రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్…

రోగనిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

పసిపిల్లలలో రోగ నిరోధక శక్తి పెంచడానికి వ్యాక్సినేషన్ టీకాలు ఉపయోగపడతాయని గ్రామ కార్యదర్శి ఆరిఫ్ అన్నారు. నిజాంపేట మండలం నగరం తండా గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో పసి పిల్లలకు టీకాలు, వ్యాక్సినేషన్ ఇచ్చారు. గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు బిపి షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎన్ఎం నిర్మల, అంగన్వాడి టీచర్ స్వప్న ఆశ వర్కర్లు ఉన్నారు.

నిజాంపేట లో ఆటో ర్యాలీ..

నిజాంపేట లో ఆటో ర్యాలీ..
డ్రైవర్లకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిజాంపేటలో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ గౌడ్ హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ వివిధ ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. పోలీస్ విధుల గురించి డ్రైవర్లకు వివరించారు.

చెక్కుల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు…

చెక్కుల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్న లబ్ధిదారులు.
చెక్కులు పంపిణీ చెయ్యాలని వేడుకలు

నిజాంపేట: నేటి ధాత్రి

 

రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద పేదింటి పెళ్లి కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. ఒక ఆడపిల్ల పెళ్లి చేసే తండ్రి కి కొంతమేర సహాయంగా కల్యాణ లక్ష్మి ఉపయోగపడుతుందనీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగింది. ఈ మేరకు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదింటి తల్లిదండ్రులు ఆడబిడ్డకు పెళ్లి చేశారు. కల్యాణ లక్ష్మికి అప్లై చేసినప్పటికీ సుమారు ఐదు, ఆరు నెలలుగా చెక్కులు పంపిణీ చేయడం లేదు. ఇది అధికారుల నిర్లక్ష్యమా! ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యమా! అనే సందేహాలు ప్రజల్లో మొదలయ్యాయి. వెయ్యి కళ్ళతో కళ్యాణ లక్ష్మి చెక్కుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి వెంటనే కల్యాణ లక్ష్మి చెక్కులను అందివ్వాలని లబ్ధిదారు లు వేడుకుంటున్నారు.

పరిశుభ్రత పై నగరం పాఠశాల….

పరిశుభ్రత పై నగరం పాఠశాల
మండలంలోనే మొదటి స్థానం..

నిజాంపేట ,నేటి ధాత్రి

 

స్వచ్చత పరిశుభ్రత హరిత పాఠశాల కార్యక్రమంలో భాగంగా 2025 సంవత్సరానికి గాను నిజాంపేట మండలం నగరం ప్రభుత్వ పాఠశాల మొదటి స్థానాన్ని దక్కించుకుందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమారాణి అన్నారు. ఆమె మాట్లాడుతూ.. పాఠశాల పరిశుభ్రత విషయం లో 61 అంశాల్లో పాఠశాల పురోగతిని పరిశీలించి రేటింగ్స్ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ రేటింగ్స్ లో మండలంలోని నగరం తండా గ్రామంలో గల పాఠశాల ఫైవ్ స్టార్ రేటింగ్ తో మొదటి స్థానం లో నిలిచిందని ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన ఉన్నారు.

ఎంపీ సహకారంతో చెక్కు అందజేత…

ఎంపీ సహకారంతో చెక్కు అందజేత

నిజాంపేట, నేటి ధాత్రి

 

మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవ నేని రఘునందన్ రావు గారి సహకారంతో సీఎంఆర్ఎఫ్ 13 వేల రూపాయల చెక్కును నార్లపూర్ గ్రామానికి చెందిన కాశమైన వెంకటలక్ష్మి దశరథం కుటుంబానికి బిజెపి నాయకుల ఆధ్వర్యంలో అందించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి భరోసాగా మెదక్ ఎంపీ నిలుస్తారని కొనియాడా రు అలాగే ఇంటింటికి తిరుగుతూ జి ఎస్ టి తగ్గిన వస్తువుల గురించి అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చిమ్మనమైన శ్రీనివాస్, చంద్రశేఖర్, నరేష్ , సంజువు, ప్రణయ్ కుమార్, పరశురాములు, తిరుపతి, అరవింద్, నాగభూషణం, కరుణాకర్, వెంకటేష్, నవీన్ తదితరులు పాల్గొన్నారు

పాత బాకీలు తీర్చడంతోనే..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-14T134821.930.wav?_=1

 

పాత బాకీలు తీర్చడంతోనే..
సమయం సరిపోతుంది.
• గత ప్రభుత్వం అప్పుల కుప్ప తెచ్చిపెట్టింది.
• ఇచ్చిన మాట తప్పిన గత ప్రభుత్వం!

మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు

నిజాంపేట: నేటి ధాత్రి

 

గత ప్రభుత్వం చేసిన పాత బాకీలు తీర్చడంతోనే సమయం సరిపోతుందని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో మంగళవారం లీల గ్రూప్ చైర్మన్, కాంగ్రెస్ నాయకులు మోహన్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు.. గత ప్రభుత్వ హయాంలో మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని విమర్శించారు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి మరెన్నో అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను మభ్య పెట్టారని పేర్కొన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ప్రజలకు మోసపూరిత మాటలపై అవగాహన కల్పించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలు అవగాహన పెంచాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ తోనే ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు, నిజాంపేట మండల అధ్యక్షుడు వెంకట్ గౌడ్, నాయకులు కొమ్మాట బాబు, నజీరుద్దీన్, మారుతి, లక్ష్మా గౌడ్ తదితరులు ఉన్నారు.

కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134240.033.wav?_=2

 

— కష్టపడి చదివితేనే.. ఉన్నత శిఖరాలకు
• చదువుతోపాటు క్రీడలు అవసరమే..
సీఐ వెంకట రాజ గౌడ్

నిజాంపేట: నేటి ధాత్రి

 

విద్యార్థులు కష్టపడి చదివితే.. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్ రాజ గౌడ్ అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతూనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన పేర్కొన్నారు. విద్యార్థికి చదువు ఎంత ముఖ్యమో.. క్రీడలు కూడా అంతే ముఖ్యమని క్రీడల ద్వారా మానసికంగా శారీకంగా దృఢంగా ఉంటామని అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి యాదగిరి, ఎస్సై రాజేష్, కమిటీ సభ్యులు తిరుపతి, జిపి స్వామి, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

బిజెపి నాయకుని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు…

బిజెపి నాయకుని పరామర్శించిన రాష్ట్ర అధ్యక్షుడు

నిజాంపేట: నేటి ధాత్రి

గత 15 రోజుల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న బిజెపి నాయకుడు కలకుచ్చిగారి రాజీరెడ్డిని బిజెపి రాష్ట్ర నాయకులు రామచంద్రరావు పరామర్శించారు. మనోధైర్యాన్ని కలిగి ఉండాలని ఎల్లవేళలా తోడుంటానని హామీ ఇచ్చారు. ఆయనతోపాటు డివిజన్ అధ్యక్షుడు అజయ్ రెడ్డి, సీనియర్ నాయకులు మాచర్ల శ్రీనివాస్, మల్లికార్జున గౌడ్,, తూప్రాన్ లక్ష్మణ్, మంద విజయ, వినయ్, కరుణశ్రీ, సుజాత, అనురాధ, ఉష, గణేష్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ విజయ్ కుమార్, సాయి సూర్య కాలనీ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారావు, రాజేందర్ సాయి సూర్య తదితరులు ఉన్నారు.

నస్కల్ లో సద్దుల బతుకమ్మ…

నస్కల్ లో సద్దుల బతుకమ్మ

నిజాంపేట: నేటి ధాత్రి

నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుండి బతుకమ్మలను పేర్చి గ్రామంలో గల ప్రధాన కూడలి వద్ద బతుకమ్మలను ఉంచి పండుగ నిర్వహించారు. నూతన పట్టు చీరలు ధరించి ప్రేమానురాగాలతో బతుకమ్మ పండుగ నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలువురూ మహిళలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో
పూలను దైవంగా భావిస్తూ ప్రకృతిని కాపాడుతూ మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు. ఎంగిలిపూలతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులు తీరొక్క పువ్వులను పూజిస్తూ జరుపుకుంటామనిఅన్నారు.తెలంగాణ సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లని ఇక్కడ జరుపుకునే బతుకమ్మ పండుగ చిన్న,పెద్ద తేడా లేకుండా ప్రతి ఇంట్లో ఆనందంగా జరుపుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ సభ్యులు పాల్గొన్నారు

అమ్మవారి మండపం వద్ద..

