పీఎం కిసాన్పై బిగ్ అప్డేట్.. రైతులు తప్పక తెలుసుకోండి..
కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఉన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. 2019లో ఈ పథకం ప్రారంభం అయింది. కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రూ. 2 వేల చొప్పున ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేస్తోంది. అయితే, కేంద్రం లక్షల మంది రైతుల పేర్లను పీఎం కిసాన్ పథకం నుంచి తొలగించిందన్న ప్రచారం గత కొద్దిరోజుల నుంచి బాగా జరుగుతోంది.
ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అధికారిక వెబ్సైట్లో ఓ ప్రకటన విడుదల చేసింది. రైతుల పేర్లను పథకం నుంచి తొలగించటంపై క్లారిటీ ఇచ్చింది. ఆ పోస్టులో.. ‘చాలా మంది రైతులు రూల్స్ ప్రకారం పథకానికి అప్లై చేయలేదు. అర్హత లేని వారు కూడా పథకానికి అప్లై చేస్తున్నారు. కుటుంబంలోని భార్య, భర్త, పిల్లలు వేరు వేరుగా పథకానికి అప్లై చేసినట్లు మా దర్యాప్తులో తేలింది. ఇంట్లో ఒక వ్యక్తికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. 2019 ఫిబ్రవరి 1వ తేదీ తర్వాత పొలం కొన్న వారికి ఈ పథకం వర్తించదు. బెనిఫిషియరీ లిస్ట్ నుంచి పేర్లు తొలగించబడ్డ రైతులకు ఫిజికల్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో వాళ్లు అర్హులని తేలితే పేర్లు మళ్లీ లిస్ట్లో యాడ్ అవుతాయి. అనర్హులని తేలితే పథకం వర్తించదు‘ అని స్పష్టం చేసింది.
జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థల కోటాలో 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని బీసీ జేఏసీ డిమాండ్ చేశారు. బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీసీ జేఏసీ నాయకులు మౌన దీక్ష చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పైడిపల్లి రమేష్ మాట్లాడారు. జనాభాలో 10 శాతం ఉన్న అగ్రవర్ణాలు రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకొని, అన్ని రంగాలను శాశిస్తూ, బీసీలను అణగదోక్కుతున్నారని మండిపడ్డారు. జనాభాలో సగభాగానికి పైగా ఉన్న బీసీలు మాత్రం అగ్రవర్ణ పార్టీల జెండాలు మోసే కార్యకర్తలుగాను, ఓట్లు వేసే యంత్రాలుగాను మిగిలిపోతున్నారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే, మద్దతునిచ్చిన పార్టీలు రెండు నాలుకల ధోరణితో వ్యవహరిస్తూ, బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని, లేకుంటే బీసీ ఉద్యమాన్ని పల్లే పల్లేకు విస్తరించి పార్టీలకు తగిన గుణపాఠం చెప్తామన్నారు. దేశంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చిన తర్వాత రిజర్వేషన్లు లేని వర్గం అంటూ ఏదీ లేదన్నారు. దగాపడ్డ బీసీలు దండు కట్టే సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళనున్నట్లు పైడిపల్లి రమేష్ వెల్లడించారు. డిసెంబర్ మొదటి వారంలో బీసీల చలో ఢిల్లీ పార్లమెంట్ ముట్టడి చేపడతామని, జనవరి 4వ వారంలో లక్ష మందితో వేల వృత్తులు..కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహిస్తామన్నారు. ఈ రోజు కార్యక్రమంనికి విద్యావంతుల వేదిక నాయకులు రాదండి దేవేందర్ మద్దతు తెలిపారు… ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ మహిళ చైర్మన్ మేకల రజిత, డీఎస్పీ పార్టీ కొత్తూరీ రవీందర్ యోజకవర్గ కన్వీనర్ జోగ బుచ్చయ్య, బర్ల గట్టయ్య, కుమ్మరి సంఘం అధ్యక్షులు కొండపర్తి ఇస్తారి, రజక సంఘం నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, బండారి రవి, బీసీ జేఏసీ కో ఆర్డినేటర్ శేఖర్ నాని,క్యాతం మహేందర్, తాటి వెంకన్న,శంకర్, రోడ్డ రవీందర్, శ్రీరాములు , పూర్ణ, తీగల సంతోష్ తదితరులు పాల్గొన్నారు
తాసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన బీసీ జేఏసీ నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మండలంలో బిసి జేఏసీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కి బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పైడిపెళ్లి రమేష్ బిసి జేఏసీ జిల్లా ఛైర్మెన్, బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ 42% బీసీ రిజర్వేషన్ రాష్ట్రంలోని పిల్ నెంబర్ 3 4 ద్వారా మార్చి 2020లో విద్యా ఉద్యోగాలు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ను 42 శాతానికి పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత కేంద్రానికి పంపబడి గత ఏడు నెలలుగా కేంద్రం వద్ద తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచి తొమ్మిదవ షెడ్యూల్లో అమలు చేయించే బాధ్యతను తనపై వేసుకొని ఆ దిశగా చర్యలు చేపట్టాలి ఈ అంశంపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మనవి చేస్తున్నాం రాబోయే శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును తొమ్మిదో షెడ్యూల్లో చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం 42% రిజర్వేషన్ లో ఉపవారికరణ సబ్ క్యాటగిరేషన్ చేయాలి అత్యంత వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలి కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రభుత్వం బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటుచేసి ప్రతి సంవత్సరం 20 వేల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన మొదటి సంవత్సరంలో కేటాయించిన 9200 కోట్లలో కేవలం 2068 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఈ సంవత్సరం కూడా ఖర్చులు అలాగే ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం బీసీల విద్య ఉపాధి ఆర్థిక అభివృద్ధి కోసం మొత్తం 40 వేల కోట్లు తక్షణమే అనగా ఈ ఆర్థిక సంవత్సరంలోగా ఖర్చు చేయాలి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో చేసిన అన్ని హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో అన్ని నామినేటెడ్ పోస్టులు కమిషన్లు బోర్డులు సలహా మండల్లో 90 శాతం ప్రాతినిథ్యం బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఇది సామాజిక న్యాయం సమాన అవకాశాలు తగు ప్రాతినిధ్యం రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణమని మేము గట్టిగా నమ్ముతున్నాం. ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిగణించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో బిసి జేఏసీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
బీసీ రిజర్వేషన్ల పోరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతాం*
-బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ లో వేముల మహేందర్ గౌడ్ మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
