సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం…

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళా ఉపాధ్యాయురాలికి సన్మానం

నేటి ధాత్రి అయినవోలు:-

 

సావిత్రిబాయి పూలే జయంతి మరియు జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐనవోలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా ఉపాధ్యాయురాలికి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఐనవోలు గ్రామ పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దల సమక్షంలో జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ మాట్లాడుతూ, భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే గారి సేవలు చిరస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని నిరూపించిన ఆమె ఆలోచనలు నేటికీ మహిళలకు, ఉపాధ్యాయులకు ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. సమాజ నిర్మాణంలో మహిళా ఉపాధ్యాయులు పోషిస్తున్న కీలక పాత్ర అమూల్యమైందని పేర్కొంటూ వారి త్యాగం, సేవాభావాన్ని ఈ సందర్భంగా ఘనంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లకొండ సురేష్, ఉపసర్పంచ్ అడ్డగూడి సతీష్, వార్డు సభ్యులు దూపెల్లి రాజు, సుజాత కుమార్, నాగలక్ష్మి అశోక్, సరిత జాన్సన్, కొత్తూరి రాజు, పురుషోత్తం, చందు, ప్రవీణ్, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రతి చిన్నారికి నోటి ఆరోగ్యం..

ప్రతి చిన్నారికి నోటి ఆరోగ్యం

రాయపర్తి మండలం, పెరికేడు గ్రామంలో అవగాహన కార్యక్రమం.

నేటిధాత్రి, రాయపర్తి.

 

వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, పెరికేడు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (టి డి ఎస్ ఏ) ఆధ్వర్యంలో ప్రాజెక్ట్–4 లో భాగంగా ప్రతి చిన్నారికి నోటి ఆరోగ్యం (ఓరల్ హెల్త్ ఫర్ ఎవరీ చైల్డ్) అనే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డా. ఆశిష్ రామడుగు సమర్థవంతంగా సమన్వయం చేసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత దంత పరీక్షలు (ఓరల్ చెకప్) నిర్వహించారు. అలాగే చిన్నారులకు నోటి ఆరోగ్యం ప్రాముఖ్యత, దంతాల సంరక్షణ విధానాలు, చెడు నోటి అలవాట్ల ప్రభావం, సరైన బ్రషింగ్ పద్ధతుల వంటి అంశాలపై సులభంగా అర్థమయ్యే విధంగా వివరణతో పాటు ప్రాక్టికల్ డెమో ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం చిన్నారుల్లో నోటి ఆరోగ్యం పట్ల చైతన్యం పెంచడంలో ఎంతో ఉపయోగపడిందని పాఠశాల ఉపాధ్యాయులు, స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఎంపీపీఎస్ పొత్కపల్లి (బాలికల) పాఠశాలకు టీవీ బహుమానం..

ఎంపీపీఎస్ పొత్కపల్లి (బాలికల) పాఠశాలకు టీవీ బహుమానం..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

ఎంపీపీఎస్ పోత్కపల్లి బాలికల పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న యేబూషి సతీష్ కుమార్ యొక్క ప్రియమైన శిష్యుడు అమెరికా నుండి టీవీ ని ఎంపీపీ ఎస్ బాలికల పాఠశాలకు బహుమతిగా పంపించడం జరిగింది.దానిని మండల విద్యాధికారి రమేష్ చేతుల మీదుగా ఈరోజు తీసుకోవడం జరిగింది.ఇది గురుశిష్యుల బంధానికి ప్రతీక ఇలా ప్రభుత్వ పాఠశాలపై ఇష్టంతో గురువు పై భక్తితో టీవీ ని పంపించినందుకు పాఠశాల బృందం శిష్యునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు రాధా రాణి, కరుణాకర్ , మిర్జా సైఫ్ మరియు పాఠశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా…

కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా
వనపర్తి నేటిదాత్రి .

