అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు…

అడ్డగోలు మాటలతోనే అరూరి అడ్రస్ గల్లంతు

ఓడించి ఇంటికి పరిమితం చేసినా బుద్ధి రాలే కార్యకర్తలను గాలికొదిలేసిన చరిత్ర అరూరిది

అన్న అంటే అందుబాటులో ఉంటున్నది ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

లక్ష మేజారిటి అని గొప్పలు చెప్పుకున్న అరూరిని సోంత పార్టీ కార్యకర్తలే ఓడించింది నిజం కాదా..?

గ్రామాల్లో ఒక్క ఇళ్లు కూడా పెదలకు కట్టని అరూకి ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడడం సిగ్గుచేటు

నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం

వర్ధన్నపేట ( నేటిధాత్రి):

లక్ష మెజారిటి గొప్పలకు పోయి కన్ను మీన్ను కానకుండా ప్రజలను, పార్టీ కార్యకర్తలను, ఉద్యమకారులను పక్కనబెట్టి అక్రమ సంపాదనకు పాకులాడి అభివృద్ధి మరిచి ఉకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చాడనే అరూరి రమేష్ ను చిత్తుగా ఓడించి ఇంటికి పరిమితం చేసినా ఇంకా అడ్డగోలుగా మాట్లాడడం మారలేదని నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్, వర్ధన్నపేట యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కుల్ల యాకాంతం ఎద్దేవా చేశారు.
నిన్నటి వరకు బీజేపి సంకలో ఉన్న అరూరికి అక్కడ కూడా ఎవరు పట్టించుకోకపోవడంతో దిక్కు తోచక బిఆర్ఎస్ పార్టీలో చేరిన అరూరి రమేష్ వాస్తవాలు మాట్లాడకుండా ఆ పార్టీ పెద్దల మెప్పు కోసం నోటికొచ్చింది మాట్లాడుతున్నాడని యాకాంతం ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు పార్టీని నమ్ముకున్న ఏ కార్యకర్తను, ఉద్యమకారులను కనీసం పట్టించుకోకుండా కేవలం కాంట్రాక్టుల మీద శ్రద్ద పెట్టి వందల కోట్ల రూపాయలు దండుకున్న అరూరి నేడు మున్సిపల్ ఓట్లు రాగానే కార్యకర్తలు రావడం ఆయన స్వార్ధ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఈ పనికిరాని మాటలు మాట్లాడారనే సొంత పార్టీ కార్యకర్తలే సాదారణ ఎన్నికల్లో చిత్తుగా ఓడించి బుద్ధి చెప్పారని అన్నారు.
నిత్యం ప్రజల్లో ఉంటూ తనకంటూ ఏ స్వార్ధం లేకుండా కేవలం నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పని చేస్తున్న వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అక్కున చేర్చుకుంటే అన్ని కష్టనష్టాల్లో వెన్నంటి ఉండి పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న పరిస్థితులను చూసి తట్టుకోలేకే తప్పుడు కూతలు కుస్తు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తే అరూరి రమేష్ రాజకీయ భవిష్యత్తు మరింత అంధకారంలోకి వెళ్లడమే గాక బీఆర్ఎన్ పార్టీ కనుమరుగు గాక తప్పదని యాకాంతం అన్నారు. నియోజకవర్గంలో గత పదేళ్ల పాలనలో ఏ గ్రామంలో ఒక్క ఇళ్లు కూడా కట్టని అరూరి రమేష్ దమ్ముంటే నేడు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణమౌతున్నాయో లెక్క పెట్టి బుద్ధి తెచ్చుకోవాలని యాకాంతం నూచించారు.
ఇప్పటికైనా అరూరి రమేష్ వాస్తవ విషయాలను మాట్లాడి మార్పు తేచ్చుకోకుంటే ఆయన వర్ధన్నపేట మునిసిపల్ ఎన్నికల్లో ఒక్క వార్డు కూడా గెలవకుండా డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని ఎన్ని కుట్రలు చేసినా వర్ధన్నపేట మునిసిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని యాకాంతం ధీమా వ్యక్తం చేశారు.

వైకాపా అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యం: ఎమ్మెల్యే గురజాల జగన్

*ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా ఎజెండా..

*అందుకే వెకాపా నాయకులు అలజడులు సృష్టిస్తున్నారు..

*సంస్కారం మరచిన వైకాపా నాయకులు..

*రాయలసీమకు జగన్ చేసింది శూన్యం…

*గత తెదేపా, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే రాయలసీమకు నీరు…

*ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్…

చిత్తూరు(నేటిధాత్రి:

రాష్ట్రంలో వైకాపా నాయకులు వరుసగా చేస్తున్న అరాచకాలు, అలజడులు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకోవడమే అజెండాగా కనిపిస్తోందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల విషయంపై మంగళవారం బీవీ
రెడ్డి కాలనీలోని గృహంలో విలేకరులతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన, 48 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ని నోటికొచ్చినట్లు మాట్లాడడం వైకాపా నాయకుడు అంబటి రాంబాబు సంస్కారానికి నిదర్శనమని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారన్నారు. అంబటి రాంబాబు, జోగి రమేష్ పనికిమాలిన చర్యలతో రాష్ట్రంలో అలజడలు సృష్టించి.. పెట్టుబడుదారులను, పారిశ్రామికవేత్తలను భయపెట్టి రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టడం లక్ష్యంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ రెడ్డి ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడుస్తోందని, జాతీయ, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన నారా చంద్రబాబునాయుడు గారిని చులకనగా మాట్లాడడం తెదేపా శ్రేణులు, సానుభూతిపరులు, ప్రజలు తట్టుకోలేకపోతున్నారని రానున్న రోజుల్లో వైకాపా నాయకులకు మరింత గట్టిగా బుద్ధి చెప్తారన్నారు. గతంలో వైయస్ జగన్ రెడ్డి భార్య వైయస్ భారతి రెడ్డి పై సోషియల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అరెస్టు చేసి ఘనత కూటమి ప్రభుత్వానిదేనని.. తెలుగుదేశం పార్టీ ఎంతో క్రమశిక్షణతో పనిచేస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చిత్తూరులో మాపై, మా కార్యకర్తలపై దాడులు జరిగినా.. ఫలితాల తర్వాత ఎలాంటి ప్రతి దాడులు మేము చేయలేదని, ఇది మా పార్టీ క్రమశిక్షణ, నిబద్ధతకు నిదర్శనం అన్నారు. రాజకీయ విమర్శలను రాజకీయంగానే ఉండాలని, వ్యక్తిగతంగా,కుటుంబ పరంగా ఉండరాదని..ఈ విషయాన్ని జగన్ రెడ్డి వాల్ల పార్టీ నాయకులకు అవగాహన కల్పించాలన్నారు.

