తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు..

తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పొడిగింపు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2025-26 విద్యా సంవత్సరం SSC, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించింది. జూలై 31 వరకు సాధారణ ఫీజుతో, ఆగస్ట్ 28 వరకు లేట్ ఫీజుతో అప్లికేషన్లు అధికారిక వెబ్సైట్లో www.telanganaopenschool.org లేదా MeeSevaలో అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ తర్వాత అభ్యర్థులు మూడు రోజుల్లో ధృవపత్రాలను సంబంధిత స్కూల్లు/కళాశాలలకు ఇవ్వాలి.

ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

ఉచిత ఉపకరణాల దరఖాస్తు గడువు జులై 5 వరకు పెంపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ : దివ్యాంగులకు ఉచితంగా అందించే ఉపకరణాల కోసం దరఖాస్తు దాఖలు చేసుకునేందుకు గడువు జులై 5 వరకు పొడిగించినట్లు తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు రాయికోటి నర్సిములు తెలిపారు. దివ్యాంగులకు ద్విచక్రవాహనాలు, వ్యాపార వాహనాలు, వినికిడి పరికరాలు, వాకింగ్‌ స్టిక్స్, వీల్‌ఛైర్లు తదితర ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. దివ్యాంగ అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జులై 5 వరకు దరఖాస్తు గడువు ను ప్రభుత్వం పెంచినట్లు తెలిపారు. అర్హులైనవారు టీజీఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు ముగింపు.

ఏకలవ్య మోడల్ స్కూల్ లో ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు ముగింపు

కొత్తగూడ నేటిధాత్రి:

మహబూబాబాద్ డివిజన్ లోని ( ఏకలవ్య గురుకుల మోడల్ రెసిడెన్సీయల్ స్కూల్ )కొత్తగూడ నందు ఇంటర్మీడియట్ ప్రవేశాల దరఖాస్తు గడువు నేటితో ముగీయనున్నదని కొత్తగూడ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపల్ అజయ్ సింగ్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో బైపీసీ ఎంపీసీ సీఈసీ ల ప్రవేశాల కొరకు అర్హత గల విద్యార్థులు మే 24 న నేటితో దరఖాస్తు ముగుస్తున్నందున విద్యార్థులు గమనించి దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

ఎల్ఆర్ఎస్ గడువు మే 31 వరకు పొడిగింపు.

ఎల్ఆర్ఎస్ గడువు మే 31 వరకు పొడిగింపు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎల్ఆర్ఎస్ రాయితీ చెల్లింపు గడువు మే మాసం 31 వరకు పొడిగింపు చేసినట్లు మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసిన. పత్రికా ప్రకటన లో జహిరాబాద్ పురపాలక సంఘం కమిషనర్ ఉమామహేశ్వరరావు తెలిపారు.

నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి.

నిర్ణీత గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలి

ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి ):

 

 

ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రతి సోమవారం ప్రజావాణిలో వచ్చే ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా దరఖాస్తుదారులతో  కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారి సమస్యలను సానుకూలంగా స్పందించారు. ప్రజావాణి ద్వారా వచ్చే అర్జీల పరిష్కారంలో జాప్యం వద్దని అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం లో డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు , మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు.

రాజీవ్ యువ వికాస్ పథకానికి ఈనెల 14 చివరి గడువు

ముగుస్తున్న గడువు,పెరుగుతున్న దరఖాస్తుల సంఖ్య

జైపూర్,నేటి ధాత్రి:

 

రాజీవ్ యువ వికాస్ పథకం దరఖాస్తుల చివరి తేదీ ఈ నెల 14 వరకు ముగుస్తుందని మండల పరిషత్ అధికారులు ప్రకటించారు.దరఖాస్తు సమయం ముగుస్తున్న కొలది, దరఖాస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు బుధవారం ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలను కల్పించుటకు రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ వర్గాలకు చెందిన యువతకు రాయితీ రుణాలు మంజూరు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించే ప్రత్యేక చర్యలు చేపట్టింది.ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా దరఖాస్తు గడువు దగ్గర పడుతున్నట్లుగా గమనించి, లబ్ధిదారులు ఇప్పటివరకు దరఖాస్తు చేయకపోతే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్ ఈ సందర్భంగా  తెలిపారు

గడవు సమయంలో వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను పూర్తి చేయాలి.

గడవు సమయంలో వస్త్ర ఉత్పత్తి ఆర్డర్లను పూర్తి చేయాలి
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా చేనేత వస్త్ర పరిశ్రమకు ప్రభుత్వం కేటాయించిన ఆర్డర్లను నిర్ణిత సమయంలో వస్త్ర ఉత్పత్తులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ప్రభుత్వ ఆర్డర్ల పురోగతి పై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ వ్యాపారులతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ సమగ్ర శిక్ష శాఖ, సంక్షేమ శాఖలకు సంబంధించి ప్రభుత్వం వస్త్ర పరిశ్రమకు అందించిన ఆర్డర్ల వస్త్ర ఉత్పత్తిని నిర్ణీత సమయంలో పూర్తిచేసి సప్లై చేయాలని అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మహిళా సంఘాలకు ఒక్కొక్కరికి రెండు చీరలు చొప్పున పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించి సంబంధిత ఆర్డర్ ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు కేటాయించడం జరిగిందని అన్నారు.
ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద చీరల పంపిణీ కోసం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలకు వచ్చిన ఆర్డర్ పనులను వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో గడువులోగా ఉత్పత్తి చేసి సప్లై చేయాలని అన్నారు.
ఈ సమావేశంలో చేనేత జౌళి శాఖ అధికారి రాఘవరావు, టెస్కో ప్రతినిధి శంకరయ్య,వస్త్ర పరిశ్రమ వ్యాపారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version