150 ఏళ్లస్మారకోత్సవాలలొ పాల్గొన్న జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T153234.560.wav?_=1

 

150 ఏళ్లస్మారకోత్సవాలలొ పాల్గొన్న జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి.

చిట్యాల, నేటిదాత్రి :

 

వందేమాతరం జాతీయ గేయం 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్మారకోత్సవాల భాగంగా చిట్యాల మండలంలో బిజెపి మండల అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత బెంగాలీ సాహితీవేత్త *శ్రీ బంకింఛంద్ర చటర్జీ రచించిన జాతీయ గీతం “వందేమాతరం”*ను విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గళమెత్తి గీతాలాపనం చేయడంతో వేదిక మొత్తం దేశభక్తి జయజయధ్వానాలతో మార్మోగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లాబిజెపి అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ మాట్లాడుతూ
వందేమాతరం గేయం భారత స్వాతంత్ర్య సమరంలో ప్రజలకు స్ఫూర్తిదాయకంగా మారి, దేశవ్యాప్తంగా ఉద్యమాలకు ప్రేరణనిచ్చిందని తెలిపారు. “వందేమాతరం కేవలం ఒక గీతం కాదు; ఇది భారత మాత పట్ల ప్రేమను, గౌరవాన్ని, ఐక్యతను వ్యక్తం చేసే ఒక మహోన్నత మంత్రం” అని అన్నారు,అనంతరం బిజెపి మండలం అధ్యక్షులు బుర్ర వేంకటేష్ గౌడ్ మాట్లాడతూ
వందేమాతరం గీతం భారతీయులలో జాతిగౌరవాన్ని పెంపొందించే శక్తి అని, ఇది మనందరికీ ఒక స్ఫూర్తి, ఒక శక్తి, ఒక మంత్రము అని చెప్పారు. ఈ గేయం స్వాతంత్ర్య సమరంలో ప్రజల మనసుల్లో ధైర్యం పెంచి, బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడే జోశ్ నింపిందని వివరించారు. ఈ గేయం అన్ని వర్గాల ప్రజల హృదయాలను ఏకం చేసి, దేశ ఐక్యతను బలపరిచిన చరిత్ర ఉందని గుర్తుచేశారు.ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, సమాజానికి సేవ చేయాలనే భావన, దేశం కోసం మంచి చేయాలనే తపనలను పెంపొందిస్తాయని తెలిపారు. యువతలో జాతీయ భావాన్ని బలపరిచేందుకు వందేమాతరం వంటి స్ఫూర్తిదాయక గేయాలు తరతరాలకు మార్గదర్శకాలు అవుతాయని అన్నారు.
కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు చెక్క నరసయ్య మండల మొగిలి గజనాల రవీందర్ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాలరాజు ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తీగల జగ్గయ్య జిల్లా కార్యదర్శి సుదగాని శ్రీనివాస్ బిజెపి సీనియర్ నాయకులు గుండ సురేష్ మల్లేష్ టేకుమట్ల మండలాధ్యక్షుడు గుర్రపు నాగరాజు మండల ప్రధాన కార్యదర్శి రావుల రాకేష్ అశోక్ చారి నగవత్ పూర్ణ సారంగ పని అశోక్ చింతల రాజేందర్ కేంసారపు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

వందేమాతర గీతం ప్రచురించి నేటికి 150 సంవత్సరాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-21T160234.230.wav?_=2

 

వందేమాతర గీతం ప్రచురించి నేటికి 150 సంవత్సరాలు

 

వందేమాతర గీతం ప్రచురించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మందమర్రి మండలంలోని ఆదిల్పెట్ చౌరస్తాలో సామూహిక వందేమాతరం జీతాల పని చేయడం ఏర్పాటు జరిగింది

ఆనాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ

స్వాతంత్ర్య సంగ్రామంలో వందేమాతర నినాదం ప్రజల్లో చైతన్యాన్ని తీసుకొచ్చిందని, బ్రిటిష్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిందని అన్నారు. ప్రతి ఒక్కరూ వందేమాతర గీతాన్ని గుండెల్లో నింపుకుని దేశ పురోభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు

ఈ సామూహిక వందేమాతరం గీతాలపన కార్యక్రమంలో గ్రామ ప్రజలు,విద్యార్థులు, ఉపాధ్యాయులు, యువకులు

భారతీయ జనతా పార్టీ నాయకులు డి.వి దీక్షితులు, దేవర్నేని సంజీవరావు, గిరినేటి జనార్ధన్, వంజరీ వెంకటేష్, పెంచాల రంజిత్, దుర్గం మల్లేష్, బోర్లకుంట లక్ష్మణ్, ఎనుగందుల రాజయ్య, ధారవేణి రవి, కాపురపు వినయ్, రాచర్ల మహేందర్,కొమురోజు రాము, సుంకరి ప్రవీణ్ ,ఏనుగందుల సత్యం, సాయి తదితరులు పాల్గొన్నారు

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది…

వందేమాతరానికి 150 ఏళ్లు – దేశభక్తి జ్వాలలతో నెక్కొండ ప్రతిధ్వనించింది

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

జాతీయ గేయం “వందేమాతరం” రచనకు 150 సంవత్సరాలు,(1875 నవంబర్ 7 న వందేమాతరం గేయం, రచించిన బంకిమ్ చంద్ర చటర్జీ రచించి 150 సంవత్సరాలు) పూర్తయిన సందర్భంగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో దేశభక్తి ఉత్సాహం ఉరకలేసింది. మార్కెట్ ఆవరణలో, పాఠశాలల్లో, కాలనీల్లో, ప్రజా వేదికలపై వందేమాతరం గీతాలాపన ప్రతిధ్వనించింది.
పల్లె నుంచి పట్టణం దాకా “వందేమాతరం” నినాదాలు మారుమ్రోగాయి.
పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ తల్లి భారతమాతకు వందనములు అర్పించారు.
నెక్కొండ జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి గేయాన్ని ఆలపించారు.
తమ 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన పాఠశాల వేదికపై నిలిచి గీతం పాడిన పూర్వ విద్యార్థులు మాణిక్యం తొ పాటు సీఐ సన్నాయిల శ్రీనివాస్ ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.
“వందేమాతరం 150వ వసంతం మనందరికీ గౌరవ దినం” అంటూ వారు గర్వంగా తెలిపారు.
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈడునూరి సాయికృష్ణ పిలుపు మేరకు పార్టీ కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ
వందేమాతరం కేవలం గేయం కాదు, ఇది దేశాత్మక గౌరవానికి ప్రతీక. తల్లి భారతమాతకు మన అర్చన.”
అని అన్నారు.
పిల్లలు జాతీయ పతాకాలతో ఊరంతా దేశభక్తి నినాదాలు చేశారు.
సంస్కృతి, భక్తి, ఐక్యత సమన్వయమై నెక్కొండ మొత్తం “వందేమాతరం” స్వరంతో మార్మోగింది.

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య

విద్యార్థులలో స్ఫూర్తిని నింపిన “వందేమాతరం “- ఎన్ సి.సి అధికారి గుండెల్లి రాజయ్య
మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి గీతం!

ఉద్యమానికి మనోబలం తెచ్చిన శబ్ద తరంగం!
వందేమాతరానికి 150 వసంతాలు పూర్తయిన సందర్భంగా, పదవ తెలంగాణ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కలనల్ సెంతిల్ రామదురై, పరిపాలన అధికారి రవి సోనహరే వారి ఆదేశాల మేరకు జడ్పీహెచ్ఎస్ మొగుల్లపల్లి, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీమతి ఎస్.భాగ్యశ్రీ, ఎన్సిసి అధికారి గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో ఎన్సిసి విద్యార్థులచే జాతీయ గీతం అయిన వందేమాతరం పూర్తి గేయాన్ని మూడు నిమిషాల ఆలపించి, మొగుళ్లపల్లి వీధుల గుండా ర్యాలీగా వెళ్లి,చౌరస్తాలో మానవహారం ఏర్పరిచి మండల అభివృద్ధి అధికారి, మండల రెవెన్యూ అధికారి, సమక్షంలో వందేమాతర గీతాన్ని ఆలపించి దాని యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది.
పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు ఎన్సిసి అధికారి మాట్లాడుతూ వందేమాతరం యొక్క పుట్టుక, దాని యొక్క ప్రాముఖ్యతను విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో టి. వెంకన్న,
బి. కుమారస్వామి, కె. ప్రవీణ్
ఎం. రాజు, డి. పద్మ, పి. లలిత,
జి. విజయభాస్కర్. ఆర్. చందర్ ఎండి. మజార్, బి. వేణు, ఎన్సిసి విద్యార్థులు,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