రాయలసీమకు నీటిపై డ్రామాలు..

అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు రాయలసీమలోని ప్రాజెక్టులను పట్టించుకోని జగన్.. ఇప్పుడు దీక్ష పేరుతో డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో చేసిన ఇసుక దోపిడీ కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి ప్రాణ నష్టం జరిగిందని, ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయలేదు, ప్రాజెక్టుల నిర్వహణలో గాలికి వదిలేసారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే రూ.8వేల కోట్లు రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేసినట్లు చెప్పారు. చిత్తూరుకు అడివిపల్లి రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా పనులు జోరుగా సాగుతుందన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలోనూ.. చిత్తూరు, పూతలపట్టు, జీడి నెల్లూరు నియోజకవర్గాలకు నీటి సరఫరాపై కలెక్టర్ తో చర్చించారని చెప్పారు. కృష్ణా జలాలను కుప్పంకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబుదేనని.. గతంలో వైయస్ జగన్ సినిమా సెట్టింగ్లను వేసి డ్రామాలు చేశారని విమర్శించారు. వైకాపా నాయకులు ఎన్ని డ్రామాలు వేసిన వారిని నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరని.. ఇలానే దిగజారుడు రాజకీయాలు చేస్తే భవిష్యత్తులో ఆ 11 సీట్లు మిగలవన్నారు. సమావేశంలో మేయర్ ఎస్ అముద, తెదేపా నాయకులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ రాజన్న సునీల్ రావుపై ఆరోపణలను ఖండించారు

ప్రజా సేవ చేయాలని వచ్చిన వెలిచాల రాజేందర్ రావుపై అభ్యంతరంగా వ్యాఖ్యలు చేయడం తగదు- కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న

కరీంనగర్, నేటిధాత్రి:

42వ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న శనివారం కరీంనగర్ డిసిసి కార్యాలయంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ మేయర్ సునీల్ రావు గతంలో తనపై మోపిన ఆరోపణలను ఖండిస్తూ డాక్టర్ రాజన్న తీవ్రస్థాయిలో మండి పడ్డారు. మాజీ మేయర్ గా సునీల్ రావు ఎంత అవినీతికి పాల్పడ్డారో నగర ప్రజలందరికీ తెలుసని, రాజకీయాలలో విమర్శలు ఆరోపణలు చేసే విషయంలో ఒక పద్ధతి ఉంటుందని దానికి భిన్నంగా కుక్కలు పందులు అంటూ అసభ్యకరంగా అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేస్తూ ఆరోపణలు చేయడం సునీల్ రావుకి తగదని, ప్రజా సేవ చేయాలని వచ్చిన వెలిచాల రాజేందర్ రావు కాంట్రాక్టర్ గా దోచుకున్నారని, దున్నపోతు అని మనిషిని పోల్చుతూ ఆరోపణలు చేయడం, అవినీతి అనకొండ రీతిగా అవినీతికి పాల్పడ్డారంటూ వ్యాఖ్యలు చేయడం, నేను నాఉద్యోగంలో భాగంగా గొర్రెలు అమ్ముకున్నానని అనుచిత వ్యాఖ్యలు చేసినారు, సునీల్ రావు చదువుకొని ఉంటే ఈవ్యాఖ్యలు చేసే వారు కాదని కొంత విజ్ఞతతో మాట్లాడాలని, నేను అవినీతికి పాల్పడి ఉంటే ఎప్పుడో జైలుకు వెళ్లే వాడినని, సరెండర్ కు సస్పెన్షన్కు తేడా తెలియని సునీల్ రావు ఐదు సంవత్సరాలు మేయర్ గా ఎలా ఉన్నారు అర్థం కావడంలేదని, సిమెన్ (వీర్యం) ఎలా తయారు చేస్తారు, ఎలా సప్లై చేస్తారు అనే విషయంలో కేవలం డాక్టర్లకు మాత్రమే అవగాహన ఉంటుందని తెలుసుకోవాలి, వ్యవహారం అంతా ఢిల్లీ ఎన్డిటిపి ఆధ్వర్యంలో నడుస్తుంది, దీనిపై అవగాహన లేకుండా అధ్వానంగా మాట్లాడవద్దని, నువ్వు గతంలో కాంగ్రెస్లో పనిచేసినప్పుడు జగపతిరావు దగ్గర ఎమ్మెస్సార్ దగ్గర పొన్నం ప్రభాకర్ దగ్గర కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి మేయర్ అయినావు. మేయర్ పదవి ముగిసిన తర్వాత వినోద్ కుమార్ ను మోసం చేసి మళ్లీ నీరాజకీయ స్వలాభం కోసం బిజెపిలో చేరినావు, ఇప్పుడు బండి సంజయ్ ని ఏమి చేయాలనుకుంటున్నావు, బండి సంజయ్ సునీల్ రావు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నాపై వచ్చిన ఆరోపణలను తిప్పి కొట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని తెలిపారు. కలెక్టరేట్ హెలిపాడ్ వద్ద ఉన్న హనుమాన్ గుడి వద్ద తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను నువ్వు మేయర్ గా ఇలాంటి అవినీతికి పాల్పడలేదని ప్రజల సొమ్ము దోచుకోలేదని నిరూపించదల్చుకుంటే నువ్వు కూడా తడి బట్టలతో వచ్చి హనుమాన్ గుడి వద్ద దేవుని పాదాలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేస్తున్నాను. రాజకీయంగా ఎదిగింది నువ్వైతే కష్టార్జితంతో ఉద్యోగం చేసి ఎదిగింది నేను. నేను ఎలాంటి వ్యక్తినో ఎవరి వద్ద శిష్యరికం చేశారో మీకు తెలుసు మీపని మీరు చేసుకుంటే బాగుంటుంది. ఎప్పుడైనా మంచితనమే గెలుస్తుంది తప్ప అవినీతి కాదు, నీగడీలోకి రానివ్వకుండా అందరిని బెదిరించావు. నువ్వు ఒక మేయర్ స్థానంలో ఉన్నావు కనుక నీతో పనులు అవుతాయని వచ్చిన వారిని బలహీన వర్గాలకు చెందిన వారిపై ఇంటి లోపల దొరలాగా ఉంటూ బయటికి వచ్చిన మీకోసం నేను ఏదైనా చేస్తాను ఎంతైనా చేస్తాను అంటూ రాజకీయ డ్రామా చేస్తావు. నన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆర్టిఐ ద్వారా నాదగ్గర ఉన్న ఆయుధాలలో ఒక ఆయుధాన్ని ప్రయోగించినా నేను లోక్సత్తా ఎం.శ్రీనివాసు శిష్యుని వారు ఎవరికి భయపడరు అది మీకు తెలుసు నేను కేవలం చావుకు తప్ప నీపిల్ల బెదిరింపులకు భయపడేది లేదని హెచ్చరిస్తున్నాను. కలెక్టర్, మంత్రి నన్ను మళ్లీ పెద్దపెల్లికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చారు తెలుసుకోవాలని వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే ప్రతి ఆరోపణలు చేయవలసి వస్తుందని తెలుసుకోవాలని, నన్ను ఆదరించే విషయం డివిజన్ ప్రజలు చూసుకుంటారని ఇక నుండి మీఅవినీతి చిట్టా బయట పెట్టడానికి నాదగ్గర ఆధారాలు చాలా ఉన్నాయని సమయం సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా అవి బయట పెడతానని హెచ్చరించారు. ఈపత్రిక విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లయాక్, మహమ్మద్ చాంద్, తదితరులు పాల్గొన్నారు.