 

డాక్టర్ కంటే నిరంజనయ్య స్వీయ రచన కాలగమనం పుస్తకాలను కంచిరావుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రంధాలయానికి కాలగమనం పుస్తకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా కంటే నిరంజనయ్యా విద్యార్థుల తో మాట్లాడుతూ కాలగమనం పుస్తకంలో 55 కవిత అంశాలు ఉన్నాయని వాటిని చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి మాట్లాడుతూ నిరంజనయ్యా రచించిన పుస్తకంములో సామాజికాంశాలు ఉన్నాయని వీటితోపాటు తల్లి తండ్రి గురువు దైవం విద్యార్థి సమాజం రాజ్యాంగము మహాత్మా పూలే అంబేద్కర్ అంశాలు ఉన్నాయని పుస్తకం చదవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సరస్వతి ఉపాధ్యాయులు కవి రచయిత కంటే నిరంజనయ్యను అభినందించారు

పరిశుభ్రత పై నగరం పాఠశాల….

పరిశుభ్రత పై నగరం పాఠశాల
మండలంలోనే మొదటి స్థానం..

నిజాంపేట ,నేటి ధాత్రి

 

స్వచ్చత పరిశుభ్రత హరిత పాఠశాల కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను నిజాంపేట మండలం నగరం ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానాన్ని దక్కించుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల పరిశుభ్రత విషయం లో 61 అంశాల్లో పాఠశాల పురోగతిని పరిశీలించి రేటింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రేటింగ్స్ లో మండలంలోని నగరం తండా గ్రామంలో గల పాఠశాల ఫైవ్ స్టార్ రేటింగ్ తో మొదటి స్థానం లో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన ఉన్నారు.

కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134240.033.wav?_=1

 

— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు
• చదువుతోపాటు క్రీడలు అవసరమే..
సీఐ వెంకట రాజ గౌడ్

నిజాంపేట: నేటి ధాత్రి

 

విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ…

దాతల సహాయంతో ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు టై బెల్టులు పంపిణీ.

చిట్యాల, నేటి ధాత్రి :

 

చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో టై బ్యాడ్జి బెల్టుల పంపిణీ@
స్థానిక జడ్పీహెచ్ఎస్ చిట్యాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థుల కోసం దాతల సహాయంతో టై, బ్యాడ్జి బెల్టులను ఎంఈఓ రఘుపతి పంపిణీ చేశారు.
ఇందుకోసం పొగళ్ల మహేందర్ రెడ్డి, దేవ శ్రీధర్,మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు సహకారంతో విద్యార్థులకు ఎం ఈ వో రఘుపతి వీటినిపంపిణీ చేశారు.
ఇట్టి కార్యక్రమంలో ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు బొమ్మ రాజమౌళి, బుర్ర సదయ్య, కూచనపల్లి.శ్రీనివాస్, పిడి సూధం సాంబమూర్తి, రామనారాయణ, ఉస్మాన్ అలీ, నీలిమ రెడ్డి సరళ దేవి,కల్పన, విజయలక్ష్మి, సుజాత, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి…

ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించాలి

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పీర్లగుట్ట కాలనీలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో మూత్రశాలలు మరుగుదొడ్లు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్
విద్యా శాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు
ఐదు తరగతులకు ఒకే టీచర్ ఉన్నారని తిరిమాల్ తెలిపారు
5 తరగతులకు ఓకే గది ఉండడంవల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదనపు గదులను నిర్మించాలని అన్నారు
పాఠశాలలో మరుగుదొడ్లు వసతులు ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వన్ని కోరారు

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్…

అధ్యాపకుడిగా జిల్లా కలెక్టర్
మల్లాపూర్ సెప్టెంబర్ 11 నేటి ధాత్రి

 

 

మల్లాపూర్ మండల కేంద్రంలోని గిరిజన బాలికల (మినీ గురుకుల)పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యను నేర్పించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
గురువారం రోజున జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కేందంలోని గిరిజన పాఠశాలను సందర్శించిన కలెక్టర్.
పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల తీరును కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.
క్లాస్ రూమ్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని కలెక్టర్ ఆరా తీశారు. అదే విధంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని కలెక్టర్ హాజరు పట్టికను పరిశీలించారు. పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు.
విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి పాఠాలు చదివించి వారి బోధన స్థితిగతులను ప్రత్యేకంగా పరిశీలించారు.

