వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

వాహనాలను తనిఖీ చేసిన పట్టణ పోలీసులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

సంగారెడ్డి జిల్లా శాసనసభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్ పట్టణ పరిధిలో గల ఝరాసంగం రోడ్డు పై జర్నలిస్ట్ కాలనీ సమీపంలో రాకపొకలు సాగించే చిన్న మధ్య తరహా వాహనాలను ఆదివారం సాయంత్రం పట్టణ పోలీసులు తనిఖీ చేశారు. డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూ రెన్స్, హెల్మెట్, సీట్ బెల్ట్ పట్ల పోలీసు సిబ్బంది వాహన చోదకులకు అవగాహన కల్పించారు.

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..

తొర్రూరు మున్సిపల్ కార్యాలయంలో నూతన వాహనాల ప్రారంభోత్సవం..

నేటి ధాత్రి

 

 

 

తొర్రూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి గారు నూతన వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ.. తొర్రూరు పట్టణం శుభ్రంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగేందుకు మున్సిపల్ వాహనాల కొత్త సదుపాయం ఎంతో అవసరం. ప్రభుత్వ సహకారంతో మున్సిపల్ కార్యాలయానికి అందిన ఈ వాహనాలు — ప్రత్యేకించి కచ్రా వాహనాలు, వాటర్ ట్యాంకర్లు, ఇతర ఉపయుక్త వాహనాలు — పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు తోడ్పడతాయి..

పట్టణంలోని పారిశుద్ధ్య పరిరక్షణ, డ్రైనేజ్ నిర్వహణ, తాగునీటి సరఫరా వంటి అంశాల్లో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి. ప్రజలకు మెరుగైన సేవలందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం మున్సిపల్ వ్యవస్థను శక్తివంతం చేస్తోంది..

అలాగే, మున్సిపల్ సిబ్బంది సమర్థంగా పనిచేస్తే పట్టణ వాతావరణం శుభ్రంగా, ఆరోగ్యంగా మారుతుంది. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా సహకరించాలని నేను కోరుతున్నాను..

ఈ కార్యక్రమంలో కమిషనర్, స్థానిక ప్రజాప్రతినిధులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ సీనియర్ నాయకులు, పట్టణ నాయకులు, అధికారులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు..

పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి

పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి

జైపూర్,నేటి ధాత్రి:

పాత వాహనాలకు హై సెక్యూరిటీ నంబర్‌ ప్లేట్‌ తప్పనిసరి
తెలంగాణలోని వాహనదారులకు భారీ షాక్ తగలనుంది.2019కి ముందు కొన్న వెహికిల్స్ అయితే వాటికి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు పెట్టుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది.అయితే ఈ ప్లేట్‌లను సెప్టెంబర్ 30లోగా తప్పనిసరిగా బిగించుకోవాలని సూచించింది.లేకుంటే ఆ వాహనాలను అమ్మడానికైనా, కొనడానికైనా వాహనంపై ఉన్న ఇన్సూరెన్స్,పొల్యూషన్ వర్తించవని వెల్లడించింది.ఒకవేళ అలాంటి వాహనాలు రోడ్డుపై తిరిగితే వాటిని పట్టుకోవాలని పోలీసు శాఖను ఆదేశించింది.

వాహనాల తనిఖీ…

వాహనాల తనిఖీ

నిజాంపేట, నేటి ధాత్రి

నిజాంపేట మండలం కేంద్రంలో శుక్రవారం ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఎడ్ కానిస్టేబుల్ సునీత మాట్లాడుతూ వాహనాలు నడిపే సమయంలో ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు తప్పకుండా సంబంధిత పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు అలాగే హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి వాహనాలు నడపాలన్నారు మద్యం తాగి వాహనం నడిపినట్లయితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ సోహెల్, రజక్ పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version