అమ్మవారి మండపం వద్ద..
భరతనాట్యం , మ్యాజిక్ షో , నిత్య అన్నదాన కార్యక్రమం

నిజాంపేట: నేటి ధాత్రి

 

దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో కౌండిన్య యుత్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాట్యమండలి చే దుర్గామాత మండపం వద్ద భరతనాట్యం కార్యక్రమం మరియు మ్యాజిక్ షో అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఏటా భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతుందన్నారు. నవరాత్రులు రోజుకు ప్రత్యేకమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆధునిక కాలంలో సంస్కృతి సంప్రదాయాలు నేటి యువతకు తెలియజేయాలని ఉద్దేశంతో భరతనాట్యం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే మూఢనమ్మకాలను నమ్మవద్దని మ్యాజిక్ షో నిర్వహించామని తెలిపారు. అలాగే నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో కౌండిన్య యూత్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు

దుర్గామాత స్వాములకు బిక్ష ఏర్పాటు..

దుర్గామాత స్వాములకు బిక్ష ఏర్పాటు..

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రంలో దుర్గామాత దీక్ష తీసుకున్న స్వాములకు బుధవారం గ్రామానికి చెందిన జిపి.స్వామి స్వగృహంలో అన్నదాన బీక్షను స్వాములకు అందించారు.ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షులు చల్మెటి నాగరాజు, ఉపాధ్యక్షులు తుమ్మలి రమేష్, కోశాధికారి బజార్ చిన్న తిరుమల్ గౌడ్, లచ్చపేట రాములు గౌడ్, సదాశివలింగం, నాయిని వెంకటేశం,సిద్ధరాంరెడ్డి, రంజిత్ గౌడ్, నాయిని లక్ష్మణ్, నవీన్,శివ,కర్ణాకర్,వినయ్ గౌడ్,మహేష్,ప్రశాంత్, బూరుపల్లి శివకుమార్,చంద్రకాంత్ గౌడ్, దుర్గామాత స్వాములు తదితరులు పాల్గొన్నారు.

నిజాంపేటలో.. శునకాలతో .. తనిఖీలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T132417.192.wav?_=3

 

నిజాంపేటలో..
శునకాలతో .. తనిఖీలు
• చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే.. చర్యలు
• ఎస్ఐ రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్ర

 

చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్థానిక ఎస్ఐ. రాజేష్ అన్నారు. నిజాంపేట మండల కేంద్రంలో గల కిరాణా షాప్, దాబాలు, పాన్ షాప్, బస్టాండ్ వివిధ బహిరంగ ప్రదేశాల్లో శునకాలతో స్థానిక ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయి లాంటి మదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఎవరైనా గంజాయి, డ్రగ్స్ మాదక ద్రవ్యాలను విక్రయించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీల్లో నిజాంపేట పోలీసులు ఉన్నారు.

ఈ గ్రామంలో అమ్మవారి ప్రతిష్ఠ….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T131626.497.wav?_=4

 

— ఈ గ్రామంలో అమ్మవారి ప్రతిష్ఠ
ఇదే మొదటిసారి.

నిజాంపేట: నేటి ధాత్రి

 

దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండలం బచ్చురాజ్ పల్లి గ్రామంలో మొదటిసారి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. గ్రామంలో ఎన్నడు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగలేదని ఈ వర్షాకాలం వర్షాలు సంమృద్ధిగా కురవడంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మొదటిసారి నిర్వహించడం జరిగిందన్నారు. రెండవ రోజు గాయత్రి మాత అలంకరణలో దర్శనం ఇవ్వడం జరిగిందన్నారు. 9 రోజుల పాటు గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారు రోజుకో అవతారంలో పూజలు అందుకోనున్నారని తెలిపారు. కార్యక్రమంలో గ్రామస్తులు బిజెపి మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, లింగం, రామచంద్రం, మహేష్, స్వామి, మధు, శ్రీను, రాజు, కార్తీక్ లో ఉన్నారు.