 

District Collector Inspects Tribal Girls School in Mallapur

 

పాఠశాలలో విద్యార్థుల హాజరు, తరగతుల నిర్వహణ, పారిశుద్ధ్య సౌకర్యాలు వంటి అంశాలను పరిశీలించారు.. విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం భోజనం అందుతున్నదా అనే విషయాన్ని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భోజన తయారీ విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అదేవిదంగా ఒప్పంద నిర్వాహకుడితో మాట్లాడి నాణ్యతతో కూడిన సరుకులు అందించాలని తెలిపారు.
పాఠశాల తరగతి గదులలో పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు. వర్షాకాలం దొమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పాఠశాల ఆవరణంలో పిచ్చి మొక్కలు తొలగించి, శానిటేషన్ చేయించాలని సూచించారు. ముఖ్యంగా పాఠశాల ఉపాధ్యాయులు సమయపాలన తప్పకుండా పాటించాలని చెప్పడం జరిగింది.
కలెక్టర్ వెంట మెట్ పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ జిల్లా అధికారి రాజ్ కుమార్, తహసీల్దార్, సంబంంధిత అధికారులు పాల్గొన్నారు.

17వ బెటాలియన్ విద్యార్థులకు షూ, టై, బెల్ట్ పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-04T141913.546-1.wav?_=2

 

17వ బెటాలియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విద్యార్థులకు షూ,టైప్,బెల్టులు పంపిణీ

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 17 వ బెటాలియన్ కి సంబంధించిన పోలీసుల అన్యువల్ రిఫ్రెషర్ కోర్సులో భాగంగా ఈరోజు సిరిసిల్ల అర్బన్ సర్దాపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సిరిసిల్ల జిల్లా 17 వ బెటాలియన్ అధికారి ఆర్.ఎస్.ఐ తిరుపతి ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు షూ, టై, బెల్ట్‌లను పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. అంతేకాకుండా
తిరుపతి మాట్లాడు విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం మరియు అధికారులు అన్ని విధాల కృషి చేస్తారు. అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మరియు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు.

నిరుపేద బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల ఆర్థిక సాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-30T151931.764.wav?_=3

 

నిరుపేద బాధిత కుటుంబానికి ఉపాధ్యాయుల ఆర్థిక సాయం

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ నిజాముద్దిన్ ఆనారోగ్యం చేత మరణించగా అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో తన ముగ్గురు కుమార్తెలు విద్యనభ్యసిస్తుండగా తమ దీన స్థితిని గమనించి మర్రిగడ్డ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం శనివారం బాదిత కుటుంబాన్ని పరామర్శించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు . నిరుపేద కుటుంబానికి దాతలు ముందుకు వచ్చి సహాయాన్ని అందించాలని కోరారు. పరమర్శించిన వారిలో ప్రధానోపాధ్యాయులు వినయ్ కుమార్ ,ఉపాధ్యాయులు,గంగనర్సయ్య, వేణుగోపాల్, జ్యోతిరాణి, సావిత్రి, సరోజ, పద్మ, కనకయ్య ఉన్నారు.

మల్లక్కపేటలో ఉచిత వైద్య శిభిరం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T152606.374.wav?_=4

మల్లక్కపేటలో ఉచిత వైద్య శిభిరం

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలోని మల్లక్కపేట గ్రామంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ)ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరాన్ని ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు ఐఎంఎ స్టేట్ కౌన్సిల్ మెంబర్,ఎంజీఎం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్.దొమ్మటి ప్రసన్న కుమార్ తెలిపారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హాజరువుతున్నట్టు తెలిపారు.గ్రామంలో ఆదివారం రోజున ఉదయం 9గంటలనుండి సాయంత్రం 3గంటలవరకు అనస్తిషియా,గుండె నిపుణులు,కిడ్నీ వైద్య నిపుణులు,స్త్రీల వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని అగర్వాల్ కంటి ఆసుపత్రి వారు ఉచిత పరీక్షలు నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు

ప్రధానోపాధ్యాయ పదోన్నతి: వెబ్ ఆపరేషన్ ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-21T125911.773-1.wav?_=5

 

ప్రధానోపాధ్యాయ పదోన్నతి: వెబ్ ఆపరేషన్ ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్కూల్ అసిస్టెంట్ నుంచి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి కల్పించే వెబ్ ఆపరేషన్ ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన ప్రధానోపాధ్యాయులు http://transfer.de.telangana.gov.in లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ ద్వారా అర్హులైన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించబడతాయి.

