దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు

దశాబ్దాలుగా అన్యాయానికి గురవుతున్నారు రైతులు…

70 సంవత్సరాలుగా సేద్యం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలి…

నేటి ధాత్రి మహబూబాబాద్:

గార్ల మండలం,మద్ది వంచ రెవెన్యూ పరిధిలో 116 మరియు 119 సర్వే నెంబర్లలో 900 ఎకరాల ప్రభుత్వ భూమిని 70 సంవత్సరాల పైగా గిరిజన, గిరిజనేతర పేద రైతులు సేద్యం చేసుకొని జీవిస్తున్నారని,అట్టి భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని సిపిఐ ఎం -ఎల్ న్యూ డెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య డిమాండ్ చేశారు.మద్దివంచ రెవెన్యూ గ్రామ పరిధిలోని రైతులు తాము దశాబ్దాలుగా సాగు చేసుకొంటున్న భూములకు పట్టాలివ్వాలని కోరుతూ శుక్రవారం మహబూబాబాద్ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.ఈధర్నా నుద్దేశించి సీపీఐ ఎం -ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ, మద్దివంచలో సగానికి పైగా ప్రభుత్వ భూములే ఉన్నాయని,అనాదిగా పేద రైతులు ఆ భూములను సాగు చేసుకుంటున్నప్పటికీ ఇప్పటివరకు వారికి పట్టాలివ్వలేదని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వాధికారుల వైపు నుండి జరిగిన వైఫల్యమేనని అన్నారు.116,119 సర్వే నెంబర్ల లోని భూములను సాగు చేసుకుంటున్న రైతులకు ఎలాంటి రుణ సౌకర్యాలు కానీ, రైతుబంధు రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలు గాని అమలు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో మాన్యువల్ పహణీల ద్వారా రైతులు బ్యాంకుల నుండి పంట రుణాలు తీసుకున్నారని ఇప్పుడు డిజిటలైజేషన్ అయిన తర్వాత పహణీ నకళ్ళు రాకపోవడంతో వారికి రుణమాఫీ కూడా జరగడం లేదని ఆయన అన్నారు.ప్రస్తుత రెవెన్యూ సదస్సులలో ఈభూముల పట్టాల కోసం రైతులు పెట్టుకొంటున్న దరఖాస్తులను కూడా అధికారులు తీసుకోవటం లేదని అన్నారు.116,119 సర్వే నెంబర్లలో సాగులో వున్న గిరిజన,గిరిజనేతర,పేద రైతులందరికీ పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వాధికారులు స్పందించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ప్రతినిధి బృందం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు విజ్ఞాపన పత్రం సమర్పించారు.ఈకార్యక్రమంలో న్యూడెమోక్రసీ గార్ల మండల కార్యదర్శి గుగులోత్ సక్రు,ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి శివ్వారపు శ్రీధర్,పీడియస్యూ జిల్లా కార్యదర్శి బోనగిరి మధు, మద్దివంచ మాజీ సర్పంచ్ కుసిని బాబూరావు, పార్టీ డివిజన్ నాయకులు గౌని భద్రయ్య, ఏఐకేఎంఎస్ నాయకులు ముండ్ల రంగారావు,గౌని మల్లేశ్,పెసా కమిటీ చైర్మన్ దారావత్ భావ్ సింగ్,రైతులు నల్లబెల్లి అప్పయ్య,గౌడి మంగయ్య, బాడిశ వెంకటేశ్వర్లు, మహ్మద్ అబ్రార్,పకీర్ మహ్మద్, చిటాకుల రాములు,బాడిశ జయమ్మ,నల్లబెల్లి చంద్రయ్య, దారవత్ రవి తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

ఇందిరమ్మ ఇళ్లలో అర్హులైన వారికి అన్యాయం

సిపిఎం పట్టణ నాయకులు మడికొండ ప్రశాంత్

పరకాల నేటిధాత్రి

 

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని సిపిఎం నాయకులు మడికొండ ప్రశాంత్ విమర్శించారు.ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు అందిస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు ఇవ్వడం జరుగుతుందని,చాలామంది పేదలకు ఇండ్లు వస్తాయని ఆశించినప్పటికీ నిరాశ ఎదురయిందని,ఇందిరమ్మ కమిటీలు నియమించినప్పటికీ అందులో కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి ఇండ్లు కూడా వారికే ఇచ్చారని,గత ప్రభుత్వం కూడా డబుల్ బెడ్ రూమ్ లు బిఆర్ఎస్ కార్యకర్తలకు కేటాయించినట్లుగానే,కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇందిరమ్మ ఇండ్లు కార్యకర్తలకే ప్రాధాన్యత ఇచ్చి పేదలకు అన్యాయం చేసిందని,పట్టణంలోని రెండో వార్డులో అర్హులైన నిరుపేదలకు ఇండ్లు ఇవ్వకుండానే,కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చుకున్నారని తెలిపారు.కార్యకర్తల కొరకు లబ్ధి చేకూర్చడం కోసమే తీసుకొచ్చిన పథకాలను ప్రజల లబ్ధి కోసమే ఇస్తున్నామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ఇప్పటికైనా ప్రభుత్వము ప్రజాప్రతిని స్పందించి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్.

మైనార్టీ వర్గానికి అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం –

 

బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

 

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా

కాంగ్రెస్ పార్టీ మైనార్టీ ఓట్లతోనే గెలుస్తుందని చెప్పుకునే కాంగ్రెస్ లీడర్స్ మరి అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయి ఏడాదిన్నర అవుతున్న కూడా ఒక్క మినిస్ట్రీ కూడా మైనార్టీ వర్గానికి ఎందుకు కేటాయించలేదు అని జ్యోతి పండాల్ ప్రశ్నించారు.

