ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్

ప్రజావాణికి 149 దరఖాస్తులు

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. జిల్లా సమీపృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించగా, ఇంచార్జి కలెక్టర్ హాజరై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 149 అర్జీలు రాగా, వాటిని పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు అందజేసి, గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు.

ఇప్పటివరకు ఆయా శాఖల వారీగా వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కారమయ్యాయి? తదితర వివరాలపై ఆరా తీశారు. అన్ని దరఖాస్తులు ఆన్లైన్లో పూర్తిగా పరిష్కరించాలని పెండింగ్ పెట్టవద్దని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు బాధ్యులు తప్పనిసరిగా ప్రజావాణికి హాజరుకావాలని స్పష్టం చేశారు. మండలాల ప్రత్యేక అధికారులు ఇందిరమ్మ ఇండ్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇతర అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు పరిశీలించాలని సూచించారు.

రెవెన్యూ కు 58, డీఆర్డీఓ కు 20, హౌసింగ్ కు 14, ఎస్డీసీకి 11, డీపీఓ కు 7, డీఈఓ 6, డీఎంహెచ్ఓ, సెస్ కు ఐదు చొప్పున, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్ల, ఉపాధి కల్పన అధికారికి మూడు చొప్పున, డీసీఎస్ఓ, ఎక్సైజ్ ఆఫీసు కు రెండు చొప్పున, డీసీఓ, ఫారెస్ట్ అధికారి, రిజిస్ట్రార్, డీఎస్సీడీఓ, డీవీహెచ్ఓ, డీ ఎం ఆర్టీసీ సిరిసిల్ల, జిల్లా సంక్షేమ అధికారి, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, ఎల్ డీ ఎం కు ఒకటి చొప్పున వచ్చాయి.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, సిరిసిల్ల వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు.

ఈ నెల 27న మద్యం షాపుల లాటరీ ప్రక్రియ…

ఈ నెల 27న మద్యం షాపుల లాటరీ ప్రక్రియ

మద్యం షాపులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఒరిజినల్ తీసుకొని రాగలరు

ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్

 

జయశంకర్ భూపాలపల్లి ములుగు జిల్లాలకు గాను 2025 – 27 సంవత్సరాలకు గాను ఏ4 మద్యం షాపుల దరఖాస్తు ప్రక్రియ తేదీ 23.10.2025 నాటికి ముగిసింది. భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లోని మొత్తం (59) మద్యం దుకాణాలకు గాను 1,863 దరఖాస్తులు రావడం జరిగింది. దరఖాస్తు ఫీజు రూపంలో 55 కోట్ల 89 లక్షల రూపాయల ఆదాయం వచ్చిందని జిల్లా ఎక్సైజ్ అధికారి శ్రీనివాస్ తెలిపారు.
భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లో అత్యధికంగా మల్లంపల్లి గ్రామం మండలం మద్యం షాపుకు 77 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. 27.10.2025 సోమవారం రోజున మద్యం షాపుల కేటాయింపుకు సంబంధించిన లాటరీ ప్రక్రియను భూపాలపల్లి పట్టణం, మంజూరు నగర్ లోని ఇల్లందు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ నందు జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ రాహుల్ శర్మ సమక్షంలో ఉదయం 10 గంటలకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎక్సైజ్ యూనిట్ లో మద్యం షాపులకు దరఖాస్తు చేసిన దరఖాస్తుదారులు ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్స్ తేదీ 27.10.2025 సోమవారం ఉదయం 9 గంటల వరకు ఇల్లందు క్లబ్ హౌస్ ఫంక్షన్ హాల్ కు హాజరు కావాల్సిందిగా ఆయన సూచించారు. దరఖాస్తుదారులు ఆర్థరైజ్డ్ రెప్రెసెంటేటివ్స్ ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి మద్యం దుకాణానికి దరఖాస్తు చేసిన సమయంలో వారికి ఇచ్చినటువంటి రిసిప్ట్ ఎంట్రీ పాస్ ఒరిజినల్ ను తీసుకొని రావాలని ఎక్సైజ్ సూపర్డెంట్ శ్రీనివాస్ సూచించారు

