నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు…

నేటి బంద్ ను జయప్రదం చేయండి…కమ్యూనిస్టు పార్టీల పిలుపు

కేంద్రంపై ఒత్తిడి చేద్దాం
రిజర్వేషన్లు సాధించుకుందాం
కదలిరండి బీసీ బిడ్డలారా

కేసముద్రం/ నేటి దాత్రి

 

వాపక్ష నేతల యం పాపరావు,చొప్పరి శేఖర్,ఆవుల కట్టయ్య,శివారపు శ్రీధర్, పిలుపునిచ్చారు.
శుక్రవారం సి పి ఎం మండల కార్యాలయం లో వామపక్ష పార్టీలు సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఎం సిపిఐయు ల విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడుతూ రేపటి బందులో బీసీ బిడ్డలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు, కేంద్ర బిజెపి పై ఒత్తిడి తెచ్చి బీసీ రిజర్వేషన్లు సాధించినామని ముక్తకంఠంతో పిలుపునిచ్చారు.రాష్ట్రంలో ఉన్న బిజెపి ఎంపీలు ఎమ్మెల్యేలు మోడీ వద్దకు వెళ్లే ధైర్యం లేక బీసీలను మోసం చేస్తున్నారన్నారు, రాష్ట్ర కాంగ్రెస్ తీర్మానం చేసి పంపిన ఆర్టికల్ 9 లో పెట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వెంటనే ఇవ్వాలన్నారు.రేపు జరిగే బందులో బీసీ బిడ్డలంతా ముక్తకంఠంతో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.కేసముద్రం మండల కేంద్రంలో ప్రజలందరూ స్వచ్ఛందంగా బందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
జిల్లావ్యాప్తంగా వామపక్ష పార్టీలు బీసీ సంఘాలను కలుపుకొని రేపటి బందులో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ ల గుడిశాల వెంకన్న, చాగంటి కిషన్,నేతలు తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం కావాలి

బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.

జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి…

జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన రాకేష్ కిషోర్ ను కఠినంగా శిక్షించాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ పై చెప్పుతో దాడి చేయడం దేశ చరిత్రలోనే అత్యంత దౌర్భాగ్యమైన దినమని ఈ దాడికి పాల్పడిన వ్యక్తి సనాతన ధర్మం గురించి ప్రస్తావించడం అంటే దాడి వెనకాల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారనేది స్పష్టంగా అర్థమతుందని ఈ దాడి కి పూర్తి బాధ్యత వారే వహించాలని డిమాండ్ చేశారు.

ములుగు జిల్లా కేంద్రం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) ములుగు మండల నాయకులు కొర్ర రాజు ఆధ్వర్యంలో అయన అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల బాద్యులు రత్నం. ప్రవీణ్ మాట్లాడుతూ
ఆర్ ఎస్ ఎస్ మూఢత్వం ముసుగులో ఉన్న అరాచక న్యాయవాది రాకేష్ కిషోర్ తన బూటు విసిరి దాడికి పాల్పడినాడని, దాడి జరిగి నాలుగు రోజులు గడుస్తున్నప్పటికి ఇంతవరకు దాడి చేసిన వ్యక్తి పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లో బీజేపీ ప్రభుత్వ అంతరంగ ఆంతర్యం ఏమిటనేది అర్థమవుతుందని అన్నారు ఇది యావత్తు భారత ప్రజానీకానికి గుండెకాయ లాంటి రాజ్యాంగం పైన చేసిన దాడిగా ఉంది అని ఆర్ఎస్ఎస్ పథకం ప్రకారం చేసిన దాడి అని అన్నారు దళితుడుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండటాన్ని ఆర్ఎస్ఎస్ బిజెపి జీర్ణించుకోలేకపోతుందన్నారు ఇటీవల ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకలకు జస్టిస్ గవాయి తల్లిని ఆహ్వానించగా ఆమె తిరస్కరించినందుకుగాను యూపీలో బిజెపి సర్కార్ బుల్డోజర్లతో ఇండ్లను కూల్చి వేస్తున్న సందర్భంగా జస్టిస్ గవాయి బుల్డోజర్ న్యాయం చెల్లదు రాజ్యాంగ న్యాయం చెల్లుతుందని తీర్పునివ్వడం, మరికొన్ని న్యాయ తీర్పుల ఆధారంగా ఆర్ఎస్ఎస్ బిజెపి ఒక పథకం ప్రకారం కక్ష పెంచుకొని జస్టిస్ గవాయిపై ఉద్దేశపూర్వక దాడి చేసిందన్నారు సనాతన ధర్మాన్ని అడ్డుకునే వారందరినీ ప్రతిఘటిస్తామని న్యాయవాది రాకేష్ కిషోర్ మాట్లాడుతున్నాడు ఇది వ్యక్తి విసిరిన చెప్పు కాదు ఆర్ఎస్ఎస్ విసిరిన అగ్రకుల ఆధిపత్య విషర్పమని అన్నారు. ఈ దాడి రాజ్యాంగం పైన ,దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ పైన అత్యున్నత న్యాయస్థానం పైన జరిగిన దాడిగా పరిగణించాలన్నారు
అత్యున్నత న్యాయస్థానాలలో కూడా ఆర్ఎస్ఎస్ మూక దాడులు ఆగట్లేదన్నారు దేశ సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి అనేక కీలక తీర్పులు ఇచ్చే జస్టిస్ గవాయ్ దళితుడు కావడం వల్లే ఈ వివక్షకు ఒడిగడుతున్నారని చెప్పారు. సనాతన ధర్మం లో సమానత్వం ఉందా అని ప్రశ్నించారు సనాతన ధర్మంలో సతీసహగమనం బాల్య వివాహాలు కుల వివక్ష జోగిని వ్యవస్థ అసమానతలు తప్ప సనాతన ధర్మంలో సమానత్వం లేదన్నారు సనాతన దర్మం కోసం పని చేసేవారు ముందుగా వారు దాన్ని పాటించాలని ఈ దేశంలో ఎన్ని మత ధర్మాలు ఉన్నప్పటికీ అవి వ్యక్తిగతంగానే అమలు చేసుకోవచ్చని ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు రాజ్యాంగబద్ధంగా మెదులుకోవాలని ఆయన కోరారు ఈ దాడి పై ప్రధానమంత్రి పెదవులతో ఖండించడమే కాదు పూర్తి బాధ్యత వహించి బహిరంగ క్షమాపణ చెప్పాలని అలాగే దాడి కి పాల్పడిన అడ్వకెట్ రాకేష్ కిషోర్ ను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు దేశ అత్యున్నత న్యాయస్థానంలోనే అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తికి రక్షణ లేకుండా పోయిందన్నారు. బిజెపి ఆర్ఎస్ఎస్ నీచ సంస్కృతీ కి ఈ భౌతిక దాడి నిదర్శనం అన్నారు
మన రాష్ట్రంలో గత కొన్ని రోజుల క్రిందట సిద్దిపేట లో ఇద్దరు ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్న న్యాయవాదులు సామాజిక మాధ్యమాలలో జస్టిస్ గవాయిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారన్నారు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ వెనుకాల ఉన్న లాయర్లందరూ జస్టిస్ గవాయ్ ఎడల ఈ వైఖరి కలిగి ఉన్నారంటానికి ఈ దాడి రుజువు చేస్తుందన్నారు జస్టిస్ గవాయి పై దాడి కేవలం ఒక వ్యక్తి పై చేసింది కాదన్నారు తక్షణమే సుప్రీంకోర్టు న్యాయవాది రాకేష్ కిషోర్ బార్ కౌన్సిల్ మెంబర్షిప్ రద్దు చేసి చేతులు దులుపుకోవడం కాకుండ వెంటనే అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపించాలని ఆయన పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని దేశ ప్రజల మెదడులో విద్వేషాలను నింపుతున్న ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్ఎస్ఎస్ విష సంస్కృతి బహిస్కరించాలని నిషేదించాలని ఈ ఘటనను దేశంలోని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని ఆయన కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ మండల నాయకులు కొర్ర రాజు గొంది సాంబయ్య డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కలవల రవీందర్ కొడపాక చంటి నాయకులు చందర్ రాజు మోహన్ ప్రదీప్ కార్తీక్ పాణి సునీల్ తదితరులు పాల్గొన్నారు