 

దీన్ని బట్టి చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీ వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటుందని చాలా చాలా స్పష్టంగా అర్థమవుతుందని మరియు మైనార్టీ వారి పట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ కి ఎంత చిత్తశుద్ధి ఉందోనని దీన్ని చూసి అర్థం చేసుకోవచ్చు.

 

ఇది వారి వర్గానికి అన్యాయం చేయడమే అవుతుంది అని జ్యోతి పండాల్ అన్నారు.

 

మైనారిటీ వర్గం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చాలా చిన్న చూపు మరియు వివక్ష చూపిస్తుందని జ్యోతి పండాల్ అన్నారు.

 

సెంట్రల్ లో ఉన్న మా బీజేపీ ప్రభుత్వం ముస్లిం మైనారిటీ వాళ్ళ కోసం చాలా స్కీమ్స్ అమలు చేసి అట్టడుగు వర్గాల మైనార్టీ వాళ్ళని ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను.

 

రెండు సంవత్సరాల క్రితం అంటే 2022 నాటికే ఇల్లు లేని వాళ్ళ కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 14 లక్షలు పైగా ఇండ్లని ముస్లిం మైనారిటీలకు కేటాయించడం జరిగింది.

 

అలాగే ముస్లిం మైనారిటీ విద్యార్థులు ఎవరైతే డబ్బులు పెట్టుకొని చదువుకో లేని స్థితిలో ఉంటారో వారి కోసం ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్, అండర్ గ్రాడ్యుయేట్స్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇలా అన్ని వర్గాల విద్యార్థులకు స్కాలర్షిప్స్ ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటుంది మా బిజెపి ప్రభుత్వం.

 

కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు మైనార్టీలను మభ్యపెట్టి ఎలక్షన్ టైం లో వాళ్ళ ఓట్లను దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పైన చిన్నచూపు చూసి వాళ్ళని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ అన్నారు.

 

కావున కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని ఓట్లు వేసిన ముస్లిం మైనారిటీల పట్ల వివక్షత, చిన్న చూపు మరియు కించపరిచేలా ప్రవర్తించవద్దని జ్యోతి పండాల్ కాంగ్రెస్ ప్రభుత్వం పై మండిపడ్డారు.

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం.!

బడ్జెట్ కేటాయింపుల్లో బీసీలకు తీరని అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం

-బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ ఆరోపించారు. గురువారం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3,04,965 కోట్ల మొత్తం బడ్జెట్లో 56 శాతం పైగా ఉన్న బీసీలకు కేవలం ముష్టి వేసినట్లు 3.6 శాతం రూ.11,405 ఓట్లు కేటాయించి బీసీలను అవమానపరిచారని ఆయన మండిపడ్డారు. బీసీలకు కేటాయించిన ఈ బడ్జెట్ బీసీలకు ఏ విధంగా..ఏ మేరకు..ఏ మూలకు సరిపోతాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు చెప్పాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో మరియు విద్యా, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తామని అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదింప చేసిన మీరు..బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ఎందుకింత వివక్షత చూపుతున్నారని ప్రశ్నించారు. బడ్జెట్లో బీసీలకు ఇంత తక్కువ నిధులు కేటాయించడంలో ఆంతర్యం ఏమిటని..ఇది వివక్షత కాదా..? అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం బీసీలకు 20 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం సరికాదన్నారు. బడ్జెట్ ను సవరించైనా సరే బీసీలకు బడ్జెట్ పెంచాలని మహేందర్ గౌడ్ డిమాండ్ చేశారు.

మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం.!

మా ప్రాంతానికి తీవ్ర అన్యాయం..

—కె.మాణిక్ఆవు, ఎమ్మెల్యే, జహీరాబాద్

జహీరాబాద్. నేటి ధాత్రి:

సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథ కాలకు బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం అన్యాయం. కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా రైతులకు అన్యాయం చేస్తున్నది. సంగమే శ్వర ఎత్తిపోతల పథకంతో జహీరాబాద్ నియోజకవర్గంలోని జహీరా బాద్, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, మొగు డంపల్లి మండలాల పరిధిలోని 115 గ్రామా ల్లోని 1,03,259 ఎకరాలకు సాగు నీరందిం చేందుకు లక్ష్యంగా పెట్టుకుని బీఆర్ఎస్ హయాంలో భూమి పూజ చేశాం. మునిపల్లి మండలంలోని చిన్నచల్మెడలో పంపుహౌస్ కోసం భూమి పూజ చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంగమేశ్వర ఎత్తిపోతల పథ కాన్ని అడ్డుకుంటున్నది. వెనుకబడిన ప్రాంతంపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నది. అనేకసార్లు దీనిపై అసెంబ్లీలో విజ్ఞప్తి చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. జహీరాబాద్ ప్రాంత నిరుద్యోగు లకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు పరిశ్రమల ఏర్పాటు కోసం భూసేకరణ చేపడుతున్న నిమ్స్ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.

రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యం కలి గిన రంగాలకు నిధులు కేటా యింపు ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా వ్యవసాయం, పారిశ్రా మిక రంగం, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర బలహీనవర్గాలకు కేటాయింపులు తగ్గాయి. ప్రస్తుతం ఇచ్చిన నిధులతోనైనా సకాలంలో పనులు చేపడితేనే ప్రజలకు ప్రయోజనం కలుగు తుంది. జహీరాబాద్ నియోజకవర్గంలో నిష్ణా ప్రాజెక్టు తోపాటు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధు లను విస్మరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version