భూమ నందినికి ప్రతిష్టాత్మక అవార్డు…

భూమ నందినికి ప్రతిష్టాత్మక అవార్డు

అభినందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన భూమ సుజాత రాజయ్య కూతురు నందినికి అరుదైన అవార్డు దక్కింది. ఇటీవల యంగ్ ఛాంపియన్ అవార్డు,వరల్డ్ రికార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్టిఫికేట్ ను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫైన్ ఆర్ట్స్ అండ్ అవార్డ్స్ (ఎన్ఐఎఫ్ఏఏ ) నుండి అందుకున్నారు.

ఈ అవార్డులు ఈ నెల 22 న న్యూ ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన కార్యక్రమంలో నందినికి ప్రముఖులు ప్రదానం చేశారు.చిన్న వయస్సులోనే సాధించిన ఈ విజయాలు ఆమె పట్టుదల,కష్టపడి పనిచేసే నైపుణ్యం,అసాధారణ ప్రతిభకు నిదర్శనమని తన సహచరులు అభినందించారు. దేశస్థాయిలో ఇంతటి మహోన్నతమైన అవార్డును అందుకున్న నందినిని నేడు బిజెపి కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ శాలువాతో సన్మానించి అభినందించారు. రానున్న రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు తను ఎదిగేలా సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ భరోసా కల్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version