 

జహీరాబాద్ పాఠశాలలో విద్యార్థుల వందేమాతరం గీతాలాపన…

జహీరాబాద్ పాఠశాలలో విద్యార్థుల వందేమాతరం గీతాలాపన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని మాణిక్ ప్రభు పాఠశాలలో శుక్రవారం ఉదయం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వేంకటయ్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఏకకంఠంతో వందేమాతరం గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఝరాసంగం విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వందేమాతరం ఏకకంఠం

భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమానికి స్ఫూర్తినిచ్చి ఇప్పటికి జాతీయ గౌరవం ఐక్యతను పెంచుతున్న వందేమాతరం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజ్ఞాన జ్యోతి మోడల్ స్కూల్లో వందేమాతరం గేయ ఆలాపనలో విద్యార్థులు తో సహా పోషక మహాశయులు ఉపాధ్యాయులు మరియు పాఠశాల కరస్పాండెంట్ బి.నాగన్న ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు,

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ జెండా శత ఆవిష్కరణ

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ జెండా శత ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

 

రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం “నిత్య జాతీయ పతాకావిష్కరణ వంద (శత) వ రోజు కార్యక్రమంలో” భాగంగా సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరి ప్రసాద్ పతాకావిష్కరణ చేయడం జరిగినది. అగ్గిపెట్టెలో చీర , సూది బెజ్జంలో దూరే చీర , ప్రముఖుల ముఖ చిత్రాలతో నేసిన వస్త్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మాట్లాడుతూ జాతీయ పతాకావిష్కరణ అవకాశం మాన్యులకే కాకుండా సామాన్యులకు కూడా అందించేటువంటి నిత్య జాతీయ పతాకావిష్కరణ అభినందనీయమని, ప్రతిరోజు విద్యార్థుల చేత జాతీయ పతాకావిష్కరణ చేయించడం ఒక వినూత్న కార్యక్రమమని ఈ విధంగా ఈ విధమైన కార్యక్రమాన్ని నిర్వహించే రాష్ట్రంలోని ఏకైక కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల అని తెలిపారు .ప్రతి విద్యార్థి దేశభక్తి భావాలను పెంచుకోవాలని క్రమశిక్షణతో చదివితే ఎలాంటి ఉన్నత ఉద్యోగాలైన సాధించవచ్చు అని పేర్కొన్నారు.

విద్యతోపాటు పుస్తక పఠనం చేయాలని ప్రతి విద్యార్థి సెల్ ఫోన్లకు దూరంగా ఉండి, మీ గురువులు చెప్పే విషయాలను పాటించి. ఇష్టపడి,కష్టపడి చదివితేనే మీ లక్ష్యాన్ని చేరగలుగుతారని ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని వారు తెలిపారు. పట్టుదలతో కష్టపడి ఇష్టంతో ఏ రంగంలో , ఏ కళ లోనైనా పనిచేసిన విజయాన్ని సాధిస్తారని వారు తెలిపారు. కార్యక్రమంలో వారు తయారు చేసిన చేనేత వస్త్రా న్ని విద్యార్థులకు ప్రదర్శించారు.

