కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నాటియుడబ్ల్యూజే హెచ్ 143 జర్నలిస్టు నాయకులు.

కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నాటియుడబ్ల్యూజే హెచ్ 143 జర్నలిస్టు నాయకులు.

అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందే

భూపాలపల్లి నేటిధాత్రి

 

అర్హులైన జర్నలిస్టులు అందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాల్సిందేనని టీయూడబ్ల్యూజే హెచ్ 143 జయశంకర్ భూపాలపల్లి జిల్లా నాయకులు మంతెన సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం టీయూడబ్ల్యూజే హెచ్ 143 రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా జర్నలిస్టులు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు 239 జీవో ఆధారంగా అర్హులైన జర్నలిస్టులు అందరికీ న్యాయబద్ధంగా అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చారని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం 252 జీవో తీసుకువచ్చి అర్హులైన వారికి అన్యాయం చేయాలని చూస్తుందని ఆరోపించారు. ఈ జీవో మూలంగా డెస్క్ జర్నలిస్టులకు, నియోజకవర్గ జర్నలిస్టులకు అలాగే ఒక్కో పత్రికకు జనాభా ఆధారంగా ఆయా మండలాలకు ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డుల మంజూరులో తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. కాగా వెంటనే 252 జీవో ను సవరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా ప్లకార్డులు చేతబూని కలెక్టరేట్ గేటు ముందు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఏవో కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంబాల సంపత్, శేఖర్ నాని, బండ మోహన్, తిక్క ప్రవీణ్, విజయ్ ,రడపాక రమేష్, జగన్,రాజశేఖర్,దేవేందర్,మహేందర్,నరేందర్, మధు, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.a

బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింస..

బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింస

జహీరాబాద్ నేటి ధాత్రి:

మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా టిప్పర్తి మండలం లో బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింసించి మూత్రం తాగించిన చర్యను నిరసిస్తూ టిఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో టిఆర్పి పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు నరసింహ, ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ హనుమంతు,

సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వరప్రసాద్, సచిన్, మొగుడంపల్లి మండల్ శీను, మొడంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి లతీఫ్ మరియు రాము మరియు తదితరులు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు వారి అనుచరుల పైన ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ నాయకుల తీరుపై వారి వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు ఖండిస్తూ రావడం జరిగిందని, కాంగ్రెస్ నాయకులు నాయకుల్లాగా కాకుండా దౌర్జన్యంతో రౌడీయిజం చేస్తున్నారని, అదే వైఖరితో మహిళల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ మండిపడ్డారు.లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మహిళల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు గర్వంగా చెప్పుకున్నారు, మరి మినిస్టర్ ఓదా లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బీసీ మహిళ నామినేషన్ వేస్తే వారి అనుచరులు ఆమె భర్తని హింసించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అన్న విషయం ప్రజలు గమనించాలి.రాష్ట్రంలో బీసీల పైన ఎక్కడికక్కడ బెదిరింపులు కిడ్నాప్లు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ ప్రాక్టీస్ మానిటరింగ్ చేయకుండా ఏం చేస్తుందని. అలాగే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వైఖరితో ప్రవర్తిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది.
ఇతర పార్టీలైన బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్లో ఉన్న బీసీలకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన తీన్మార్ మల్లన్న గారిని ఆశ్రయిస్తున్నారు. వేరే పార్టీలో ఉన్న బీసీలకు మద్దతు మరియు న్యాయం జరగాలన్న కేవలం టిఆర్పి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరియు టిఆర్పి పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.

బీసీ రిజర్వేషన్లపై ఆగ్రహం

బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం:

◆:- పరమేశ్వర్ పటేల్ ఆరోపణ

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల మేదపల్లి గ్రామ మాజీ తాజా సర్పంచ్ పరమేశ్వర్ పటేల్ మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల అమలులో అధికారుల నిర్లక్ష్యం వల్ల బీసీ వర్గాలు నష్టపోతున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి 42 శాతం రిజర్వేషన్ల హామీ ఇచ్చి, పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించి బీసీలను మోసం చేశారని, పాత పద్ధతిలోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆయన అన్నారు. రాజకీయ పలుకుబడితో బీసీలను అణిచివేసేలా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు అమలు కావడం లేదని, దీనికి అధికారులు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.వెంటనే కలెక్టర్ స్పందించి విచారణ జరిపి, రిజర్వేషన్ ప్రక్రియను పునర్విమర్శించి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

అనర్హులను డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు…

అనర్హులను డబ్బులు బెడ్ రూమ్ ఇండ్లు

లబ్దిదారుల పట్ల పోలీసులు, అధికారులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నాం.

 

L1,L2,L3 కేటగిరిలు చేసిన వాటిని కూడా విస్మరించిన జిల్లా అధికారులు..

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.
భూపాలపల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పంపిణీ కార్యక్రమంలో నిన్న ఏదైతే గతంలో ఎంపిక చేసిన లబ్దిదారుల పట్ల పోలీస్ అధికారులు వ్యవహరించిన తీరు గాని, అధికారులు వ్యవహరించిన తీరును బిఆర్ఎస్ పార్టీ తరుపున ముక్తకంఠంతో ఖండిస్తున్నాం.
లబ్దిదారులను పోలీస్ స్టేషన్ లో చెట్టు కింద నిల్చోబెట్టి వారిని దొంగలాగ, నేరస్థుడిలా ట్రీట్ చేయడాని ఖండిస్తున్నాం.