శాయంపేటలో కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్‌పై బిఆర్ఎస్ నేతల విమర్శలు

డైవర్షన్ పాలిటిక్స్ తో ప్రజ లను తప్పుద్రోవ పట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ ఆధ్వర్యంలో స మావేశం ఏర్పాటు చేయడ మైనది ఈ సందర్భంగా బిఆర్ఎస్.వి రాష్ట్ర నాయ కులు కొమ్ముల శివ బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మారపల్లి మోహన్ మైలారం గ్రామ మాజీ సర్పంచ్ అరికెళ్ల ప్రసాద్ మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్స్ పాలి టిక్స్ కొనసాగిస్తూ ప్రజలను మభ్యపెడుతోందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనా కూడా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా బిఆర్ఎస్ నాయకులను విచారణ పేరుతో మాజీ మంత్రి హరీష్ రావును బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇబ్బందులు పెడుతూ రాక్షస ఆనందం పొందుతూ ప్రజలను మభ్యపెడుతూ సంక్షేమ పథ కాలు అందించడంలో కాల యాపనచేస్తూ విఫలమ వుతున్నారని తెలిపారు రాబోయే రోజుల్లో ప్రజల చేతిలో తగిన గుణ పాఠం తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ధైనంపల్లి కరుణ్ బాబు, కూతాటి రమేష్ యూత్ జిల్లా నాయకులు పెంబర్తి వినయ్ తదితరులు పాల్గొన్నారు.

పడేండ్ల బిఆర్ఎస్ అరాచకాలు ప్రజలు మర్చిపోలేదు…

పడేండ్ల బిఆర్ఎస్ అరాచకాలు ప్రజలు మర్చిపోలేదు

పీసీసీ సభ్యులు పెండెం రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

ఏం వ్యాపారాలు చేసి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారో ప్రజలకు వివరణ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ డిమాండ్ చేశారు.
మీ..చుట్టు పక్కల ఉన్న నాయకులు చేసిన మట్టి దందాలు, భూ కబ్జాలు, గ్రీన్ ల్యాండ్ ఆక్రమణలు వంటి అనేక అక్రమాలు ప్రజలంతా గమనిస్తున్నారని ఎద్దేవా చేశారు.నైతిక విలువలులేని రాజకీయ లబ్ధి కోసం వ్యాఖ్యలు చేయడం తగదని మాజీ ఎమ్మెల్యేపై ఆయన మండిపడ్డారు.నర్సంపేట పట్టణంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామానంద్ మాట్లాడుతూ మా కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నారని.. ఆ అభివృద్ధిని ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారని తెలిపారు. పదేండ్లు అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా సొంత ప్రయోజనాల కోసం కమిషన్ల కోసం దందాలు చేసి వందల కోట్లను సంపాదించుకున్న మీరు.. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గురించి కాంగ్రెస్ పార్టీ నాయకులపై మాట్లాడే నైతిక హక్కు లేదని పెద్దిని ప్రశ్నించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో
పదేండ్లు మీరు చేసిన అరాచకాలు ఇంకా ప్రజలు మర్చిపోలేదని పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ పేర్కొన్నారు.ఈ సమావేశంలో నర్సంపేట పట్టణ అధ్యక్షులు బత్తిని రాజేందర్, వరంగల్ జిల్లా ఓబీసీ అధ్యక్షులు ఓర్సు తిరుపతి, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, నర్సంపేట పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ బొబ్బల రమణారెడ్డి, మాదాసి రవి,పంబి వంశీకృష్ణ, మాజీ ఎంపిటిసి చింతల సాంబ రెడ్డి, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు ధోని కీర్తన, బాణాల ప్రసన్న,శ్రీను,తదితరులు పాల్గొన్నారు.

మంత్రి వివేక్‌కు ఆందోళన మొదలైంది: రాజా రమేష్ బాబు

మంత్రి వివేక్ కు ఆందోళన, గుబులు మొదలయ్యింది…

చెన్నూర్ బిఆర్ఎస్ ఇంచార్జ్ రాజా రమేష్ బాబు…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మంత్రి వివేక్ వెంకటస్వామి కి ఆందోళన, గుబులు మొదలయ్యిందని చెన్నూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ డాక్టర్ రాజా రమేష్ బాబు అన్నారు. బుధవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహం వద్ద, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అప్పుడెట్లుండే క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఇప్పుడెట్లుంది అనే వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. వాల్ పోస్టర్ విడుదల కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.

