రామడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సిపి గౌష్ ఆలం.

రామడుగు పోలీస్ స్టేషన్ ను పరిశీలించిన సిపి గౌష్ ఆలం

రామడుగు నేటిధాత్రి:

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ ను కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ ఎస్పై రాజు కమిషనర్ కు పూల మొక్కను అందించి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ఆఫ్ హానర్ ను స్వీకరించారు. ఈసందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది నిర్వహించిన పరేడ్, లాఠీ పరేడ్ ను పర్యవేక్షించారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన కమిషనర్, కేసుల్లో స్వాధీనమైన వాహనాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్టేషన్లో విధుల్లో ఉన్న సిబ్బందితో ముఖాముఖి చర్చలు జరిపారు. కేసుల నమోదు, సీసీటీఎన్ఎస్ 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సమన్లు, టీఎస్ కాప్, హెస్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్ కేసుల దర్యాప్తు కోసం వినియోగించే టెక్ డాటం వంటి సాంకేతిక వ్యవస్థలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు కేటాయించిన ఫింగర్ ప్రింట్ డివైస్ వినియోగాన్ని బ్లూకోల్ట్స్ సిబ్బంది చేత పరిశీలించారు. అలాగే ఎఫ్ఎఆర్ ఇండెక్స్, పెండింగ్ కేసులపై సమీక్ష చేసి వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రామడుగు మండలంలోని గ్రామాలను సెక్టార్లు, సబ్ సెక్టార్లుగా విభజించి గ్రామ పోలీసు అధికారులను నియమించాలని సూచించారు. కోత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు రికార్డు నిర్వహణ, కోర్టు డ్యూటీ, బీట్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సమన్లు తదితర విధులపై పూర్తిస్థాయి అవగాహన కలిగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. విధుల్లో నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని స్పష్టం చేశారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, వారి కదలికలను నిరంతరం గమనిస్తూ తాజా సమాచారం సేకరించాల్సిన అవసరం ఉందని కమిషనర్ ఆదేశించారు. ఈకార్యక్రమంలో రూరల్ ఏసీపీ శుభం ప్రకాష్, చొప్పదండి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, రామడుగు ఎస్పై రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

రామడుగులో “భూ” బకాసురులు

రామడుగులో “భూ” బకాసురులు

 

అధికారుల అండదండలతో చెలరేగిపోతున్న కబ్జా రాయుళ్లు

మండలంలోని ఒక గ్రామంలో కొత్తదంద మొదలైంది

 

హద్దులు పెట్టరు మోఖా ఉండరు

 

కోట్లు చేతులు మారుతున్న వైనం.

కోనుగోలు చేసి ఖాస్తు చేస్తున్న అమాయక ప్రజల భూములను కబ్జా చేయాలనుకుంటున్న వైనం

 

రహదారులను సైతం పట్టా చేసిన వైనం

 

తప్పు చేసింది ఒకరైతే బలాయ్యేది అమాయక ప్రజల?

వారంలోనే హద్దులు పూర్తిస్థాయిలో మారుతున్న వైనం

 

వీరికి సహకరిస్తున్న మండల రెవెన్యూ అధికారులు

 

ఒకే హద్దులతో రెండు డాక్యుమెంట్ ఎలా వచ్చాయి?

పూర్తి వివరాలతో త్వరలో మీ “నేటిధాత్రి”లో

నూతన వధూవరులను ఆశీర్వదించిన.!

నూతన వధూవరులను ఆశీర్వదించిన రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు

రామడుగు, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన కంకణాల లక్ష్మీపతి రమాదేవి దంపతుల కుమారుడు చంద్రశేఖర రావు మధుప్రియల వివాహా మహోత్సవ వేడుక(అన్విత గార్డెన్స్ కరీంనగర్) లో జరగగా ఆవేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వరరావు. ఈవివాహ మహోత్సవ వేడుకలో బిఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు ఎల్లా జగన్మోహన్ రెడ్డి, సత్యనారాయణ, శనిగారపు అనిల్ కుమార్, తదితరనాయకులు పాల్గొన్నారు.

విచారణకు వచ్చిన అధికారులు

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ విషయమై వార్డు సభ్యులు ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుపై విచారణకు వచ్చిన డిఎల్పివో హరికిషన్. ఈసందర్భంగా వార్డు సభ్యుల వాంగ్మూలాలను, గ్రామ ప్రజలు వాంగ్మూలాలను తీసుకోవడం జరిగినది. ఈకార్యక్రమంలో ఆర్ఐ రజని, ఎంపిడివో భాస్కర్ రావ్, ఎంపివో రాజశేఖర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, డిఇ లచ్చయ్య, ఎఈ సచిన్, పంచాయతీ కార్యదర్శి పాషా, ఎంపిటిసిలు ఎడవెల్లి నరేందర్ రెడ్డి, కరుణశ్రీ పాపిరెడ్డి, మండల కోఆప్షన్ సభ్యులు రజబ్ ఆలీ, ఉపసర్పంచ్ ఎడవెల్లి మదుసుదన్ రెడ్డి, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version