గతంలో మాజీ గండ్ర వెంకట రమణా రెడ్డి ఎంపికైన లబ్దిదారుల వివరాలను మున్సిపాలిటీ కార్యాలయంలో నోటీస్ బోర్డులో అంటించి ప్రజల అభ్యంతరాలను కోరిన తరువాత వాటిని పరిగణలోకి తీసుకున్న తరువాతనే లబ్ది దారులకు ఇళ్ళను కేటాయించడం జరిగింది.

కానీ జిల్లా అడిషనల్ కలెక్టర్ హౌసింగ్ డిపార్ట్మెంట్, పిడి అధికారులు దొంగలాగా, రహస్యంగా పోలీస్ బందోబస్తు నడుమ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళను పంపిణీ చేయడం పనికిమాలిన చర్యగా పరిగణిస్తున్నాం.

L1,L2,L3 కేటగిరి జాబితా చేసి కూడా వాటిని విస్మరించి డబ్బులు తీసుకుని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన పేర్లను లబ్దిదారులుగా పరిగణలోకి తీసుకోవడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని ఏద్దేవా చేశారు.

ఇది చాలా బాధాకరమైన విషయం దీనికి పూర్తి బాధ్యత జిల్లా కలెక్టర్, జిల్లా అడిషనల్ కలెక్టర్, పీడీ, ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ బాధ్యత వహించాలి.

గతంలో ఎంపిక చేసిన లబ్దిదారులను తొలగించడం సిగ్గుచేటు.

గతంలో ఎంపికైన లబ్ధిదారులలో అనర్హులను తొలగించి, అర్హులకు ఇవ్వాలి.

కానీ ఏదో పెద్ద పని చేసిన, ఏదో గొప్ప పని చేసినం అని చెప్పుకుంటే దానిని ఎవరిని ఒప్పుకోరు.

మీరు చేసిన ఈ తప్పిదం రానున్న ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ది చెప్పుతారు.

నిరుపేదలబ్దిదారుల పక్షాన పోరాడుతాం, కోర్టును ఆశ్రయించి న్యాయం జరిగే వరకు పోరాడతామని తెలియచేస్తున్నాం.
ఈ సందర్భంగా చెపుతున్నాం అనర్హుల జాబితా ఇచ్చే దమ్ము మాకుంది, వారిని తొలగించి అర్హులైన వారికీ ఇచ్చే దమ్ము మీకు ఉందా.
ప్రజలను వంచించే చర్యలను మానుకోవాలని బిఆర్ఎస్ పార్టీ తరుపున హెచ్చరిస్తున్నాం.
ప్రజల పక్షాన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. అని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

బెల్ట్ షాపు యజమాన్యంపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి..

బెల్ట్ షాపు యజమాన్యంపై చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయండి..

*గౌడ సంక్షేమ సంఘం సభ్యుల డిమాండ్.

తిరుపతి(నేటిధాత్రి) నవంబ

 

ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందిన వైన్ షాప్ ని బెల్టు షాప్ యజమానులు కొడుతున్నారని గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో గౌడ సంఘ సభ్యులు వాపోయారు. ఈ ప్రభుత్వంలో మద్యం షాపు టెండర్ ద్వారా 28 మంది దరఖాస్తు చేసుకోగా అత్తరాల నారాయణ అనే వ్యక్తి పేరు మీద పుత్తూరు నందు షాపు మంజూరైనది. గౌడ సంఘం సభ్యులు అందరూ కలిసికట్టుగా నిర్వహించుకుంటున్నాముఅధికారుల సూచన మేరకు షాపును మార్చాలని కోరగా మొదట తొర్రూరు బైపాస్ రోడ్డు నందు, అక్కడి నుండి విష్ణు మహల్, ఇస్లాపురం తరువాత కళ్యాణపురం దగ్గరికి మార్చాము. బెల్ట్ షాపు నిర్వాహకులు పగలు రేయి మద్యం అమ్మడంతో మా షాపు తెరిస్తే వాళ్లకు వ్యాపారాలు దెబ్బతింటాయని బయట ఊరి నుంచి జనాలను తెచ్చి ధర్నాలు చేపించడం జరుగుతున్నదిమా షాపు వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు మా పైకి బయట ఊర్ల నుంచి మనుషులను తెప్పించి దాడులకు పంపుతున్నారు.ఈ షాపు ద్వారా 28 కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి,మేము షాపు తెరకపోతే చావేగతి, వేరే దారి లేదని వాపోయారు.షాపు తెరవకపోతే ప్రభుత్వానికి లైసెన్స్ కు మేము డబ్బులు ఎలా కట్టాలి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులకు పలుమార్లు విన్నవించుకున్న మాకు న్యాయం జరగలేదని పత్రిక ముఖం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తారని మీ ముందుకు వచ్చామని పత్రికల వారిని కోరుకుంటున్నామని, మా బాధను అర్థం చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మా షాపును తెలుసుకునే దానికి అనుమతులు ఇచ్చి, మాకు రక్షణ కల్పించాలని, బెల్టు షాపుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.
ఈ కార్యక్రమంలో నాగరాజు గౌడ్, అత్తిరాల శ్రీరాములు గౌడ్, సత్యనారాయణ గౌడ్, రాంబాబు గౌడ్, పురుషోత్తం గౌడ్, రామయ్య గౌడ్, ఉదయగిరి మోహన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