భూభారతి దరఖాస్తుల త్వరితగతిన పరిష్కరించాలి…

భూభారతి దరఖాస్తుల త్వరితగతిన పరిష్కరించాలి

నర్సంపేట ఆర్డీఓ కార్యాలయం సందర్శన

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

Vaibhavalaxmi Shopping Mall


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమం ద్వారా రైతులు సకాలంలో తమ భూ సంబంధిత సమస్యలను పరిష్కరించుకునేలా చొరవ చూపాలని, దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావులేకుండా వెంటనే ఆర్జీలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.బుధవారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలసి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయాన్ని సందర్శించారు.

 


ఈ సందర్భంగా రెవిన్యూ డివిజన్లోని 6 మండలాల తహసిల్దార్, ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు?.ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి?. ఎంత మందికి నోటీసులు ఇచ్చారు?. క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా..? లేదా అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
క్షేత్రస్థాయి పరిశీలన నిర్ణీత గడువు లోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు.దరఖాస్తులు తిరస్కరణకు గురైనట్టయితే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా, పీఓటీ లకు సంబంధించిన అప్లికేషన్ లను క్షుణ్ణంగా పరిశీలించాలని వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆర్జీల పరిష్కారంలో జాప్యం జరుగకుండా రోజువారీగా దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ.. వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమీక్షలో ఆర్డీఓ ఉమారాణి, తహశీల్దార్లు
రవిచంద్ర రెడ్డి, రాజేశ్వరరావు, రాజ్ కుమార్, అబిడ్ అలీ, రమేష్, కృష్ణా, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి…

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్. ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి దరకాస్తు లు స్వీకరించారు
ప్రజల ఫిర్యాదులు త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను కోరారు

“తెలంగాణలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తులు రేపటి నుంచి..

రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు *రేపటి నుంచి కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు.. అప్లికేషన్స్ కు అనర్హులు వీరే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త మద్యం (New Liquor Shops) దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాబోతోంది. రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతుల కోసం ఇప్పటికే ఎక్సెజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నోటిఫికేషన్ కు అనుబంధంగా ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధరించారు. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తారు. ఎక్సెజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు మద్యం దుకాణాలు పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. దుకాణాల కేటాయింపుల్లో గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈమేరకు రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి జతచేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్లు ఈ ఏడాది నవంబర్ చివర వరకు గడువు ఉంది.

బార్లలో బీర్ల తయారీ లైసెన్స్ కు నేడే ఆఖరు తేదీ:

హోటల్ లేదా రెస్టారెంట్లలోనే బీర్లు తయారు చేసి విక్రయిచేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ లైసెన్స్లు జారీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన లైసెన్స్ కోసం దరఖాస్తులకు ఇవాల్టితో ఆఖరు గడువు ముగియనుంది. 2బి బార్లు, ఎలైట్ బార్లు, సీ1- క్లబ్, టిడి1, టీడీ2 లాంటి లైసెన్స్ కలిగిన హోటల్, రెస్టారెంట్లలో మైక్రో బ్రూవరీ యూనిట్లు ఏర్పాటు కోసం రూ. 1 లక్ష రుసుముతో దరఖాస్తులను అబ్కారీ శాఖ ఆహ్వానించింది.ఈ దరఖాస్తులకు ఇవాల్టితో గడువు పూర్తి ముగియనుంది. tgbcl.telangana.gov.in వెబ్ సెట్ ను సందర్శించాలని సూచించింది. వివరాలకుదరఖాస్తులు.. అప్లికేషన్స్ కు అనర్హులు వీరే*

