బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కేంద్రముచట్ట భద్రత కల్పించాలలి
తెలంగాణ జన సమితి
వనపర్తి నేటిదాత్రి .
తెలంగాణ రాష్ట్రంలోబీసీలకు 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత భద్రత కల్పించాలని తెలంగాణ
జనసమితి జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాష డిమాండ్ చేశారు వనపర్తి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో తెలంగాణ జనసమితి నేతలు మాట్లాడారు
తెలంగాణలోబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభ ఆమోదించిన బిల్లులకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని వారు కోరారుతెలంగాణ జనసమితి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు విద్యా, ఉపాధి రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చట్టంచేసి తొమ్మిదవ షెడ్యూల్ ఈసమావేశంలో పిక్కిలి బాలయ్యశాంతారామ్ నాయక్
కె రమేష్. తదితరులు ఉన్నారు
Tag: central government
కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా.!
కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమ్మె విజయవంతం
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక ఉద్యోగ రైతాంగ సంఘాలు ఇచ్చిన సమ్మె బుధవారం గుండాల మండలంలో విజయవంతం అయిందని ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు,సిఐటియు జిల్లా నాయకులు ఈసం వెంకటమ్మ,ఏఐయుకేఎస్ జిల్లా నాయకులు మాచర్ల సత్యం, ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం( ఏఐటిఎఫ్) జాతీయ కన్వీనర్ ముక్తిసత్యం అన్నారు.
సమ్మె సందర్భంగా గుండాలలో గ్రామపంచాయతీ కార్యాలయం నుండి బొడ్రాయి సెంటర్ వరకు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమాని ఐఎఫ్టియు జిల్లా నాయకులు యాసారపు వెంకన్నఅధ్యక్షత వహించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నాలుగు కోడులకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. రైతాంగం తమ రైతాంగ వ్యతిరేక నల్ల చట్టాలను వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించి చట్టాలను వెనక్కి కొట్ట గలిగారని అదే స్ఫూర్తితో కార్మిక వర్గం సమరశీల పోరాటాల ద్వారా కార్మిక వ్యతిరేక నాలుగు కోడులను వెనక్కి కొట్టగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో కార్మిక వర్గం సంగటితం కావలసిన అవశ్యకతను గుర్తు చేశారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెలో సుమారు 25 కోట్ల మంది సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం సమ్మెలో పాల్గొన్నారని వారు అన్నారు. గుండాల మండలంలో అంగన్వాడి,ఆశ,హమాలి, భవన నిర్మాణం గ్రామపంచాయతీ,మోటార్ వర్కర్స్ తదితర అసంఘటిత సంఘటిత కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేశారని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు గడ్డం నగేష్, వానపాకుల లాలయ్య,చింత నరసయ్య,బానోత్ చంద్యా, తాటి కృష్ణ,మెంతిని నాగేష్, ఏఐకేఎంఎస్ నాయకులు గడ్డం లాలయ్య,కొమరం సీతారాములు,బానోతు లాలు, పాయం ఎల్లన్న,టియుసిఐ నాయకులు కొమరం శాంతయ్య,కోడూరి జగన్, మొక్క నరి, సిఐటియు నాయకులు పాయం సారమ్మ, వట్టం పూలమ్మ,వాగబోయిన కౌసల్య,ఎస్.కె నజీమా తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి.