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి…

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం బలపరిచిన వ్యక్తులను గెలిపించండి

సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)

 

 

ఈరోజు అమృత్లాల్ శుక్ల కార్మిక భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి
ముశం రమేష్ మాట్లాడుతూ..రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జడ్పిటిసి ఎంపిటిసి సర్పంచ్ కానాలకు వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో పోటీ చేయనున్నది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో సిపిఎం కార్మిక కర్షక బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి అనేక పోరాటాలు నిర్వహిస్తూ వస్తున్నది
కాంగ్రెస్ బిజెపి టిఆర్ఎస్ పార్టీలు తమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాలు మాత్రమే పనిచేస్తున్నాయి తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఏ ఒక్క పార్టీ కూడా నిజాయితీగా ప్రజల కొరకు పనిచేసిన దాకాలు లేవు ఎన్నికల సందర్భంగా అనేక హామీలు ఇచ్చి ఎన్నికల అయిన తర్వాత హామీలను అమలు చేయకుండా తుంగలో తొక్కేయడం పెట్టుబడిదారి పార్టీలకు ఆనవాయితీగా మారింది చట్టసభల్లో కమ్యూనిస్టు పార్టీల ప్రాతినిధ్యం తగ్గిపోవడంతో విచ్చలవిడిగా అవినీతి రాజ్యమేలుతున్న పేదల సమస్యలు పరిష్కారం కావడం లేదు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూ అక్రమాలు ఇసుక మాఫియా. ప్రకృతి సంపద దోచుకోవడం. రోజురోజుకు పెరిగిపోతాయి ప్రశ్నించే గొంతుక లేకపోవడం వలన అవినీతి రాజ్యమేలుతుంది ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి.నీతికి నిజాయితీకి క్రమశిక్షణకు మారుపేరైనటువంటి సిపిఎం పార్టీ అభ్యర్థులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకురాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానీకానికి సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది.ఈ సమావేశంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి. కోడం రమణ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ,శ్రీరాముల రమేష్,
చంద్ర సిపిఎం నాయకులు,సందు పట్ల పోచమ్మల్లు, గడ్డం రాజశేఖర్,తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే…

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
బిజెపి.ఆర్ఎస్ఎస్. లకు పోరాటానికి ఎలాంటి సంబంధం లేదు
ఉద్యమ కాలంలో తెల్లదొరల సేవలో ఆర్ఎస్ఎస్. బిజెపి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం చుక్కయ్య