*రాష్ట్రబందులో పాల్గొన్న బిజెపి నాయకులు…

*రాష్ట్రబందులో పాల్గొన్న బిజెపి నాయకులు

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలంలో 42% బీసీ రిజర్వేషన్ బిల్లు సాధనకై బీసీ జేఏసీ ఇచ్చినటు వంటి తెలంగాణ బందుకు మద్దతు తెలుపుతూ బందు లో పాల్గొన్న బిజెపి మండల నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామ కృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బిసి డిక్ల రేషన్లు లో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మోసపూరిత వాగ్దానాలు చేసి ఆరోజు అధికారంలోకి రావడం జరిగింది అధికారంలో వచ్చిన కాడి నుంచి బీసీలను మభ్యపెడుతూ బీసీలను మోసం చేసే కుట్ర పన్నుతూ కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అవలంబిస్తున్నటువంటి బీసీ వ్యతిరేక విధానాలని భారతీ య జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు గడువు పూర్తి అయి రెండు సంవత్సరాలు కావ స్తున్న ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా మోసపూరిత హామీల తోటి బీసీలను 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి మభ్యపెడు తూ కాలం వెళ్లబుచ్చుతుంది తప్పితే ఈ కాంగ్రెస్ పార్టీకి బీసీల మీద ఎలాంటి చిత్తశుద్ధి అనేది లేదు అని ఏ రోజుకైనా బీసీలకి న్యాయం చేసే పార్టీ బిజెపి పార్టీ మాత్రమే అని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగి లి, సీనియర్ నాయకులు బూ ర ఈశ్వరయ్య, జిల్లా ఓబిసి మోర్చ నాయకులు ఉప్పు రాజు, మండల ప్రధాన కార్య దర్శి భూతం తిరుపతి, కురా కుల చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన…

కండ్లకు గంతలు కట్టుకొని సిపిఐ నిరసన

బీజేపీ వల్లనే బీసీలకు అన్యాయం

సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం 9వ షెడ్యూల్లో చేర్చి,బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ సెంటర్ వద్ద కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశంలోనే బీసీల జనాభా 60% పైగా ఉన్నప్పటికీ బీసీలకు ఏ ప్రభుత్వం న్యాయం చేయలేదని చెప్పారు. కేవలం బీసీలను ఓట్లకు వాడుకోడానికి మాత్రమే చూశారని వారి హక్కుల కోసం, రిజర్వేషన్లు పెంచి న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం చూడలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ఒకసారి బీసీలకు రిజర్వేషన్లకు పెంపు కు మద్దతుగా మరోసారి బీసీ రిజర్వేషన్లు పెంపు వల్ల ముస్లింలకు లాభం చేరుతుందని వ్యతిరేకంగా ద్వంద వైఖరులను పాటిస్తుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో 42% ఆమోదం తెలిపి కేంద్రానికి పంపిస్తే గవర్నర్, రాష్ట్రపతి సంతకం పెట్టకుండా బీసీలను మోసం చేస్తుందని తెలిపారు. అతి త్వరలోనే బీసీ ప్రజలంతా బిజెపికి బుద్ధి చెప్పే సమయం దగ్గర లో ఉందని తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. లేనియెడల భవిష్యత్తులో సిపిఐ పార్టీ ,అన్ని రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు ఆధ్వర్యంలో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. బందును విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రవీణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్యాతరాజ్ సతీష్,కుడుదుల వెంకటేశ్,నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్,గోలి లావణ్య, పొనగంటి లావణ్య, పీక రవికాంత్, రమేష్ చారి, రాజేష్, ఎకు రాములు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ బంద్ విజయవంతం కావాలి

బీసీ రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

బీసీ రిజర్వేషన్ పట్ల రాష్ట్ర బిసి బంద్ ను విజయవంతం చేయాలని కోరుతూ నర్సంపేట సిపిఎం ఆఫీసులో సిపిఎం మండల కార్యదర్శి కోరబోయిన కుమార స్వామి అధ్యక్షతన సిపిఎం, సీపీఐ,కాంగ్రెస్, బీసీ సంఘాల ఉమ్మడి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ర్ట నాయకులు పంజాల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వము విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీసీ లకు తీసుకువచ్చిన 42 శాతం రిజర్వేషన్ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదించకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అడ్డుపడుతూ బీసీలకు రావాల్సిన న్యాయమైన వాటలకు అన్యాయం చేస్తుందని పేర్కొన్నారు.ఈ బంద్ ద్వారా బిజెపికి బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షులు కత్తి కిరణ్ కుమార్ గౌడ్, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర నాయకులు చింతకింది కుమార స్వామి, సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గజ్జి రాజు,సిపిఎం నాయకులు గడ్డమీదీ బాలకృష్ణ, పాత్కల సుధాకర్, జినుకల సుదర్శన్, నరసింహారాములు తదితరులు పాల్గొన్నారు.

బిజెపి రిజర్వేషన్లను అడ్డుకోవడం వల్ల నే బీసీలకు అన్యాయం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-11T131713.653.wav?_=1

 

బిజెపి రిజర్వేషన్లను అడ్డుకోవడం వల్ల నే బీసీలకు అన్యాయం

రాష్ట్రంలో బీసీలు ఉద్యమానికి బిఎస్యూ సంపూర్ణ మద్దతు

బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్

పరకాల నేటిధాత్రి

 

బిజెపి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వళ్లనే హైకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టేట్ ఇచ్చారని బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద సురేష్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్బంగా సురేష్ మాట్లాడుతూ డబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇవ్వడానికి మాత్రం రాత్రికి రాత్రే నిర్ణయం తీసుకున్నారని ఉన్నంత కులాల వారి మీద ఉన్న ప్రేమ బీసీల పట్ల బిజెపి పార్టీకి లేనే లేదని స్పష్టంగా అర్థమవుతుందని బీసీ ప్రధాని న నీ చెబుతూ మోడీ బీసీలకు అన్యాయం చేస్తున్నారని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం న్యాయబద్ధమైన చర్యలన్ని తీసుకొని అన్ని రాజకీయ పార్టీలను బీసీ సంఘాలను కలుపుకొని చిత్తశుద్ధితో అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం…

కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం.

