సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి…

సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం గా ప్రకటించాలి

నేటి ధాత్రి కథలాపూర్

 

 

కథలాపూర్ మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం రోజున మండల అధ్యక్షులు మల్యాల మారుతి అధ్యక్షతన సేవాపక్షం మండల కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి, మండల సేవాపక్షం ఇంచార్జి లింగంపల్లి శంకర్ మాట్లాడుతూ….. బిజెపి జాతీయ పార్టీ . పిలుపుమేరకు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ రెండు వరకు బూత్ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.. 19 గ్రామాల్లో రక్తదానం,స్వచ్ఛభారత్, సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి జన్మదినవేడుకలు, తెలంగాణ విమోచన దినోత్సనం ఘనంగా నిర్వహించాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లో బూత్ స్థాయిలో బీజేపీ కార్యకర్తలంతా సమిష్టిగా పనిచేసి ఎక్కువ సంఖ్యలో ఎంపీటీసీ, సర్పంచ్ లు గెలవాలని కోరారు. కార్యక్రమంలో మల్యాల మారుతి,కోడిపెల్లి గోపాల్ రెడ్డి,గాంధారి శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి గంగారాం,ప్రమోద్,శ్రీకర్, మహేష్,వినోద్,నారాయణ పాల్గొన్నారు.

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్…

బిజెపి ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలోని భూలక్ష్మి వద్ద బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు ఊర నవీన్ రావ్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహిచి దారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించడం జరిగింది
అలాగే నిన్న విపరీతంగా కురిసిన భారీ వర్షానికి గణపురం మండల కేంద్రంలోని గుడివాడ ప్రాంతాల్లో చాలా ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుకోవడం జరిగింది ఇది కేవలం ఊర కాలువను శుభ్రం చేయకుండా చెత్తాచెదారం పిచ్చి మొక్కలు పేరుకోవడం వల్ల వచ్చిన వరద నీరు కిందకు పోకపోవడం వలన ఇళ్లలోకి చొరబడడం జరిగింది అది తెలుసుకున్న బిజెపి పార్టీ బృందం ఆ ప్రాంతాన్ని సందర్శించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారితో ఫోన్లో మాట్లాడి సమస్యను మళ్ళీ పునరావృతం కాకుండా త్వరితగతిన పరిష్కరించాలని కోరడం జరిగింది లేనిపక్షంలో నిరసన కార్యక్రమం చేస్తామని చెప్పడం జరిగిందిఈ కార్యక్రమంలో బీజేవైఎం కలాశాలాల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి చెలుమల్ల ప్రవీణ్ కుమార్, బిజెపి మండల ఉపాధ్యక్షులు మధాసు మొగిలి, డాకురి కృష్ణ రెడ్డి,బిజెపి జిల్లా నాయకులు,దుగ్గుషెట్టి.పూర్ణ చందర్ , మండల మహిళా నాయకురాలు బొల్లం అరుణ,బిజెపి మండల నాయకులు మంధల రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version