ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా…

ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న సఫియ సుల్తానా

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

భారతదేశ మహిళా విద్య చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడిన మహనీయురాలు చదువుల తల్లి సావిత్రిభాయి ఫూలే జయంతి ని పురస్కరించుకొని,గత సంవత్సరం నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే.ఈ సంవత్సరం ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు,ప్రతి జిల్లాలో 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను సన్మానించాలనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దాంట్లో భాగంగా, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆడిటోరియంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో,జిల్లాలోని 10 మంది ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,డిఇఓ వెంకటేశ్వర్లు ,నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకులు ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా,ఎం పి పి ఎస్ రెజింతల్, న్యాల్కల్ మండల ప్రధానోపాధ్యాయులు సఫియ సుల్తానా తమ విద్యా సేవలకు గాను,జిల్లా కలెక్టర్ డిఇఓ నిర్మల జగ్గారెడ్డి మరియు వివిధ సంఘాల నాయకుల చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version