మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి

మందమర్రి, నేటిధాత్రి:

– గుడికందుల రమేష్ ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను జాతీయ పండుగగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని గుడికందుల రమేష్ డిమాండ్ చేశారు. మందమర్రిలో ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు.. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని అన్నారు. ప్రతి రెండు సంవత్సరాలకు కోట్లాది మంది భక్తులు, గిరిజనులు పాల్గొనే ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రకృతి ఆరాధన, సమానత్వ భావన, త్యాగ గాథలతో ముడిపడి ఉన్న మేడారం జాతరను జాతీయ స్థాయిలో గుర్తించడం ద్వారా గిరిజన సంస్కృతికి తగిన గౌరవం దక్కుతుందని ఆయన పేర్కొన్నారు.
దేశ వైవిధ్యానికి ప్రతిబింబమైన ఈ జాతరను జాతీయ పండుగగా గుర్తిస్తే, గిరిజనుల చరిత్రను దేశమంతా తెలుసుకునే అవకాశం కలుగుతుందని, అలాగే పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై సానుకూలంగా స్పందించి, మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని గుడికందుల రమేష్ విజ్ఞప్తి చేశారు.

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేయాలి

ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉదృతం చేయాలి

ఎంసిపిఐ(యు) జిల్లా కమిటీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి

నర్సంపేట,నేటిధాత్రి:

 

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉదృతం చేయాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ప్రలోభాలపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేయాలని కోరారు.భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ (ఐక్య) వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నర్సంపేట పార్టీ ఆఫీసు ఆవరణలో జిల్లా కమిటీ సభ్యుడు కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గాదగోని రవి మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చి విదేశీ పెట్టుబడిదారులకు సామ్రాజ్యవాదులకు అనుకూలంగా విధానాలను రూపొంది దేశీయ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నదని ఈ క్రమంలో కార్మికుల రైతుల ప్రజల హక్కులను హరించే విధంగా గతంలో ఉన్న చట్టాలను కాలరాస్తూ నియంతృత్వ విధానాలను రూపొందిస్తూ దేశాన్ని అధోగతిపాలు చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నో పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చి కొత్త చట్టాన్ని తెచ్చింది అన్నారు. ఉగ్రవాదం మతోన్మాదం పేరుతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తుందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఎన్నో ఆశాజనకమైన హామీలు ఇచ్చి ఆచరణలో తుంగలో తొక్కిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజా వ్యతిరేక విధానాలపై, ఎన్నికల హామీల అమలుకై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి పోరాటాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ శాఖలను నిరంతరం కదలికలో ఉంచాలని కోరారు. రాజకీయ విలువలను కాపాడేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్,రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, మంద రవి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, కుసుంబా బాబురావు,వంగల రాగసుధ, నాగేల్లి కొమురయ్య, మాలోత్ సాగర్, సుంచు జగదీశ్వర్, ముక్కెర రామస్వామి, జిల్లా కమిటీ సభ్యులు సింగతి మల్లికార్జున్, కేశెట్టి సదానందం,దామ సాంబయ్య, మాలోత్ ప్రత్యూష, ఎగ్గని మల్లికార్జున్, అప్పనపురి నరసయ్య, మాలి ప్రభాకర్,గణిపాక ఓదేలు తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర..

ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామ మాజీ ఉప సర్పంచ్ గోపాల్ బుధవారం మాట్లాడుతూ, ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఏడాదికి 125 రోజులు పని దినాలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, తెర వెనుక మాత్రం పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు.

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి.

గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక ఎన్నికల్లో భారత జనతా పార్టీని గెలిపించాలి

భారతీయ జనతా పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చిన కరీంనగర్ మాజీ మేయర్ వై సునీల్ రావు

వీణవంక ,(కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి:

వీణవంక మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో వై సునీల్ రావు మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎలక్షన్లు బిజెపి బలపరిచిన అభ్యర్థులు గెలిపించి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలనలో గ్రామాల అభివృద్ధి చెందుతున్నాయి గ్రామం పంచాయతీలలో ఒక చీపురు కట్ట కొనాలన్న కేంద్ర నిధులను తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల్లో గ్రామాలకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు మన ప్రియతమ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోం సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ తన పార్లమెంటు అభివృద్ధి కొరకై వేల కోట్ల నిధులు ఇస్తున్నారు గ్రామాల అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇంకా పది లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం సొంతంగా ఫండింగ్ పెడతానని ప్రజలకు తెలియజేయుతున్నారు మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే పైసలు ఇచ్చే ప్రభుత్వం లో పనిచేస్తున్న కార్యకర్తలను మీ సర్పంచి అభ్యర్థుల గెలిపించుకోండి ఇలాంటి ఒక రూపాయి ఇవ్వని అభ్యర్థులకు ఓటు వేసి గ్రామాలు అభివృద్ధికి కుంటుపడుతుందని మేము కోరడం జరుగుతుంది కావున మా అభ్యర్థులు గెలిపించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు స్థానిక పార్లమెంటు సభ్యుడు ప్రత్యేకమైన నిధులతో చెరువతో మీ గ్రామాల అభివృద్ధి చేసుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు,జిల్లా కార్యదర్శి చెన్న మాధవుని నరసింహారాజు, గొడుగు వినోద్, మాడుగురి సమ్మిరెడ్డి, లింగారెడ్డి ,ముత్యాల రవీందర్, కొండల్ రెడ్డి, ఎల్లా గౌడ్, దాట్ల వీరస్వామి, పార్లపల్లి స్వామి, దసారపు అశోక్, మోటం శ్రీనివాస్, కంకల సంతోష్, మడికొండ వెంకటేష్,చేతి వెంకటేశ్వర్లు, పత్తి శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, తోడేటి శ్రీనివాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.

నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి

4 లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి

29 కార్మిక చట్టాలను వెంటనే అమలు చేయాలి

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని -29. కార్మిక చట్టాలను అమలు పర్చాలని
ఎస్ జి ఎల్ బి కే ఎస్ ఏఐ ఎఫ్ టియు రాష్ట్ర. ప్రధాన కార్యదర్శి. ఎం రాయమల్లు
రాష్ట్ర నాయకులు. చంద్రగిరి శంకర్
డిమాండ్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలను
అనుసరిస్తూ. కార్మికులు అనేక ఉద్యమాలు ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 29. కార్మిక చట్టాలను
నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పరిశ్రమంలో అమలు చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ అఖిల భారత స్థాయిలో అన్ని కార్మిక సంఘాలు ఫెడరేషన్లు కార్మిక ఉద్యోగ సంఘాలు అనేక నిరసనలు భారత్ బందులు, టోకెన్ సమ్మెలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి చేసినప్పటికీ కార్మికుల అభిష్టానికి వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి. కార్మిక వ్యతిరేక
లేబర్ కోడ్స్ ను (21/11/25) రోజు నుండి అమలులోకి తెచ్చి. మోడీ ప్రభుత్వం బడా కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడడానికి భారత రాజ్యాంగంలో కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పొందుపరచుకున్న కార్మిక చట్టాలను హిందుత్వ మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం. భారత కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నమని చెప్తూ మరోవైపు. లాభాల లొ నడుస్తున్న. ప్రభుత్వ రంగ పరిశ్రమలను మూసివేస్తూ. ఆదాని- అంబానీ-బడా పారిశ్రామిక వేత్తలకు అమ్మివేస్తూ . కార్మికులను కార్మిక కుటుంబలను రోడ్డుమీదికి నేటి వేస్తూ. అన్ని రంగాల ప్రజలను సంక్షోభములకు నెడుతు భారత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్స్ గా మార్చి. భారత కార్మిక వర్గం ప్రశ్నించే హక్కు లేకుండా. ప్రశ్నించే కార్మికులను. ఎలాంటి సమాధానాలు లేకుండా. నేరుగా ఉద్యోగం నుండి తొలగించే విధంగా. బ్రిటిష్ వారిని మై మరిపించే విధంగా. కార్మిక చట్టాలను మారుస్తు. కార్మిక వ్యతిరేక. చట్టాలను అమల్పరుస్తూ కార్మిక వర్గాన్ని కట్టుబానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నా.కావున కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నాలుగు లేబర్ కోడులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం

జీవితంపై విరక్తితో ఆత్మహత్య…

జీవితంపై విరక్తితో ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నవంబర్ 23: జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గొయి లో చోటు చేసుకున్నట్లు ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం ఎల్గొయి లావణ్య భర్త వెంకట్ అనే మహిళ తన కూతురు అనారోగ్యం పాలై న్యూమోనియా వ్యాధికి హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందడంతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తన సొంత కూతురు చనిపోయిందన్న బాధతో మానసికంగా కృంగిపోయి జీవితం పై విరక్తితో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి భర్త బోయిని వెంకట్ తండ్రి విట్టల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవా పంచనమనిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పటేల్ తెలిపారు.

ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు..

ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు

 

సన్న బియ్యం కంపెనీలో 90% ఖర్చును భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ప్రధానమంత్రి గారి ఫోటో రేషన్ కార్డు పై లేకపోవడం విడ్డూరం
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట.వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో విచిత్రంగా రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వం పై మహేందర్రెడ్డి విమర్శలు చేశారు.

ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల పోటో ఏంటి. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తి రేషన్ కార్డ్ పై తన ఫోటో ముద్రించుకొని ప్రజలకు ఎలా ఇస్తాడు. అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార కుందూరు మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.

దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇలా తలతిక్క పనులు చేయకుండా చూడాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. అని మహేందర్ రెడ్డి అన్నారు.

 ‘మెట్రో’పై స్టాలిన్‌ రాజకీయం చేస్తున్నారు…..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T120934.813.wav?_=1

 ‘మెట్రో’పై స్టాలిన్‌ రాజకీయం చేస్తున్నారు..

 

మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్‌ ఆరోపించిన విషయం తెల్సిందే.

మదురై, కోయంబత్తూరు మెట్రో రైల్‌ ప్రాజెక్టు ప్రతిపాదనలకు కేంద్రం అనుమతివ్వలేదంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ రాజకీయం చేస్తున్నారని కేంద్రమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌(Manohar Lal Khattar) ఆరోపించారు. కోవై, మదురై మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతివ్వకుండా వివక్ష చూపిస్తోందంటూ స్టాలిన్‌ ఆరోపించిన విషయం తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏ ఒక్క రాష్ట్రంలోని లేని విధంగా చెన్నై మెట్రో రైల్‌(Chennai Metro Rail) రెండో దశ ప్రాజెక్టుకు రూ.6326 కోట్లు కేటాయించామన్నారు.
2024 అక్టోబరులో కేంద్రం ఇచ్చిన అనుమతులను ముఖ్యమంత్రి స్టాలిన్‌ విస్మరించి, 2017లో ప్రతిపాదనలను ఆధారంగా చేసుకుని కోవై, మదురై మెట్రో ప్రాజెక్టులను రాజకీయం చేస్తున్నారని, ఇది దురదృష్టమన్నారు. కోవై, మదురై మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు అనేక లోటుపాట్లున్నాయన్నారు. చెన్నైతో పోల్చితే కోయంబత్తూరులో మెట్రో ప్రాజెక్టు దూరం చాలా తక్కువని, కానీ, అధిక మొత్తంలో రవాణా సదుపాయాలను ప్రతిపాదించారన్నారు.

 

పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T151547.325.wav?_=2

పీఎం కిసాన్‌పై బిగ్ అప్‌డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..

 

కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది.

దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ఈ పథకం ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. అయితే, కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రకటన విడుదల చేసింది. రైతుల పేర్లను పథకం నుంచి తొలగించటంపై క్లారిటీ ఇచ్చింది. ఆ పోస్టులో.. ‘చాలా మంది రైతులు రూల్స్ ప్రకారం పథకానికి అప్లై చేయలేదు. అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేస్తున్నారు. కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు వేరు వేరుగా పథకానికి అప్లై చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదు. బెనిఫిషియరీ లిస్ట్ నుంచి పేర్లు తొలగించబడ్డ రైతులకు ఫిజికల్‌ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో వాళ్లు అర్హులని తేలితే పేర్లు మళ్లీ లిస్ట్‌లో యాడ్ అవుతాయి. అనర్హులని తేలితే పథకం వర్తించదు‘ అని స్పష్టం చేసింది.