రాబోయే రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయని మంత్రి వివేక్ కు ఆందోళన మొదలైందని విమర్శించారు. సర్పంచ్ ఎన్నికల్లో 50 సీట్లు కూడా గెలవలేదని మంత్రి నిరాశకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు. చెన్నూర్, క్యాతన్ పల్లి మునిసిపాలిటీలను గెలుపొందాలని అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. డబ్బుతో నాయకులను కొనాలని చూస్తున్నారని ఆరోపించారు. మున్సిపాలిటీ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని గత బిఆర్ఎస్ బాల్క సుమన్ పరిపాలన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మంత్రి పరిపాలనను గమనిస్తున్నారని అన్నారు. రెండు సంవత్సరాలలో మున్సిపాలిటీ అభివృద్ధికి ఏం నిధులు తీసుకొచ్చారని ప్రశ్నించారు. మంత్రికి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించి గిఫ్ట్ గా ఇస్తారని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదెక్కడి సభ.. ఇదెక్కడి సంప్రదాయం: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్…

ఇదెక్కడి సభ.. ఇదెక్కడి సంప్రదాయం: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ఫైర్

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం భజన చేసేందుకు తాము అసెంబ్లీకి రావాలా అని ప్రశ్నించారు.

హైదరాబాద్, జనవరి 3: అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని దేశమంతా చూసిందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రశ్నోత్తరాలలో సీఎం గంటన్నర సేపు మాట్లాడటం శాసన సభ చరిత్రలో లేదన్నారు. అసెంబ్లీని గాంధీ భవన్‌లా వాడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై సమాధానం చెప్పకుండా ముఖ్యమంత్రి ఇష్టా రాజ్యంగా మాట్లాడారని మండిపడ్డారు. కేసీఆర్ చావు కోరుకోవటం… హరీష్ రావును బాడీ షేమింగ్ చేయటం తప్ప సమాధానం చెప్పలేదన్నారు. ముఖ్యమంత్రి నోట్లో మూసి కంపు పెట్టుకొని హరీష్ రావు మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఫైర్ అయ్యారు.

వరంగల్ తూర్పులో వర్గపోరు..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-12T135513.292.wav?_=1

వరంగల్ తూర్పులో వర్గపోరు..

అభివృద్ధిలో వెనుకబడిన ఓరుగల్లు!

నేటిధాత్రి, వరంగల్.

 

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అధికార పార్టీ అంతర్గత కలహాలు మళ్ళీ చర్చనీయాంశమయ్యాయి. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ వర్గం నాయకులు ఏర్పాటు చేసిన రహస్య సమావేశం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. స్థానిక సమస్యలు, ప్రజా సమస్యలపై కాకుండా పదవుల కోసం జరుగుతున్న కసరత్తులు, వర్గపోరాటాలు ప్రజల్లో అసంతృప్తిని కలిగిస్తున్నాయి. మరోవైపు, వరద బాధితుల నష్టపరిహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కోసం ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టగా.., అధికార పార్టీ నాయకులు మాత్రం అంతర్గత రాజకీయాలు, ఆధిపత్య పోరాటాల్లో మునిగిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల సమస్యలు పక్కన పడుతున్నాయన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. అభివృద్ధి పరంగా పరిశీలిస్తే, వరంగల్ తూర్పు పక్క నియోజకవర్గమైన పశ్చిమతో పోలిస్తే వెనుకబడింది. ముఖ్యంగా నగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల పురోగతిలో తూర్పు ప్రాంతం నిర్లక్ష్యం గురవుతోంది. ఇంకా ప్రభుత్వ కార్యాలయాలన్నీ హన్మకొండలోనే కొనసాగుతుండటం స్థానికులకు ఆవేదన కలిగిస్తోంది. సమస్యలను పరిష్కరించడంలో కాకుండా వర్గపోరు, అంతర్గత రాజకీయాలతో ముందంజలో ఉండే నాయకుల ధోరణి స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. “పదవుల కోసం పోరాటాలు, అధికార పార్టీ రెండు వర్గాల మధ్య తూర్పు నాయకుల ప్రవర్తన వింతగా కొనసాగుతున్నా, ప్రజా ప్రయోజనాల కోసం ఒక్క అడుగు ముందుకు వేయడం లేదు” అనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ప్రజలు ఆశిస్తున్నది అభివృద్ధి, పారదర్శక పాలన. కానీ రాజకీయ నాయకులు మాత్రం సమీకరణాల గణాంకాల్లో చిక్కుకుని వరంగల్ తూర్పు ప్రజల ఆకాంక్షలను మరచిపోయినట్టే కనిపిస్తున్నారు.

తక్కువ రేట్లకే భూములు ధారాదత్తం.. సర్కార్‌పై బీజేపీ నేతల ఫైర్..

తక్కువ రేట్లకే భూములు ధారాదత్తం.. సర్కార్‌పై బీజేపీ నేతల ఫైర్

 

హిల్ట్‌కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని రామచందర్ రావు ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని తెలిపారు.

 రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ ఈరోజు (సోమవాం) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను బీజేపీ నేతలు (BJP Leaders) కలిశారు. సర్కార్ తీసుకొచ్చిన హిల్ట్ పాలసీపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్‌ రావు (State BJP Chief Ramachandar Rao) మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీని వ్యతిరేకిస్తూ గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇండస్ట్రియల్‌కు కేటాయించిన భూములను హిల్ట్ పేరుతో రియల్ ఎస్టేట్‌గా మారుస్తూ కోట్ల రూపాయలు అవకతవకలకు తెర లేపుతున్నారని ఆరోపించారు. మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ రేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు.

6 లక్షల 30 వేల కోట్ల విలువైన 9292 వేల ఎకరాల భూములను కేవలం 5 వేల కోట్లకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందా..? పరిపాలన చేస్తుందా.. అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు పరచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందింది కాబట్టే ఇండస్ట్రియల్ భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కట్టబెట్టి లబ్ధి పొందుతున్నారని వ్యాఖ్యలు చేశారు. హిల్ట్‌కు వ్యతిరేకంగా ఈనెల 7న ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా చేపట్టబోతున్నామని ప్రకటించారు. హిల్ట్ పాలసీపై ప్రభుత్వంతో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు వెల్లడించారు.హిల్ట్‌పై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని.. ప్రభుత్వ వైఫల్యాను వ్యతిరేకంగా 7న నిరసన దీక్ష చేపట్టబోతున్నామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు. కాగా.. రామచందర్ రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ ఇతర నేతలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.