వెల్దండ/ నేటి ధాత్రి :

 

బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు విధానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసత్యాలతో, అబద్ధాలతో కాలయాపన చేస్తూ వచ్చింది అని వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి ఆరోపించారు. ఈ రోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించవలసి వచ్చినప్పుడు న్యాయ నిపుణలతో సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు హామీలు ఇవ్వాలి.కోర్టులో 42% బీసీ కోటా నిలబడదు అని తెలిసినా కూడా తమ రాజకీయ లబ్దికోసం దుందుడుకు తనంతో, దూకుడు వ్యవహారంతో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కల్పిస్తామని అమలు కాని హామీలు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి అయినట్టు అర్థమవుతుంది. స్థానిక ఎలక్షన్లు జరగకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి ఎప్పుడో అటకెక్కింది, దానితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదు. కాబట్టి ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రితో తెలంగాణకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది.కావున బీసీ ప్రజలారా ఇకనైనా మేల్కోనండి రేవంత్ రెడ్డి కుట్రా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ కోరారు.

దళితుల నివాస షెడ్డును కూల్చడం దుర్మార్గం…

దళితుల నివాస షెడ్డును కూల్చడం దుర్మార్గం.

పలమనేరు(నేటి ధాత్రి)
సెప్టెంబర్ 23:

 

 

గంగవరం మండలం కల్లుపల్లి పంచాయితీ బూడిద పల్లి గ్రామంలో ఓ దళిత కుటుంబం నివాసముంటున్న షెడ్డు ను కూల్చడం దుర్మార్గమైన చర్య అని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ జిల్లా అధ్యక్షులు డి.వి. మునిరత్నం, యువజన నాయకులు సోమరాజు, మహిళా నాయకులు రత్నమ్మ, సరస్వతి, జగదీశ్వరి అన్నారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు కార్యదర్శి మణి అధ్యక్షతన జరిగిన సంఘటనపై అత్యవసర సమావేశం నిర్వహించారుఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బూడిద పల్లి గ్రామం వద్ద అగ్రకుల, పెత్తందారులు సుమారు 16 ఎకరాల వరకు ప్రభుత్వ భూమితో పాటు దళితులకు కేటాయించిన స్మశాన భూమిని సైతం ఆక్రమించుకున్న వారిపై ఏమాత్రం చర్యలు తీసుకోకుండా దళిత కుటుంబంపై ఎందుకు అధికారులు దుర్మార్గమైన చర్యకు పాల్పడ్డారని నిలదీశారు. అదే స్థలాన్ని అగ్రకులాలు వారు ఆక్రమించుకొని ఉంటే దళితులకు కావాల్సినప్పుడు అధికారులు వారి వద్ద నుండి తీసిచ్చే సామర్థ్యం ఉందా అని మండిపడ్డారు. దళితుల షెడ్డు కూల్చివేత వ్యవహారం స్థానిక ఎమ్మెల్యేకు సన్నిహితముగా ఉన్న అధికారి కనుసన్నుల్లోనే జరిగిందని ప్రజాభిప్రాయం మేరకు అనుమానం వ్యక్తం చేశారు. ఆ అధికారి పైన ప్రజలు గతంలో ఎన్నో ఆరోపణలు చేసి ఎమ్మెల్యేకు చెడ్డ పేరు తెచ్చారని అప్పటిలో
ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేశారని గుర్తు చేశారు.ఒక సెంటు నేల కోసం దళిత కుటుంబాన్ని అవమానం చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించిన మండల తహసీల్దార్, పోలీస్ అధికారులపై ఎస్సీ ,ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు సేవకులుగా సేవ చేయాలనే సంకల్పముతో వచ్చే అధికారులు వ్యవహారం చూస్తుంటే అక్రమార్కులను వదిలి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లుగా ఉందని అభివర్ణించారుబాధిత కుటుంబానికి ప్రత్యామ్నాయంగ స్థలం కేటాయించి, రక్షణ కల్పించాలని, ఇన్ని సంవత్సరాలుగా ఆ స్థలం కోసం దళిత కుటుంబాన్ని క్షభకు గురిచేసి, మహిళ ఆత్మహత్యాయత్నానికి కారుకులైన అగ్రకుల పెత్తందారులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలన్నారుఈ కార్యక్రమంలో శివ, నారాయణ శెట్టి, సుమతి, వాణి, నాగవేణి, చిన్నా, శాంతమ్మ, సూర శ్రీనివాసులు, ఇతరులు పాల్గొన్నారు.

డీపీవో, జహీరాబాద్ డి ఎల్ పీ ఓ లపై కమీషనర్ కు పిర్యాదు.

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-16T150608.575.wav?_=2

 

*డీపీవో, జహీరాబాద్ డి ఎల్ పీ ఓ లపై పంచాయతీరాజ్ కమీషనర్ కు పిర్యాదు*

◆:- తుంకుంట – మోహన్

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

పంచాయతీలే పట్టుకొమ్మలు అనీ అందరు అనుకొంటారు. కానీ అవేవి ఈ అధికారులకు పట్టనట్టు వ్య వహరిస్తున్న తీరు పట్ల జిల్లా పంచాయతీ అధికారి మరియు జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారుల పైన రాష్ట్ర పంచాయతీరాజ్ కమీషనర్ కు పిర్యాదు చేయడం జరిగింది.ఇటీవల పెన్ గన్ మరియు అనేక ప్రత్రికలలో వారిపైన వచ్చిన కథనాలను జోడిస్తూ పిర్యాదు చేయడం జరిగింది. అంతేకాక జహీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు వారి పైన జిల్లా కలెక్టర్ కు వారిపై పిర్యాదు చేయడం జరిగింది.. అంతేకాక రాష్ట్ర ఎస్సి డెవలప్ మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై. నరోత్తమ్ వారిపై చర్యలు తీసుకోవాలని మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.