బీసీ రిజర్వేషన్ల విషయంలో దోబూచులాట లాడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచైన బీసీ రిజర్వేషన్లను సాధించి తీరుతామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు. శనివారం బంద్ ఫర్ జస్టిస్ పేరిట బీసీ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపులో భాగంగా హన్మకొండ యూనివర్సిటీలోని ఎస్ డి ఎల్ సిలో గల మహాత్మా జ్యోతిబాపూలే దంపతుల విగ్రహానికి మహేందర్ గౌడ్ పూలమాల వేశారు. అనంతరం యూనివర్సిటీ క్రాస్ వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాధించేందుకు సకలజనులు బీసీ జేఏసీ పిలుపునిచ్చిన బంద్ లో పాల్గొన్నారన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో అగ్రవర్ణాల పార్టీలు రాజకీయ కుట్రలు చేస్తున్నాయని, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ అమలులో భాగంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించడంలో విఫలమైందన్నారు. సమగ్ర కులగణనను మొదలుకొని..బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి పంపించడం..ఆ బిల్లు పెండింగ్ లో ఉండగానే..మరో ఆర్డినెన్స్ తేవడం..ఆ ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉండగానే..జీవో 9 ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఘోరా తప్పిదమన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూనే కాంగ్రెస్ ప్రభుత్వం..5 శాతం ఉన్న రెడ్డిలకు ఎక్కువగా ప్రాధాన్యతనిస్తుందని, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేయాలన్నారు. అలా చేసినప్పుడే బీసీలకు సముచిత న్యాయం దక్కుతుందన్నారు. అదేవిధంగా బీసీ ప్రధానిగా చెప్పుకుంటున్నా నరేంద్ర మోడీ బీసీల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడని, బీసీల పాపం బిజెపికి తగులుతుందని, బ్రాహ్మణ ఆర్ఎస్ఎస్ చెప్పు చేతుల్లో పనిచేస్తున్న బిజెపి బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటుందని మండిపడ్డారు. బంద్ ఫర్ జస్టిస్ బీసీ జేఏసీ బంద్ పిలుపులో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకత్వం ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించి బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి రాజ్యాంగ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఇప్పటివరకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేయలేని బిజెపి బీసీలంటే బానిసలుగా చూస్తుందన్నారు. ఇప్పటికైనా దేశంలో కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో బీసీలు రాణించాలంటే చట్టసభలలో రిజర్వేషన్లను ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలని, ఇందుకు బిజెపి రాజ్యసభ సభ్యుడు, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఆర్ కృష్ణయ్య ప్రధాని నరేంద్ర మోడీని ఒప్పించే బాధ్యతను తీసుకోవాలన్నారు. లేకుంటే రాష్ట్రంలో బిజెపిని బొంద పెట్టడం ఖాయమన్నారు. బీసీ రిజర్వేషన్లను 33 శాతం నుంచి 18 శాతానికి కుదించిన బీఆర్ఎస్ పార్టీ బంద్ లో పాల్గొని బీసీ సమాజానికి ఏం సందేశం ఇచ్చిందని ప్రశ్నించారు. సకల జనులు కలిసి బీసీ జేఏసీ బంద్ కు సంపూర్ణ మద్దతు తెలిపినందుకు మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లను రాజకీయ కోణంలో ఆలోచించకుండా..అన్ని పార్టీలు ఏకమై బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కృషి చేయాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్లి నరేంద్ర మోడీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం హన్మకొండ యూనివర్సిటీ నుండి ములుగు క్రాస్ రోడ్ వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో మహేందర్ గౌడ్ పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంఘాలు తలపెట్టిన ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంధుకు సిపిఐ బెల్లంపల్లి పట్టణ సమితి సంపూర్ణ మద్దతు.
బెల్లంపల్లి నేటిధాత్రి :
బెల్లంపల్లి పట్టణ కార్యాలయం బాసెట్టి గంగారం విజ్ఞాన్ భవన్ లో బెల్లంపల్లి పట్టణ సిపిఐ, బీసీ హక్కుల సాధన సమితి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ రాకుండా రెడ్డి సామాజిక వర్గం బీజేపీ అడ్డుపడటం తగదు. రెడ్డి సామాజిక వర్గం హైకోర్టులో వేసిన పిటిషన్ వాపస్ తీసుకుని హైకోర్టు స్టేను వెంటనే రద్దు చేయించి బిసి లకు 42 శాతం రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు నిర్వహించా దానికి దోహదపడాలి. బీసీ సంఘాలు ఈ నెల 18 వ తేదీన తలపెట్టిన తెలంగాణా బంద్ కు బెల్లంపల్లి పట్టణ భారత కమ్యూనిస్టు పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది. పార్లమెంటులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా వెంటనే చట్టాన్ని చేయాలి . రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే విధంగా జీవో9ను తీసుకొచ్చి షెడ్యూల్ను ప్రకటించినా, కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఆమోదించనందున స్థానిక సంస్థల ఎన్నికలు ఆగిపోయినాయని, కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తున్నట్లుగా చట్టం తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్రము లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం కేవలం మతతత్వ రాజకీయాలను అనుసరిస్తూ, అగ్రవర్ణాలకే పెద్ద పీట వేస్తూ, బీసీలను విస్మరిస్తోందని వారు అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించినా, కేంద్ర ప్రభుత్వం వల్ల ఆగిపోయిందని కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం *9వ షెడ్యూల్ ప్రకారం చట్టాన్ని చేసి బీసీలు కూడా ప్రజా ప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం కల్పించాలని వారు కోరారు.బీసీలను ఇంకెన్నాళ్లు వెనకబడేస్తారని వారిని కూడా రాజకీయంగా ఎదిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈనెల 18 జరుపు తలపెట్టిన బందును విజయవంతం చేయడానికి వ్యాపార వర్గాలు, ఆర్టీసీ బస్సులు, బ్యాంకులు, ఆటోలు, సినిమా హాలు అన్ని వర్గాలు సహకరించగలరని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజన్న ,మేకల రాజేశం ,పట్టణ కార్యవర్గ సభ్యులు బియ్యాల ఉపేందర్, బొంకురి రామచందర్, పులిపాక స్వామి దాస్. తదితరులు పాల్గొన్నారు ,
బీసీల 42% రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలి
బీసీ రిజర్వేషన్లపై బిజేపి కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి విడనాడాలి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుపై అంబేద్కర్ విగ్రహానికి ఆవేదనతో కూడిన వినతి పత్రం అందజేత
రామన్నపేట నేటి ధాత్రి యాదాద్రి జిల్లా