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కొత్త మద్యం (New Liquor Shops) దుకాణాలకు రేపటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకాబోతోంది. రెండేళ్ల కాలపరిమితికి (2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు) అనుమతుల కోసం ఇప్పటికే ఎక్సెజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేయగా ఈ నోటిఫికేషన్ కు అనుబంధంగా ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు రుసుం రూ.3 లక్షలుగా నిర్ధరించారు. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 23వ తేదీన డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయిస్తారు. ఎక్సెజ్ చట్టం 1968 ప్రకారం శిక్ష పడిన వారు, ప్రభుత్వానికి బకాయిలు పడి సక్రమంగా చెల్లింపులు చేయని వారు మద్యం దుకాణాలు పొందేందుకు అనర్హులుగా ప్రకటించారు. దుకాణాల కేటాయింపుల్లో గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈమేరకు రిజర్వేషన్ దరఖాస్తుదారులు కుల ధ్రువీకరణ పత్రం తప్పనిసరి జతచేయవల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం కొనసాగుతున్న మద్యం దుకాణాల లైసెన్స్లు ఈ ఏడాది నవంబర్ చివర వరకు గడువు ఉంది.

బార్లలో బీర్ల తయారీ లైసెన్స్ కు నేడే ఆఖరు తేదీ:

హోటల్ లేదా రెస్టారెంట్లలోనే బీర్లు తయారు చేసి విక్రయిచేందుకు తెలంగాణ ఆబ్కారీ శాఖ లైసెన్స్లు జారీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రూవరీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించిన లైసెన్స్ కోసం దరఖాస్తులకు ఇవాల్టితో ఆఖరు గడువు ముగియనుంది. 2బి బార్లు, ఎలైట్ బార్లు, సీ1- క్లబ్, టిడి1, టీడీ2 లాంటి లైసెన్స్ కలిగిన హోటల్, రెస్టారెంట్లలో మైక్రో బ్రూవరీ యూనిట్లు ఏర్పాటు కోసం రూ. 1 లక్ష రుసుముతో దరఖాస్తులను అబ్కారీ శాఖ ఆహ్వానించింది.ఈ దరఖాస్తులకు ఇవాల్టితో గడువు పూర్తి ముగియనుంది. tgbcl.telangana.gov.in వెబ్ సెట్ ను సందర్శించాలని సూచించింది.

విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ..

విదేశీ విద్యా నిధి పథకం కొరకు షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల నుండి దరఖాస్తుల స్వీకరణ

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్

మంచిర్యాల,నేటి ధాత్రి:

 

 

విదేశీ విద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు 2025- 26 సంవత్సరానికి గాను విదేశీ విద్యాలయంలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా నిర్వహించబడుతున్న అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకం కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.యు.ఎస్.ఎ, యు.కె,ఆస్ట్రేలియా,కెనడా, సింగపూర్,జర్మనీ,జపాన్, సౌత్ కొరియా,న్యూజిలాండ్ విశ్వవిద్యాలయాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్,ప్రొఫెషనల్ కోర్సులలో చదవాలనుకునే షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు నవంబర్ 19వ తేదీ లోగా ఆన్ లైన్ లో www.telangana.epass.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, ఎంపికైన విద్యార్థులకు 20 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.అభ్యర్థులు జిల్లాకు చెందిన షెడ్యూల్డ్ కులములవారై ఉండాలని, వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయల లోపు ఉండాలని, పిజి.చదవడానికి గ్రాడ్యుయేషన్ లో 60 శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలని, టి.ఓ.ఈ.ఎఫ్.ఎల్, ఐ.ఈ.ఎల్.టి.ఎస్, జి.ఆర్.ఈ, జి.ఎం.ఎ.టి ఎక్కువ శాతం అర్హత,పాస్ పోర్ట్,వీసా కలిగి ఉండాలని,విదేశీ విశ్వవిద్యాలయంలో అడ్మిషన్ పొంది ఉండాలని,ఒక కుటుంబం నుండి ఒక్కరు మాత్రమే ఈ పథకానికి అర్హులని తెలిపారు.ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ తనిఖీలు…

భూ భారతి దరఖాస్తులపై జిల్లా కలెక్టర్ తనిఖీలు

జిల్లా కలెక్టర్ స్నేహ శబరీ ష్

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండలం కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఎలాంటి సమాచారం లేకుండా రావడంతో అధికారులు పరుగులు పెట్టారు. పరిష్కా రంలో అధికారులు జాప్యం చేయొద్దని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు.