యూరియా బస్తాల పంపిణీ….

గ్రామాల్లో..
యూరియా బస్తాల పంపిణీ.

నిజాంపేట: నేటి ధాత్రి

గత కొన్ని రోజుల నుండి రైతులు యూరియా బస్తాల కోసం పొడి పడిగాపులుకాస్తున్నారు. నిజాంపేట మండలం లో చల్మెడ గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సోమలింగారెడ్డి ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేపట్టారు. పోలీసుల పర్యవేక్షణలో రైతులను క్యూ లైన్ కట్టించి టోకెన్ల ద్వారా రైతులకు యూరియా పంపిణీ చేశారు.

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం…

విజయవంతమైన ఉచిత మెగా వైద్య శిబిరం

౼అధిక సంఖ్యలో పాల్గొన్న గ్రామస్థులు

నిజాంపేట్, నేటి ధాత్రి

 

 

ప్రెస్ క్లబ్ నిజాంపేట ( రి.నెం 738/25 ) ఆధ్వర్యంలోశుక్రవారం నిజాంపేట మండలకేంద్రంలో ఆర్ వి ఎమ్ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరం లో కంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్,జనరల్ సర్జరీ,ఈఎన్ టి,ఆర్థో పెడిక్ డాక్టర్ లు రోగులను పరీక్షించి..ఉచితంగా మందులను కూడా పంపిణీ చేశారు.ఈ ఆరోగ్య శిబిరానికి మండల తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రాజిరెడ్డి, ఎస్సై రాజేష్,ముఖ్య అతిథిగా హాజరై వైద్య పరీక్షలు చేయుంచుకున్నారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నిజాంపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు.ప్రెస్ క్లబ్ సభ్యులు వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘ సేవకులు తంబలి రమేష్,వ్యవసాయ అధికారి సోమలింగ రెడ్డి, ఏ ఈ ఓ శ్రీలత, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మాట బాబు, బిజెపి పార్టీ నాయకులు నరేందర్,, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బండారి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శి సంజీవ్,కార్యదర్శి స్వామి, కోశాధికారి ప్రదీప్ రెడ్డి, గట్టు ప్రశాంత్, జల పోశయ్య, శ్రీనివాస్,ఆర్ వి ఎమ్ డాక్టర్ లు, గీతాంజలి, తేజస్విని, గ్రీష్మ, సిక, భూమిక,మార్కెటింగ్ మేనేజర్ లక్షణ్
పీఆర్ ఓ లు సంతోష్,కనుకయ్య తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు మొక్కల పంపిణీ…

విద్యార్థులకు మొక్కల పంపిణీ
• నిర్మాణాలు త్వరగా పూర్తి చెయ్యాలి.
• ఎంపీడీవో రాజీరెడ్డి.

నిజాంపేట: నేటి ధాత్రి

 

తల్లి పేరు మీద ఒక మొక్క అనే కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి పాఠశాల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ మేరకు నిజాంపేట మండలం నగరం తాండ గ్రామంలో గ్రామ కార్యదర్శి ఆరిఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీడీవో రాజీరెడ్డి హాజరయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఒక్కొకరికి ఒక్కో మొక్కను ప్రధానం చేశారు. గ్రామంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి త్వరితగతిన ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ సంధ్య, ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, ఉపాధ్యాయులు వెంకటేష్, కల్పన, స్రవంతి విద్యార్థులు, గ్రామస్తులు ఉన్నారు.

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

“నేటిధాత్రి”, బిగ్ బ్రేకింగ్

ఇదేమి రాజ్యమురన్నో చూడబోతే రెండు కళ్ళు పోతున్నాయి

యూరియా కై..రాత్రి వేళలో పడిగాపులు.

