దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి…

దసరా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రజలకు రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గామాత అనుగ్రహం కోసం.. నవరాత్రుల్లో 9 రోజులపాటు భక్తిశ్రద్ధలతో దుర్గామాతను పూజించి, చెడుపై.. మంచి, దుష్ట శక్తులపై.. దైవ శక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అన్నారు. దసరా పండుగ ధనిక పేద తేడా లేకుండా ప్రతి ఒక్కరి మధ్య స్నేహభావాన్ని పెంపొందించి సమాజం ఐక్యమత్యంతో ఉండేలా చేస్తుందని పేర్కొన్నారు. జహీరాబాద్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్య వైద్యం ప్రతి ఒక్కరికి చేరాలని తలంపుతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తూ విద్యా వైద్యానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. పేదింటి బిడ్డలకు అత్యుత్తమ విద్య అందించాలని తలంపుతో ప్రారంభించరు ఈ సందర్భంగా ఉదాహరించారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో దసరా ఉత్సవాలను జరుపుకోవాలని, ఆ జగన్మాత ఆశీస్సులతో ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆ కనకదుర్గమ్మ అమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

శ్రీరాంపూర్‌లో నంది అవార్డు పోస్టర్ ఆవిష్కరణ…

ఎస్ ఎస్ కల్చరల్,డాన్స్ అకాడమీ ఆధ్వర్యంలో నంది అవార్డు పురస్కారాల పోస్టర్ ఆవిష్కరణ

శ్రీరాంపూర్,నేటి ధాత్రి:

 

 

ఎస్ ఎస్ కల్చరల్,డాన్స్ అకాడమీ,స్వచ్చంద సేవ సొసైటీ సంస్థ దసరా పండుగ పురస్కరించుకొని రాష్టం లోని కళాకారుల ప్రతిభని గుర్తించి,వారిని ప్రోత్సహించేందుకు విజయదశమి ఉత్తమ కళారత్న నంది అవార్డ్ పురస్కారాలు సెప్టెంబర్ 28 న మంచిర్యాలలో నిర్వహించబడుతుంది.గురువారం శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియంలో ఈ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ కళాకారులు,జానపద కళాకారుల,ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హన్మాండ్ల మధుకర్,మంచిర్యాల జిల్లా నృత్య కళ సమాఖ్య అధ్యక్షులు రాకం సంతోష్,ఉపాధ్యక్షులు రామగిరి అర్జున్,డాన్స్ మాస్టర్స్ రిథమ్ సది,మాస్టర్ రమేష్ బాబు, డైరెక్టర్ కె.తిరుపతి వర్మ ,రవీందర్ వర్మ ,స్టాలిన్,తిరుపతి,కార్య నిర్వాహకులు దుర్గం విజయ్,కొప్పర్తి సురేందర్,బెల్లం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version