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపినకమ్యూనిస్టులు నిజాం ప్రభువు, రజాకార్లు భూస్వాములు, జాగీర్దార్ల ఆధీనంలో ఉన్న భూముల్ని స్వాధినం చేసుకుని 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు ఎర్రజెండా నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్ట్ లు అమరులయ్యారు. వేలాది గ్రామాలు నిజాం నవాబు పాలన నుంచి విముక్తి పొందాయి. అలాంటి మహోత్తరమైన ప్రజాపోరాటంలో ముస్లింలు సైతం ముఖ్యపాత్ర పోషించారు. అని అన్నారు. పోరాటానికి ఎలాంటి సంబంధంలేని బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లీం పోరాటంగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది’ అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. చుక్కయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ .సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం. సిపిఎం మండల కమిటీ సభ్యులు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణ పై స్టడీ.సర్కిల్ . ఏం చుక్కయ్యగారు బోధించారు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పాలనలో తెలం గాణ ప్రాంతం మంత వెట్టి నడిచేదని, భూస్వాములు, పెత్తందార్లు, పటేల్‌. పట్వారీ లకు లొంగి పనిచేయాల్సిన దుస్థితి ఉండేదన్నారు.

 

 

 

దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కల్గించి, ప్రజల్ని కాపాడేందుకు 1930లో ఆంధ్రమహాసభ పేరుతో కమ్యూనిస్టులు ప్రజల ముందుకొచ్చారని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఐదెకరాల పంటను భూస్వామ్య గుండాలు ఎత్తుకెళ్లేందుకు పూనుకుంటే భీంరెడ్డి నర్సింహారెడ్డి. మల్లు స్వరాజ్యం. కృష్ణమూర్తి. మల్లు వెంకట నరసింహారెడ్డి దళం ఆ పంటను రక్షించి భూస్వామ్య గుండాలను ఎదిరించిన విషయాలను ఆయన వివరించారు. దొడ్డి కొమరయ్య బలిదానం తర్వాత సాయుధ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిందని, అన్నారు సిపిఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ. బాంచన్‌ కాల్మొక్త అన్న ప్రజలు బంధూకులు పట్టి పోరాటంలోకి దూకారని తెలిపారు. సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న సిపిఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని ఉద్యమాలు నడిపేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కే నారాయణరెడ్డి. మడిగే నాగరాజు. గుండెకారి బాబురావు వరికల్ గోపాల్ రావు .గుండెకారి. చిన్న మహేందర్. కే కవిత.రాజేశ్వర రావు. తదితరులు పాల్గొన్నారు

ఘనంగా సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T133552.423.wav?_=1

 

ఘనంగా సీతారాం ఏచూరి వర్ధంతి వేడుకలు

భూపాలపల్లి నేటిధాత్రి

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

కామ్రేడ్ సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఏచూరి ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చిన సిపిఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి బందు సాయిలు.
భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీ శ్రామిక భవన్లో కామ్రేడ్ సీతారాము ఏచూరి ప్రథమ వర్ధంతి సభ ఘనంగా నిర్వహించడం జరిగింది. కామ్రేడ్ సీతా రామ్ ఏచూరి చిత్రపటానికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు పూలమాల లేచి జోహార్లు అర్పించారు. అనంతరం జరిగిన సభకు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గుర్రం దేవేందర్ అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ బంధు సాయిలు ముఖ్యఅతిథిగా హాజరై వారు మాట్లాడుతూ కామ్రేడ్ సీతారామయ్య చూరి 1952 ఆగస్టు 12న మద్రాసులో జన్మించారు. వారు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నివాసి. వారి తాత మద్రాసు హైకోర్టులో. వారి తల్లి కలపకం దుర్గాబాయి తో కలిసి పని చేశారు. ఏచూరి మేనమామ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చీప్ సెక్రెటరీగా పనిచేశారు మోహన్ కందా సీతారాం ఏచూరి వారి మేనమామ సాయంతో హైదరాబాదు ఢిల్లీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. విద్యార్థి ఉద్యమాల్లో స్వర్గా పాల్గొన్నటువంటి నాయకుడు. బెంగాల్ నుంచి రెండుసార్లుగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఉత్తమ పార్లమెంటరీగా పనిచేశారు. సాధారణంగా జీవించి ఉన్నతంగా ఆలోచించారు సీతారాం ఏచూరి గారు. భూమికోసం భుక్తి కోసం పేద ప్రజలను విముక్తి కోసం కూడి లేని వాళ్లకు కూడు పెట్టాలని జాగ లేని వాళ్లకు జాబు ఉండాలని నిరుద్యోగ సమస్య పరిష్కరించబడాలని. ధరలు తగ్గించాలని. పేద ప్రజల రాజ్యం రావాలని, కార్మిక వర్గ నాయకత్వన విప్లవం విజయవంతం కావాలని పోరాడినటువంటి వ్యక్తి. దోపిడికి వ్యతిరేకంగా పెట్టుబడుదారులకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించినటువంటి వ్యక్తి సీతారాం ఏచూరి. వారి ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ శ్రేణులంతా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సమర సమరశీల పోరాటాలు నిర్వహించాలని పార్టీ జిల్లా కార్యదర్శి శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఆకుదారి రమేష్, గడప శేఖర్, గడ్డం భాస్కర్, చిలుక బిక్షపతి, మేకల మహేందర్, జ్ఞానేశ్వరి, డి రాజేశ్వరి, గూట్ల రాజేశ్వరి, మామిడిలా రాధా, షేక్ జూబ్లీ, కాదాసీ సుగుణ, తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం పోటీ