భూభారతి దరఖాస్తులు ఎన్ని వచ్చాయో,వాటిని గురించి అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా కార్యాలయం ఎదుట ఉన్న భూభారతి కానీ ప్రజల సమస్యలను అడిగి తెలుసు కుని స్థానిక తాసిల్దార్ కు ఆదేశించారు అనంతరం మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో శాయంపేట తహసిల్దార్ సత్యనారాయణ, అన్ని శాఖల ప్రభుత్వ అధి కారులు, ఎస్సై పరమేష్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

రైతు బీమా దరఖాస్తులకు ఆహ్వానం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-11-1.wav?_=1

రైతు బీమా దరఖాస్తులకు ఆహ్వానం

◆:- రైతు బీమా – నమోదుకు 13.08.2025 చివరి తేదీ

◆:- మండల వ్యవసాయ అధికారి వెంకటేశం

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని రైతులు రైతు బీమా గురించి కేవలం 4 రోజులు సమయం ఉన్నది
05-06-2025 నాటికి భూభారతి పోర్టల్‌లో డిజిటల్ సైన్ చేసిన పట్టాదారుల వివరాలు మరియు కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ నుండి అందిన ROFR పట్టు హోల్డర్ల వివరాలు ఆధారంగా పాత/కొత్త అర్హులైన రైతుల బీమా పునరుద్ధరణ/నమోదు జరుగుతుంది.18 నుండి 59 సంవత్సరాల వయస్సు (పుట్టిన తేదీ 14-08-1966 నుండి 14-08-2007 వరకు, రెండు తేదీలు కలుపుకొని) ఉన్నవారు మాత్రమే అర్హులు.నమోదు కోసం రైతు తప్పక ఈ పత్రాలు ఒరిజినల్ మరియు జీరోక్స్ కాపీలను తీసుకురావాలి
1. రైతు ఆధార్ కార్డు
2. భూమి పట్టా పాస్‌బుక్
3. నామినీ ఆధార్ కార్డు
4. రైతు బీమా Enrollment ఫామ్
రైతు తప్పక హాజరు కావలెను.

Agriculture Officer Venkatesham

(వాట్సప్ ద్వారా కానీ ఇతర వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ పంపుతాము మేము చాలా దూరంలో ఉన్నాము ఇంత తక్కువ సమయంలో మేము రాలేము అని దయచేసి భీమ చేయండి అని అడగొద్దు రైతు తప్పక వొచ్చి సంతకం చేయాలి.)
భూమి కలిగి ఇంకా రైతు బీమా నమోదు చేయని రైతుల వివరాలు వ్యవసాయ విస్తరణ అధికారుల రైతు వేదిక ఆఫీసర్ లో వద్ద అందుబాటులో ఉన్నాయి. దయచేసి సంప్రదించండి.

ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

ఉపాధ్యాయుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం: మండల కేంద్రంలోని మో
డల్ స్కూల్లో కాంట్రాక్ట్ పాతిపదికన ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ టీనావ తి ఓ ప్రకటనలో గురువారం పేర్కొన్నారు. పిజీటి ఫిజిక్స్, టీ జీటీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఖాళీలు ఉన్నట్లు ప్రిన్సిపల్ తె లియజేశా రు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 4వ తేదీన పాఠశాలలో నిర్వ హించే డెమో క్లాస్కు హాజరు కావాలన్నారు. తప్పనిసరిగా ఒ రిజినల్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలన్నారు.

5వ.తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

5వ.తరగతి, ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T110019.532.wav?_=2

బెల్లంపల్లి నేటిధాత్రి :

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో చేరికల కొరకు మళ్ళీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ నీలు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మైనారిటీ విద్యార్థినులు ధ్రువీకరణ పత్రాలతో కళాశాలకు వచ్చి ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కళాశాలలో ఎంసెట్ శిక్షణ సైతం ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారించాలి.

భూభారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారించాలి
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట/వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:

భూ భారతి  రెవిన్యూ సదస్సులో ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా  కలెక్టర్ డాక్టర్ సత్య శారద తహసీల్దార్ లను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ లో మండల తహసీల్దార్ లతో భూ భారతి, రెవిన్యూ సదస్సు లో స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి చేపడుతున్న చర్యల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధించిన అన్ని దరఖాస్తులను క్లియర్ చేయాలని అన్నారు.భూభారతి రెవిన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను కేటగిరీల వారీగా విభజిస్తూ సత్వరమే  వాటిని ఆన్లైన్లో  అప్లోడ్ చేయాలన్నారు. ఆగస్టు 15 నాటికి  అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చొరవ చూపాలన్నారు.

అన్ని మాడ్యుల్స్ లో దాఖలైన భూ భారతి దరఖాస్తులను పెండింగ్ ఉంచకుండా వెంటనే పరిష్కరించేందుకు చొరవ చూపాలి అన్నారు.దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ జరపాలన్నారు. అవసరమైన రికార్డులను కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలన్నారు. రెవిన్యూ పరంగా ఎలాంటి తప్పిదాలకు తావు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో  అదనపు కలెక్టర్ సంధ్యారాణి,డిఆర్ ఓ విజయలక్ష్మి,ఆర్డీవో లు సత్యపాల్ రెడ్డి, ఉమారాణి , కలెక్టరేట్ ఏఓ విశ్వ ప్రసాద్, తహసీల్దార్ లు పాల్గొన్నారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ అస్లం ఫర్ కి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బాటనీ జువాలజీ, కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 24వ తేదీన సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-62.wav?_=3

* ప్రిన్సిపల్ జన్ను విజయ్ కుమార్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విద్య శాఖ ఆదేశాల మేరకు అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయ్ కుమార్ ఒక ప్రకటనలో సోమవారం రోజున తెలిపారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల లో 2025 -2026 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న కంప్యూటర్స్ విభాగంలో రెండు పోస్టులు, ఎకనామిక్స్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నాయని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల లోపు కళాశాలలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు రెండు జతలు జిరాక్స్ కాపీలు సమర్పించవలసిందిగా తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులు పొంది ఉండాలని ఇతరులు 55 శాతం మార్కులు పొంది ఉండాలని సంబంధిత సబ్జెక్టుల్లో అర్హతలు పీజీ తో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దివ్యాంగుల స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం.

జహీరాబాద్ దివ్యాంగుల స్వయం ఉపాధికి దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

దివ్యాంగుల స్వయం ఉపాధికి ఈనెల 31వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి గురువారం తెలిపారు. దరఖాస్తులను http://tgobmms. cgg. gov. in 3 ໖ చెప్పారు. బ్యాంకు లింకేజీ లేకుండా 37, బ్యాంకు లింకేజీ తో 3 యూనిట్లు మంజూరు అయినట్లు పేర్కొన్నారు. సంబంధిత పత్రాలను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయంలో సమర్పించాలని తెలిపారు.

ఇందిర సౌర గిరిజన వికాసం స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం.

ఇందిర సౌర గిరిజన వికాసం స్కీంకు దరఖాస్తుల ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-1-1.wav?_=4

ఇందిరా సౌర గిరిజన వికాసం స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. పోడు భూములు ఉన్న గిరిజనలు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. పట్టా పాసు పుస్తకం, కులం సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్ ప్రతులను సమర్పించాలని పేర్కొన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Dr. Satya Sarada.

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి, నర్సంపేట ఉమారాణి ,హౌసింగ్ పీడీ గణపతి పాల్గొని ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 150 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 58, పిడి హౌసింగ్ 25, జి డబ్ల్యూ ఎం సి 13 దరఖాస్తులు రాగా, మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 54 స్వీకరించామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరీంచిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,డిసిఓ నీరజ, డిబిసిడివో పుష్పలత, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ.