Complaint to the Commissioner

 

జహీరాబాద్ నియోజకవర్గం లో ఉన్నటువంటి దళిత సంఘాల నాయకులు సైతం ఈ అధికారుల తీరు మార్చుకోవాలని ప్రజావాణి లో పిర్యాదు చేయడం జరిగింది. ఇటీవల సస్పెండ్ అయినా ఒక బిసి కుల పంచాయతీ కార్యదర్శి కి తిరిగి కొన్ని రోజులకే పోస్టింగ్ ఇచ్చి దళిత జాతికి చెందిన పంచాయతీ కార్యదర్శి లు సస్పెండ్ అయి సంవత్సరమ్ గడిచిన నేటికీ వారికీ పోస్టింగ్ ఇవ్వడం లేదంటే ఈ అధికారులు ఎంత వివక్ష చూపితున్నారో అందరికి అర్ధం అవుతుంది.ఏ కారణం చేత అయినా సస్పెండ్ అయితే ఆరు నెలలకే తిరిగి పోస్టింగ్ ఇవ్వాలి అనీ ఆదేశాల ఉన్నప్పటికీ ఈ అధికారులు పాటించకపోవడము అందరికి విస్మయానికి గురిచేస్తుంది.అంతేకాక దళిత పంచాయతీ కార్యదర్శులపైన ఎవరైనా పిర్యాదు చేస్తే ఈ అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి అనీ రిపోర్ట్ లు పంపుతున్నారు. అదే బీసి, ఇతర పంచాయతీ కార్యదర్శులపైన పిర్యాదు చేస్తే మాత్రం పట్టింపు చేయకుండా ఉంటున్నారు అనీ కమీషనర్ పిర్యాదు లో పేర్కొనడం జరిగిందనీ తెలిపారు.ఇటీవల తుంకుంట గ్రామంలో జరిగిన ఒక ఫారెస్ట్ భూమీ పంచాయతీ లో కూడా డివిజనల్ పంచాయతీ అధికారి అయినా అమృత దళితులపైన తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అనీ పిటిషనర్ లేఖ లో పేర్కొనడం జరిగింది.

Complaint to the Commissioner

 

దళితులకు రావాల్సిన భూమినీ రాకుండా తప్పుడు రిపోర్ట్ లు ఇచ్చిన డి ఎల్ పీ ఓ మరియు డి పి ఓ పైన చర్యలు చేసుకొని మా తుంకుంట దళితులకు న్యాయం జరిగే వరుకు పోరాడుతనాని తెల్పడము జరిగింది.అంతేకాక జిల్లాలో దళితులపైన జరుగుతున్న వివక్షత పైన రాష్ట్ర ఎస్సి ఎస్టీ కమిషన్ కు కూడా పిర్యాదు చేస్తానాని దళితుల అభ్యునతి కొరకు పాటుపడుతనాని తెల్పడం జరిగింది.జహీరాబాద్ నియోజకవర్గం లో డివిజనల్ పంచాయతీ కార్యాలయం లేక సమస్యలు చెప్పుకోవడానికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారానీ తెలిపారు. వెంటనే డివిజనల్ పంచాయతీ కార్యాలయం ఏర్పాటు చేసి, గ్రామాలలో నెలకొన్న సమస్యలపైన ద్రుష్టి పెట్టి ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండేటట్లు చేయాలనీ పంచాయతీ రాజ్ కమీషనర్ కు తెల్పడం జరిగిందనీ తెలిపారు. ఇప్పటికైనా ఈ అధికారుల తీరు మారకుంటే ముఖ్యమంత్రి కి పిర్యాదు చేస్తానని తెల్పడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లంబాడి లపై అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదు

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు లంబాడి లపై అసత్య ప్రచారం చేస్తే సహించేదిలేదు

◆:- లంబాడి హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్ పవర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ లో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా కార్యదర్శి గోపాల్ పవర్ మాట్లాడుతూ బంజారా లంబాడిలు సింధు నాగరికత కాలం నుండే ఈ దేశ ములనివాసులు భారత దేశ స్వాతంత్రానికి ముందే గిరిజనులుగా గుర్తింపు పొందినము, 1871లో బ్రిటిష్ పాలకులు బంజారాలను క్రిమినల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు, 1931 లో నిజాం రాజులు చేపట్టిన కులగణన లో బంజారా లంబాడిలను గిరిజనుల పట్టికలో చూపించారు 1956 లో ఆంధ్రప్రదేశ్ రాష్టం ఏర్పడినప్పుడు ఆంధ్ర ప్రాంతంలోని లంబాడిలు, సుగాలిలను భారత పార్లమెంట్ ఉభయశభల ఆమోదం తో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ లిస్ట్ ఆర్డర్ – 1956 ప్రకారం గిరిజనులుగా గుర్తింపు పొంది గిరిజన జాబితాలో సీరియల్ నెంబర్ 19 గా చేర్చాబడ్డారు అయితే ఒకే రాష్టంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన గిరిజన లంబాడిలను సుమారు 25 సమ త్సరాలు గిరిజన జాబితాలో చేర్చకపోవడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ లంబాడిలను ఘోరమైన అన్యాయం చేసింది అని అన్నారు,1969 కే చందా అధ్యక్షతన వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ ఆధారంగా నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ గారి నెత్రు త్వంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఉభయ సభ ల ఆమోదం తో ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్ ట్రైబ్స్ (సవరణ) యాక్ట్ 1976 (యాక్ట్ no 108 of1976)తేదీ :సెప్టెంబర్ 19, 1976 చట్టం చేసి తెలంగాణ ప్రాంతానికి చెందిన లంబాడిలను గిరిజన జాబితాలో స