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష…

బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మౌన దీక్ష

బీసీ జేఏసి జిల్లా ఛైర్మెన్ పైడిపల్లి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

 

జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పైడిపల్లి రమేష్ మాట్లాడారు. జనాభాలో 10 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని, అన్ని రంగాలను శాశిస్తూ, బీసీలను అణగదోక్కుతున్నారని మండిపడ్డారు. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను, ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోతున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే, మద్దతునిచ్చిన పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లే పల్లేకు విస్తరించి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదన్నారు. దగాపడ్డ బీసీలు దండు కట్టే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళనున్నట్లు పైడిపల్లి రమేష్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపడతామని, జనవరి 4వ వారంలో లక్ష మందితో వేల వృత్తులు..కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ రోజు కార్యక్రమంనికి విద్యావంతుల వేదిక నాయకులు రాదండి దేవేందర్ మద్దతు తెలిపారు… ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మహిళ చైర్మన్ మేకల రజిత, డీఎస్పీ పార్టీ కొత్తూరీ రవీందర్ యోజకవర్గ కన్వీనర్ జోగ బుచ్చయ్య, బర్ల గట్టయ్య, కుమ్మరి సంఘం అధ్యక్షులు కొండపర్తి ఇస్తారి, రజక సంఘం నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, బండారి రవి, బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ శేఖర్ నాని,క్యాతం మహేందర్, తాటి వెంకన్న,శంకర్, రోడ్డ రవీందర్, శ్రీరాములు , పూర్ణ, తీగల సంతోష్ తదితరులు పాల్గొన్నారు

తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు

తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
పైడిపెళ్లి రమేష్ బిసి జేఏసీ జిల్లా ఛైర్మెన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ
42% బీసీ రిజర్వేషన్
రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3 4 ద్వారా మార్చి 2020లో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి తొమ్మిదవ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలి ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మనవి చేస్తున్నాం
రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి
కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంవత్సరం కూడా ఖర్చులు అలాగే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు కమిషన్లు బోర్డులు సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం సమాన అవకాశాలు తగు ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

బీసీ రిజర్వేషన్ కోసం “బంద్ ఫర్ జస్టిస్” ర్యాలీ…

బీసీ రిజర్వేషన్ల పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతాం*

-బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ లో వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

బీసీ రిజర్వేషన్ల విషయంలో దోబూచులాట లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా హన్మకొండ యూనివర్సిటీలోని ఎస్ డి ఎల్ సిలో గల మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి మహేందర్ గౌడ్ పూలమాల వేశారు. అనంతరం యూనివర్సిటీ క్రాస్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు సకలజనులు బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్నారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అగ్రవర్ణాల పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలులో భాగంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో విఫలమైందన్నారు. సమగ్ర కులగణనను మొదలుకొని..బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించడం..ఆ బిల్లు పెండింగ్ లో ఉండగానే..మరో ఆర్డినెన్స్ తేవడం..ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే..జీవో 9 ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘోరా తప్పిదమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం..5 శాతం ఉన్న రెడ్డిలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలా చేసినప్పుడే బీసీలకు సముచిత న్యాయం దక్కుతుందన్నారు. అదేవిధంగా బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ బీసీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడని, బీసీల పాపం బిజెపికి తగులుతుందని, బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్న బిజెపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ పిలుపులో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని బిజెపి బీసీలంటే బానిసలుగా చూస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు రాణించాలంటే చట్టసభలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని, ఇందుకు బిజెపి రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్రంలో బిజెపిని బొంద పెట్టడం ఖాయమన్నారు. బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 18 శాతానికి కుదించిన బీఆర్ఎస్ పార్టీ బంద్ లో పాల్గొని బీసీ సమాజానికి ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. సకల జనులు కలిసి బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంలో ఆలోచించకుండా..అన్ని పార్టీలు ఏకమై బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం హన్మకొండ యూనివర్సిటీ నుండి ములుగు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం కావాలి

బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లిలో బీసీ రిజర్వేషన్ బందుకు సిపిఐ మద్దతు…

బీసీ సంఘాలు తలపెట్టిన ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సంపూర్ణ మద్దతు.

