అంతర్జాతీయ కార్యశాల పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T163223.425.wav?_=1

 

అంతర్జాతీయ కార్యశాల పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్)రాజమండ్రి ఎస్.కే.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఈడూమెంట్ యు సరయు ఎడ్యుకేషనల్ ప్రో, వెంకట్స్ టైమ్ అనే సంస్థల సౌజన్యంతో ఇంటర్నేషనల్ ఇంటెన్సీస్ థీసిస్ రైటింగ్ వర్క్ షాప్ అనే అంశంపై ఈ నెల 16 నుండి 30 వరకు నిర్వహిస్తున్న 15 రోజుల అంతర్జాతీయ కార్యాశాలను ఆన్లైన్ విధానంలో కొనసాగించే పోస్టర్ ను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆవిష్కరించారు.మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇలాంటి ఉన్నతమైన అంతర్జాతీయ స్థాయిలో వర్క్ షాప్ ను నిర్వహిస్తున్నందుకు గాను ఈ ప్రోగ్రామ్ చీఫ్ పాట్రన్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ను ,ఆంగ్ల విభాగపతి, కన్వీనర్ ఎంఎంకే రహీముద్దీన్ లను జిల్లా కలెక్టర్ అభినందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నతమైన విలువలతో కూడి ఉన్నాయని ఇలాంటి కార్యక్రమాలు పరిశోధన విద్యార్థులకు ఉపయోగకరంగాను విద్యావేత్తలు పరిశోధక పత్రాలను సమర్పించడంలో ఉపయోగకరంగా ఉంటాయని చెప్పారు.ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొని తమ యొక్క నైపుణ్యాలను మెరుగుపరుచుకొని తమ యొక్క పరిశోధనలలో అగ్రగామిగా ఉండాలని ఆకాక్షిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

 బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T152333.182.wav?_=2

 

బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తాం: తేజస్వి

 

నవంబర్ 6న తొలి విడత పోలింగ్ జరిగి నాలుగు రోజులైనా గణాంకాలను ఇంతవరకూ ఈసీ బయటకు వెల్లడించలేదని తేజస్వి ఆరోపించారు. గతంలో ఎన్నికల రోజే ఓటింగ్ గణాంకాలను వెల్లడించేవారని, ఇప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారని ప్రశ్నించారు.

 నవంబర్ 14వ తేదీ తర్వాత బిహార్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ఆర్జేడీ (RJD) నేత, మహాగఠ్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ (Tejashwi Yadav) తెలిపారు. బిహార్‌ను అట్టడుగు స్థాయిలోకి ఎన్డీయే నెట్టేసిందని, పోలింగ్‌కు ముందు ఎన్నికల అధికారులను కేంద్ర మంత్రులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ మరికొద్ది గంటల్లోనే జరుగనుండటంతో సోమవారంనాడు మీడియా సమావేశంలో తేజస్వి మాట్లాడారు.
నవంబర్ 14 తర్వాత బిహార్‌ను దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్తాం. ఆహార ఆధారిత యూనిట్లు, విద్య, వైద్యం, ఉపాధి కల్పన, ఇరిగేషన్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎడ్యుకేషనల్ సిటీలు, ఐటీ హబ్‌లు ఏర్పాటు చేస్తాం. ఏ ఒక్క బిహారీ కూడా ఇతర సిటీలకు వెళ్లాల్సిన పని లేదు’ అని తేజస్వి తెలిపారు. ఈసారి చాలా స్పష్టంగా బిహార్‌లో మార్పు కనిపిస్తోందని, ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని ప్రజలు బలంగా తీర్మానించుకున్నారని, ప్రజలు చరిత్ర సృష్టించనున్నారని చెప్పారు.

విద్యార్దులకు ప్రతిభ పొటీలు:

విద్యార్దులకు ప్రతిభ పొటీలు:

చందుర్తి, నేటిధాత్రి:

చందుర్తి మండల కేంద్రములోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున టి_ సాట్(T-SAT), తెలంగాణ ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రధానోపాధ్యాయ సంఘం మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతు విద్యార్థులకు పోటీ పరీక్షల పట్ల అవగాహన, ఆసక్తిని కలిగించడానికి , ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రతిభ పోటీలు నిర్వహించామని, మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులను జిల్లా స్థాయి పోటీలకు పింపించడం జరుగుతుందన్నారు. గెలుపోందిన విద్యార్థులకు ప్రశంస పత్రాలు అందించారు.
వ్యాసరచనలో లతిక శ్రీ ఉన్నత పాఠశాల లింగంపేట(ప్రథమ), భవిష్య ఉన్నత పాఠశాల (ద్వితీయ) శ్రీవిన్ ఉన్నత పాఠశాల జోగాపూర్( తృతియ),
ఉపన్యాస పోటిలో రిషిక ఉన్నత పాఠశాల మాల్యాల(ప్రథమ), అశ్విత ఉన్నత పాఠశాల నర్సింగాపూర్(ద్వితీయ), హర్షిని ఉన్నత పాఠశాల చందుర్తి(తృతీయ),
క్విజ్ పోటిలో కీర్తన ఉన్నత పాఠశాల మల్యాల(ప్రథమ), శ్రీ చరిత ఉన్నత పాఠశాల మూడపల్లి ( ద్వితీయ) , మహి దీక్షిత ఉన్నత పాఠశాల మల్యాల (తృతీయ) బహుమతులు
గెలుపొందారు, ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రాజు , ప్రతిభ పాల్గొన్నారు. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు మేడికాల అంజయ్య, అంబటి శంకర్, అగ్రవ చారి,అమర్ నాద్, కార్తీక్ , సుధారాణి, ప్రకాశ్ వ్యవహరించారు.

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు…

రామడుగులో మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన, క్విజ్ పోటీలు

రామడుగు, నేటిధాత్రి:

 

టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ సంయుక్త ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా రామడుగు మండల స్థాయి ఉపన్యాసం, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు శుక్రవారం రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి జి.పి.వి.రంగనాథ శర్మ పర్యవేక్షణలో నిర్వహించబడ్డాయి. ఈపోటిలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గెలుపోందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈసందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, పోటీ మనోభావం, జ్ఞాన విస్తరణకు ఇలాంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని, టి-సాట్ మరియు టిఎస్జిహెచ్ఎమ్ఎ విద్యా రంగంలో చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈకార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

జహీరాబాద్ పాఠశాలలో విద్యార్థుల వందేమాతరం గీతాలాపన..

జహీరాబాద్ పాఠశాలలో విద్యార్థుల వందేమాతరం గీతాలాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు పాఠశాలలో శుక్రవారం ఉదయం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేంకటయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఏకకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఝరాసంగం విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వందేమాతరం ఏకకంఠం

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికి జాతీయ గౌరవం ఐక్యతను పెంచుతున్న వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వందేమాతరం గేయ ఆలాపనలో విద్యార్థులు తో సహా పోషక మహాశయులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల కరస్పాండెంట్ బి.నాగన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా…

కంచిరావు పల్లి ప్రభుత్వ పాఠశాల గ్రంథాలయానికి కాలగమనం పుస్తకాలు ఇచ్చిన నిరంజనయ్యా
వనపర్తి నేటిదాత్రి .

 

డాక్టర్ కంటే నిరంజనయ్య స్వీయ రచన కాలగమనం పుస్తకాలను కంచిరావుపల్లి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గ్రంధాలయానికి కాలగమనం పుస్తకాలను ఇచ్చారు. ఈ సందర్భంగా కంటే నిరంజనయ్యా విద్యార్థుల తో మాట్లాడుతూ కాలగమనం పుస్తకంలో 55 కవిత అంశాలు ఉన్నాయని వాటిని చదివి కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రధానోపాధ్యాయురాలు సరస్వతి మాట్లాడుతూ నిరంజనయ్యా రచించిన పుస్తకంములో సామాజికాంశాలు ఉన్నాయని వీటితోపాటు తల్లి తండ్రి గురువు దైవం విద్యార్థి సమాజం రాజ్యాంగము మహాత్మా పూలే అంబేద్కర్ అంశాలు ఉన్నాయని పుస్తకం చదవాలని విద్యార్థులను కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టీచర్లు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు సరస్వతి ఉపాధ్యాయులు కవి రచయిత కంటే నిరంజనయ్యను అభినందించారు

సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక..

సాఫ్ట్ బాల్ పోటీలకు కేజీవీపీ విద్యార్థులు ఎంపిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

ఈనెల 2న హన్మకొండ జిల్లా ఎస్ డిఎల్ సి క్రీడా ప్రాంగణంలో సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ హన్మకొండ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ సెలెక్షన్ పోటీలలో, జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల కేజీవీపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎన్. శరణ్య అద్భుత ప్రతిభ ప్రదర్శించి, హన్మకొండ జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించింది.
రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు జగిత్యాల జిల్లాలో నవంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్నాయి.
ఈ విజయంపై కేజీవీపీ స్పెషల్ ఆఫీసర్ నాగపురి స్వప్న వ్యాయామ ఉపాధ్యాయురాలు అనిత ఉపాధ్యాయ బృందం విద్యార్థినీ తల్లిదండ్రులు శరణ్యను హృదయపూర్వకంగా అభినందించారు.