క్రమ సంఖ్య 29 గలో చేర్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ గారు గత శాసన సభ ఎన్నికల్లో లంబాడిల ఓట్లతోనే కాంగ్రెస్ పార్టీ తాను గద్దెనెక్కనని అనేక సభలలో ప్రకటించారు. కానీ 2017 లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ప్రాంతంలో హింసత్మక ఘటనకు పాల్పడిన సోయం బాబురావు, తెల్లం వెంకట్రావు లను కాంగ్రెస్ పార్టీ లోకి చేర్చుకున్నారు. తేదీ 24/07/2025 నా వీరిద్దరూ లంబాడిలను గిరిజన జాబితా నుండి తొలగించాలని రిట్ ఫిటిషన్ దాఖాలు చేశారు.ఇది కాంగ్రెస్ పార్టీ ఆదేశాల ప్రకారమే జరిగిందా..? దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డీ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ లంబాడిలకు సమాధానం చెప్పాలన్నారు. దీనిపై బి ఆర్ ఎస్, బీజేపీ ల వైఖరి కూడా ఎటువైపో..? సమాధానం చెప్పాలి అని అన్నారు ఈ కార్యక్రంలో జిల్లా, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు,

శాంతియుతంగా ఎమ్మెల్యే కార్యాలయానికి ముట్టడించిన మాలమహానాడు నాయకులు

శాంతియుతంగా ఎమ్మెల్యే కార్యాలయానికి ముట్టడించిన మాలమహానాడు నాయకులు

జీవో 99గురించి అసెంబ్లీలో చర్చించాలని వినతిపత్రం అందజేత

పరకాల నేటిధాత్రి

జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ పిలుపుమేరకు ఎస్సీ వర్గీకరణలో భాగంగా గ్రూప్ 3 లో ఉన్న 26 కులాల మాలలకు అన్యాయం చేసే విధంగా జీవో 99లో భాగమైన ఎమ్మెల్యేలను ఇట్టి జీవో 99 పై పునరాలోచన చేసి అసెంబ్లీలో చర్చించి మాలలకు న్యాయం చేకూర్చలని సోమవారం జాతీయ మాల మహానాడు పరకాల నియోజకవర్గ ఇన్చార్జ్ మరియు పరకాల పట్టణ అధ్యక్షులు బండారి గిరి ప్రసాద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని శాంతియుతంగా ముట్టడి కార్యక్రమం చేపట్టారు.ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అందుబాటులో లేని సందర్భంగా స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ రాజి రెడ్డికి మరియు పట్టణ అధ్యక్షులు కొయ్యడ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేసి జీవో 99పై పునరాలోచన చేసేవిధంగా సమాచారాన్ని అందజేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి నీరటి రాములు,రాష్ట్ర కార్యదర్శి తుప్పరి నరసింహస్వామి,జిల్లా నాయకులు పసుల లక్ష్మీనారాయణ,గీసుకొండ మండల అధ్యక్షులు నాంపల్లి శ్రీనివాస్,ఆత్మకూరు మండల ఉపాధ్యక్షులు న్యాతకాని వనం,మాల మహానాడు నాయకుడు దుబాసి వెంకటస్వామి,జిల్లా నాయకులు తుప్పరి నర్సింగా రావు,పరకాల పట్టణ మాల మహానాడు ఉపాధ్యక్షులు బండారినాగార్జున,అంకేశ్వరపు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-01T112233.101.wav?_=3

 

ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష???

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జిల్లా ఇంచార్జి మంత్రి దళితుడే.. ఆరోగ్య శాఖ మరియు జిల్లా మంత్రి మంత్రిదళితడే, నియోజకవర్గం శాసనసభ్యులు దళితుడే కానీ దళితలంటే ఈ అధికారులకు గిట్టదు..

ఎస్సి నియోజకవర్గం లో ఎస్సి ఉద్యోగుల పైన ఆ అధికారికి ఎందుకంత వివక్ష జిల్లా డీ పీ ఓ, మరియు డివిజనల్ పంచాయతీ అధికారి తీరు ఇలా ఉన్నందున తక్షణమే ఈ అధికారుల పైన చర్యలు తీసుకొనేలా చేయాలనీ జహీరాబాద్ నియోజకవర్గం

 

 

శాసనసభ్యులకు మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ చెంద్రశేఖర్ లకు దళిత సంఘాల విజ్ఞప్తి చేస్తున్నవి.నెలరోజులు గడవక ముందే సస్పెండ్ అయినా తుంకుంట పంచాయతీ కార్యదర్శి కి వెంటనే పోస్టింగ్ ఇవ్వడం ఎస్. సి కార్యదర్శి లు సస్పెండ్ అయి ఆరు నెలలు గడిచిన నేటికీ పోస్టింగ్ లు ఇవ్వకపోవడం పైన దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దళితుల పైన వివక్ష చూపడం జహీరాబాద్ డివిజనల్ పంచాయతీ అధికారికి తగదని దళిత సంఘాలు హెచ్చరిస్తున్నారు. అన్ని డివిజనల్ కార్యాలయాలు నియోజకవర్గం లో ఉన్నపుడు డీ ఎల్ పీ ఓ కు ఎందుకు కార్యాలయం ఉండదని కోరుతున్నారు.బి సి లకు ఒక న్యాయం ఎస్ సి లకు ఒక న్యాయమా అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇప్పటికైనా డీ పీ ఓ మరియు డీ ఎల్ పీ ఓ తీరు మార్చుకోకుంటే జిల్లా వ్యాప్తంగా ఉద్యమం తప్పదని