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని రామన్నపేట మండల సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటి ఆధ్వర్యంలోఈరోజు రామన్నపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి ఆవేదన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరి నరసింహ, ఎర్ర రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి దాన్ని అమలుపరచడానికి ప్రయత్నం చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఆపడానికి ప్రయత్నం చేస్తూ, గవర్నర్ వద్ద ఉన్న బిసి బిల్లు పాస్ అవ్వకుండా చేసి,ఇప్పుడు హైకోర్టులో స్టే విధించినా బిజేపి ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా బీసిలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు హడావుడిగా అమలు చేశారని, మరి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం సంవత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాకుండా, మొండి వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నదని, తక్షణమే బిసి రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని అన్ని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18వ తారీఖున చేసే నిరసన ధర్నా , రాస్తారోకో కార్యక్రమాలను అన్ని బీసీ సంఘాల నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు…. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, సిపిఐ సీనీయర్ నాయకులు వీరమల్ల.ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, భగవంతం, సిపిఐ పట్టణ కార్యదర్శి రచ్చ యాదగిరి, శివరాత్రి సమ్మయ్య, రచ్చ దయాకర్, ఊట్కూరి కృష్ణ, పెండెం రవీందర్ , సల్లా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు..
సిపిఐ రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద కమ్యూనిస్టు పార్టీ సిపిఐ బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజు సతీష్, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ బిసి రిజర్వేషన్ల సాధనకు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఒక సామాజిక ఉద్యమంగా ముందుకు సాగాలని సూచించారు. బిసి బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని స్పష్టం చేశారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమేనని. ఇప్పటికైనా రాష్ట్రం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు,కేంద్ర మంత్రులు నైతిక బాధ్యత వహించి, వారి పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం కులగణన, సర్వే నిర్వహించి, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల బిల్లు కేంద్రానికి పంపించినా స్పందించలేదన్నారు. శాసనసభలో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించి ఆర్డినెన్స్ చేసి గవర్నర్కు పంపించినా ఆమోదించకపోవడం వల్లే రిజర్వేషన్లు ఆగిపోయాయన్నారు.
ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళలకు రావాల్సిన హక్కులన్నింటినీ కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. బీసీల పట్ల బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే తొమ్మిదివ షెడ్యూలులో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ ద్వారా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటును సమావేశపరిచి, ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. రిజర్వేషన్లు 50 శాతం పరిమితి పేరుతో ఏళ్ళ తరబడి బిసిల రిజర్వేషన్ పెంపు అంశాన్ని నాన్చడం ఏ మాత్రం తగదన్నారు. ఆర్థికంగా ప్రభుత్వం వెనుకబడిన వర్గాల(ఈడబ్ల్యూ ఎస్) రిజర్వేషన్ వర్తింపులో ఈ పరిమితిని ఇప్పటికే దాటి పోయిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్నారు.
గవర్నర్ వద్ద పెండింగ్ ఉన్న బిల్లులు నిర్ణీత కాలపరమితి లోగా ఆమోదం లభించకపోతే, నోటిఫై చేయవచ్చని తమిళనాడు కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును పరిశీలించాలన్నారు
కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉండడం వల్లనే ఈ రోజు ఈ రిజర్వేషన్లు అమలు కాని పరిస్థితి ఏర్పడిందని, బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్రంలో, కేంద్రంలో బీజేపీని భూస్థాపితం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నేరేళ్ల జోసెఫ్, గోలి లావణ్య, యాకుబ్ పాషా, షబీర్ పాషా, రమేష్ చారి, గోనెల తిరుపతి, మట్టి కృష్ణ, పంగ మహేందర్,వాసం రజిత, యాకూబీ తో పాటు పెద్ద ఎత్తున సిపిఐ నాయకులు పాల్గొన్నారు…
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి మీద దాడి చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి- అనిల్ బెజ్జంకి
కరీంనగర్, నేటిధాత్రి:
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయిపై జరిగిన దాడి నిరసిస్తూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, ఎమ్మార్పిస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగలు మాట్లాడుతూ అక్టోబర్7, 2025న భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయి బెంచ్ మీద లాయర్ల వాదనలు వింటున్న విషయంలో రాకేష్ కిషోర్ అనే వ్యక్తి షూ విసిరి దాడికి పాల్పడ్డారు చీఫ్ జస్టిస్ మీద జరిగిన దాడి అనాగరికమైంది ఈదాడి ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది. ఈదాడి సమస్త భారతీయులను దిగ్భ్రాంతికి గురి చేసిందని, దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేసింది అందువల్ల దేశ ప్రజలందరూ ఈదాడిని ఖండించారని, దళితుడైన బిఆర్ గవాయి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కావడం కొన్ని ఆధిపత్య శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే అహం పూరితంగా ఈదాడికి తెగపడ్డారని, ఈదాడికి పాల్పడ్డ వ్యక్తి మీద తక్షణమే కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలి అలాగే దాడి వెనుకున్న శక్తులను గుర్తించి వారికి శిక్ష పడేలా ఈఘటన మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి అందుకోసం సుప్రీంకోర్టులో అనుభవం కలిగిన ప్రజాస్వామ్య దృక్పథం కలిగిన రిటైర్డ్ జడ్జిలను దర్యాప్తు కోసం నియమించాలి అలాగే ఇలాంటి ఘటనలు ఉన్నత న్యాయస్థానంలో పునరావతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి ఈడిమాండ్లను తక్షణమే పరిగణలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనిరసన ధర్నా కార్యక్రమంలో తునికి వసంత్ మాదిగ, చెంచాల నవీన్ మాదిగ, కనకం అంజిబాబు మాదిగ, కొత్తూరి రాజన్న మాదిగ, తడగొండ శంకర్ మాదిగ, చిలుముల రాజయ్య మాదిగ, ఎల్కపెల్లి పౌలు మాదిగ, దండు వరలక్ష్మి మాదిగ, బొద్దులవాని మాదిగ, దండు అంజయ్య మాదిగ, అంతడుపుల సంపత్ మాదిగ, అలువాల సంపత్ మాదిగ, రేపాక బాబు మాదిగ, అంబాలా మధునయ్య మాదిగ, కనకం నరేష్ మాదిగ, శనిగరపు కొమురయ్య మాదిగ, కనుకుంట్ల శ్రీనివాస్ మాదిగ, కళ్లెపెల్లి కొమురయ్య మాదిగ, అన్నీవేణి కౌసల్య, దేవసాని ప్రియదర్శిని, తదితరులు పాల్గొన్నారు
తప్పుడు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనాం…?
గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్
కేసముద్రం/ నేటి ధాత్రి
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం సృష్టించిన యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్న రైతులు, కొద్ది మొత్తంలో వచ్చిన యూరియా పంపిణీలో పూర్తిగా సహకరిస్తున్న మహబూబాబాద్, కేసముద్రం పోలీస్ వారికి ధన్యవాదాలు తెలియచేసిన కేసముద్రం విలేజ్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కత్తెరసాల శ్రీనివాస్.ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ… కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు కావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బధనం చేయడానికి పూనుకొని రైతులకు లేనిపోని అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం వల్లనే యూరియా కొరత ఏర్పడిందని ఒక అవగాహన లేకుండా బదనం చేస్తున్నారని కావున రైతులందరూ ఎవరు ఈ యూరియా కొరతకు కారణం ఏ ప్రభుత్వం అనేది పూర్తిగా తెలుసుకోవాలని రాష్ట్రానికి సరిపడా యూరియా కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటు ముందు ధర్నా చేసిన ఏ ఒక్కరు రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోగా కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని బదనం చేయడానికి మాత్రం కంకణం కట్టుకున్నారని, రాష్ట్రంలో బిజెపి ఎంపీలు సగం మంది ఉన్నారని వారు ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నిస్తున్నానని అన్నారు. రైతులపై ప్రేమ ఉంటే ఎవరు ఎందుకు అడగట్లేదని మండిపడ్డారు.తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతో గెలిచి కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి రాష్ట్రం గురించి రాష్ట్ర రైతుల గురించి అడగకపోవడం శోచనీయం..? రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెప్పాలి కదా బిజెపి ఎంపీలు ప్రజా ప్రభుత్వం ఏర్పడి సుమారు రెండు సంవత్సరాలుఅవుతుంది ప్రవేశపెట్టిన పథకాలు ఒక్కొక్కటిగా అమలవుతుంటే ఓర్వలేని కొందరు ప్రభుత్వంపై అవగాహన లేని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వారికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా అన్నారు
కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
కామెర గట్టయ్య తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడుతూ నల్ల చట్టాలకు ఆజ్యం పోస్తున్న గుర్తింపు ప్రాతినిత్య కార్మిక సంఘాలు. సింగరేణిలో కోడ్ ఆఫ్ డిస్ప్లేన్ . అమలు చేస్తూ కార్మికులు కార్మిక సంఘాలు మాట్లాడకుండా హక్కుల గురించి ప్రశ్నించకుండా మాట్లాడే స్వేచ్ఛను కాల రాస్తున్న కార్మికులకు వాక్ స్వాతంత్రం లేకుండా చేసే కుట్రను కార్మిక వర్గం కార్మిక సంఘాలు ఒక తాటిపై నడిచి తిప్పి కొట్టాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్మికులకు కార్మిక సంఘాలకు విజ్ఞప్తి చేస్తుంది సింగరేణి యాజమాన్యం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఒకటిగా నిలబడి కార్మికుల శ్రమపై ఆధారపడిన యాజమాన్యం కార్మికుల వాక్కు స్వాతంత్రాన్ని విస్మరిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మికులను కట్టు బానిసలుగా చేయుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వంత పాడుతున్న సింగరేణి యాజమాన్యం గుర్తింపు కార్మిక సంఘం ప్రాతినిధ్య కార్మిక సంఘం కార్మికులను మోసం చేస్తూ పబ్బం గడుపు కుఉంటుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు టాక్సీల పేరుతో కోట్లది రూపాయలు కడుతున్న కూడా కనికరించని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకం అమలు చేయాలని గత కొన్ని సంవత్సరాల కాలం నుండి ఉద్యమిస్తున్న కార్మిక సంఘాలను కార్మికుల నుండి దూరం చేయుటకు సింగరేణి యాజమాన్యం కూడా డిస్ప్లే న్ పేరుతో కార్మిక సంఘం నాయకులు బ్యాలెట్ తో కార్మిక వర్గం దగ్గరికి తమ అభిప్రాయాలను తెలుపాలని వచ్చిన కార్మిక సంఘం నాయకులను గేటు దాటవద్దని హుకుం జారీ చేయడాని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం యాజమాన్యం మొండి వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఉంది సింగరేణిలో 1998.ఎన్నికల తర్వాత ఒకే సంఘం పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేసిన గుర్తింపు సంఘం. ఏఐటీయూసీ మళ్లీ పాత పద్ధతిని 2025 లో అదే నల్ల చట్టాలు కోడ్ ఆఫ్ డిసిప్లిన్ పేరుతో కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయుటకు కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలనే పోరాటాన్ని నిర్వీర్యం చేయుటకే కానీ కార్మిక హక్కుల్ని కాపాడుకొనుటకు కాదు అనేదాన్ని సింగరేణి కార్మిక వర్గం గ్రహించి గుర్తింపు కార్మిక సంఘం నాయకులను కార్మికులు నిలదీయాలని కోరుతుంది సింగరేణి కార్మికులను పకృతికి విరుద్ధంగా పనిచేసే కార్మికులు బార్డర్ సైనికులతో పోల్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బార్డర్ సైనికునికి ఇచ్చిన గుర్తింపులో సగభాగాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఇవ్వడం లేదు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వానికి కూడా టాక్సీల రూపంలో కార్మికులు పన్నులు కడుతూనే ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కార్మికులకు వాళ్ళ సంక్షేమానికి ఏమీ జవాబుగా నిలిచిందో కార్మిక వర్గం గ్రహించాలి అని కోరుతున్నామని బార్డర్ లో సైనికుని 15 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సైనికునికి హైదరాబాద్ పట్టణ పరిసర ప్రాంతాలలో రెండు గుంటల జాగా ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 60 సంవత్సరాలు సింగరేణి కార్మికుల రక్తాన్ని చెమటలు మార్చి దేశానికి వెన్నెముకగా నిలబడితే కార్మికునికి రక్త మాంసాలు ధారపోసి కోట్లాది రూపాయలు లాభాలు తీసుకొస్తున్న కార్మికులకు నివసించుటకు రెండు గుంటల జాగా అడిగితే కార్మికుడు ఉత్పత్తిలో భాగమే తప్ప సొంత ఆస్తి లేదు సొంత ఆస్తిని ఇవ్వము అనే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యం వాటికి కొమ్ముకాస్తున్న గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలను కార్మిక వర్గం నిలదీయాలని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కోరుతుంది దేశంలో ఉత్పత్తి లో భాగమైన విద్యుత్ పరికరంగా మారిన కార్మికుని 40 సంవత్సరాల నుండి తీసుకున్న టాక్సీ లా రూపంలో తీసుకున్న రూపాయలను లెక్కలోకి తీసుకుంటే కార్మికుడు అడిగే రెండు గుంటల జాగా కు సరిపడే రూపాయలు కష్టతరమైన పని కాదని కూడా ఆలోచించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తున్నాం. బే షరతుగా కార్మికులకు రెండు గుంటల జాగా పట్టణ ప్రాంతాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కార్మికుల సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న కార్మిక సంఘాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నా గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలకు బుద్ధి చెప్పుటకు కార్మిక వర్గం సిద్ధం కావాలని ఈసందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్మిక సంఘాలన్నీ కూడా ఒక తాటిపై నిలబడి కార్మిక హక్కులను కాపాడుటకు దోహదపడే విధంగా కార్మిక సంఘాల ఎజెండా ఉండాలని ప్రశ్నించే సంఘాలను అన్ని కూడా ఒక వేదికగా ఏర్పడి కార్మిక హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తో పాటు సింగరేణి యాజమాన్యాన్ని కూడా ఒప్పించి సింగరేణి కార్మికుల సొంతింటి పథకాన్ని అమలు చేయుటకు దోహదపడాలని కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరింపబడడాలంటే ఐక్య పోరాటాలే శరణ్యమని ఈ సందర్భంగా తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామెర గట్టయ్య మాట్లాడారు ఈ సమావేశంలో టి ఎస్ యు ఎస్ కార్మిక సంఘం నాయకులు దాసరి జనార్ధన్ కాసర్ల ప్రసాద్ రెడ్డి నామాల శ్రీనివాస్ జయశంకర్ సాజిత్ సలీం నరసింహారెడ్డి యుగంధర్ సిహెచ్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు
యూరియా కష్టాలు రైతులను వెంటాడుతున్నాయి. నిజాంపేట మండల కేంద్రంలో గల ఓ ప్రైవేట్ ఫర్టిలైజర్ లో యూరియా పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ యూరియా పంపిణీలో రైతులు అధిక సంఖ్యలో టోకెన్ తీసుకొని క్యూ లైన్ లో ఉదయం నుండి వేచి ఉండగా పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా పలువు రైతులు మాట్లాడుతూ.. గత కొన్ని నెలలో క్రితం వర్షాలు లేక వర్షాలకు ఏడిస్తే.. ఇప్పుడు వర్షాలు సంమృద్ధిగా కురిసినప్పటికీ యూరియా కోసం పడిగాపులు కాయవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి యూరియా చల్లకపోతే.. వేసిన పంట ఎదుగుదల నిలుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందుబాటులోకి యూరియా తీసుకురావాలని వేడుకుంటున్నారు.
వికలాంగుల పింఛన్ల మాటమర్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.
చిట్యాల, నేటి ధాత్రి :
చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం రోజున వికలాంగుల నాయకుడు పుల్ల మల్లయ్య మాట్లాడుతూ… గత నాలుగు సంవత్సరాలుగా వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయకుండా సైట్ బంద్ చేసి వారి జీవితాలతో చెరగట మాడుతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో తాగిన.బుద్ధి చెప్పాలన్నారు. కొత్త పింఛన్లు రాక వికలాంగులకు సరియైన తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు . ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే గండ సత్యనారాయణ రావు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధించిన జిల్లా అధికారులు తక్షణమే వికలాంగులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆన్నారు . ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగులకు కొత్త పిక్చర్లు ఇవ్వడానికి సైట్ ఓపెన్ చేసి పింఛన్లు మంజూరు చేసివారిని ఆదుకోవాలని కోరారు.