డాక్టరేట్ అందుకున్న ఎర్రోళ్ల ప్రతాప్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-06T115203.420.wav?_=3

 

డాక్టరేట్ అందుకున్న ఎర్రోళ్ల ప్రతాప్

జహీరాబాద్ నేటి ధాత్రి:

విద్యార్థి దశ నుండి నేటి వరకు ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఝరాసంగం మండల్ బర్దిపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రతాప్ కు ఆయన చేసిన సేవలను గుర్తించి ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను రీసర్చ్ అండ్ కల్చర్ భవన్ హైదరాబాద్ నందు అందించడం జరిగింది. ఆయన చేసిన సామాజిక సేవ కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, డాక్టరేట్ రావడంతో ఇంకా సామాజిక బాధ్యత పెరిగిందని డాక్టర్ ఎర్రోళ్ల ప్రతాప్ అన్నారు.

ఆయన విద్యార్థి దశలో విద్యార్థుల ఎన్నో సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల యొక్క విద్య సమస్యలే కాకుండా మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించి నిరుపేదలకు మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నారు. సమాజంలో విద్యా వైద్యం రెండు సంపూర్ణంగా అందినప్పుడే నిరుపేదల జీవితాలు బాగుపడతాయని వారన్నారు. అటు విద్యార్థి సమస్యలపై ఇటు నిరుపేదల ఆరోగ్యాలను కాపాడడానికి మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

తండ్రి బాటలో తనయుడు వారి తండ్రి ఎర్రోళ్ల జయప్ప ఎన్జీవో ద్వారా దాదాపు 45 సంవత్సరాల నుండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. వారి తండ్రి జయప్ప స్ఫూర్తి బాటలోనే తనయుడు డాక్టర్ ఎర్రోళ్ల ప్రతాప్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గౌరవ డాక్టర్ రేట్ రావడం తో ఇంకా సామాజిక బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో బాధ్యత యుతంగా, భావి భారత పౌరునిగా తన వంతు బాధ్యతను కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తానని వారన్నారు

*నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్…

*నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్
మహదేవపూర్ ఉపాధ్యాయులు

మహాదేవపూర్ నవంబర్ 04నేటిధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండల కేంద్రంలో
ఛత్తిస్ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో ఈ నెల 5వ తేది నుండి 8వ తేది వరకు జరగనున్న నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్ లో మహాదేవపూర్ బాలుర పాఠశాల సైన్స్ టీచర్ బి. ప్రభాకర్ రెడ్డి, మరియు బాలికల పాఠశాల సైన్స్ టీచర్ మడక మధు పాల్గొననున్నారు.దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 162 మంది సైన్స్ టీచర్స్ ఎంపికయ్యారు. తెలంగాణా నుండి ఎంపికైన ముగ్గురిలో ఇద్దరు మన మహాదేవపూర్ ఉపాధ్యాయులు ఉండడం గర్వకారణం. ఈ కాన్ఫరెన్స్
నెట్వర్క్ ఆఫ్ ఆర్గనైజషన్స్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్,ఇస్రో నేషనల్ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ఇండియన్ యంగ్ ఇన్వెంటర్స్ అండ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఈ కాన్ఫరెన్స్ గత పద్నాలుగు సంవత్సరాలుగా సైన్స్ అభివృద్ధికి కృషి చేస్తూ, సైన్స్ మరియు మాథ్స్ టీచర్స్ కు వేదికగా టీచర్స్ సైన్స్ కాంగ్రెస్‌ను నిర్వహిస్తోంది. ఈ కాన్ఫరెన్స్ ప్రముఖ శాస్త్రవేత్తలతో సంభాషించడానికి అవకాశం కల్పిస్తూ యువ వర్ధమాన శాస్త్రవేత్తలను ప్రోత్సహిస్తుంది.
ఉపాధ్యాయులు, ఆవిష్కర్తలు, పరిశోధకులు తమ వినూత్న ఆలోచనలను, ప్రాజెక్టులను మరియు పరిశోధన పత్రాలను ప్రదర్శించడానికి ఈ కాన్ఫరెన్స్ చక్కని వేదిక.దీనికి ఎంపికైన ఉపాధ్యాయులను మండల విద్యాధికారి, ఉభయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అభినందించారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ జెండా శత ఆవిష్కరణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ జెండా శత ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం “నిత్య జాతీయ పతాకావిష్కరణ వంద (శత) వ రోజు కార్యక్రమంలో” భాగంగా సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ పతాకావిష్కరణ చేయడం జరిగినది. అగ్గిపెట్టెలో చీర , సూది బెజ్జంలో దూరే చీర , ప్రముఖుల ముఖ చిత్రాలతో నేసిన వస్త్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మాట్లాడుతూ జాతీయ పతాకావిష్కరణ అవకాశం మాన్యులకే కాకుండా సామాన్యులకు కూడా అందించేటువంటి నిత్య జాతీయ పతాకావిష్కరణ అభినందనీయమని, ప్రతిరోజు విద్యార్థుల చేత జాతీయ పతాకావిష్కరణ చేయించడం ఒక వినూత్న కార్యక్రమమని ఈ విధంగా ఈ విధమైన కార్యక్రమాన్ని నిర్వహించే రాష్ట్రంలోని ఏకైక కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అని తెలిపారు .ప్రతి విద్యార్థి దేశభక్తి భావాలను పెంచుకోవాలని క్రమశిక్షణతో చదివితే ఎలాంటి ఉన్నత ఉద్యోగాలైన సాధించవచ్చు అని పేర్కొన్నారు.