 

హెచ్చరించారు.ప్పాంపాడ్, రాయికోడ్, ఖర్చల్, ఇందూర్, హస్నాబాద్,ఉల్గేరా, రాయి పల్లి, కుస్ నూర్, రాఘవాపుర్, చాల్కి,డప్పుర్, రత్నపూర్, చిక్కుర్తి, రత్నపూర్, ఉసెల్లి, మొగుడం పల్లి, పార్వతపూర్, దనసిరి, సత్వర్, సరిహద్దు తండాలు, సజ్జపూర్, బిళ్ల్పూర్, గోటిగార్పల్లి, శేఖపూర్, జిర్లపల్లి, ఏడాకులపల్లి, గుంతమర్పల్లి, ఝరాసంగం,కంబాలపల్లి, సిద్ధపూర్, గణేశపూర్ బీదర్ సరిహద్దు గ్రామాలు ఎన్నో తీరుగాల్సిన డీ ఎల్ పీ ఓ కేవలం హైవే పైన ఉన్న గ్రామాలు మాత్రమే తిరుగుతు కార్ ట్యాంక్ ఫుల్, బ్యాగ్ ఫుల్ చేసుకొంటూ కార్యదర్శి ల జెబులు నిల్ చేస్తున్నట్టు సమాచారం ఉంది. డ్రైవర్ కి ఫోన్ పే ద్వారా డబ్బులు వసూలు చేస్తూ మరి ముఖ్యంగా దళిత కార్యదర్శి లపైన టార్గెట్ చేస్తున్నారనీ అందరు కార్యదర్శి లు ఆందోళన చెండుతున్నారు. ఇలాంటి అధికారి పైన వెంటనే చర్యలు తీసుకోవాలి దళిత సంఘాలు కోరుతున్నాయి. నియోజకవర్గం శాసనసభ్యులు మరియు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మాజీ మంత్రి డాక్టర్ చెంద్రశేఖర్ చోరువ తీసుకొని ఆ అధికారి తీరు మారేటట్టు చూడాలని దళిత సంఘాలు కోరుకొంటున్నారు.

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-18T175746.314.wav?_=4

సర్పంచ్ బరిలో ఉంటాడని తెలిసే మహేష్ పై దాడి.

తీన్మార్ మల్లన్న బిసి జేఏసీ రవి పటేల్.

చిట్యాల, నేటిధాత్రి :

 


 

 

సోమవారం రోజున చిట్యాల మండల కేంద్రంలో
తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ రవి పటేల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూచిట్యాల మండలం కల్వపల్లి గ్రామానికి చెందిన పంచిని మహేష్ యాదవ్ పైన ఆగస్టు 15 రోజున అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు మహేష్ భార్య పిల్లలు వారి మామ ఇతరులపై దాడి చేశారని బిసి పొలిటికల్ జేఏసీ నీ కలవడం జరిగింది, మహేష్ పై భౌతిక దాడులు సమంజసం కాదని ఒక బీసీ యాదవ బిడ్డను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కొట్టడం బీసీ పొలిటికల్ జేఏసీ తీవ్రంగా ఖండిస్తున్నాం
గుడికి సంబంధించింది గానీ ఏదైనా సమస్య ఉంటే పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలి గాని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు
మహేష్ యాదవ్ కాల్వపల్లి గ్రామానికి సర్పంచిగా పోటీ చేస్తాడని అక్కస్సుతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు అగ్రవర్ణాలు అని మా దృష్టికి రావడంతో మహేష్ ను తీన్మార్ మల్లన్న బీసీ పొలిటికల్ జేఏసీ నుండి సర్పంచి అభ్యర్థిగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో నిలబెట్టడానికి మేము కార్యచరణ తీసుకొని కాల్వపల్లి లో మహేష్ యాదవ్ ను గెలిపించుకుంటామని
రవి పటేల్ అన్నారు ఈ కార్యక్రమంలో
రోడ్డ శ్రీను ప్రణీత్ వెంకటేష్ అఖిల్ సమిరెడ్డి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

30 వార్డు విభజనలో అన్యాయం.

30 వార్డు విభజనలో అన్యాయం

అఖిలపక్ష ఐక్యవేదిక.

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి 30 వ వార్డులో అఖిలపక్ష ఐక్యవేదిక తరుపున వార్డు ను పరిశీలించామని
మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ తెలిపారు
వనపర్తి లో ఉన్న ఇంజనీరింగ్ అధికారులు ప్రభుత్వ నిధులను ఉపయోగించకుండా కొందరి సలహా హాలు తీసుకుని రోడ్లు వేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సతీష్ ఎమ్మెల్యే ను అధికారులను కోరారు
వార్డు విభజనలో 30 వార్డును అన్యాయంగా 5 వార్డులను చీల్చి ఒక వార్డుగా చేశారని దానివల్ల వార్డు అభివృద్ధి కి నోచుకోవడం లేదని అన్నారు జంగిడి పురం మర్రిచెట్టు అనూస్ స్కూల్ రోడ్డు గుంతలు ఏర్పడి ఈ రోడ్డు వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి ఇంటి.వరకు లింకు ఉన్నదని, సివి రామన్ కాలేజ్ కింది నుండి నాగవరం పోయే రోడ్డు మొత్తం దెబ్బతిన్నదని
స్విమ్మింగ్ పూల్ దగ్గర రెండు రోడ్లు ఇంతవరకు వేయలేద నివెంటనే సిసి రోడ్లు వేయాలని 30వ వార్డు ప్రజల తరఫున అధికారుల ను ఎమ్మెల్యే ను కోరారు 30 వార్డు ను పరిశీలించిన వారిలో వెంకటేశ్వర్లు తెలుగుదేశం కొత్తగొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్, రామస్వామి నాగరాజూ, రమేష్ ముదిరాజ్ గార్డుల శీను వార్డు ప్రజలు ఉన్నరని సతీష్ యాదవ్ తెలిపారు

దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు

దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు…

70 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి…

నేటి ధాత్రి మహబూబాబాద్:

గార్ల మండలం,మద్ది వంచ రెవెన్యూ పరిధిలో 116 మరియు 119 సర్వే నెంబర్లలో 900 ఎకరాల ప్రభుత్వ భూమిని 70 సంవత్సరాల పైగా గిరిజన, గిరిజనేతర పేద రైతులు సేద్యం చేసుకొని జీవిస్తున్నారని,అట్టి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎం -ఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు.మద్దివంచ రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులు తాము దశాబ్దాలుగా సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలివ్వాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం -ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ, మద్దివంచలో సగానికి పైగా ప్రభుత్వ భూములే ఉన్నాయని,అనాదిగా పేద రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు వారికి పట్టాలివ్వలేదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వాధికారుల వైపు నుండి జరిగిన వైఫల్యమేనని అన్నారు.116,119 సర్వే నెంబర్ల లోని భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి రుణ సౌకర్యాలు కానీ, రైతుబంధు రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలు గాని అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో మాన్యువల్ పహణీల ద్వారా రైతులు బ్యాంకుల నుండి పంట రుణాలు తీసుకున్నారని ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత పహణీ నకళ్ళు రాకపోవడంతో వారికి రుణమాఫీ కూడా జరగడం లేదని ఆయన అన్నారు.ప్రస్తుత రెవెన్యూ సదస్సులలో ఈభూముల పట్టాల కోసం రైతులు పెట్టుకొంటున్న దరఖాస్తులను కూడా అధికారులు తీసుకోవటం లేదని అన్నారు.116,119 సర్వే నెంబర్లలో సాగులో వున్న గిరిజన,గిరిజనేతర,పేద రైతులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాధికారులు స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ప్రతినిధి బృందం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు విజ్ఞాపన పత్రం సమర్పించారు.ఈకార్యక్రమంలో న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి గుగులోత్ సక్రు,ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి శివ్వారపు శ్రీధర్,పీడియస్యూ జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, మద్దివంచ మాజీ సర్పంచ్ కుసిని బాబూరావు, పార్టీ డివిజన్ నాయకులు గౌని భద్రయ్య, ఏఐకేఎంఎస్ నాయకులు ముండ్ల రంగారావు,గౌని మల్లేశ్,పెసా కమిటీ చైర్మన్ దారావత్ భావ్ సింగ్,రైతులు నల్లబెల్లి అప్పయ్య,గౌడి మంగయ్య, బాడిశ వెంకటేశ్వర్లు, మహ్మద్ అబ్రార్,పకీర్ మహ్మద్, చిటాకుల రాములు,బాడిశ జయమ్మ,నల్లబెల్లి చంద్రయ్య, దారవత్ రవి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్

పరకాల నేటిధాత్రి

 

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్ విమర్శించారు.ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు అందిస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని,చాలామంది పేదలకు ఇండ్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయిందని,ఇందిరమ్మ కమిటీలు నియమించినప్పటికీ అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి ఇండ్లు కూడా వారికే ఇచ్చారని,గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ లు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించినట్లుగానే,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చి పేదలకు అన్యాయం చేసిందని,పట్టణంలోని రెండో వార్డులో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండానే,కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని తెలిపారు.కార్యకర్తల కొరకు లబ్ధి చేకూర్చడం కోసమే తీసుకొచ్చిన పథకాలను ప్రజల లబ్ధి కోసమే ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతిని స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం –

 

బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్స్ మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాదిన్నర అవుతున్న కూడా ఒక్క మినిస్ట్రీ కూడా మైనార్టీ వర్గానికి ఎందుకు కేటాయించలేదు అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.

 

దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటుందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మరియు మైనార్టీ వారి పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉందోనని దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

 

ఇది వారి వర్గానికి అన్యాయం చేయడమే అవుతుంది అని జ్యోతి పండాల్ అన్నారు.

 

మైనారిటీ వర్గం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా చిన్న చూపు మరియు వివక్ష చూపిస్తుందని జ్యోతి పండాల్ అన్నారు.

 

సెంట్రల్ లో ఉన్న మా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ అమలు చేసి అట్టడుగు వర్గాల మైనార్టీ వాళ్ళని ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను.

 

రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 నాటికే ఇల్లు లేని వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 14 లక్షలు పైగా ఇండ్లని ముస్లిం మైనారిటీలకు కేటాయించడం జరిగింది.

 

అలాగే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎవరైతే డబ్బులు పెట్టుకొని చదువుకో లేని స్థితిలో ఉంటారో వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇలా అన్ని వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటుంది మా బిజెపి ప్రభుత్వం.

 

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మైనార్టీలను మభ్యపెట్టి ఎలక్షన్ టైం లో వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పైన చిన్నచూపు చూసి వాళ్ళని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ అన్నారు.

 

కావున కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీల పట్ల వివక్షత, చిన్న చూపు మరియు కించపరిచేలా ప్రవర్తించవద్దని జ్యోతి పండాల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version