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-29T152624.682-1.wav?_=2

స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం పొటీ: సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ
నల్లగొండ జిల్లా, నేటి దాత్రి:

 

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని గ్రామాలలో సిపిఎం పోటీ చేస్తుందని సిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. ఒకటి, రెండు హామీలను అమలు చేసిన అవి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆయన అన్నారు. స్థానిక సమస్యలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగానే ఉన్నామని, ఒంటరిగానే పోటీ చేయాలనుకున్నామని, ఎవరైనా కలిసి వస్తే ఆలోచిస్తామని ఆయన అన్నారు. దేశ లౌకిక విధానం, ఫెడరలిజానికి బిజెపి రూపంలో ప్రమాదం పొంచి ఉందని ఆయన అన్నారు. రాష్ట్రంలో రైతులకు సరిపడ యూరియాను అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యావని ఆయన అన్నారు. యూరియా కోసం కావాలని గంటల తరబడి క్యూలైన్లలో నిలబడిన దొరకని పరిస్థితి నెలకొన్నదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నేర్మట నుండి బంగారిగడ్డ వరకు బీటీ రోడ్డు నిర్మించాలని, అదేవిధంగా పుల్లెంల నుండి నేర్మట వరకు రోడ్డు నిర్మాణం చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు రావడం వలన సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గ్రామ శాఖ కార్యదర్శి బల్లెం స్వామి, రైతు సంఘం మండల కార్యదర్శి ఈరటి వెంకటయ్య, నారపాక శంకరయ్య, బొమ్మరగోని యాదయ్య, ఈరగట్ల నరసింహ, స్వామి, కలిమెర సైదులు, కొత్తపల్లి వెంకన్న, లక్ష్మమ్మ, ఎన్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని CPM ధర్నా

రైతులకు యూరియా బస్తాలు అందజేయాలని సిపిఎం ధర్నా

పరకాల నేటిధాత్రి

రైతులకు పంటకు సరిపడా యూరియా బస్తాలను సకాలంలో అందించాలని పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ పట్టణంలో ఉన్న ఫర్టిలైజర్ షాపులు యూరియా బస్తాలను నిలువ ఉంచుకొని రైతులకు అందించడం లేదని, ఇతర మందులు కొంటేనే యూరియా బస్తాలు అమ్ముతామని చెప్పడంతో రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారని,వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ కరువైందని,షాపుల యజమానులు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని,రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యూరియా బస్తాలు ఇవ్వకుంటే చర్యలు చేపడుతామని హెచ్చరించారు.పట్టణంలో ఉన్న వ్యాపారాలు మాత్రం దాన్ని ధిక్కరిస్తున్నారని,సిండికేట్ గా ఏర్పడి రైతులను దోచుకుంటున్నారని,ప్రభుత్వము అధికారులు స్పందించి రైతులను మోసం చేస్తున్న పార్టీలైజర్ షాపులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సిపిఎం నేతలు వ్యవసాయ అధికారికి ఫోన్ లో సమాచారం అందించిన వెంటనే స్పందించి నిల్వ ఉన్న యూరియా బస్తాలను రైతులకు ఇవ్వాలని చారని,రైతులను ఇబ్బందులు పెడితే చర్యలు తీసుకుంటామని షాపుల యజమాన్యాలను హెచ్చరించారని కళ్యాణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బొచ్చు ఈశ్వర్,బొజ్జ హేమంత్ రైతులు పాల్గొన్నారు.

స్థానిక సమస్యలు పరిష్కరించాలి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T160607.508-1.wav?_=3

 

స్థానిక సమస్యలు పరిష్కరించాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

స్థానిక సమస్యలపై సర్వేలు చేసి సర్వేలో వచ్చిన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటలు నిర్వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ నాగయ్య అన్నారు.నర్సంపేట పట్టణంలో సీపీఎం జిల్లా స్థాయి గ్రామీణ ప్రాంత వర్క్ షాప్ సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కోరబోయిన కుమారస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది.నాగయ్య మాట్లాడుతూ
వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని మంచినీరు,రోడ్ల ధ్వంసం,డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు,కుక్కల,కోతుల బెడద సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీల అమలు నెరవేర్చలేదని ఆరోపించారు.అందుకు జిల్లావ్యాప్తంగా పోరాటాలు నిర్వహిస్తామని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, నమిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, బోళ్ల సాంబయ్య మండల నాయకులు అక్కపెల్లి సుధాకర్, పుచ్చకాయల నర్సింహ రెడ్డి, ఎస్కె అన్వర్, పెండ్యాల సారయ్య, కందికొండ రాజు, కొంగర నర్సింహ స్వామి, కలకోట అనిల్, ఎండీ ఫరీదా, వజ్జంతి విజయ ఉదయగిరి నాగమణి బిట్ర స్వప్న గణిపాక విలియం కెరీ, జన్ను రమేశ్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.