 

ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనక విజయ రఘునందన్,అధ్యాపకులు శ్రీధర్, కేదారేశ్వర్ ,బి.వెంకటేశం. సామల వివేకానంద్.ఈ కనకయ్య. .అరుంధతి. విజయ ,రాజయ్య , ఆంజనేయులు, చంద్రమౌళి, సురేష్ ,సరోజ,
చంద్రశేఖర్,రాజశేఖర్,శ్రీనివాస్, సుజిత , మమత,నర్మద, మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

నేటి యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శం చందుపట్ల కీర్తి రెడ్డి

నేటి యువతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆదర్శం చందుపట్ల కీర్తి రెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా జిల్లా పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు
ర్యాలీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి హాజరైనారు అనంతరం సంఘ మిత్ర డిగ్రీ కాలేజీ నుండి ప్రారంభమైన ర్యాలీ, వివిధ వీధుల గుండా అంబేద్కర్ సర్కిల్ వరకు ఉత్సాహంగా సాగింది. దేశభక్తి నినాదాలతో గాలిలో ర్యాలీ చేశారు అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు
ఈ సందర్భంగా చందుపట్ల కీర్తి రెడ్డి మాట్లాడుతూ
దేశాన్ని ఐక్యం చేసిన లౌహ పురుషుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ చరిత్రలో అజరామరమైన నాయకుడు. ఆయన నాయకత్వం లేకపోయి ఉంటే మన దేశం ఈరోజు ఒకటిగా ఉండేది కాదు. ఆయన దృఢనిశ్చయంతోనే 562 రియాసతాలను ఒకే భారతదేశంగా ఏకం చేశారు. ఆయన చూపిన మార్గం, ఆయన నిబద్ధత ప్రతి నాయకుడికి, ప్రతి పౌరుడికి స్ఫూర్తి కావాలి, అని అన్నారు.
నేటి తరంలో యువతకు సర్దార్ పటేల్ ఆలోచనలను పరిచయం చేయడం చాలా అవసరం. ఆయన చూపిన దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం మనందరిలో నాటుకుపోవాలి. దేశం పట్ల గౌరవం, సమైక్యత పట్ల అవగాహన పెంచుకోవాలి. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేది నాయకులు మాత్రమే కాదు, ప్రతి ఒక్క పౌరుడు. అందుకే ప్రతి ఒక్కరూ పటేల్ స్ఫూర్తితో దేశ నిర్మాణంలో భాగస్వాములుగా మారాలి,” అని పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రం మొత్తం “జై సర్దార్ పటేల్”, “ఒక భారతం ఒక మనసు ఒక జెండా” అనే నినాదాలతో మార్మోగింది. అని అన్నారు ఈ కార్యక్రమంలో ఐక్యత మార్చ్ కో కన్వినర్స్ తాటికొండ రవి కిరణ్ సయ్యద్ గాలిఫ్ జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి రెడ్డి సామల మధుసూదన్ రెడ్డి కొడపాక స్వరూప జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల రాజు జిల్లా కార్యదర్శి శివనాత్రి వేణు జీట్టబోయిన సాంబయ్య మీడియా కన్వీనర్ మునేందర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు జగ్గయ్య సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి వివిధ మండల అధ్యక్షులు బుర్ర వెంకటేష్ గౌడ్ పులి గు జ్జల రాజు బండి శ్రీనివాస్ గుర్రపు నాగరాజ్ గౌడ్ రామకృష్ణ అర్బన్ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి బీజేవైఎం నాయకులు వంశీ బిఎంఎస్ నాయకులు బిక్షపతి తదితరున్నారు

ఉక్కు మనిషి సర్దార్ 150 వ జయంతి….

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T145658.595.wav?_=3

 

ఉక్కు మనిషి సర్దార్ 150 వ జయంతి.

పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం.

చిట్యాల, నేటిదాత్రి :

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా, చిట్యాల మండలంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు.ఈ సందర్భంగా, చిట్యాల ఎస్సై2 హేమలత మరియు ఎస్సై 2 ఈశ్వరయ్య కార్యక్రమ స్థలంలో యువతను ఉద్దేశించి ప్రసంగించారు. సర్దార్ పటేల్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని దేశ ఐక్యతను కాపాడాల్సిన బాధ్యత యువతపై ఉందని వారు నొక్కి చెప్పారు.