స్థానిక ఎన్నికల్లో బీజేపీ ఘాటు విమర్శలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-01T144217.405.wav?_=2

 

స్థానిక ఎన్నికల్లో మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోసే కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ కావాలా లేక ఏజెన్సీ ప్రాంత అభివృద్ధి కోసం పోరాడే బీజేపీ కావాలా *

డా జాడి రామరాజు నేత

ఏటూరునాగారం, నేటిధాత్రి

సోమవారం రోజున కన్నాయిగూడెం మండలని బుట్టాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో మైదాన ప్రాంత నాయకుల జెండాలు మోస్తూ జేజేలు కొడుతూ రాక్షస నందం పొందుతున్న బి ఆర్ ఎస్ కాంగ్రెస్ నాయకులు కావాలా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నా బీజేపీ పార్టీ కావాలో కన్నాయిగూడెం మండల ప్రజలు ఆలోచించాలని అన్నారు అదేవిదంగా గత పదిసంత్సరాలు అధికారం లో బ్యాంకు లను దోపిడీ చేసి లబ్ది దారుల దగ్గర లక్షకు 40వేలు తీసుకున్నా నాయకులు కావాలా లేక బిల్డింగ్ లు పూర్తి చెయ్యకుండానే డబ్బులు డ్రా చేసుకున్నా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కావాలో ప్రజలు అర్ధం చేసుకోవాలని అన్నారు అదేవిదంగా 2019లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తులను కన్నాయిగూడెం మండలానికి తీసుకొచ్చి స్థానిక నాయకున్ని ఓడించి రాక్షస నందం పొందుతూ మండల పరిషత్ నిధులను దుర్వినియోగం చేసిన కాంగ్రెస్ పార్టీ కావాలో ప్రజలే తెలుసుకోవాలని అన్నారు ఇప్పటికైనా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ రాక్షస నందం పొందుతున్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీ లకు స్థానిక ఎన్నికల్లో బుద్ది చెప్పాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు

మహిళలపై కాంగ్రెస్ వివక్ష ఆరోపణలు

మహిళల అగౌరవపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం

ఏఐఎఫ్డిడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ

నర్సంపేట,నేటిధాత్రి:

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మహిళల హక్కులు, గౌరవాలను పక్కనపెట్టి వివక్షను అధికారిక విధానంగా మార్చుకుందని అగౌరవపరుస్తున్నదని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు.గురువారం రాష్ట్ర సమావేశం నర్సంపేట ఓంకార్ భవన్ లో జరగగా రాగసుధ మాట్లాడుతూ మహిళ శక్తి పథకంకింద వడ్డీలేని రుణాలు,ఇందిరమ్మ చీరల పంపిణీలో ప్రభుత్వం బహిరంగంగా అన్యాయం చేస్తోందని అవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో మొత్తం 4,35,364 స్వయం సహాయక సంఘాలు ఉంటే కేవలం3,57,098 స్వయం సహాయక సంఘాలకు మాత్రమే 304 కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు ఇచ్చి కపటప్రేమ చూపుతున్నదని ఆరోపించారు.ఇందిరమ్మ చీరల పంపిణీని ఎన్నికల ప్రయోజనాల కోసం
కేవలం ఓటు బ్యాంకుగా చూస్తూ ఇందిరమ్మ పేరుతో కేవలం డ్వాక్రా గ్రూపు మహిళలకు మాత్రమే చీరలను అందిస్తుందని రాగసుద ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకులకి “మహిళ సాధికారత”..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-25T141835.868.wav?_=3

 

కాంగ్రెస్ నాయకులకి “మహిళ సాధికారత”

◆:- అనే పదాలకి అర్థం తెలుసా అని ప్రశ్నిస్తున్న – టిఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకి “మహిళా సాధికారత” లేదా “మహిళల సాధికారత” అనే పదాలకి అర్థం తెలుసా అని అడుగుతున్నాను.
నేను బీజేపీ లో ఉన్నప్పుడు బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కి పిలుపునిచ్చినప్పుడు, మీ రేవంత్ రెడ్డి ఆడపిల్లలకు భయపడి రాష్ట్రంలో ఎక్కడికక్కడ పోలీసు వాళ్లని ఇండ్ల మీదికి పంపించి నైటీల పైన ఉన్న మహిళలని బజార్లోకి తీసుకొచ్చి అరెస్ట్ చేయించారు. అలాగే నేను వ్యక్తిగత పనిమీద హైదరాబాద్ కి వెళ్ళినప్పుడు నేనున్న అపార్ట్మెంట్ లొకేషన్ ట్రేస్ కాకపోయినా చాలా ఇబ్బందులు పడి గంటసేపు ట్రేస్ చేసి నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే పోలీసు వాళ్లని నా బాత్ రూమ్ వరకి పంపించి అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించిన గొప్ప చరిత్ర మీ రేవంత్ రెడ్డికి, మీ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది.

మీ కాంగ్రెస్ వాళ్లు అరెస్టులతోనే ఆగకుండా, రోజంతా తినడానికి తిండి పెట్టకుండా, వాష్ రూమ్ కి వెళ్తే కూడా ఒక లేడీ కానిస్టేబుల్ ని బాత్రూం వరికి పంపించి హరాస్మెంట్ చేసిన చరిత్ర కూడా మీ కాంగ్రెస్ వాళ్లకే దక్కుతుంది.

రాష్ట్రంలో తల్లికి, చెల్లికి, ఆలి కి తేడా లేకుండా కామంతో కళ్ళు మూసుకుపోయి హత్యాచారాలు చేస్తుంటే, దేవతా విగ్రహాల చీరలు లాగుతుంటే కట్టడి చేయలేకపోయింది మీ అసమర్థతప్రభుత్వం.

ఒక పక్క రాష్ట్రంలో ఇలాంటి అరాచకాలు చేస్తూ మీ రేవంత్ రెడ్డి మహిళల సాధికారత కోసం కృషి చేస్తున్నాము అని నిన్న కొడంగల్ ప్రెస్ మీట్ లో నీతి మాటలు మాట్లాడుతుంటే “దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుంది”.

ఇక జహీరాబాద్ నియోజకవర్గానికి వస్తే కాంగ్రెస్ నాయకుల అనుచరులు తప్ప తాగి ఒళ్ళు మరిచిపోయి రాత్రి ఒంటిగంటకు ఫోను చేసి గొడవ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఇంకొక తాగుబోతు ఒళ్ళు మర్చిపోయి రాత్రి 12 గంటలకు, పెళ్లయిన, పెళ్లి కాని మహిళలకు “ఐ లవ్ యు” “ఐ లవ్ యు” అంటూ మెసేజ్లు పెట్టడం జరిగింది, అలాగే షేకాపూర్ లో జరిగిన ఉరుస్స్ కి హాజరై తిరిగి వస్తున్న మహిళలు ట్రాఫిక్ లో చిక్కుకు పోవడం జరిగింది, ఆ మహిళలకు సహాయం చేయాల్సింది పోయి వాళ్ళని చూసి వెక్కిరి నవ్వులు నవ్వుతూ వెళ్ళిపోయారు కాంగ్రెస్ నాయకులు.