చర్ల రైతులకు ఎరువులు సకాలంలో అందించాలి సిపిఐ రైతు సంఘం డిమాండ్
నేటిధాత్రి చర్ల
చర్ల మండలంలో వరి పత్తి మిర్చి మొక్కజొన్న ఆకు కూరలు కూరగాయలు ఇతర పంటలు సాగుచేసుకుంటున్న రైతులకు ఎరువులు సకాలంలో సరిపడా సరఫరా చేయకపోవడం వల్ల రైతులు నష్టాల బారిన పడే పరిస్థితులు ఏర్పడ్డాయి అప్పులు చేసి సాగు ప్రారంభించిన రైతులకు ఎరువులు అందించకపోవడంలో దిగుబడి సన్నగిల్లి భారీ స్థాయిలో నష్టపోయి అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడుతుందని. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉపాధ్యక్షులు ఆండ్రు వామనరావు అన్నారు తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి సరిపడా 10 లక్షల మెట్రిక్ టన్నుల సరఫరా చేస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 5. 32లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంది దీంతో రాష్ట్రంలో ఎరువుల కొరత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మండల రైతంగానికి సరిపడా డిమాండ్ కనుగుణంగా ఎరువులను సకాలంలో సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు అవినీతి పైరవీలు దళారి వ్యవస్థలను అదుపుచేసి ప్రతి రైతుకు ఎరువుల అందించాలని అదేవిధంగా పూర్తి సబ్సిడీతో పురుగుల మందులు వ్యవసాయ పరికరాలు అందించాలని ఏఐకేఎస్ అనుబంధ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మండల తాసిల్దార్ కార్యాలయ వద్ద వినతి పత్రాలు అందిస్తున్నామని ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అడ్డగర్ల తాతాజీ తెలిపారు అనంతరం వివిధ డిమాండ్స్ తో కూడిన వినతి పత్రాన్ని చర్ల మండల తాసిల్దార్ శ్రీనివాస్ కు అందించారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నూప పోతయ్య సహాయ కార్యదర్శులు కోటి ముత్యాలరావు చల్లా లక్ష్మీనారాయణ కోడిరెక్కల రాజారావు నరసింహారావు మహేష్ రమణ రామారావు సత్యనారాయణ వీరబాబు నాగేశ్వరావు తేజ వెంకటేశ్వరరావు బాబురావు గోపాలకృష్ణ వసంతు తదితరులు పాల్గొన్నారు
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకరించి ప్రజలపై భారాలు మోపేందుకే నూతన కేంద్ర విద్యుత్ చట్టాన్ని మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రజా వ్యతిరేక నూతన కేంద్ర విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని లేకపోతే ప్రజా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. గురువారం ఎంసిపిఐ(యు) డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నర్సంపేటలోని స్థానిక ఓంకార్ భవన్ లో విద్యుత్ పోరాట అమరవీరులు రామకృష్ణ బాలస్వామి విష్ణువర్ధన్ ల 25వ వర్ధంతి కార్యక్రమాన్ని డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పెద్దారపు రమేష్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు రాష్ట్రాల పరిధిలో ఉన్న విద్యుత్తురంగాన్ని కేంద్రం పరిధిలోకి తీసుకువచ్చి నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని పార్లమెంట్లు ప్రవేశపెట్టిందని ఈ క్రమంలో స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధమవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.తమ ఇష్టానుసారంగా కరెంటు చార్జీలను పెంచేందుకు పూనుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వం చట్టాన్ని నిరసిస్తూ ఉద్యమాలు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి కనీస చలనం కలగకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలకు లోబడి డిస్కాం లుగా విడగొట్టి ప్రైవేటీకరించేందుకు పూనుకుంటే వామపక్ష పార్టీలు ప్రజలు పెద్ద ఎత్తున పోరాడినారని ఈ క్రమంలో చలో అసెంబ్లీకి పిలుపునిస్తే లక్షలాదిమంది పోరాటంలో పాల్గొన్నారని అప్పటి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి లాఠీలను తూటాలను తుపాకులను ఉపయోగించి రామకృష్ణ విష్ణువర్ధన్ బాలస్వామి ప్రాణాలను బలి కొన్నారని వందలాది మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు.ఆ విద్యుత్ పోరాట ఫలితంగా అప్పటి ప్రభుత్వం ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైందని ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పాలకులు విద్యుత్ చార్జీల జోలికి రాలేదని అదే గుణపాఠం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పదని ఇప్పటికైనా కేంద్రం తీసుకువచ్చిన నూతన విద్యుత్ సవరణ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుసుంబ బాబూరావు, వంగల రాధసుద,జిల్లా కమిటీ సభ్యులు కేశెట్టి సదానందం, డివిజన్ నాయకులు కర్నే సాంబయ్య, భైరబోయిన నరసయ్య, గడ్డం స్వరూప, గుర్రం రవి,గణిపాక బిందు, కందికొండ సాంబయ్య,అజయ్,విజయ, లక్ష్మి లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ఈ నెల.24న హన్మకొండ అంబేద్కర్ భవన్ లో ఆదివాసుల హక్కులపై అవగాహన సభను విజయవంతం చేయాలని ఏఐఎఫ్ టీయు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్. ఏం .రాయమల్లు రాష్ట్ర నాయకులు. చంద్రగిరి శంకర్. పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, కార్పొరేటీకరణ, ఆపరేషన్ కగార్ హత్యాకాండ, కాల్పుల విరమణ ,పెసా తదితర ఆదివాసి చట్టాలు పరిరక్షించబడాలని, మావోయిస్టుల,పేరుతో ఆదివాసి జాతి హననానికి పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వ పాశవిక నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలు తరలిరావాలని ప్రధానంగా మధ్య భారతంలోగల దండకారణ్య ప్రాంతంలోని అపారమైన ఖనిజ సంపాదను ఆదాని. అంబానీలకు. బడా కార్పొరేట్ సంస్థలకు. అప్పనంగా దోచిపెట్టడం కోసం. మోడీ. అమిషాల. ప్రభుత్వం ఆదివాసీల హననానికి పాల్పడుతూ . ఆదివాసులకు అండగా ఉన్నా. మావోయిస్టు ఉద్యమకారులను. పట్టుకొని చిత్రహింసలు పెట్టి. ఎదురు కాల్పుల పేరట. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అతి కిరాతకంగా మావోయిస్టులను. అమాయకులైన ఆదివాసులను.