విద్యతోపాటు పుస్తక పఠనం చేయాలని ప్రతి విద్యార్థి సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, మీ గురువులు చెప్పే విషయాలను పాటించి. ఇష్టపడి,కష్టపడి చదివితేనే మీ లక్ష్యాన్ని చేరగలుగుతారని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వారు తెలిపారు. పట్టుదలతో కష్టపడి ఇష్టంతో ఏ రంగంలో , ఏ కళ లోనైనా పనిచేసిన విజయాన్ని సాధిస్తారని వారు తెలిపారు. కార్యక్రమంలో వారు తయారు చేసిన చేనేత వస్త్రా న్ని విద్యార్థులకు ప్రదర్శించారు.

 

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్,అధ్యాపకులు శ్రీధర్, కేదారేశ్వర్ ,బి.వెంకటేశం. సామల వివేకానంద్.ఈ కనకయ్య. .అరుంధతి. విజయ ,రాజయ్య , ఆంజనేయులు, చంద్రమౌళి, సురేష్ ,సరోజ,
చంద్రశేఖర్,రాజశేఖర్,శ్రీనివాస్, సుజిత , మమత,నర్మద, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు

తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
పైడిపెళ్లి రమేష్ బిసి జేఏసీ జిల్లా ఛైర్మెన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ
42% బీసీ రిజర్వేషన్
రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3 4 ద్వారా మార్చి 2020లో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి తొమ్మిదవ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలి ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మనవి చేస్తున్నాం
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి
కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంవత్సరం కూడా ఖర్చులు అలాగే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు కమిషన్లు బోర్డులు సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం సమాన అవకాశాలు తగు ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి…

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు షైక్ సోహైల్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 80% ముస్లిం మైనార్టీ లు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. మైనార్టీ యువత సాధారణంగా జీవన అవసరాలు తీర్చి ఆదాయ వనరులు, ఉపాధి మార్గాలు లేక, దారిద్రం, బతుకుల భారమై అవమానాలతో, మానసిక వేదనతో అనేకమంది అనారోగ్య పాలైన వృద్ధుల కంటే ముందే చనిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 80% యువకులు తమ విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారూ.. అని ముస్లిం మైనార్టీ హక్కుల విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు 50% రాయితీ ఇవ్వాలి. ప్రభుత్వం మిగిలి ఉన్నా వక్స బోర్డు భూములను మరుమేద ముస్లిం మైనార్టీ లకు ప్రభుత్వం పంచిపెట్టాలి.

ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలి

ఫీజు రియంబర్మెంట్ వెంటనే విడుదల చేయాలి

బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ ముట్టడి.