సిరిసిల్ల జిల్లాలో ప్రజా సమస్యల పై దరఖాస్తుల స్వీకరణ

*ప్రజావాణికి 157 ఆర్జీలు రాక *

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

 

 

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రజావాణిలో వచ్చే అర్జీలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్వీకరించి.. వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సోమవారం అర్జీలు స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 157 దరఖాస్తులు వచ్చాయి.రెవెన్యూ శాఖకు 45, హౌసింగ్ శాఖకు 33, డీఆర్డీఓకు 15, జిల్లా విద్యాధికారి 11, మున్సిపల్ కమిషనర్ సిరిసిల్లకు 10, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కు 8, జిల్లా వ్యవసాయ అధికారి,జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున, జిల్లా పంచాయతీ అధికారి, ఏడీ ఎస్ఎల్ఆర్, జిల్లా పౌర సరఫరాల అధికారికి మూడు చొప్పున, ఫిషరీస్, జిల్లా సంక్షేమ అధికారి, ఈఈ నీటి పారుదల శాఖ, ఈఓ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున, ఎల్ డీ ఎం, ఈఈ పీఆర్, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఏడీ హ్యాండ్ లూమ్స్, మైనార్టీ, ఆర్ టీ సీ, జడ్పీ సీఈవో, ,సెస్, ఈఈ ఆర్ డబ్ల్యూ ఎస్, ఎస్పీ ఆఫీస్ కు ఒకటి చొప్పున వచ్చాయి.
ఈ కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, డీఆర్డీఓ శేషాద్రి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన.

— రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పరిశీలన
• ఎమ్మార్వో
శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన భూభారతి కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. ఈ మెరకు నిజాంపేట లో స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల సమస్యల పరిశీలన ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. ఆగస్టు 15 వరకు దరఖాస్తుల సమస్యలను పరిశీలించడం జరుగుతుందన్నారు.

భద్రకాళీ వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు.

భద్రకాళీ వేద పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తులు.

నేటిధాత్రి, వరంగల్.

 

shine junior college

 

 

 

వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానమునందలి శ్రీ భద్రకాళీ సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయమునందు వైదిక స్మార్త ఆగమము, తైత్తరీయ కృష్ణయజుర్వేదాధ్యయనంలో ప్రవేశం కొరకు ఆసక్తి గల విద్యార్థుల నుండి దరఖాస్తులు కోరబడుచున్నవని దేవస్థాన కార్యనిర్వహణాధికారి/సహాయ కమీషనర్ కె. శేషుభారతి తెలిపారు. మాతృభాషలో చదవగలిగి, రాయగలిగిన విద్యార్థులు 8 నుండి 12 యేళ్ళ మధ్య వయస్సు గలిగి ఉపనయన సంస్కారం, ఉపాకర్మోత్సర్జనములు పూర్తి ఐనవారు సంధ్యావందనం, అగ్నికార్యం, బ్రహ్మయజ్ఞంలు కంఠస్థం అయివుండి స్వయముగా అనుష్ఠానము జరుపుకోగలిగినవారు అలాగే 10 సంస్కృత శబ్ధములు (7 విభక్తులు) కంఠస్థం అయివున్నవారు పాఠశాలలో అధ్యయనము చేయుటకు అర్హులని తెలిపారు. దరఖాస్తు ఫారాలను భద్రకాళి దేవస్థానం, వరంగల్ వారి వేదపాఠశాల యందు తేది: 18-06-2025 నుండి అందుబాటులో ఉంటాయని , విద్యార్థులు పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను 25-06-2025 వరకు వేదపాఠశాల కార్యాలయము నందు అందజేయగలరు అని ఈవో ఒక ప్రకటనలో తెలియచేశారు.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి.

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించాలి

రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి:

 

shine junior college

 

సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు.
సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల దరఖాస్తులు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను కూలం కషంగా పరిశీలించి, పెండింగ్‌ ఉంచకుండా, సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాభవన్ హైదరాబాద్ నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి మూడు రోజులలో పరిష్కారం చూపాలని, తదుపరి నివేదికలు అందచేయాలని ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులు సంబంధిత శాఖల అధికారులకు తగు చర్యలు నిమిత్తం ఎండార్స్ చేసినట్లు తెలిపారు. ప్రజావాణిలో 53 దరఖాస్తులు వచ్చాయని వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజావాణి ప్రధాన ఉద్దేశం ప్రజల ఫిర్యాదులను స్వీకరించి త్వరితగతిన పరిష్కారం చేయడమేనని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మీ, ఆర్డిఓ రవి, అన్ని శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version