లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

లయన్స్ క్లబ్ గోపాలరావుపేట మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రామడుగు మండల శాఖల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ జండాను అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జండాను అధ్యక్షులు కర్ర శ్యాంసుందర్ రెడ్డి ఎగరవేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముదుగంటి రాజిరెడ్డి, కర్ర రాంచంద్రారెడ్డి, కర్ర రాజిరెడ్డి, ముదుగంటి సత్యనారాయణ రెడ్డి, పాకాల మోహన్, గొడుగు అంజియాదవ్, కోట్ల మల్లేశం, చాడ దామోదర్ రెడ్డి, కర్ర ప్రభాకర్ రెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, దుద్దెనపెల్లి లచ్చయ్య, ముదుగంటి లక్ష్మారెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, ఎడవెల్లి ముకుందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సామూహిక గా వందే మాతరం గీతాలాపన…

సామూహిక గా వందే మాతరం గీతాలాపన

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

దేశభక్తిని మరింతగా పెంపొందించే కార్యక్రమంగా వందే మాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
వందేమాతర గీతం 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా శుక్రవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సామూహిక వందేమాతర గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ప్రజలలో దేశభక్తి భావాన్ని పెంపొందించడానికి, భారత చరిత్రలో వందే మాతరం గీతానికి ఉన్న విశిష్ట స్థానాన్ని తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన వివరించారు.

ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ పట్ల ప్రజల్లో ఉత్సాహం గుండెల నిండుగా జాతీయ భావం నెలకొందని ఆయన వెల్లడించారు. జాతీయ భావన, ఐక్యత, సామూహిక భావం పెంపొందించే దిశగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఐక్యతకు దోహదపడతాయని తెలిపారు. వందేమాతర గీతం భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రజల్లో దేశభక్తి భావాన్ని రగిలించిన గీతమని, స్వాతంత్ర్య సమరయోధులందరిలో ఉత్సాహానికి, శక్తికి ప్రతీకగా నిలిచిందని ఆయన గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు.

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2కే రన్ విజయవంతం….

పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో 2కే రన్ విజయవంతం

వీణవంక,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండలకేంద్రంలో పోలీసు శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31వ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఎక్తా దివాస్ ను పురస్కరించుకొని పోలీసు విభాగం ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు జమ్మికుంట రూరల్ సీఐ లక్ష్మీనారాయణ,ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. ముఖ్య అతిథులుగా హాజరైన తాసిల్దార్ అనుపమ రావు పచ్చ జెండా ఊపి వీణవంక నుండి నర్సింగాపూర్ గ్రామం వరకు 2కే రన్ ప్రారంభించారు

దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించే విధంగా స్ఫూర్తితో మన దేశం అభివృద్ధి చెందాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు,విద్యార్థులు, మండల నాయకులు, పత్రికా మిత్రులు పోలీస్ సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version