Adivasi Rights Scheduled
కాల్చి చంపడం జరుగుతుంది ప్రశ్నించే ఉద్యమకారులపై. పౌర హక్కుల సంఘాలపై. అక్రమ కేసులు బనాయిస్తూ. జైలు పాలు చేస్తున్నారు. మోడీ. అమిషా. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. ఎన్కౌంటర్ల పేరుతో అణిచివేస్తున్న ఆదివాసీల ఉద్యమకారుల జీవించే హక్కును రక్షించుకోవాలని, బస్టర్ లో ఏర్పాటు చేసిన వందలాది సాయుధ బలగాల క్యాంపులను వెంటనే ఎత్తివేసి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలను కొనసాగించాలని, తక్షణం కాల్పుల విరమణను ప్రకటించాలని, పోలీసు బలగాలను . వెనక్కి రప్పించాలని .భారత రాజ్యాంగంలొ ఆదివాసి లకు కల్పించబడిన హక్కులన్నింటినీ అమలు చేయాలని, 1996 పెసా చట్టం .2006 అటవీ హక్కుల చట్టం 5-6- షెడ్యూల్ లను. గ్రామ సభల తీర్మానాలను అమలు చేయాలని. నర మేధాని నిలిపివేసి. దేశంలో శాంతిని నెలకొల్పాలని. కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
జిల్లా ప్రధాన కార్యదర్శి: రిక్కుల శ్రీనివాస్ రెడ్డి
జైపూర్,నేటి ధాత్రి:
రైతుల సంక్షేమం కోసమే గల్లి నుంచి ఢిల్లీ దాకా వెళ్లి పోరాటం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు,ఎమ్మెల్యేలు,నాయకులు రైతుల తరఫున కేంద్రంతో పోరాడుతున్నారని,బిజెపి- బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై రైతు సమస్యలపై నోరు మెదపట్లేదనీ,చోద్యం చూస్తున్నారు అని జిల్లా ప్రధాన కార్యదర్శి రిక్కుల శ్రీనివాస్ రెడ్డి బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు.గత పది సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను ఆదుకోలేని బీఆర్ఎస్ నేతలే ఇప్పుడు రైతులకు అన్యాయం జరుగుతుందని ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.రాష్ట్రంలో యూరియా కొరత ఉందని చెప్పడం అవివేకం అని మండిపడ్డారు.యూరియా కేటాయింపులో కీలక పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ అని,మాటలు కాదు,చర్యలు ముఖ్యమని,రైతులకు ఎరువులు తెప్పించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు.బీజేపీ–బీఆర్ఎస్ చేతగానితనం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు అని రిక్కుల శ్రీనివాస్ రెడ్డి మండిపడ్డారు.ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే లక్షల కోట్లు ఖర్చు చేసిందని నేతలు వివరించారు.ప్రజా సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంమని,బీజేపీ–బిఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని,ప్రజల ఆదరణను జీర్ణించుకోవడం లేదనీ,అందుకే వారు నిరాధార ఆరోపణలకు తెగబడుతున్నారనీ ఎద్దేవా చేశారు.చెన్నూర్ నియోజకవర్గం కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి ఆధ్వర్యంలో నిరంతరం సంక్షేమ పథకాలతో,అభివృద్ధి కార్యక్రమాలతో విజయవంతంగా ముందుకు కొనసాగుతుందని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శీలం వెంకటేశం,ఆసంపల్లి శ్రీకాంత్,గద్దల అనిల్ కుమార్, సుమన్,షారుక్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఫయాజ్,రమేష్ తదితరులు పాల్గొన్నారు.
రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షులు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి ప్రధాన కార్యదర్శి గోలి చంద్రారెడ్డి
కరీంనగర్, నేటిధాత్రి:
చిగురుమామిడి మండలంలోని రైతులకు యూరియా బస్తాలు సకాలంలో అందించడంలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దీనిని నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం చిగురుమామిడి మండల సమితి ఆధ్వర్యంలో ఈరోజు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈసందర్భంగా కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు మాట్లాడుతూ ఎన్నడు లేని విధంగా మండలంలో యూరియా బస్తాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలో యూరియా కష్టాలు ఉండడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సరైన సమన్వయం లేకపోవడంతో యూరియా కష్టాలు తీవ్రం అయ్యాయని దీనిని పరిష్కరించడంలో స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ ఘెరంగా విఫలమయ్యారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు యూరియా కోసం ప్రతిరోజు ప్రాథమిక సహకార కేంద్రం వద్ద బారులు తీరుతూ చెప్పులు పెట్టి గంటల తరబడి లైన్లో నిల్చున్న పొన్నం ప్రభాకర్ కు కనీస కనికరం లేకుండా పోయిందని రైతులను గోస పెట్టిన ఏప్రభుత్వం కూడా నిలవదని ఆయన అన్నారు. పట్టాదారు పాసు బుక్కు ఆధార్ కార్డు ఉంటేనే యూరియా ఇస్తున్నారని ఇది చాలా దుర్మార్గమైన చర్యని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియాతోపాటు నాన్ లిక్విడ్ కొంటేనే యూరియా బస్తా ఇస్తున్నారని రైతుకు ఇష్టం లేకున్నా అంటగడుతున్నారని ఆరోపించారు. కృత్రిమ కొరత సృష్టించి బయట విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దీనికి అడ్డుకట్ట వేయాలన్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకొని వెంటనే రైతులకు చిగురుమామిడి మండలంలో సరిపడ యూరియాని తెప్పించాలని లేనిపక్షంలో రైతులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, గోలి చంద్రారెడ్డిలు హెచ్చరించారు. ఈకార్యక్రమంలో ముద్రకోల రాజయ్య, మనోజ్, మహేందర్, రెడ్డి, ఐలయ్య, గంగారెడ్డి, మల్లారెడ్డి, రామస్వామి, పోచయ్య, స్వామి, వీరయ్య తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు ఇటు కేంద్రం, అటు ఎస్ఎఫ్సీ (రాష్ట్ర ఆర్థిక సంఘం) నిధులు ఆగిపోయాయి. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్య చర్యలు, డ్రైనేజీల నిర్వహణ, బ్లీచింగ్ పౌడర్, ట్రాక్టర్లకు డీజిల్ కొనుగోలు వంటి వాటి కోసం ఇబ్బందిగా మారింది. వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతులు, తాగునీటి పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు కూడా చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని సెక్రటరీలు వాపోతున్నారు. ఆదాయ వనరులు లేని చిన్న పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉందంటున్నారు. అసలే వర్షా కాలం.. గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతాయని, పారిశుధ్య చర్యలు ఎలా చేపట్టాలో తెలియడం లేదని సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీలు నిధుల లేమితో సతమతమ వుతున్నాయి. కేంద్ర, రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడంతో పల్లెల్లో అభివద్ధి పనులు ముందుకు సాగడం లేదు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు రూ.3,600 కోట్లు రావాల్సి ఉండగా.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో నిధులుని లిచిపోయాయి. పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించాలని కేంద్రానికి మంత్రి సీతక్క విజ్ఞప్తి చేసినా… రూల్స్ ఒప్పుకోవని చెప్పిన్న ట్లు తెలిసింది. బీసీ రిజర్వేషన్ల అంశం కారణంగా
◆:- మంత్రి సీతక్క విన్నవించినా ససేమిరా
◆:- కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రూ.3,600 కోట్లు
◆:- ఎస్ఎఫ్సీ నుంచి మరో రూ.1,500 కోట్లు
◆:- రూ.70 కోట్లకుపైగా స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీల సొంత నిధులతో గ్రామాల్లో పనులు
◆:- బీసీ రిజర్వేషన్ల ఆలస్యంతో స్థానిక ఎన్నికలు ఆలస్యం
స్థానిక ఎన్నికలు ఆలస్యమవుతున్నాయని, ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్కార్ కసరత్తు చేస్తుందని చెప్పారు. ఈ క్రమంలో నిధులివ్వాలని మంత్రి అడగగా, నిబంధనల ప్రకారం గ్రామాల్లో పాలక వర్గాలు కొలువుతీరితేనే నిధులు చెల్లిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. 15 నెలలుగా స్టేట్ ఫైనాన్స్ ఫండ్ (ఎస్ఎఫ్సీ) రూ.1,500 కోట్లపైనే రావాల్సి ఉండగా.. ఆ నిధులు కూడా పల్లెలకు అందలేదు. దీంతో పంచాయతీల స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు తమ సొంత నిధులతో పల్లెల్లో అభివద్ధి పనులు చేప డుతున్నారు.
రూ. 3,600 .. కోట్లు పెండింగ్
రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ముగిసి 18 నెలలు దాటింది. 2024 ఫిబ్రవరిలో స్పెషల్ ఆఫీసర్ల పాలన మొదలైంది. అప్పటి నుంచి పాలక వర్గాలు లేకపోవడంతో పంచాయతీలకు కేంద్రం విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ప్రతి నెలా రూ.180 కోట్లు రావాల్సి ఉండగా.. 18 నెలలకు మొత్తం రూ.3,600కోట్లకు పైగా నిధులు నిలిచిపోయాయి. ఎన్నికలు పూర్తయి పాలక వర్గాలు ఏర్పాటు చేస్తేనే ఈ నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క ఢిల్లీ వెళ్లి నిధులు విడుదల చేయాలని పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. పం చాయతీల ఎన్నికల నిర్వహణకు సర్కార్ సన్నాహాలు చేస్తోందని, 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం కసర త్తు చేస్తుందని చెప్పారు. త్వరలో స్థానిక ఎన్నికలపై సర్కార్ నిర్ణయం తీసుకుంటుందని, పల్లెల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులివ్వాలని కోరినా.. కేంద్రం నిరాకరించింది.
రూ. 70 కోట్లకు పైగా సొంత నిధులు..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్ఎఫ్సీ నిధులు సైతం 18 నెలలుగా విడుదల కావడం లేదు. మొత్తం రూ.1,560 కోట్లకు పైగా పెండింగ్లో ఉన్నాయి. నిధులు రాకపోవడంతో పల్లెల్లో వివిధ పనులకు తామే సొంతంగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత నిధులు రూ.70 కోట్లకు పైగా ఖర్చు చేసి అభివృద్ధి పనులు చేపట్టామని వాపోయారు. కొన్ని నిధులు స్థానిక రాబడి (పన్నులు, ఫీజులు) నుంచి సమకూరుతున్నా.. అభివృద్ధి పనులకు సరి పోవడం లేదని పేర్కొంటున్నారు. నిధుల కొరత కారణంగా గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, తాగు నీటి సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులు చేపట్టలేని పరి స్థితి నెలకొందని చెప్పారు. పంచాయతీలు స్వయం సమృద్ధి సాధించాలంటే కేంద్ర, రాష్ట్ర నిధులు కీలక మని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పల్లెలకు వచ్చే నిధులను గ్రామాల్లో విద్యుత్, నెట్ బిల్లులు, వాహనాల అద్దె చెల్లింపు. ఇతర ఖర్చులకు వినియోగిస్తుంటారు. నిధులు ఆగిపోవడంతో ఈ చె లింపులు నిలిచిపోయాయి. తాము సొంతంగా ఖర్చు చేసిన వాటికి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలు కోరుతున్నారు.
బిజెపి కిషన్ మోర్చా మండల అధ్యక్షుడు చింతకుంట సాగర్
చందుర్తి, నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని కిసాన్ మోర్చా చందుర్తి మండల అధ్యక్షులు చింతకుంట సాగర్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వారు మాట్లాడుతూ రైతుల పక్షపాతి అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు యూరియా సరఫరా చేయడంలో విఫలమైందని వారు అన్నారు ఎకరానికి ఒక బస్తా అని చెబుతున్న ప్రభుత్వం దానికి సరిపడా కూడా చేయడం లేదు పైగా కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేయడం సరికాదన్నారు కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తా పై 2100 సబ్సిడీ రైతుల గురించి ఇస్తుందని వారు పేర్కొన్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం యూరియా ను తక్షణమే సరఫరా చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలనీ కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.