లోడ్ వచ్చిన పంపిణీ. జరగడం లేదు.

అధికారులు స్పందించి.. పంపిణీ చేయాలని వేడుకోలు.

కుండ పోత వర్షం పడిన రైతులు పడిన కాపులు కాస్తున్నారు.

రైతు వేదిక వద్ద కరెంటు సప్లై లేకున్నా ఫోన్ లైట్ ద్వారా చూసుకుంటూ పడిగాపులు కాస్తున్న రైతులు.

“నేటిధాత్రి”,నిజాంపేట, మెదక్

రైతు యూరియా పొందడం అంటే ఓ యుద్ధం చేసినట్టుగా మారింది. నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు యూరియా లోడ్ రావడం జరిగింది.

urea shortage in Nizampet, Medak

సమాచారం తెలుసుకున్న రైతులు గ్రామంలో గల రైతు వేదికలో యూరియా పంపిణీ చేస్తారెమొనని వేచి ఉన్నప్పటికీ యూరియా పంపిణీ జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి భారీ వర్షం కురవడంతో కరెంటు బంద్ అయినప్పటికీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చీకటిలో, చెప్పులతో సహా క్యూలైన్లో ఉన్నారు.

urea shortage in Nizampet, Medak

యూరియా పంపిణీ జరగకపోవడంతో తెల్లవారితే.. క్యూలైన్ పెరుగుతుందని రైతులు రాత్రి వేళలో క్యూ లైన్ కట్టారు. దీనిపై సంబంధిత అధికారులు స్పందించి యూరియాను పంపిణీ చేయాలని వేడుకుంటున్నారు.

urea shortage in Nizampet, Medak
urea shortage in Nizampet, Medak

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం…

బాధిత కుటుంబానికి కాంటారెడ్డి ఆర్థిక సహాయం

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

మండలం కేంద్రంలోని షౌకత్పల్లి కి చెందిన సుజాత మృతి చెందింది. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కాంటారెడ్డి తిరుపతిరెడ్డి స్థానిక టిఆర్ఎస్ నేతల ద్వారా బాధిత కుటుంబానికి 5000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ మావురం రాజు,
మాజీ సర్పంచ్ అరుణ్ కుమార్, పత్య నాయక్, రాజు నాయక్ ,రమేష్ , రవీందర్ రెడ్డి, సుర మల్లేశం,రాములు,రాంరెడ్డి, ఐలయ్య, బాల్ రెడ్డి, రాజు నాయక్, నాగిరెడ్డి, దేవుల మహారాజ్, అంతీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

రాజీమార్గమే రాజ.. మార్గం..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-10T140614.114-1.wav?_=5

 

రాజీమార్గమే రాజ.. మార్గం..
 13 జాతీయ లోక్ అదాలత్..
ఎస్సై రాజేష్.

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

శత్రువులను పెంచుకుంటు వెళ్తే శత్రుత్వమే పెరుగుతుందని రాజీ పడితే.. ఇద్దరూ గెలిచినట్టేనని రాజీమార్గమే రాజ మార్గమని నిజాంపేట ఎస్సై రాజేష్ పేర్కొన్నారు. నిజాంపేటలో మాట్లాడుతూ.. వివిధ కేసులతో కోర్టు చుట్టూ తిరుగుతున్న వారు ఈనెల 13న జరిగే జాతీయలోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీస్ కేసులకు సంబంధించి యాక్సిడెంట్, గొడవ, చీటింగ్, భూతగాదాలు వివాహ సంబంధానికి సంబంధించిన కేసులపై రాజీ పడదగిన కేసులపై రాజీపడి కేసులను క్లోజ్ చేసుకోవాలన్నారు. రాజీమార్గమే రాజ మార్గమని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు..

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మైసమ్మ గల్లీలో వినాయక నవరాత్రులలో పూజలు అందుకున్న లడ్డును మాజీ మండల అధ్యక్షుడు బక్కన గారి మంజుల లింగం గౌడ్ 5018 రూపాయలకు కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే నిజాంపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మైసమ్మ గల్లి నిర్వాహకులు కాలనీవాసులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version