భారతదేశ సమైక్యత, సమగ్రత, మరియు భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి పౌరులలో అవగాహన పెంచారు
‘ఉక్కు మనిషి’ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశం కోసం చేసిన సేవలను, ముఖ్యంగా 550కి పైగా స్వతంత్ర రాజ్యాలను భారత్‌లో విలీనం చేసి దేశాన్ని ఏకం చేయడంలో ఆయన కృషిని స్మరించుకోవడం జరిగింది
ఈ పరుగులో మండలంలోని యువత మరియు పోలీసు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు కట్టుబడి ఉంటామని నినదించారు

రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-31T121544.783.wav?_=4

 

రన్ ఫర్ కార్యక్రమం నిర్వహించిన ఝరాసంగం పోలీసు అధికారులు

◆:- సీఐ హనుమంతు

◆:- ఎస్ఐ,, క్రాంతి కుమార్ పటేల్ ఝరాసంగం పోలీస్ స్టేషన్ 
 
జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఝరాసంగం మండల పోలీస్ స్టేషన్ అధికారులు జాతీయ ఐక్యత దినోత్సవం అక్టోబర్ 31 సందర్భంగా, భారత ఐక్యతా స్ఫూర్తికి ప్రతీక అయిన సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించిన ఝరాసంగం సీఐ హనుమంతు ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఐ హనుమంతు మాట్లాడుతూ..ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో జాతీయ ఐక్యత, సామరస్యం, దేశభక్తి, సమైక్యతా భావం పట్ల అవగాహన కల్పించడమే లక్ష్యం అని అన్నారు. యువత, ప్రజలు, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు సిబ్బంది అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.సర్దార్ పటేల్  సేవలు, దేశాన్ని ఏకతా బంధంతో కట్టిపడేసిన ఆయన నాయకత్వం ప్రతి ఒక్కరికీ ప్రేరణ. మనమందరం ఐక్యతతో, స్ఫూర్తితో ముందుకు సాగితేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొన తమ వంతు సహకారం అందించాలి అన్నారు. శుక్రవారం ఉదయం 06:30 గంటలకు, పోలీస్ స్టేషన్ నుండి ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, ప్రింట్ మీడియా మిత్రులు మరియు వివిధ సామాజిక సంస్థల సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు,

లింగంపల్లి పురవీధుల్లో ఆకట్టుకున్న స్వయంసేవకుల కవాతు…

లింగంపల్లి పురవీధుల్లో ఆకట్టుకున్న స్వయంసేవకుల కవాతు…

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా శేరిలింగంపల్లి స్వయంసేవకుల పథ సంచలన కార్యక్రమం వైభవంగా, స్ఫూర్తివంతంగా, కన్నులపండుగగా, పాల్గొన్నవారికే కాకుండా చూసేవారికి కూడా ఉత్సాహాన్నిచ్చే విధంగా జరిగింది.
ముందుగా జరిగిన సమావేశంలో సికింద్రాబాద్ విభాగ్ బౌధ్ధిక్ ప్రముఖ్ శ్రీ.అచ్చవెల్లి.భాను ప్రకాశ్
గారు తమ వక్త సందేశంలో భాగంగా మాట్లాడుతూ, హిందూ సంఘటన కోసం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభించబడింది అన్నారు. సంఘ్ స్వయంసేవకులకు క్రమశిక్షణ, దేశభక్తి వంటి ఉన్నతమైన సద్గుణాలు అలవడే విధంగా శిక్షణనిస్తుంది అన్నారు. సంఘం అంచెలంచెలుగా ఎదుగుతూ అనేక సమాజసేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చింది అన్నారు. కన్యాకుమారిలోని స్వామి వివేకానంద స్మారక కేంద్రం, శ్రీశైలంలోని ఛత్రపతి శివాజీ స్ఫూర్తికేంద్రం, అయోధ్యలోని భవ్యమైన శ్రీరామ మందిరం సంఘ కృషివల్లనే నిర్మించబడ్డాయి అన్నారు. తిరుమల పవిత్రత ఏడుకొండలు కాక రెండు కొండలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదన, రామసేతు విధ్వంస ప్రతిపాదన సంఘ ఉద్యమాలవల్ల ఆగాయి అన్నారు. సంఘ పనిని సమాజమంతాకలిసి వేగంగా ముందుకు తీసుకువెళ్లి భారతదేశాన్ని తిరిగి విశ్వగురువు స్థానంలో నిలపాలన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ విభాగ్ సహకార్యవాహ్ శ్రీ.నారాయణ మూర్తి గారు కూడా పాల్గొన్నారు.