అర్హులైన వారందరికీ పించన్లు ఇవ్వాలి

అర్హులైన వారందరికీ పించన్లు ఇవ్వాలి

సిపిఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు

కరక గూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా..నేటిధాత్రి…

 

 

కరకగూడెం: అర్హులైన పేదలందరికి వృధాప్య, వితంతు, వికలాంగ పింఛన్లు ఇవ్వాలని సీపీఎం మండల కార్యదర్శి కొమరం కాంతారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండలంలో ప్రతి గ్రామం నుండి ఇప్పటికే దరఖాస్తు తీసుకుని ఉన్నప్పటికీ వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని గత ప్రభుత్వంలో కూడా వందల సంఖ్యలో పెండింగ్లో ఉన్నప్పటికీ వాటిని అర్హులైన వారికీ అందించడంలో ప్రజా ప్రభుత్వం విఫలమవుతుందని వారన్నారు పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించటమే ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం అంటున్న పాలకవర్గ పెద్దలు వికలాంగులకు పింఛన్లు ఇచ్చే దిక్కు లేదా అని వారు తీవ్రంగా విమర్శించారు వారికి ఇందిరమ్మా రాజ్యం వర్తించదా అని వారు ఎదేవా చేశారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు కావస్తున్నా నేటికి ఒక్కరికి కూడా కొత్తగా పింఛన్ ఇచ్చిన దాఖలు లేవని వారన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదని ఇచ్చిన వాగ్దానం ప్రకారం పింఛన్దారులందరికీ పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు సత్యం కనితి రాజు తాటి దేవయ్య తదితరులు పాల్గొన్నారు

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి..

రైతులకు సరిపడాయూరియా పంపిణీ చేయాలి

కేంద్ర ప్రభుత్వం రైతులకు,యూరియా పంపిణీ తగ్గించడం దుర్మార్గమైన చర్య

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు మానుకొని రైతులకు న్యాయం చేయాలి
ప్రైవేట్ ఫెర్టిలైజర్ షాపుల దోపిడి అరికట్టాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి ముషo రమేష్

సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి)

ఈరోజు జిల్లా కేంద్రంలోని అమృత లాల్ శుక్ల కార్మిక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని రైతులకు వానకాలానికి సరిపోవు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు అలాగే జిల్లాలోని సహకార సంఘ గోదాముల వద్ద తెల్లవారుజాము నుండే బార్లు తీరుతున్న రైతుల బాధలు పట్టించుకునే నాధుడే లేడని అన్నారు ఇంత జరుగుతున్నా జిల్లా వ్యవసాయ అధికారులు మాత్రం జిల్లాలో యూరియా కొరతలేదని రైతులు ఆందోళన చెందవద్దని ప్రకటనలు చేస్తున్నారని అన్నారు అలాగే ప్రైవేటు వ్యాపారులు కూడా ఇదే అదునుగా భావించి ఒక యూరియా బస్తా 310 రూపాయల నుండి 350 వరకు అమ్ముతూ యూరియాతోపాటు మిగతా పెటిలైజర్ కొంటేనే యూరియా ఇస్తామని అవసరం లేకున్నా దంటు గోళీలు గడ్డి మందు తదితర ఫెర్టిలైజర్ అంట కడుతున్నారని వారిపై వ్యవసాయ శాఖ ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఆయన అన్నారు గతంలో ప్రతి సహకార సంఘ గోదాముల్లో నిల్వ ఉండే యూరియా బస్తాలు నేడు కనిపించడం లేదని యూరియా బస్తాలు కేటాయింపుల్లో కూడా పెద్ద రైతులు భూస్వాములు లైన్లో ఎక్కడ కనిపించడం లేదని ఎక్కడ చూసినా సన్నకారు చిన్న కారు రైతులే ఇబ్బందులు పడుతున్నారని మరి వారికి యూరియా ఎలా అందుతుందో అర్థం కావడం లేదని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి సీజనకు సరిపడా యూరియా సప్లై చేయాలని లేని పక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున రైతులతో ధర్నా చేస్తామని ఆయన హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ,జవ్వాజి విమల పాల్గొన్నారు

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా.

సిరిసిల్ల ఎమ్మార్వో ఆఫీస్ ముందు సిపిఎం ధర్నా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

 

 

 

 

సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఇసుక మరియు ముడి సరుకుల ధరల్ని ప్రభుత్వం నియంత్రించాలి – అన్నల్ దాస్ గణేష్ సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి.

సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఇసుక కొరత తీర్చాలని ఎమ్మార్వో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగినది.

ఈ సందర్బంగా సిపిఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ మాట్లాడుతూగత 15 రోజులుగా సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ ఇండ్లు మరియు ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు ఇసుక అనుమతులు లేకపోవడంతో ఇండ్ల నిర్మాణాలు ఆగిపోయాయి ప్రభుత్వ పనులకు ఇస్తున్న ఇసుక బ్లాక్లో నాలుగు వేల నుండి 5 వేలకు అమ్ముకుంటున్నారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్లకు 10 ట్రాక్టర్ల ఇసుక మాత్రమే ఇస్తామని చెబుతున్నారు కానీ సిరిసిల్ల పట్టణంలో నల్ల రేగడి భూములు అయినందున పుటింగులకే పది ట్రిప్పుల ఉష్కే సరిపోని పరిస్థితి ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించి ఇసుక ట్రిప్పుల సంఖ్య పెంచాలని అలాగే ప్రైవేట్ ఇంటి నిర్మాణాలకు కూడా ప్రతిరోజు ఇసుక అందించేలా చర్యలు తీసుకోవాలని దానివలన పట్టణంలోని పేద ప్రజల పైన అదనపు భారాన్ని తగ్గించినట్టు అవుతుంది ఇంటి నిర్మాణానికి సంబంధించి ఇతర ముడి సరుకుల ధరల్ని కూడా నియంత్రించాలి ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పనిచెయ్యాలి మైనింగ్ అధికారులు దాడులను ఆపాలి పేదల ఇంటి నిర్మాణాలకు అలాగే ప్రయివేట్ ఇంటి నిర్మాణదారులకు ఇబ్బందులు లేకుండా అధికారులు తక్షణమే చెర్యలు తీసుకోవాలని సిపిఎంసిరిసిల్ల జిల్లా కమిటీగా తహసీల్దార్ వినతిపత్రం అందించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోడం రమణ, ఎగమాంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, శ్రీరామ్ రమేష్ చంద్ర సిపిఎం సీనియర్ నాయకులు మిట్టపెల్లి రాజమల్లు, రాపెల్లి రమేష్, నక్క దేవదాస్, జిందాం కమలాకర్, బెజగం సురేష్, సిరిమల్లా సత్యం, కోలా శ్రీనివాస్, బింగి సంపత్ సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా.

కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ధర్నా.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ లోని నిమ్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ నిమ్టే రైతుల కోసం సీపీఎం పోరాటం చేస్తుందని చెప్పారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. ధర్నాలో జిల్లా కార్యదర్శి జయరాజ్, కార్యదర్శి వర్గ సభ్యులు రామచందర్, మల్లేశం, సాయిలు, నర్సింలు పాల్గొన్నారు.

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం.!

రైతులకు రుణమాఫీ చేయడములోరాష్ట్ర ప్రభుత్వం విఫలం సీపీఎం
వనపర్తి నేటిధాత్రి

 

 

. సిఐటియు వనపర్తి జిల్లా కార్యాలయంలో సిపిఎం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశము నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సి పి ఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జాన్ వెస్లీ మాట్లాడారు. కార్ల్ మార్క్స్ 207వ, జయంతి సందర్భంగా కార్ల్ మార్క్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ” కారల్ మార్క్స్ 1818 లో జర్మనీలో జన్మించారని నేటికీ 207 సంవత్సరాలు అవుతుందని, ఆయన సిద్ధాంత రచన కమ్యూనిస్టు ప్రణాళిక విడుదలై 177 సంవత్సరాలు అవుతుందని అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నూటికి నూరు శాతం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ అమలులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇందిరమ్మ ఇండ్లను నిర్మించడంతో పాటు స్థలాలు లేని పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. కేరళ తరహ పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రేషన్ కార్డుకు 14 రకాల నిత్యావసర సరుకులు ఉచితం గా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు.ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్ ,జిఎస్ గోపి, బాల్ రెడ్డి ,ఏం. రాజు ,ఏ. లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు మేకల ఆంజనేయులు, ఆర్. ఎన్. రమేష్, బి. వెంకటేష్, బాల్య నాయక్, గుంటి వెంకటేష్ ,ఎం. పరమేశ్వరా చారి, ఎం. కృష్ణయ్య, ఎస్. రాజు, బి వెంకటేష్, ఎం. వెంకట్ రాములు తదితరులు పాల్గొన్నారు

గ్యాస్,పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా.!

గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలకు నిరసనగా సి.పి.ఎం ఆధ్వర్యంలో ధర్నా

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి)

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపాన తెలంగాణ తల్లి చౌక్ లో పెంచిన వంటగ్యాస్,పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే ఉపశమరించుకోవాలని సిపిఎం పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ తో నిరసన తెలిపడం జరిగినది.ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ముషం రమేష్ సీపీఎం పార్టీ సిరిసిల్ల పట్టణ కార్యదర్శి అన్నల్ దాస్ గణేష్ లు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా వంట గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం
వంట గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచడం దారుణమని విమర్శించారు దీనివల్ల ఉజ్వల పథకం లబ్ధిదారులు సాధారణ వినియోగదారుల తోపాటు మహాలక్ష్మి పథకం అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వంపై కూడా పెద్ద భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం పెంచిన సిలిండర్ ధరను ఉపశమరించుకోవాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు.
నిత్యవసర సరుకుల ధరలపై నియంత్రణ చేస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం అన్ని రకాల సరుకులు వస్తువుల ధరలను విపరీతంగా పెంచిందని
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచారు. 2014 బిజెపి అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ 450 రూపాయలు ఉండేదని కానీ ఇప్పుడు బిజెపి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలకి గ్యాస్ సిలిండర్ పెంచడం చాలా దారుణమైన విషయం,ప్రజలు పెద్ద ఎత్తున మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఏగమంటి ఎల్లారెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు సూరం పద్మ, గురిజాల శ్రీధర్, సిపిఎం నాయకులు నక్క దేవదాస్, సిరిమల్ల సత్యం బెజుగం సురేష్, గుండు రమేష్, గోవిందు లక్ష్మణ్
తదితరులు పాల్గొన్నారు.

CPM పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా.

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా

 

భూపాలపల్లి నేటిధాత్రి

 

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు జె వెంకటేష్ హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని పాత ఎర్ర చెరువులో గుడిసెలు నిర్మించుకున్న పేదలందరికి ఇంటి పట్టాలు, ఇంటి నెంబర్లు, కరెంటు సౌకర్యం, మంచి నీటి సౌకర్యం, రోడ్ల సౌకర్యం కల్పించి ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలి.

జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలని జోహార్ నగర్ రాజీవ్ నగర్ బాంబులగడ్డ, సి.ఆర్.నగర్, శాంతినగర్, రాంనగర్, ఫక్మీర్ గడ్డ వాసులకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలని అన్నారు పలిమెల మండలంలోని మండల కేంద్రంతో పాటు కాటారం మండలంలోని గ్రామాలు, ముత్తారం మండలంలోని గ్రామాలు, మండల కేంద్రాలతో పాటు వివాసం ఉంటున్న ఇండ్లకు ఇంటి పట్టాలు మంజూరు చేయాలి.