వీణవంకలో 79వ స్వాతంత్ర దినోత్సవం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-50.wav?_=6

ఘనంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

వీణవంక మండల కేంద్రంలో 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా ప్రభుత్వ కార్యాలయంలో జరుపుకున్నారు అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, స్వీట్లు పంపిణీ చేశారు తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ అంబాటి రజిత జాతీయ జెండా ఆవిష్కరించారు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆవుల తిరుపతి మూడు రంగుల జెండాను ఆవిష్కరించారు ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శ్రీధర్ జెండా ఆవిష్కరించారు ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నవాబ్ తాసిల్దార్ నిజాముద్దీన్, అధికారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

తండ్రి జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాలలో టై,బెల్ట్,ఐడి కార్డు పంపిణీ

మాజీ సర్పంచ్ నామాల సత్యవతి తిరుపతి

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండలం రామారావు పేట గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలలో నామాల వెంకన్న 13వ వర్ధంతి సందర్భంగా టై,బెల్ట్స్,ఐడెంటి కార్డ్స్,విద్యార్థిని,విద్యార్థులకు వారి కుటుంబ సభ్యులు అందించారు.నామాల వెంకన్న కుమారులైన నమాల సత్యవతి తిరుపతి,జ్యోతి రవి,మాధురి శ్రీనివాస్ విద్యార్థిని,విద్యార్థులకు టై, బెల్ట్,ఐడికార్డ్స్ వారి నాన్న జ్ఞాపకార్థం విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు సంతోష్ ఆధ్వర్యంలో బుధవారం అందజేశారు.ఈ సందర్భంగా నామాల తిరుపతి మాట్లాడుతూ..మన ప్రభుత్వ పాఠశాలను మనమే అభివృద్ధి చేసుకోవాలని విద్యార్థిని,విద్యార్థులను ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు దీటుగా తయారుచేసి పోటీ పరీక్షల్లో ప్రైవేటు పాఠశాల విద్యార్థులపై నెగ్గే విధంగా తయారు చేయాలని అన్నారు.మా వంతుగా ప్రభుత్వ పాఠశాలకు ఏ అవసరమొచ్చిన సహాయం చేయడానికి ముందుంటామని తెలిపారు.అలాగే పాఠశాల ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులు నామాల సత్యవతి తిరుపతి ని ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు,అంగన్వాడీ టీచర్ విజయ,యూత్ సభ్యులు శ్రీకాంత్, రాజకుమార్,శ్యామ్ కుమార్, శ్రీకర్,తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో జిల్లా సహకార బ్యాంక్.

ప్రభుత్వ పాఠశాలలో జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్ కోడూరు రవీందర్ రావు జన్మదిన వేడుకల సందర్భంగా నోట్ బుక్స్ పంపిణీ.,

వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి 

 

వీణవంక మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు గారి జన్మదిన వేడుకల సందర్భంగా వీణవంక సహకార కేంద్ర బ్యాంక్ మేనేజర్ బెజ్జంకి అభిలాష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ పెన్నులు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, విద్యార్థి విద్యార్థులకు భవిష్యత్ భావి తరాలకు ఉన్నంత చదువుల కోసం వెళ్లేందుకు సహకార బ్యాంకు నందు ప్రతి విద్యార్థి అకౌంటు ఖాతా తీసుకొని మీకు స్కాలర్షిప్ వీలైనంత డబ్బులను డిపాజిట్ చేసుకొని పై చదువులకు ఉపయోగపడతాయని వారు అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు సురేష్ బాబు, లింగయ్య సహకార బ్యాంక్ సిబ్బంది సల్పాల లక్ష్మణ్, ప్రదీప్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు

ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలి
ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు దూడపాక రాజు

మొగులపల్లి నేటి ధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26 వేలకు పైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మంది పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో 60% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్న వారు.