తరువాత గణవేష్ (uniform) ధరించిన స్వయంసేవక్ లు అందరూ కాళ్ళు, చేతులు ఒకేసారి, ఒకే విధంగా కుదుపుతూ సైనిక కవాతులాగా మనోహరంగా పథసంచలన చేస్తూ, గుల్మోహర్ చౌరస్తా నుడి ప్రారంభము అయి ప్రశాంతి నగర్, బాపు నగర్, గోపీనగర్, నెహ్రూ నగర్ , ఆదర్శనగర్ బస్తీ వీధుల్లో సంచరించారు. సంఘ ఘోష్ (RSS musical band) లయబద్ధంగా వాదన చేస్తూ పథసంచలనకి అత్యంత ఉత్సాహం ఇచ్చింది. పరమపవిత్ర భగవాధ్వజాన్ని పుష్పాలంకృతమైన వాహనంలో తెచ్చారు. బస్తీవాసులు పూలుచల్లి అడుగడుగునా స్వాగతం పలికారు.

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో…

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో
పొత్కపల్లి యువత ..

సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న యువత..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం లోని పొత్కపల్లి గ్రామానికి యువత గత దశాబ్దకాలంగా దుర్గాభవాని కమిటీగా ఏర్పాటై భవాని మాత సేవలో తరిస్తూ మన సనాతన ధర్మాన్ని ,భక్తి మార్గాన్ని భావి తరాలకి అందిస్తుంది.యువత అంటే మనకు ఉండే ఆలోచనలకి ఆమడదూరంలో ఉంటూ సనాతన ధర్మానికి, భక్తిగా చిరునామాగా నిలుస్తూ పొత్కపల్లి యువత భవాని సేవలో దశ్జబ్దకాలంగా త్రికరణశుద్ధిగా ముందుకు సాగుతుంది.ఓదెల మండలంలోని ఎంతో ప్రాచుర్యం పొందిన పొత్కపల్లి శ్రీ రాజ వేణుగోపాలస్వామి మరియు భవాని సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత దశాబ్ద కాలంగా భవాని మాత ఉత్సవాలు స్థానిక యువత ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తు హిందూ ధర్మ పరిరక్షణకు మేము సైతం చెడుపై పోరాటానికి సిద్ధం అంటూ భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు పొట్కపల్లి గ్రామంలో నీ యువత కులాల కతీతంగా భవాని మాత కమిటీగా ఏర్పడి,భవాని మాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తు ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నారు.ఆనాడు మరాఠా రాజ్య స్థాపకుడైన చత్రపతి శివాజీ మహారాజ్ భవాని మాత ఉత్సవాలను ప్రారంభిస్తే దానిని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లడానికి పొత్కపల్లి యువత సంకల్పించారు. సమాజ హితమే తమ అభిమతంగా దశాబ్దకాలంగా భవాని మాత ఉత్సవాలని అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క భవాని మాలలు ధరించి భక్తిని ,బాధ్యతలని సమపాళ్లలో నిర్వర్తిస్తూ యువతకి ఒక మార్గాన్ని జీవనవిధానాన్ని చూపిస్తున్నారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజాన్ని మంచి దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క భక్తి భావంతో పాటు సామజిక స్ఫూర్తిని రగిలిస్తున్నారు భవాని కమిటి గ్రామ కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల లో అయిన హెల్మెట్ ధరించాలని, స్థానిక వ్యాపారులని ప్రోత్సహించాలని,స్వదేశీ ఉత్పత్తులు కొనడం దేశభక్తికి శోభా అని,విద్యతోనే వెలుగు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని గుర్తు చేస్తూ అందరిలో చైతన్యం తీసుకువస్తున్నారు. మాదకద్రవ్యాలు,మద్యం, జూదం జీవితం చెడగొట్టే మార్గాలు కావున వాటికీ దూరంగా ఉండి భవిష్యత్తుని వెలిగించండి అని యువతకి హితబోధ చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవం ఒక ఆనందం మాత్రమే కాదు మన గ్రామాన్ని ఒకటిగా నిలబెట్టే శక్తి అని చెబుతు రాక్షస సంహారానికి ప్రతీక అయిన నవరాత్రులని ఘనంగా నిర్వహిస్టు నవ సంకల్పంతో ముందుకు సాగుతూ యువత అంటే ఇలానే ఉండాలి అనే స్ఫూర్తిని ప్రతివో ఒక్కరిలో కలిగిస్తూ పోత్కపల్లి యువత ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి
సామజిక కార్యకర్త

