బీసీ రిజర్వేషండ్ల చట్ట బద్ధత కల్పించాలి..

బీసీ రిజర్వేషండ్ల చట్ట బద్ధత కల్పించాలి

గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసి కుల గణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లు చట్ట బద్ధత కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ నాయకుడు బొమ్మెర రాంబాబు డిమాండ్ చేశారు.బీసి కులాల రిజర్వేషన్ విషయం కేవలం వారి ఎన్నికల నినాదమె తప్ప కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బీ సి కులాల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని అన్నారు. రాజ్యాంగంలో బీసి కులాల అభ్యున్నతి కోసమే డా అంబేద్కర్ 340 అధికరణ పొందపరిసితె రాజ్యాంగం అమలులోకి వచ్చి 90 సంవత్సరాలు కావస్తున్నా ఎందుకు ఈ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కాలయాపన చేయడం ఏమిటని ప్రశ్నించారు.బహుజన సమాజ్ పార్టీ వ్వవస్థపాకులు గౌ మాన్య శ్రీ కాన్షిరాం 1992 సంవత్సర కాలంలో అప్పటి ప్రధాని విపి సింగ్ హయం లో బీసి కుల గణన చెయ్యాలని పార్లమెంట్ సమావేశాల్లో వత్తిడి చేస్తే ఆనాడు బీసి కులాల జాబితా రిపోర్ట్ చేయ్యలని అప్పటి ఉప ప్రధాని దేవీలాల్ ని కమిషన్ గా నియమించిది.ఆ తర్వాత ఏర్పడిన బీజేపీ పార్టీ బీ సి కులాల జాబితాను పట్టించుకోకుండా వ్వవహరించిదని ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈదేశంలో బీ సి కులాల అభ్యున్నతి కోసం పని చేసే ఏకైక పార్టీ ఒక్క బహుజన్ సమాజ్ పార్టీ అనే విషయాన్నిబీసీ,ఎస్సి, ఎస్టీ)క్రైస్తవ, ముస్లిం సోదరులు. సంబండ కులాలు జోతీరావుపూలే అంబేద్కర్.మాన్యశ్రీ కాన్షిరాం పని విదానం మరియు బావి బారత ప్రధాన మంత్రి కుమారి మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీ లో పని చేసి రాజ్యాధికారం సాదించిన నాడే (బీసీ/ఎస్సి/ఎస్టీ) ప్రజల సమస్యలను పరిష్కరించబడతయని అన్నారు.

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు

బీసీ రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలి

-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్లను 42 శాతం పెంచిన తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం నేతృత్వంలో అఖిలపక్షం నేతలతో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఢిల్లీకి వెళ్లాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీ సంఘాలు చేసిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి త్వరలోనే దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనను చేపడతామని ప్రకటించడం అభినందనీయమన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్ర ప్రభుత్వం తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో చేర్చి రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించాలని, అప్పుడే కేంద్ర ప్రభుత్వాన్ని బీసీలు విశ్వసిస్తారన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version