మహిళల పట్ల ఏ కోశానా కూడా సంస్కారం లేని మీ కాంగ్రెస్ నాయకులు మహిళల గురించి గానీ మహిళల సాధికారత గురించి మాట్లాడుతుంటే “మేడి పండు చూడు మేలిమై యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండు” అనే మాటలు మీకు చాలా కరెక్ట్ గా సెట్ అవుతాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.

జహీరాబాద్ నియోజకవర్గంలో స్వయం సహాయక గ్రూపుల మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమాలు చేపడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు కింద ఉన్న అంశాల పైన స్పష్టతనివ్వాలి.

1. స్వయం సహాయక మహిళలకి కాకుండా ఇతర మహిళలకి చీరలు పంపిణీ ఎందుకు చేయడం లేదు?
2. చీరల పంపిణీలు, ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వల్ల మహిళలు సాధికారత ఎలా సాధిస్తారో చెప్పాలి?

మహిళలకి తులం బంగారం మరియు స్కూటీ లని ఇస్తామని అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం చీరలతో సరి పెట్టడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల మనోభావాన్ని దెబ్బతీసేలాగా చిన్నచూపు చూస్తుందని చాలా స్పష్టంగా అర్థం అవుతుంది.

మహిళలకు పండగలకి చీరలు ఇవ్వకుండా ఇప్పుడు ఎలాంటి కారణం లేకుండా స్థానిక ఎన్నికల్లో మహిళల ఓట్లని దండుకోవడానికి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సాధికారత పేరుతో మహిళలని మోసం చేస్తున్న దగాకోరు ప్రభుత్వం అని మహిళలు తెలుసుకోవాలి.

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్..

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T121732.421.wav?_=4

 జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.

 వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రైతుల కోసం చేసిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు. అన్నదాతలు వైసీపీ హయాంలో చాలా నష్టపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రెండు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
రైతులకు ఇప్పటికే రూ.14,000 ఇచ్చామని చెప్పుకొచ్చారు. త్వరలో మూడో విడతగా రూ.6,000 విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సంవత్సరానికి రూ.20,000 అన్నదాతలకు సహాయం చేశామని తెలిపారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫీల్డ్‌లోకి వచ్చి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రైతాంగం ఎన్డీఏ నాయకత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడాన్ని కూడా పూర్తిగా రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శలు చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. ఇదంతా చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమవుతోందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్‌లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లో మమేకమై వారి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్‌ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.

జీవితంపై విరక్తితో ఆత్మహత్య…

జీవితంపై విరక్తితో ఆత్మహత్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నవంబర్ 23: జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం ఝరాసంగం మండల పరిధిలోని ఎల్గొయి లో చోటు చేసుకున్నట్లు ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పాటిల్ పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ప్రకారం ఎల్గొయి లావణ్య భర్త వెంకట్ అనే మహిళ తన కూతురు అనారోగ్యం పాలై న్యూమోనియా వ్యాధికి హైదరాబాద్ నగరంలోని నీలోఫర్ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 22న మృతి చెందడంతో స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తన సొంత కూతురు చనిపోయిందన్న బాధతో మానసికంగా కృంగిపోయి జీవితం పై విరక్తితో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడిన బాధితురాలి భర్త బోయిని వెంకట్ తండ్రి విట్టల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవా పంచనమనిమిత్తం జహీరాబాద్ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై క్రాంతికుమార్ పటేల్ తెలిపారు.

ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు..

ఇలాంటి రేషన్ కార్డులు నేనైతే ఎడ చూడలేదు

 

సన్న బియ్యం కంపెనీలో 90% ఖర్చును భరిస్తున్న కేంద్ర ప్రభుత్వం
ప్రధానమంత్రి గారి ఫోటో రేషన్ కార్డు పై లేకపోవడం విడ్డూరం
భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కుందూరు మహేందర్ రెడ్డి
వర్ధన్నపేట.వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలో విచిత్రంగా రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నారని ప్రభుత్వం పై మహేందర్రెడ్డి విమర్శలు చేశారు.

ప్రభుత్వం అధికారికంగా ఇచ్చే రేషన్ కార్డులపై కాంగ్రెస్ పార్టీ నాయకుల పోటో ఏంటి. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఎటువంటి ప్రోటోకాల్ లేని వ్యక్తి రేషన్ కార్డ్ పై తన ఫోటో ముద్రించుకొని ప్రజలకు ఎలా ఇస్తాడు. అని భారతీయ జనతా పార్టీ జిల్లా అధికార కుందూరు మహేందర్ రెడ్డి ప్రశ్నించారు.

దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇలా తలతిక్క పనులు చేయకుండా చూడాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు. అని మహేందర్ రెడ్డి అన్నారు.

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ ఘన కార్యక్రమం…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-22T173132.012.wav?_=5

 

 

కోటి మంది మహిళలకు కోటి చీరల పంపిణీ ఘన కార్యక్రమం
మహిళా ఉన్నతే సమాజ ప్రగతి — దేశ పురోగతి
మహిళలే దేశ నిర్మాణపు మౌలిక శక్తి
మహిళలు బలంగా ఉంటేనే జాతి పునాదులు బలపడతాయి
కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం” ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ

నేటిధాత్రి ఐనవోలు హన్మకొండ :-

 

హన్మకొండ జిల్లా కేంద్రంలోని డీసీసీబీ బ్యాంకు మీటింగ్ హాల్ లో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటవీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖల మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిథిగా వ్యవహరించారు.