కేంద్ర ప్రభుత్వము మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి
శాంతి చర్చలు జరిపేం దుకు చొరవ తీసుకోండి
ప్రజా సంఘాల డిమాండ్
శాయంపేట నేటిధాత్రి:
కేంద్ర ప్రభుత్వము మావోయి స్టులతో శాంతి చర్చలు జరప డానికి ముందుకు రావాలని ప్రజాసంఘాల నాయకులు
వంగర సాంబయ్య. చింతల భాస్కర్. అంకేశ్వరపు ఐలయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజా సంఘాల నాయ కులు మాట్లాడుతూనక్సలైట్ల సమస్యను శాంతి భద్రత సమ స్యగా చూడకుండా ప్రభుత్వం వెంటనే మావోయిస్టులతో చర్చలు జరపాలని ప్రభు త్వాన్ని కోరారుమావోయిస్టుల పేరుతో ఈ దేశము ఆదివా సీలను అడవి నుండి బయ టకు పంపే ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారని మండి పడ్డారు.గత ప్రభుత్వాలు ఆది వాసీల సంక్షేమం కోసం ఎన్నో రకాలైన అడవి హక్కుల చట్టా లను తెచ్చినప్పటికీ వాటిని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తుంగలో తొక్కి ఆదివాసులపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మావో యిస్టులో జాడ లేకుండా చేస్తా నని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం పేదలను కొట్టి సంపన్నులకు ఊడేగం చేసే విధానాలను ప్రోత్సహిస్తుందని వారన్నారు.రాజ్యాంగ హక్కు లను పేద ప్రజలకు పూర్తిగా అందించిన ప్పుడు సామాజిక అసమా నతలు లేకుండా ప్రభు త్వాలు రాజ్యాంగ ఫలాలను ప్రజల చెంతకు చేర్చినప్పుడు మావోయిస్టు సమస్య ఉండ దని అన్నారు.ప్రభుత్వాలు పేద ప్రజలకు చెందాల్సిన ఎన్నో రకాలైన సంక్షేమ కార్యక్రమా లను అమలు జరపకుండా వారిని ఆకలితో మాడే విధంగా చేస్తున్నంతకాలము ప్రజల మనసులలో ప్రభుత్వాల పట్ల పూర్తిస్థాయి వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వారు తెలిపారు
మావోయిస్టులను అణిచివే యాలని పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు
కేంద్ర ప్రభుత్వం గానీ,రాష్ట్ర ప్రభుత్వాలుగానీ ప్రజా సంక్షే మమే పరమపదిగా పనిచేసి నప్పుడు ప్రజల్లో సామాజిక అసమానతలు అంతరించి పోతాయని అప్పుడు సమా జంలో అందరూ సమానమైన భావన గుర్తిస్తారని, ప్రభుత్వా లు ప్రజా సంక్షేమానికి ఉప యోగపడే కార్యక్రమాలను నిర్వహించకుండా ప్రభుత్వాల తప్పులను ప్రశ్నించకుండా చేయడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ప్రజలను భయభ్రాం తులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.ప్రభుత్వము మావోయిస్టులు సౌమ్య మానాన్ని పాటించి కాల్పుల విరమణను పూనుకోవాలని అన్నారు ఆదివాసీలు నివసి స్తున్న ప్రాంతాలలో పోలీసులు వికృతి చర్యలకు పాల్పడుతు న్నారని అటవీ భూములను అక్కడి ఖనిజ సంపదను సంపన్నులకు దోచి పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మావోయిస్టు సమస్యను సామాజికపరమైన సమస్యగా గుర్తించి అసమానతలు తగ్గించి ప్రజలంతా ఒక్కటి అనే భావనను తీసుకు వచ్చిన ప్పుడు ఆ సమస్యకు నిజమైన పరిష్కారం చూపి నట్టు అవుతుందని ప్రభుత్వము మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని కోరారు
ఢిల్లీ గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు.
ఢిల్లీ గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు
-వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఢిల్లీలోని జంతర్ మంతర్ లో చేసిన బీసీల పోరు గర్జనతో కేంద్ర ప్రభుత్వంలో వణుకు పుట్టిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. ఢిల్లీలో చేసిన బీసీ గర్జనను చూసైనా కేంద్రం తన వైఖరి మార్చుకోవాలన్నారు. సోమవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. గర్జన చూసి కేంద్ర ప్రభుత్వం బీసీలకు న్యాయం చేస్తుందని భావిస్తే..బీసీ డిమాండ్లను పరిష్కరించకపోగా..ఎదురు దాడికి దిగడం బాధాకరమన్నారు. ఢిల్లీ ఉద్యమ స్ఫూర్తితో బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉధృతం చేసి బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు. ఢిల్లీలో నిర్వహించిన బీసీల ఆందోళనతో దేశం మొత్తం బీసీల గొంతుకను వినిపించి, అన్ని రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చామన్నారు. ఇక బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ చివరి వారంలో హైద్రాబాదులో 29 రాష్ట్రాల బీసీ ప్రతినిధులతో బీసీల రాజకీయ ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే నెల రెండవ వారంలో పరేడ్ గ్రౌండ్ లో 10 లక్షల మందితో బీసీల యుద్ధభేరి బహిరంగ సభను నిర్వహించి సత్తా చాటుతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన బీసీల పోరు గర్జనకు 16 రాజకీయ పార్టీలు, 18 రాష్ట్రాల నుంచి 32 మంది పార్లమెంట్ సభ్యులు, 29 రాష్ట్రాల నుండి ఓబీసీ నాయకులు పాల్గొన్నారన్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో బీసీల పోరుగర్జనలో పాల్గొనడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. బీసీల పోరుగర్జన సభకు వచ్చి మద్దతు తెలిపిన సీఎంతో పాటు మంత్రులు, వివిధ పార్టీల నేతలకు బీసీ సమాజం తరఫున మహేందర్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.