ముత్తారం మండలంలోని కనుకునూరు పలిమెల మండలంలోని క్రిషంపాటు పండిన రెవెన్యూ భూములలో గుడిసెలు వేసుకున్న వారికి ఇందిరమ్మ ఇండ్లను కెటాయించాలి దుబ్బపల్లి, గడ్డిగానిపల్లి, కాపురం గ్రామాలను తరలించి ఆర్ & ఆర్ ప్యాకేజి క్రింది ఇండ్లు నిర్మించి
సింగరేణి, జెన్ కో ఆధారిత పరిశ్రముల అయిన బొగ్గు శుద్ధి కర్మగారం, ఎరువుల కర్మగారం, సిమెంట్, కర్మగారాన్ని నెలకొల్పి జిల్లాలో ఉండే యువతకు ఉద్యోగ అవకాశాల కల్పించాలి.

భూపాలపల్లి జిల్లాలో రైల్వేమార్గం ఏర్పాటు చేస్తామని గతపాలకులు ఉప్పల్ నుండి భూపాలపల్లి మీదుగా ఇల్లందు.

వరకు భూ సేకరణ జరిపి సర్వేలు వేసినారు, రైల్వే మార్గం ఉంచడం వలన జిల్లా అభివృద్ది అవుతుంది.

వెంటనే జిల్లా ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే మార్గాన్ని ఏర్పాటు చేయాలి.

జిల్లాలో వరి తర్వాత పెద్ద పంట అయిన తునికాకు సేకరణ పని గిరిజనులు, గిరిజనేతరులు చేస్తున్నారు.

ఇప్పటి వరకు గత సంవత్సరం తునికాకు బోనస్ అందలేదు వెంటనే పరిశీలించి ఇప్పించాలి.

ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి ఈ కాలంలో ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన ట్యాంకర్ల ద్వారా మంచి నీటి కొరత ఉన్న ప్రాంతాలలో సరఫరా చేయించాలి.

ఇండ్ల స్థలాలు లేని జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి పట్టాలిచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేశు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు చెన్నూరి రమేష్,గుర్రం దేవేందర్,వెలిశెట్టి రాజయ్య, ఆత్కూరి శ్రీకాంతు గడప శేఖర్, ఆకుదారి రమేష్,,కుందాం బుధవారం,వి విజయలక్ష్మి, బి క్రాంతి,, సిహెచ్ రవికుమార్, ఎమ్ రాజేందర్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

CPM అధ్యర్యములో 18 వ వార్డుల్లో ప్రజల సమస్యలపై సర్వే.

సీ పి ఏం అధ్యర్యములో 18 వ వార్డుల్లో ప్రజల సమస్యలపై సర్వే

వనపర్తి నేటిదాత్రి :

 

సిపిఎం వనపర్తి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 18వ వార్డులో ఇంటింటి సర్వే నిర్వహించార.

సర్వేలో ప్రధానంగా వాటర్ పైప్ లైన్ వేసి కంకర వేయినందున ఒక మహిళకు కిందపడి కాలు కు గాయాలు వార్డులో చేసిన పైప్ లైన్లు మొత్తం తేలుకొని ఉన్నాయి.

వాటిని వెంటనే మూయాలి.

వాటిని పైన సిమెంటు కంకర వేసి రోడ్డు సైజులో వచ్చేయాలని సీపీ ఏం నాయకులు డిమాండ్ చేశారు వార్డులో విద్యుత్తు లో వోల్టేజి సమస్య ఉన్నది.

వెంటనే లో వోల్టేజీ సమస్యను పరిష్కారం చేయాలి.

హనుమంతు ఇంటి పక్కల ఉన్న విద్యుత్ పోల్ ఇంటి స్థలంలో ఉన్నది.

రోడ్డుపైకి వేయాలి.

విద్యుత్ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్నది.

భూగర్భ డ్రైనేజీ నిర్మాణం చేయాలి .

అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి. చాలామందికి పెన్షన్స్ లేవు.

పింఛన్లు ఇవ్వాలి.

కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలి.

ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం .

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పేరుతో ఇంటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని అనడం తప్ప ఒక్క రూపాయి మంజూరు చేయడం లేదు.

వెంటనే ప్రతి ఇంటి నిర్మాణానికి 10 లక్షలు కేంద్ర ప్రభుత్వం, 5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.

దళిత వాడకుస్మశాన వాటిక లేదు .

వెంటనే దళిత వాడకు స్మశాన స్థలం కేటాయించాలి.

ఈ కార్యక్రమంలో సిపిఎం వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, సిపిఎం వనపర్తి పట్టణ కార్యదర్శి ఏం పరమేశ్వర చారి, 18 వ వార్డు శాఖ కార్యదర్శి గంధం మదన్, సిపిఎం 18 వ వార్డు నాయకులు డి. బాలరాజు ,ఎం. మన్యం, రత్నయ్య, బాల పీరు, రవి హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.

జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాను జయప్రదం చేయండి.

సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు.

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆరు టీములుగా ఏర్పడి జిల్లాలోని 12 మండలాలు గ్రామాలలో ప్రజాస్థానిక సమస్యలపై సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27వ తారీఖున భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నాయకులు కామ్రేడ్ జే వెంకటేష్ హాజరవుతున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు తెలిపారు

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం.!

