విద్యార్థులకు బోర్డుపై వ్రాసి విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న కలెక్టర్

విద్యార్థులకు బోర్డుపై వ్రాసి విద్యార్థులను ప్రశ్నలు అడుగుతున్న కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి .

మర్రికుంట ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రికెట్ హాకీ సమ్మర్ ట్రెనినింగ్ క్యాంపు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రార oబించార విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ అన్నారు మంగళవారం జిల్లా కలెక్టర్ వనపర్తి మర్రి కుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను సందర్శించారు వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి విద్యార్థులకు బోర్డుపై వ్రాసి ప్రశ్నలు అడిగి తెలుకున్నారు
సమ్మర్ ట్రైనింగ్ క్యాంప్ ఏప్రిల్ 29 వరకు కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పాఠశాల వంటగదిని పరిశీలించారు వంటగది పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బంది ని ఆదేశించారు విద్యార్థులకు మంచి భోజనం అందించాలన్నారు స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి మెస్ కమిటీకి చెందిన విద్యార్థులు రిజిస్టర్లలో సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై కలెక్టర్ విచారణ చేశారు డ్రాయింగ్ వ్యాసరచన పోటీలను పరిశీలించారు విద్యార్థులను ప్రశ్నలు అడిగి సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారుఈ కార్యక్రమంలో తహసిల్దార్ రమేష్ రెడ్డి, ప్రిన్సిపల్ సరస్వతి పాఠశాల సిబ్బంది, అధికారులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు

పలిమెల లెంకల గడ్డలో జిల్లా కలెక్టర్ పర్యటన…

పలిమెల లెంకల గడ్డలో జిల్లా కలెక్టర్ పర్యటన

భూపాలపల్లి నేటిధాత్రి

 

బారి సుడిగాలికి ధ్వంసం అయిన పంటలను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు.
పలిమెల మండలం లెంకల గడ్డ శివారు అటవి ప్రాంత పంట పొలాలలో మంగళవారం బారి సుడిగాలి ప్రభావానికి పంటలు, అడవిలో చెట్లు కూలిపోగా సుమారు 30 నుండి 40 ఎకరాలలో పత్తి, మిర్చి, వరి పంటలు ధ్వంసం అయ్యాయని తెలిపారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులు ప్రాథమికంగా పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందించాలి అని అధికారులను ఆదేశించారు.
అధికారులు అందించిన నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అనంతరం వాహనం వెళ్ళడానికి అవకాశం లేకపోగా మోటార్ సైకిల్ పై అటవీ శాఖ అధికారులతో కలిసి వెళ్లి నేలకొరిగిన వృక్షాలను పరిశీలించారు. అటవి ప్రాంతంలో విరిగిన చెట్లను లెక్కించి నివేదిక అందించాలని సూచించారు. చెట్లు నేలకొరిగిన చోట నూతన ప్లాంటేషన్ చేపట్టి అడవుల పునరుద్ధరణ కు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి నవీన్ రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి అనీల్, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, తహసీల్దార్ సునీల్, ఎంపిడిఓ సాయి పవన్ ఇతర శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ చెక్ చేయాలి…

విద్యార్థుల ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ చెక్ చేయాలి

నర్సంపేట బిసి బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శన

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రభుత్వ వసతి గృహాలో చదువుకునే విద్యార్థులకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాని నర్సంపేట బిసి బాలుర వసతి గృహం అధికారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. నర్సంపేట పట్టణంలోని బిసి బాలుర వసతి గృహాన్ని మంగళవారం సాయంత్రం ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తనిఖీ చేశారు.వసతి గృహానికి సంబంధించిన విద్యార్థులు, స్టాఫ్ వివరాలను పలు రికార్డులు, వంటగది, మరుగుదొడ్లను, పరిసర ప్రాంతాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కామన్ డైట్ మెనూను పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పిల్లలకు అందించే ఆహర పదార్థాల నాణ్యతను రెగ్యులర్ గా చెక్ చేసుకోవాలని, విద్యార్థులకు మెనూపకారంగా రుచికరమైన నాణ్యమైన వేడి భోజనం అందించాలని అన్నారు. భోజన నాణ్యతను పరిశీలించి విద్యార్థులతో కలిసి కలెక్టర్ రాత్రి భోజనం చేశారు.విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉంటే ఏర్పాటుచేసిన కంప్లైంట్ బాక్స్ లో రాసి వేయాలని అన్నారు. విద్యార్థులు హాస్టల్ కు వచ్చి వెళ్ళేటప్పుడు బాధ్యత గా కేర్ టేకర్ వెంట ఉండాలని తెలిపారు.చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై వసతి గృహ సంక్షేమ అధికారి ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సంవత్సరం ప్రభుత్వ బిసి వసతి గృహంలో మెరుగైన ఫలితాలు రావాలని అందుకు విద్యార్థులు కూడా కృషి పట్టుదలతో చదివి జిల్లాలోనే వసతి గృహా విద్యార్థులు ముందంజలో ఉంచి 100 శాతం మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.చదువులో విద్యార్థుల సామర్థ్యం తెలుసుకునేందుకు పలు ప్రశ్నలు వేసిన కలెక్టర్ పలు సమాధానాలు రాబట్టారు.పదవ తరగతి విద్యార్థులను సబ్జెక్టు వారిగా ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు విషయ పరిజ్ఞానంలో ముందుండాలని సూచించారు. చదువులో వెనుకబడ్డ ప్రతి విద్యార్థిపై వసతి గృహ సంక్షేమ అధికారులు తన సొంత బిడ్డల వల్లే భావించి ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన ఫలితాలు వచ్చేందుకు కృషి చేయాలని అన్నారు. వసతి గృహ ఆవరణ పరిసరాలు ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ సిబ్బంది సమయపాలన పాటిస్తూ విధులు నిర్వహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన సంక్షేమ అధికారి పుష్పలత, వసతి గృహ సంక్షేమ అధికారి, నాలుగో తరగతి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version