కార్యక్రమంలో ఎంపీ శ్రీమతి కడియం కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద దేవి, టెస్కాబ్ ఛైర్మన్ మార్నేని రవీందర్ రావు, కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు.
తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు మాట్లాడుతూ,ఇందిరమ్మ మహిళ శక్తి చీరల పంపిణీలో పాల్గొనడం నాకు అదృష్టం.భూమాతకు ఉన్నట్లు మహిళలకు ఓపిక ఉంటుంది.మహిళలు చదువులో రాణిస్తే కుటుంబ ప్రగతి అనివార్యం.మహిళల అభివృద్ధి దేశ అభివృద్ధి ఎమ్మెల్యే నాగరాజు పేర్కొంటూ, రాష్ట్రంలోని కోటి మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రజా ప్రభుత్వ అసలు లక్ష్యం అని అన్నారు.

బి. ఆర్. ఎస్ ప్రభుత్వంపై విమర్శలు
ఎమ్మెల్యే మాట్లాడుతూ,పాత ప్రభుత్వ కాలంలో ఇచ్చిన చీరలు నాణ్యత లేనివి. పంటచేనుల్లో వేసుకునేవి.ప్రస్తుతం నాణ్యమైన చీరలు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.చీరల పంపిణీతో చేనేత కార్మికులకు ఉపాధి లభించింది.కేసీఆర్ పాలన రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. కేటీఆర్–కవిత–హరీష్ రావు వేల ఎకరాల భూములు, ఫార్మ్ హౌస్‌లు ఎలా సంపాదించారో ప్రజలకు చెప్పాలి.సీఎం రేవంత్ రెడ్డి రోజుకు 18 గంటలు పనిచేస్తున్నారు.
కేటీఆర్ అహంకారంతో సీఎం పై ఏకవచనంలో మాట్లాడుతున్నారు
అని వ్యాఖ్యానించారు.
మహిళల కోసం ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే నాగరాజు వివరించారు
ఈ కార్యక్రమంలో:అదనపు కలెక్టర్ సంధ్యారాణి జిల్లా సమైక్య సంఘం అధ్యక్షురాలు రజిని ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్ జిల్లా – మండల – గ్రామ సమైక్య సంఘాలు అధికారులు, ప్రజాప్రతినిధులు
తదితరులు పాల్గొన్నారు.

 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-10T145837.753.wav?_=6

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. సీఎం రేవంత్‌పై హరీష్ సంచలన కామెంట్స్

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ఓటర్లను మభ్యపెడుతున్నారని ఆరోపించారు.

 జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు (Former Minister Harish Rao) ఆరోపించారు. ఇంత జరుగుతున్నా స్థానిక ఎన్నికల అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈరోజు (సోమవారం) హరీష్ రావు ఆధ్వర్యంలో చీఫ్ ఎలక్ట్రోలర్ ఆఫీసర్‌ను (సీఈవో) బీఆర్‌ఎస్ నేతలు కలిశారు. జూబ్లీహిల్స్ బైపోల్స్‌లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని సీఈవోకు ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు పోలీసులు, అధికారులు తొత్తులుగా మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ పంపిణీ చేస్తోన్న చీరలు, మద్యం పంపిణీ వీడియోలను ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డికి ఇచ్చినట్లు తెలిపారు. యూసుఫ్‌గూడాలో పోలింగ్ కేంద్రం పక్కనే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆఫీస్‌ను షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెమటలు పడుతున్నాయన్నారు. రెండేళ్ళుగా ఆరు గ్యారెంటీల అమలుపై రివ్యూ చేయని సీఎం.. ఈరోజే ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. రేవంత్ ఓటమిని అంగీకరించారు… అందుకే ఆరు గ్యారెంటీలపై రివ్యూ నిర్వహిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా ఓటర్లను మభ్యపెడ్తున్నారని ఆరోపించారు.

పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T133534.280.wav?_=7

 

పదిఏళ్లలో బీసీలకోసం బిఆర్ఎస్ ఏం చేసింది.?
మొగుళ్లపల్లి కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం లో విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్ మాట్లాడుతు బి ఆర్ఎస్ పార్టీ పదిఏండ్లు అధికారంలో ఉండి.. బీసీ రిజర్వేషన్ల మీద కనీసం బిల్లు కూడా పాస్ చేయించుకోలేదు టిఆర్ఎస్ పార్టీ..?
బి ఆర్ఎస్ నాయకులంతా గొప్ప గొప్ప మేధావులు..
బిల్లు ఎలా పెట్టాలో తెలుసు..
ఆర్డినెన్సులు ఎలా తీసుకు రావాలో తెలుసు..
కేంద్రంతో ఎలా కోట్లాడలో తెలుసు.. అంటున్నారు..
మరి ఇన్ని తెలిసి పదేండ్లు అధికారం లో ఉండి.. బిసిల పట్ల మీరు చూపించిన నీతి ఏంటి?

నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు.. ఆట ఆడే వాడికి తెలుసు ఎలా ఉంది పరిస్థితి అని.
దేశం లో, స్వాతంత్రం నుంచీ.. పేదల పట్ల చట్టాలు చేసిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ నే..
బిసి రిజర్వేషన్ల బిల్లు కూడా సాధించి తీరుతుంది.*
తెలంగాణ కోసం ఎన్నాళ్లు కోట్లాడితే తెలంగాణ వచ్చింది? అడగగానే తెలంగాణ ఇచ్చారా? ఎన్నో ఏండ్లు కోట్లాడితే వచ్చింది తెలంగాణ.. అది ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే..!!
బీసీ బిల్లు కూడా అంత సులువైన వ్యవహారం కాదు..!
కాంగ్రెస్ పోరాడుతుంది.. సాధిస్తుంది..!
బి ఆర్ఎస్ కి బీసీ ల పట్ల అంత చిత్తశుద్ధి ఉంటే పందేడ్లలో ఏనాడైనా బీసీ ల కోసం ఏమైనా చేసిందా? చెప్పండి..
కనీసం బి ఆర్ఎస్ నుంచి ఒక్కటంటే ఒక్క నాయకుడు కూడా ఇంప్లీడ్ పిటిషన్ వెయ్యలేదు బీసీ రిజర్వేషన్ల కేసులో..
నీతులు ప్రతి ఒక్కడూ చెప్తాడు..
బి సి రిజర్వేషన్లు మాత్రం కాంగ్రెస్ ద్వారానే సాధ్యం..అవుతుంది.!! స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న జీవో నెంబర్ స్టే హైకోర్టు స్టే విధించిన నేపథ్యంలో బిజెపి టీఆర్ఎస్ పై ప్రజలు మండి పడుతున్నారని బిల్లు ఆపడంలో వారి కుట్ర స్పష్టంగా కనిపించిందని కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ క్యాత రాజు రమేష్ విలేకరులకు కాంగ్రెస్ పార్టీవివరించారు బీసీ రిజర్వేషన్ బిల్లును ఆపింది బిజెపి ప్రభుత్వం కాదా? రిజర్వేషన్ 50% మించకుండా చట్టం చేసింది బిఆర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు ఇక్కడ రెండు పార్టీలు కుట్ర స్పష్టంగా కనబడుతుందని అదంతా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..

ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం…
బి ఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మొగుళ్ళపల్లి

నేటి ధాత్రి భూపాలపల్లి జిల్లా

Vaibhavalaxmi Shopping Mall

మొగుళ్లపల్లి మండల కేంద్రంలో పర్యటించిన జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గ్రామంలో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి బాకీ కార్డు అందజేసిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి * మాజీ జెడ్పిటిసి జోరుక సదయ్య*

ప్రజలతో మాట్లాడుతూ….
ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ కాంగ్రెస్ బాకీ కార్డు* ప్రజలకు వివరిస్తూ ప్రచారం నిర్వహించాలని సూచించారు,
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.

100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.

రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.

మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.

కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.

ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

మేము ప్రజలకు బాకీ ఉన్నమాట వాస్తవమే..

#మమ్మల్ని గెలిపించి,అభివృద్ధిలో భాగస్వామ్యం చేసిన ప్రజలకు ఎప్పడు రుణపడి ఉంటాం..

#మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చెందింది మీరే కదా..

#మీ రాజకీయ లబ్ధికోసం ప్రజలను ఎన్నికల ముందు తప్పుదోవ పట్టిస్తున్నారు…

#బి ఆర్ ఎస్ కా డోఖా కార్డ్ విడుదల చేసిన డీసీసీ అధ్యక్షులు,ఎమ్మెల్యేలు,ఎంపీ

హన్మకొండ, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

పదేళ్ల పరిపాలనలో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్ధిక భారాన్ని మోపిన బి ఆర్ ఎస్ నేతలు బాకీ కార్డ్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు.సోమవారం రోజున హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి కడియం కావ్య,వర్ధన్నపేట శాసన సభ్యులు శ్రీ కే ఆర్ నాగరాజు,వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీమతి కడియం కావ్య తో కలిసి పాల్గొన్నారు.

పదేళ్ల గత బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన హామీలను విస్మరించిన హామీలపై బిఆర్ఎస్ కా డోఖా కార్డ్ పేరుతో కార్డులను విడుదల చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్డులను ప్రజల్లోకి తీసుకెళ్లలను పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ ప్రజలిచ్చిన అధికారాన్ని పూర్తిగా స్వప్రయోజనాలకు వాడుకున్నారని,రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ప్రజలను నట్టేట ముంచారని మండిపడ్డారు.ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా,సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ప్రజలు మర్చిపోలేదు దశాబ్దం పాటు అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి, ఏవీ పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసింది.

కాంగ్రెస్ మాట మీద నమ్మకం ఉన్న పార్టీ మేము ఇచ్చిన హామీలను దశల వారీగా, ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నాం.
బిఆర్‌ఎస్ పార్టీకి ఇప్పుడు ఉన్న ఏకైక పని తప్పులను కప్పిపుచ్చుకోవడం, ప్రజల దృష్టి మళ్లించడం మాత్రమే.
బిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు ఇస్తామని పెద్దగా ప్రచారం చేసింది.
వేలాది కుటుంబాలు నేడు షీట్ ఇళ్ళ్లో, అద్దె ఇళ్ళ్లో ఉంటున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్‌లో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి ఫండ్‌లు విడుదల చేసింది.
టీఆర్‌ఎస్ “రైతు బంధు, రైతు బీమా” అని గొప్పగా చెప్పుకున్నా, వాస్తవానికి రైతులకు రుణాలు మాఫీ కాలేదు.
పంట కొనుగోలు కేంద్రాల్లో బిల్లులు నెలల తరబడి పెండింగ్‌లో ఉంచారు.

ఎరువుల కొరత, విత్తనాల కొరత రైతు దైనందిన కష్టాలు బిఆర్‌ఎస్ పాలనలో పెరిగాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదటి బడ్జెట్‌లోనే రైతులకు పంటల బీమా పునరుద్ధరణ, సమయానుసారం ఎరువుల సరఫరా చర్యలు తీసుకుంది.

మార్కెట్‌లో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పి) హామీగా ఇచ్చి అమలు చేయడం మొదలుపెట్టింది.
టీఆర్‌ఎస్ 2018లో ఇచ్చిన హామీ: “ప్రతి నిరుద్యోగ యువకుడికి ₹3,016 భృతి.”
పదేళ్లపాటు అధికారంలో ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు.
పరీక్షల వాయిదాలు, పేపర్ లీక్‌లు, అవినీతి యువత భవిష్యత్తుతో చెలగాటమాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రిక్రూట్‌మెంట్ ప్రక్రియలను వేగవంతం చేసింది.
టీఆర్‌ఎస్ పాలనలో పాఠశాలలు మూతపడ్డాయి, హాస్టళ్లు మూసివేశారు.
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి.
డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలలు కొత్తగా ఎక్కడా ప్రారంభం కాలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగానికి మళ్లీ జీవం పోస్తోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు క్లియర్ చేయడం మొదలుపెట్టింది.
ప్రభుత్వ కళాశాలలకు ఫ్యాకల్టీ నియామకాలు జరుగుతున్నాయి.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం వరంగల్‌కు స్మార్ట్ సిటీ హామీ ఇచ్చినా, దాని అమలు వద్ద ఆగిపోయింది.
మీరు చేస్తున్న బాకీ ప్రచారంలో మేము ప్రజలకు బాకీ ఉన్నమాట నిజమే అని ఓటు వేసి గెలిపించిన ప్రజలకు బాకీ ఉండటంలో తప్పు లేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బి ఆర్ ఎస్ బాగోతాలను ప్రజలకు చేరువ అయ్యేలా “బిఆర్ఎస్ కా దోఖా “ను ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రావు,పీసీసీ సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు,కార్పొరేటర్లు జక్కుల రవీందర్ యాదవ్,విజయశ్రీ జిల్లా కిసాన్ సెల్ చైర్మన్ వెంకట్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు బంక సరళ మరియు ప్రజా ప్రతినిధులు,బ్లాక్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version