జమ్మికుంట,( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

 

జమ్మికుంట నుండి వంద మంది విద్యార్థులు హలో విద్యార్థి చలో కలెక్టరేట్ విద్యార్థులు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులతో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగినది ముట్టడిలో భాగంగా పోలీసులకు విద్యార్థి నాయకులకు విద్యార్థులతో తోపులాట జరిగినది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి నాయకులను అరెస్టు చేయడం జరిగినది సిటీ పోలీస్ స్టేషన్ ట్రైనింగ్ సెంటర్ కి తరలించడం జరిగినది మీరు ఎన్ని అక్రమ అరెస్టులు కేసులు చేసిన విద్యార్థులకు ఇచ్చిన హామీలు మరియు ఫీజు రీయంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి లేనియెడల మరో ధర్నాలు రాస్తారోకోలు చేయడనికైనా సిద్ధం హెచ్చరించడం జరిగినది ఈ కార్యక్రమంలో జమ్మికుంట బిఆర్ఎస్వి పట్టణ అధ్యక్షులు కొమ్ము నరేష్ ,ఆవుల తిరుపతి, జవాజీ అనిల్, వొల్లాల శ్రీకాంత్ , నల్లగాశ హరీష్ యాదవ్,చింతల కౌశిక్, వెనిశెట్టి నాగరాజు, నరిండ్ల శివ భాస్కర్

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి…

మైనార్టీలకు విద్య ఉపాధి రాజకీయాల్లో 12% రిజర్వేషన్ అమలు చేయాలి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల తుమ్మనపల్లి గ్రామ యువ నాయకులు షైక్ సోహైల్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 80% ముస్లిం మైనార్టీ లు కఠిన దరిద్రాన్ని అనుభవిస్తున్నారు. మైనార్టీ యువత సాధారణంగా జీవన అవసరాలు తీర్చి ఆదాయ వనరులు, ఉపాధి మార్గాలు లేక, దారిద్రం, బతుకుల భారమై అవమానాలతో, మానసిక వేదనతో అనేకమంది అనారోగ్య పాలైన వృద్ధుల కంటే ముందే చనిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో 80% యువకులు తమ విలువైన జీవితాన్ని వృధా చేసుకుంటున్నారూ.. అని ముస్లిం మైనార్టీ హక్కుల విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ విద్యార్థులకు ప్రైవేటు విద్యాసంస్థలు 50% రాయితీ ఇవ్వాలి. ప్రభుత్వం మిగిలి ఉన్నా వక్స బోర్డు భూములను మరుమేద ముస్లిం మైనార్టీ లకు ప్రభుత్వం పంచిపెట్టాలి.

రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T135916.842.wav?_=4

 

రాష్ట్రవ్యాప్త బీసీ బందులో పాల్గొన్న మోకుదెబ్బ నాయకులు.

దుగ్గొండి,నేటిధాత్రి:

 

42 శాతం బీసీ రిజర్వేషన్ అమలు పట్ల బీసీ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన రాష్ట్ర బంద్ కార్యక్రమం దుగ్గొండి మండలం గిర్నిబావి గ్రామంలో గల ప్రధాన రహదారిపై నిరసన,ధర్నా కార్యక్రమం చేపట్టగా గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ మండల అధ్యక్షుడు తడుక కొమురయ్య గౌడ్ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా నర్సంపేట డివిజన్ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.విద్య, ఉపాధి తోపాటు అన్ని విధాల బీసీ కులస్తులకు న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు గుండెబోయిన రమేష్ గౌడ్, జిల్లా నాయకులు మోడెం విద్యాసాగర్ గౌడ్, మహేష్ గౌడ్, కాసగాని చందూగౌడ్, సుధీర్ గౌడ్, తడుక కాంత్రి కుమార్ గౌడ్ వివిధ గ్రామాల గౌడ కులస్తులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం కావాలి

బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.

42% రిజర్వేషన్ల కోసం బీసీ బంద్‌కు సగర సంఘం మద్దతు

బిసి బంద్ కు సగర సంఘం మద్దతు

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు పోతే సహించేది లేదు

సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ సగర

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

Vaibhavalaxmi Shopping Mall

తెలంగాణ రాష్ట్రంలో బిసి లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18 వ తేదీన తెలంగాణ బిసి జేఏసీ ఇచ్చిన బంద్ కు తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తున్నామని తెలంగాణ సగర సంఘం రాష్ట్ర కమిటీ స్పష్టం చేసింది. గురువారం గచ్చిబౌలి లోని సగర సంఘం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న ఈ బంద్ ద్వారా బిసి ల చైతన్యం ప్రదర్శించాలని పిలునిచ్చారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సహించేది లేదని అన్నారు. రాజ్యాంగ సవరణ చేసి చట్ట పరంగా నే రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ, విద్య, ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సగరులు బంద్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, చిలుక శ్రీనివాస్ సగర, దిండి శేఖర్ సగర, సంయుక్త కార్యదర్శి సంగిశెట్టి గంగాధర్ సగర, కార్యనిర్వాక కార్యదర్శి బంగారి ఆంజనేయులు సగర, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు మోడల రవి సగర, సగర సంఘం నాయకులు కేపీ వెంకటేష్ సగర, ఖాజా సగర, రాజు సగర, కృష్ణ సగర తదితరులు పాల్గొన్నారు.