బంగారు పతకాలతో మెరిసిన మొగుళ్లపల్లి విద్యార్థులు.

బంగారు పథకాలతో మెరిసిన మొగుళ్లపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు
– ప్రధానోపాధ్యాయులు  విజయ పాల్ రెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి
పోలీసు శిక్షణ కళాశాల మామునూరు ఆవరణలో 4 వ తెలంగాణ  ఎయిర్ ఫోర్స్   వారి ఆధ్వర్యంలో నిర్వహించిన” కంబైన్డ్ అన్యువల్ ట్రైనింగ్ క్యాంపు”-7 లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మొగులపల్లి నుండి 12 మంది  ఎన్.సి .సి క్యాడేట్స్  పాల్గొన్నారు.
శిక్షణలో భాగంగా నిర్వహించిన ఆటల పోటీలలో  వాలీబాల్,  టాగ్ ఆఫ్ వార్, ఆటలలో  గోల్డ్  మెడల్ సాధించగా,  మెరుగు సంజయ్ 100 మీటర్ల పరుగు లో మొదటి స్థానము పొంది గోల్డ్ మెడల్ సాధించారని  పాఠశాల ప్రధానోపాధ్యాయులు , విజయ పాల్ రెడ్డి ఎన్సిసి అధికారి  జి. రాజయ్య లు తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పింగిలి విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇలాంటి విజయాలు ఇంకా ఎన్నో సాధించాలని, మంచి ప్రవర్తన, పట్టుదల, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకొని, పాఠశాలకు  మీ ఊరికి  రాష్ట్రానికి , దేశానికి  మంచి పేరు తీసుకురావాలని  సూచించారు. అదేవిధంగా దేశానికి ముగ్గురే ముగ్గురు  ఎలాంటి స్వార్థం లేకుండా సేవ చేసేవారు, సైనికుడు, రైతు, క్రీడాకారుడు
కావున  మంచి చదువుతోపాటు  ఆటలలో రాణించి మంచి దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు .
ఈ కార్యక్రమంలో గోల్డ్ మెడల్ సాధించిన ఎన్. సి.సి విద్యార్థులను  అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  శ్రీమతి భాగ్యశ్రీ,   ,  శ్రీమతి ఏ.వీ. ఎల్ . కళ్యాణి,  జి .అనిల్ కుమార్, బి. కుమారస్వామి కే .ప్రవీణ్, ఎం. రాజు,  శ్రీమతి పి. లలిత, జి. విజయ భాస్కర్, శ్రీమతి  వై. శ్రీకళ  విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T112717.663.wav?_=5

 

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ
శాఖ నుంచి గౌరవ ప్రశంసా పత్రం అందుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు మేడికాల అంజయ్య
దేశభక్తిని చాటేలా జోగాపూర్
విద్యార్థుల “హర్ ఘర్ తిరంగా”

విద్యార్థులలో దేశ భక్తిని పెంపొందించేందుకు సిసిఆర్టి శిక్షకులు, హర్ ఘర్ తిరంగా వాలీంటియర్ మేడికాల అంజయ్య కృషి …