కాబట్టి, ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో & ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతీ 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు ఏర్పాటు చేసి విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది. చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. కొంత మేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది.
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని మీ ద్వారా తెలంగాణ | రాష్ట్ర ప్రభుత్వానికి BC, SC, ST JAC తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని క్రమంలో ప్రభుత్వంపై అనేక రకాలుగా దశలవారీగా ఉద్యమాలు చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ తెలంగాణ రాష్ట్రంలో స్త్రీలకు ఏ విధంగా అయితే ఉచిత బస్సు అందించారు అదేవిధంగా స్థానిక ప్రభుత్వ స్కూలు ప్రైమరీ, ఉన్నత పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు గ్రామాల నుండి పాఠశాల వారికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని మరొక విధంగా దీనిని సెమీ రెసిడెన్షియల్ గా అనుకోవచ్చు. అలాగే పిల్లలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం స్నాక్స్ తో వారికి అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు దూడపాక రాజు ఉపాధ్యక్షులు బండారి కుమార్ ధర్మ స్టూడెంట్స్ యూనియన్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీక్రిష్ణ మరియు బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు శ్రీధర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం

ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బస్సు సౌకర్యం కల్పించాలి

భూపాలపల్లి నేటిధాత్రి

రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు ఉచిత బస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా భూపాలపల్లి జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 26వేలపైగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు.

 

 

 

 

వీరిలో 90% విద్యార్థులు తాము చదువుకుంటున్న పాఠశాలకు దూరంగా నివాసం ఉంటున్నవారు.కాబట్టి ప్రతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రతి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక బస్సు చొప్పున ఏర్పాటు చేసి, విద్యార్థులను స్కూల్స్ కు తీసుకెళ్లాలి. దీని ద్వారా వారి సమయం, శక్తి వృధా కాకుండా ఉంటుంది చదువుపై మరింత శ్రద్ధ పెడతారు, ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి.

 

 

 

 

 

ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజుల భారం మోయలేనటువంటి పరిస్థితి, అదే విధంగా ఇప్పుడు వర్షాకాలం సీసన్ గనుక ఒకవేళ వర్షం పడితే స్కూల్ కి వెళ్లలేనటువంటి పరిస్థితి మరియు చిన్నపిల్లలకు బుక్స్ మోయడం భారం అవుతుంది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.కొంతమేరకు సెమీ రెసిడెన్షియల్ స్కూల్ గా ఏర్పాటు చేసుకునే అవకాశం కలుగుతుంది
తప్పకుండా ఈ డిమాండ్ ను నెరవేర్చాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.

 

 

 

ఈ కార్యక్రమంలో భీమనాధుని సత్యనారాయణ బిసి సంఘం జిల్లా అధ్యక్షులు, వైనాల శోభన్ బాబు రజక సంఘం, వైనాల శంకర్ రజక సంఘం, సంతోష్ ముదిరాజ్ సంఘం, ముత్యాల రవికుమార్ నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు, మరియు ధర్మ స్టూడెంట్ యూనియన్ జిల్లా కన్వీనర్ దూడపాక శ్రీకృష్ణ, జేఏసీ సభ్యులు మంద రమేష్, కండె రవి బొజ్జ పెళ్లి మహర్షి, పుల్ల అశోక్, కుర్రి స్వామినాథన్, దూడపాక రాజు నేరెళ్ల రమేష్ పర్లపల్లి కుమార్ దాసరపు భాస్కర్, మట్టవాడ కుమార్, లాపాక రవి, ఎంజలా శ్రీనివాస్, పందిళ్ళ రమేష్,గుండ్ల రాజకుమార్,సంజీవ్ పాల్గొన్నారు.

ప్రైవేట్ పాఠశాలను తలపిస్తున్న సర్కార్ బడి.

ప్రైవేట్ పాఠశాలను తలపిస్తున్న సర్కార్ బడి

ఇబ్రహీంపట్నం. నేటిధాత్రి

 

 

 