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ…

ఉల్లాస్ పుస్తకాల పంపిణి చేసిన ఎంఈఓ

చిట్యాల,నేటి ధాత్రి :

 

సమాజంలోని ప్రతి ఒక్కరు చదువుతూ తన యొక్క వ్యక్తిగత జీవన విధానమును మార్చుకోవాలని మానవ వనరుల కేంద్రం చిట్యాల నందు వాలంటరీ టీచర్స్ నకు ఉల్లాస్ పుస్తకాల పంపిణీ మండల విద్యాశాఖాధికారి కోడెపాక రఘుపతి పంపిణీ చేసినారు.
మండల విద్యాశాఖాధికారి రఘుపతి మాట్లాడుతూ చదువు అనేది సమాజంలో మంచి గుర్తింపు ఇస్తుందని ముఖ్యంగా మహిళల అక్షరాస్యతను పెంచవలసిన అవసరము ఎంతైనా ఉన్నదని చదువుకున్న మహిళ తన ఇంటిని పిల్లలను సక్రమమైన మార్గంలో పయనింప చేయడానికి కృషి చేస్తుందని అందుకే ఇంటికి దీపం ఇల్లాలు అని అన్నారని అదేవిధంగా అందరూ చదువుతూ అందరూ ఎదగాలని వారు కోరారు .చిట్యాల మండలంలో వాలంటరీ టీచర్స్ 279. లర్నర్స్ 2790 మందిని గుర్తించామని వాలంటరీ టీచర్స్ అందరూ కూడా లర్నర్స్ ను చదువు వైపునకు మళ్ళించాలని చదువు యొక్క ప్రాముఖ్యతను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉల్లాస్ కార్యక్రమమును దిగ్వి జయం చేయుటకు ప్రతి ఒక్కరు దీనినీ యజ్ఞములా భావించి పాల్గొనాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏపీయం గుర్రపు రాజేందర్ ఉల్లాస్ కార్యక్రమ ఇన్చార్జ్ బోనగిరి తిరుపతి వాలంటరీ టీచర్స్  పాల్గొన్నారు.

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

మాజీ ఉపరాష్ట్రపతి, భారత దేశ సైన్స్ పితామహుడు స్వర్గీయ అబ్దుల్ కలాం 94వ జయంతి సందర్భంగా హైదరాబాదులోని రవీంద్ర భారతి లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. అబ్దుల్ కలాం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు రామకృష్ణాపూర్ పట్టణ తవక్కల్ విద్యాసంస్థల అధినేత అబ్దుల్ అజీజ్ ఎంపికైన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మాజీ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలో గత 25 సంవత్సరాల నుండి విద్యారంగంలో చేసిన నిస్వార్ధ సేవలకు గాను అబ్దుల్ కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత అబ్దుల్ అజీజ్ తెలిపారు. అబ్దుల్ అజీజ్ కు కలాం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు రావడంతో పట్టణంలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు…

ఘనంగా అబ్దుల్ కలాం జయంతి వేడుకలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

కేసముద్రం మండల కేంద్రంలోని శ్రీ వివేకవర్ధిని హైస్కూల్‌లో బుధవారం భారత మాజీ రాష్ట్రపతి, “మిసైల్ మాన్ ఆఫ్ ఇండియా”గా పేరుపొందిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పాఠశాల రెస్పాండెంట్ చిర్ర యాకాంతం గౌడ్ కలాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ –
“డాక్టర్ అబ్దుల్ కలాం జీవితమే ఓ ప్రేరణ. సాధారణ కుటుంబంలో పుట్టి, కఠిన శ్రమతో దేశానికి శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా సేవలు అందించారు. విద్యార్థులు ఆయనలా పెద్ద కలలు కనాలి, వాటిని నెరవేర్చే దిశగా కృషి చేయాలి. కలాం చెప్పిన ‘ కలలు కనండి వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయండి’ అనే వాక్యాన్ని జీవితమంతా మంత్రంలా మార్చుకోవాలి” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version