బెల్లంపల్లి నేటిధాత్రి :

 

బెల్లంపల్లి పట్టణ కార్యాలయం బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ అడ్డుపడటం తగదు. రెడ్డి సామాజిక వర్గం హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకుని
హైకోర్టు స్టేను వెంటనే రద్దు చేయించి
బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించా దానికి దోహదపడాలి.
బీసీ సంఘాలు ఈ నెల 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణా బంద్ కు బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది.
పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా వెంటనే చట్టాన్ని చేయాలి .
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవో9ను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించినా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రము లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం *9వ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.బీసీలను ఇంకెన్నాళ్లు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈనెల 18 జరుపు తలపెట్టిన బందును విజయవంతం చేయడానికి వ్యాపార వర్గాలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ఆటోలు, సినిమా హాలు అన్ని వర్గాలు సహకరించగలరని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజన్న ,మేకల రాజేశం ,పట్టణ కార్యవర్గ సభ్యులు బియ్యాల ఉపేందర్, బొంకురి రామచందర్, పులిపాక స్వామి దాస్.
తదితరులు పాల్గొన్నారు ,

బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి…

బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి

బీసీ రిజర్వేషన్లపై బిజేపి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అంబేద్కర్ విగ్రహానికి ఆవేదనతో కూడిన వినతి పత్రం అందజేత

రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి జిల్లా

 

బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని రామన్నపేట మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటి ఆధ్వర్యంలోఈరోజు రామన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేస్తూ, గవర్నర్ వద్ద ఉన్న బిసి బిల్లు పాస్ అవ్వకుండా చేసి,ఇప్పుడు హైకోర్టులో స్టే విధించినా బిజేపి ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా బీసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హడావుడిగా అమలు చేశారని, మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాకుండా, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నదని, తక్షణమే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీఖున చేసే నిరసన ధర్నా , రాస్తారోకో కార్యక్రమాలను అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ సీనీయర్ నాయకులు వీరమల్ల.ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంతం, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, రచ్చ దయాకర్, ఊట్కూరి కృష్ణ, పెండెం రవీందర్ , సల్లా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు చెయ్యాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T131311.562.wav?_=3

 

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలు చెయ్యాలి

బీసీలకు వ్యతిరేకంగా ఉన్న బీజేపీని గద్దె దింపాలి

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్,

భూపాలపల్లి నేటిధాత్రి

 

సిపిఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్
మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు. బిసి బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు,కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదన్నారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు.

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీల పట్ల బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదివ షెడ్యూలులో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి పేరుతో ఏళ్ళ తరబడి బిసిల రిజర్వేషన్ పెంపు అంశాన్ని నాన్చడం ఏ మాత్రం తగదన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూ ఎస్) రిజర్వేషన్ వర్తింపులో ఈ పరిమితిని ఇప్పటికే దాటి పోయిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.

గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణీత కాలపరమితి లోగా ఆమోదం లభించకపోతే, నోటిఫై చేయవచ్చని తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలన్నారు

కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లనే ఈ రోజు ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీని భూస్థాపితం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నేరేళ్ల జోసెఫ్, గోలి లావణ్య, యాకుబ్ పాషా, షబీర్ పాషా, రమేష్ చారి, గోనెల తిరుపతి, మట్టి కృష్ణ, పంగ మహేందర్,వాసం రజిత, యాకూబీ తో పాటు పెద్ద ఎత్తున సిపిఐ నాయకులు పాల్గొన్నారు…

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయిపై దాడి నిందనిరసన…

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి- అనిల్ బెజ్జంకి

కరీంనగర్, నేటిధాత్రి:

 

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, ఎమ్మార్పిస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు మాట్లాడుతూ అక్టోబర్7, 2025న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న విషయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడ్డారు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనాగరికమైంది ఈదాడి ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈదాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని, దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అందువల్ల దేశ ప్రజలందరూ ఈదాడిని ఖండించారని, దళితుడైన బిఆర్ గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అహం పూరితంగా ఈదాడికి తెగపడ్డారని, ఈదాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే దాడి వెనుకున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా ఈఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయస్థానంలో పునరావతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఈడిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో
తునికి వసంత్ మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, కనకం అంజిబాబు మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, చిలుముల రాజయ్య మాదిగ, ఎల్కపెల్లి పౌలు మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, బొద్దులవాని మాదిగ, దండు అంజయ్య మాదిగ, అంతడుపుల సంపత్ మాదిగ, అలువాల సంపత్ మాదిగ, రేపాక బాబు మాదిగ, అంబాలా మధునయ్య మాదిగ, కనకం నరేష్ మాదిగ, శనిగరపు కొమురయ్య మాదిగ, కనుకుంట్ల శ్రీనివాస్ మాదిగ, కళ్లెపెల్లి కొమురయ్య మాదిగ, అన్నీవేణి కౌసల్య, దేవసాని ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు

యూరియా కొరత సృష్టించింది కేంద్రం.

యూరియా కొరత సృష్టించింది కేంద్రం

తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం…?

గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్

కేసముద్రం/ నేటి ధాత్రి

తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు, కొద్ది మొత్తంలో వచ్చిన యూరియా పంపిణీలో పూర్తిగా సహకరిస్తున్న మహబూబాబాద్, కేసముద్రం పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియచేసిన కేసముద్రం విలేజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్.ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ… కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బధనం చేయడానికి పూనుకొని రైతులకు లేనిపోని అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని ఒక అవగాహన లేకుండా బదనం చేస్తున్నారని కావున రైతులందరూ ఎవరు ఈ యూరియా కొరతకు కారణం ఏ ప్రభుత్వం అనేది పూర్తిగా తెలుసుకోవాలని రాష్ట్రానికి సరిపడా యూరియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు ముందు ధర్నా చేసిన ఏ ఒక్కరు రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోగా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మాత్రం కంకణం కట్టుకున్నారని, రాష్ట్రంలో బిజెపి ఎంపీలు సగం మంది ఉన్నారని వారు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నానని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే ఎవరు ఎందుకు అడగట్లేదని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి రాష్ట్రం గురించి రాష్ట్ర రైతుల గురించి అడగకపోవడం శోచనీయం..? రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి కదా బిజెపి ఎంపీలు ప్రజా ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలుఅవుతుంది ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతుంటే ఓర్వలేని కొందరు ప్రభుత్వంపై అవగాహన లేని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు

కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-11T131732.044.wav?_=4

 

కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

కామెర గట్టయ్య
తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

 

భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ
నల్ల చట్టాలకు ఆజ్యం పోస్తున్న గుర్తింపు ప్రాతినిత్య కార్మిక సంఘాలు.
సింగరేణిలో కోడ్ ఆఫ్ డిస్ప్లేన్ . అమలు చేస్తూ కార్మికులు కార్మిక సంఘాలు మాట్లాడకుండా హక్కుల గురించి ప్రశ్నించకుండా మాట్లాడే స్వేచ్ఛను కాల రాస్తున్న కార్మికులకు వాక్ స్వాతంత్రం లేకుండా చేసే కుట్రను కార్మిక వర్గం కార్మిక సంఘాలు ఒక తాటిపై నడిచి తిప్పి కొట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్మికులకు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తుంది
సింగరేణి యాజమాన్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒకటిగా నిలబడి కార్మికుల శ్రమపై ఆధారపడిన యాజమాన్యం కార్మికుల వాక్కు స్వాతంత్రాన్ని విస్మరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వంత పాడుతున్న సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం కార్మికులను మోసం చేస్తూ పబ్బం గడుపు కుఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్సీల పేరుతో కోట్లది రూపాయలు కడుతున్న కూడా కనికరించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను కార్మికుల నుండి దూరం చేయుటకు సింగరేణి యాజమాన్యం కూడా డిస్ప్లే న్ పేరుతో కార్మిక సంఘం నాయకులు బ్యాలెట్ తో కార్మిక వర్గం దగ్గరికి తమ అభిప్రాయాలను తెలుపాలని వచ్చిన కార్మిక సంఘం నాయకులను గేటు దాటవద్దని హుకుం జారీ చేయడాని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం యాజమాన్యం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది సింగరేణిలో 1998.ఎన్నికల తర్వాత ఒకే సంఘం పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసిన గుర్తింపు సంఘం. ఏఐటీయూసీ మళ్లీ పాత పద్ధతిని 2025 లో అదే నల్ల చట్టాలు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయుటకు కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలనే పోరాటాన్ని నిర్వీర్యం చేయుటకే కానీ కార్మిక హక్కుల్ని కాపాడుకొనుటకు కాదు అనేదాన్ని సింగరేణి కార్మిక వర్గం గ్రహించి గుర్తింపు కార్మిక సంఘం నాయకులను కార్మికులు నిలదీయాలని కోరుతుంది సింగరేణి కార్మికులను పకృతికి విరుద్ధంగా పనిచేసే కార్మికులు బార్డర్ సైనికులతో పోల్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బార్డర్ సైనికునికి ఇచ్చిన గుర్తింపులో సగభాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వడం లేదు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వానికి కూడా టాక్సీల రూపంలో కార్మికులు పన్నులు కడుతూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వాళ్ళ సంక్షేమానికి ఏమీ జవాబుగా నిలిచిందో కార్మిక వర్గం గ్రహించాలి అని కోరుతున్నామని బార్డర్ లో సైనికుని 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సైనికునికి హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలలో రెండు గుంటల జాగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటలు మార్చి దేశానికి వెన్నెముకగా నిలబడితే కార్మికునికి రక్త మాంసాలు ధారపోసి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకొస్తున్న కార్మికులకు నివసించుటకు రెండు గుంటల జాగా అడిగితే కార్మికుడు ఉత్పత్తిలో భాగమే తప్ప సొంత ఆస్తి లేదు సొంత ఆస్తిని ఇవ్వము అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యం వాటికి కొమ్ముకాస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలను కార్మిక వర్గం నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కోరుతుంది దేశంలో ఉత్పత్తి లో భాగమైన విద్యుత్ పరికరంగా మారిన కార్మికుని 40 సంవత్సరాల నుండి తీసుకున్న టాక్సీ లా రూపంలో తీసుకున్న రూపాయలను లెక్కలోకి తీసుకుంటే కార్మికుడు అడిగే రెండు గుంటల జాగా కు సరిపడే రూపాయలు కష్టతరమైన పని కాదని కూడా ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. బే షరతుగా కార్మికులకు రెండు గుంటల జాగా పట్టణ ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పుటకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఈసందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటిపై నిలబడి కార్మిక హక్కులను కాపాడుటకు దోహదపడే విధంగా కార్మిక సంఘాల ఎజెండా ఉండాలని ప్రశ్నించే సంఘాలను అన్ని కూడా ఒక వేదికగా ఏర్పడి కార్మిక హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఒప్పించి సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయుటకు దోహదపడాలని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరింపబడడాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడారు
ఈ సమావేశంలో
టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు
దాసరి జనార్ధన్ కాసర్ల ప్రసాద్ రెడ్డి నామాల శ్రీనివాస్ జయశంకర్ సాజిత్ సలీం నరసింహారెడ్డి యుగంధర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు

నిజాంపేటలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T123957.151-1.wav?_=5

నిజాంపేటలో..
వెంటాడుతున్న యూరియా కష్టాలు..

నిజాంపేట: నేటి ధాత్రి

యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version