బోడంగిపర్తి గ్రామానికి చిట్యాలనుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
బోడంగిపర్తి గ్రామానికి చిట్యాల నుండి దేవరకొండ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు.మంగళవారంచండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, దేవరకొండ నుండి , ఉదయం 5 గంటలకు బయలుదేరి వయా చండూరు మీదుగా బోడంగపర్తి గ్రామానికి ఏడు గంటలకు చేరుకుని చిట్యాలకు పోయే విధంగా మళ్లీ సాయంత్రం చిట్యాల నుండి బయలుదేరి బోడంగి పర్తి గ్రామానికి మూడు గంటలకు చేరుకుని మళ్లీ దేవరకొండ పోయే విధంగా బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు.
. ఈ గ్రామంలో రేషన్ కార్డుల కోసం 500 పైగా దరఖాస్తు చేసుకున్నారని, ఇందిరమ్మ ఇండ్ల కోసం సుమారు 600 మంది, కొత్త పింఛన్ల కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుందనిఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావి ఏవి అమలు చేయలేదని ఆయన అన్నారు. వేసవి వస్తుండడంతో గ్రామంలో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండాఅధికారులు చూడాలని, ఇంకా అనేకమంది పేదలు రేషన్ కార్డుల కోసం, ఇందిరమ్మ ఇండ్ల కోసం, పింఛన్ల కోసం ఎప్పుడు వస్తాయని ఆశతో ఎదురుచూస్తున్నారని ఆయన అన్నారు. రైతాంగానికి నేటికీ సక్రమంగా రుణమాఫీ కాక, రైతు భరోసా రాక, సన్నధాన్యానికి బోనస్ ఇవ్వక రైతులు ఇబ్బందులు పడుతున్నారనిఆయనఅన్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చిట్యాల నుండి వయా మునుగోడు,బోడంగిపర్తి చండూరు, నాంపల్లిదేవరకొండకు పోయే విధంగామళ్లీ సాయంత్రం ఇదే విధంగాఈ గ్రామాల మీదుగా దేవరకొండ నుండి చిట్యాలకు బస్సు సౌకర్యం కల్పించాలనిఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరుబాట కార్యక్రమంలోప్రజలు బాధలు పంచుకుంటున్నారని,ప్రజా సమస్యలను పరిష్కరించని యెడల ప్రజలను సమీకరించి ప్రజా ఉద్యమాలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల కార్యదర్శి జెర్రిపోతుల ధనంజయ, సిపిఎం సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,వెంకటేశం,రైతు సంఘం మండల కార్యదర్శిఈరటి వెంకటయ్య, బోడంగిపర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం, యాదయ్య,నరసింహ, గ్రామ ప్రజలుముత్తయ్య,శంకర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం

గుజ్జ గ్రామానికి ఆర్టీసీ బస్సులు పునరుద్ధరించాలి: సిపిఎం
.రీజనల్ మేనేజర్ కు సీపీఐ(ఎం) వినతి
నల్లగొండ జిల్లా, నేటిదాత్రి:
గుజ్జ గ్రామానికి నార్కట్ పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను పునరుద్ధరించడంతోపాటు ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన బస్సును గ్రామం లోపలికి వెళ్లి తిరిగి వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం సీపీఐ(ఎం)నాయకులు నల్లగొండ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు నారి ఐలయ్య,బండ శ్రీశైలం మాట్లాడుతూ కరోనాకు ముందు నార్కట్పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం 6.30 గంటలకు నార్కట్పల్లి నుంచి బయలుదేరి బ్రాహ్మణ వెల్లేముల,పలివెల,గుజ్జ, సర్వేలో గ్రామాల మీదగా చౌటుప్పల్ కు వెళ్లి తిరిగి అదే గ్రామాల మీదగా నార్కట్పల్లికి చేరుకునేది అన్నారు.ఉదయం సాయంత్రం ఇలా రోజుకు రెండు పర్యాయాలు తిరిగేదన్నారు.ప్రస్తుతం నడుస్తున్న నల్లగొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు గ్రామం లోపలికి వెళ్లి హైదరాబాదులోని దిల్సు ఖునగర్ వరకు పెళ్లి తిరిగి వచ్చేదన్నారు.కరోనా సమయంలో బంధయిన ఈ బస్సులు తిరిగి నల్లగొండ డిపోకు చెందిన బస్సు ప్రారంభమైనప్పటికీ నార్కట్పల్లి డిపోకు చెందిన బస్సు ప్రారంభం కాలేదన్నారు.వాణిజ్య పంటలకు కేంద్రమైన గుజ్జ గ్రామానికి బస్సు సౌకర్యాలు లేకపోవడం వల్ల పండించిన పంటలను అమ్ముకునేందుకు రైతులు, విద్యాబుద్ధులు నేర్చుకునేందుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థులు,వివిధ అవసరాల కోసం వెళ్లే ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. నార్కట్ పల్లి ఆర్టీసీ బస్సులు తిరిగి పునరుద్ధరించాలని, నల్లగొండ నుంచి వస్తున్న బస్సులు గ్రామంలో పలికి రప్పించాలని కోరుతూ శుక్రవారం ఆరంభకు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు నారీ ఐలయ్య,గుజ్జ గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, నారాయణపురం మండల కార్యదర్శి దోడ యాదిరెడ్డి, గుజ్జ మాజీ సర్పంచ్ చాడ నరసింహ,ఉప సర్పంచ్ వెలిజాల గోపిక,రైతు సంఘం నాయకులు బొమ్మగాని శంకరయ్య, మహిళా సంఘం నాయకురాలు కుకుడాల మంగమ్మ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version