ఇబ్రహీంపట్నం మండలంలోని వర్ష కొండ గ్రామంలో మండల్ పరిషత్ పాఠశాల గత ఏడాది జూన్ నెలలో 20. మంది పిల్లలతో ఉన్న బడి ఈ సంవత్సరం 70.విద్యార్థులతో ప్రవేట్ పాఠశాలకు దీటుగా కేవలం ఒక సంవత్సరంలో పాఠశాలక మారిపోయింది ప్రమోషన్ ద్వారా ప్రధానోపాధ్యాయులుగా బాధ్యతలు స్వీకరించిన అచ్చ విజయ్ భాస్కర్ కేవలం సంవత్సర కాలంలోనే పూర్తిగా మార్చుకున్నారు దీని కొరకు గ్రామంలో ఇంటింటికి తిరిగి పిల్లల తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేట్లు భరోసా ఇవ్వగలిగాడు వెంటనే గ్రామ పెద్దలను కలిసి బడికి కావలసిన అవసరాలపై చర్చించి ఒక్కొక్కటిగా రాబట్టుకునే ప్రయత్నం చేశాడు మొదట గ్రామ ఎంపీటీసీ పోనుకంటి చిన్న వెంకట్ పిల్లలకు టై. బెల్ట్. ఐడి కార్డు ఇచ్చారు తరగతి లో పాఠ్యాంశ బోధనకు గ్రామంలోకి తీసుకుపోయే విధంగా యూట్యూబ్ ఛానల్ లలో ఏర్పాటు చేశారు తద్వారా బడిని గ్రామానికి అనుసంధానం చేయడంలో సఫలం అయ్యారు అంతటితో ఆగకుండా గ్రామంలోని పెద్దలను. మరియు యువతను సభ్యులుగా చేస్తూ ఒక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసి బడిలో జరిగే ప్రతి కార్యక్రమాన్ని గ్రామంలోకి తీసుకువెళ్లారు దీనితో బడి వైపు దాతలు ముందుకు వచ్చారు జియో ఫైబర్.

 

బడికి అవసరం కొరకు ప్రింటర్ మరియు బడి రక్షణ కొరకై సీసీ కెమెరాలు దాతల సహకారంతో ఏర్పాటు చేశారు ఈ దశలో దుబాయిలో ఉండే గ్రామ నివాసి మంగలి పెళ్లి మహిపాల్.

 

private school

 

 

దృష్టికి తీసుకువెళ్లారు బడి డెవలప్మెంట్ కోసం ఏమన్నా సహాయం చేయాలని కోరారు అతను వెంటనే స్పందించి బడికి టాయిలెట్స్ రిపేరు మరియు రన్నింగ్ వాటర్ కొరకు 110.000లక్ష పది రూపాయలు మరియు అంతేకాకుండా మరమూర్తులకు బడి ప్రైవేట్ పాఠశాల లాగా కనపడే విధంగా 90 వేల రూపాయలతో పెయింటింగ్. మరియు పిల్లలకు ఆడుకునేటట్లు పాట వస్తువులకు 80000 రూపాయలతో పాటవస్తులు ఏర్పాటు చేశారు ప్రజల ఉపాధ్యాయుల గదిలో 5000 రూపాయలతో దేశ నాయకుల ఫోటోలు ఏర్పాటు చేశారు అలాగే బడి వార్షికోత్సవ కార్యక్రమానికి పదిహేడు వేల రూపాయలు ఇచ్చారు మొత్తం కలిపి 300000 రూపాయలు తన సొంత డబ్బులతో పాఠశాలకు ఖర్చు చేశారు సొంత గ్రామ బడిని నిలబెట్టిన మంగలి పెళ్లి మహిపాల్ గ్రామస్తులు అభినందించారు లో ఉండేది మనుగడే ప్రశ్నార్థకంగా ఉన్నప్పటి పరిస్థితుల నుండి ఈ సంవత్సరం 70 మంది విద్యార్థులతో ప్రైవేట్ పాఠశాలకు దీటుగా కేవలం ఒక సంవత్సరంలోనే పాఠశాల మారిపోయింది

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

మందమర్రిలో నివాసం ఉంటున్న గంగాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నం సంజీవ్, కరుణ ల కూతురు రత్నం ఉజ్వలిత ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల – ఫిల్టర్ బెడ్ లో ఐదవ తరగతిలో చేర్పించారు.ఫిల్టర్ బెడ్ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో తన కూతుర్ని అడ్మిషన్ చేసినందుకు గాను ఉపాధ్యాయులు రత్నం సంజీవ్ ను అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించేలా చొరవ తీసుకోవాలని ఫిల్టర్ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉజ్వలకు ఫిల్టర్ బెడ్ ప్రదానోద్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి , ఏఏపిసి చైర్మన్ అంజలి లు సాదర స్వాగతం పలికారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version