చందుర్తి, నేటిధాత్రి:

 

 

స్వాతంత్ర్యయం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా “ఆజాదీ కా మహోత్సవ్ – 2022″లో భాగంగా కేంద్రం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో మరోసారి పాల్గొనే అవకాశం కల్పించినందున జోగాపూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తూ ,సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్స్ ట్రైనింగ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా వాలింటిర్ గా వ్యవహరిస్తు జాతీయ పతాక ఆవిష్కరణ విధానం, నియమాలను విధ్యార్థులకు
అవగాహాన కల్పిస్తు దాదాపు 60 మంది విద్యార్థుల జాతీయ పతాక సెల్ఫిలను అప్ లోడ్ చేయించగా,60 మంది విద్యార్థులు ప్రశంస పత్రాలు అందుకున్నారు. వాలింటిర్ గా వ్యవహరించిన ఉపాధ్యాయుడు అంజయ్య కు
మినిస్ట్రి ఆఫ్ కల్చర్ మరొక గౌరవ ప్రశంసా పత్రం అందించి గౌరవించింది.
విద్యార్థి దశలోనే దేశభక్తిని పెంపోందించేలా కృషి చేస్తే , భావితరాల వారు దేశం కోసం పనిచేస్తారని, విద్యార్థులు చక్కటి క్రమశిక్షణను పాటిస్తారని అంజయ్య అన్నారు.

జాతీయ జెండాకు అవమానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T123932.348-1.wav?_=6

 

జాతీయ జెండాకు అవమానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతీయ జెండాను అవమానపరుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పోస్ట్ ఆఫీస్ లో జెండా ఎగరేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాతీయ జెండాను అవమాన పరిచారు. సంబంధిత అధికారి సెలవులో ఉన్నట్టు నీ లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యతగల వ్యక్తులే ఇలా చేస్తే ఎలా ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒకపక్క భారత్ మాతాకీ జై అంటూ దేశం పట్ల ప్రజలకు ప్రేమ ఉండాలని దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపై భారత జాతీయ జెండా ఎగరేస్తూ దేశభక్తిని చాటుతుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ పనితీరుకు
ఆ పార్టీ వారు చెప్పే మాటలకు చాలా తేడా కనిపిస్తున్నట్టు పలు వర్గాల ప్రజలు విమర్శిస్తున్నాయి.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకున..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-9-5.wav?_=7

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకున మజీద్ మదర్స సదర్ సయ్యద్ మాజీద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఝరాసంగం మదర్సా జామియా హబీబా నిస్వాన్ మదర్సలో లో సదర్ సయ్యద్ మజీద్ జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.దేశ స్వాతంత్ర్యం‌ కోసం త్యాగాలు చేసిన అమరవీరులను, ఉద్యమకారుల పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రతి భారతీయుడి గుండెలోనూ దేశభక్తి నిండిపోయే రోజు ఆగస్టు 15. ఇది మనకు కేవలం ఒక సెలవు రోజు కాదు, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన పవిత్రమైన రోజు.ఈ రోజున మనం అందరం కుల, మత, ప్రాంతీయ భేదాలు మరచిపోయి, భారతీయులమనే గర్వంతో ఏకమవుతాం. దేశమంతా ‘వందేమాతరం’, ‘భారత్ మాతా కీ జై’ నినాదాలతో ప్రతిధ్వనిస్తుంది. ఇలాంటి గొప్ప రోజున మన ప్రియమైన వారికి శుభాకాంక్షలు చెప్పడం మన సంప్రదాయం. ఈ దేశభక్తి సందేశాలు మన బంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు, దేశభక్తిని, ఐక్యతను కూడా పెంచుతాయన్నారు,ఈ కార్యక్రమంలో మస్జిద్ గురువు మూఫ్తీ ఫిర్దోస్ హఫీస్ బాబర్ ఖాదర్ అలీ రాజ్ మహమ్మద్ అమీరుద్దీన్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు,

ధనసిరి గ్రామంలో అమర జవాన్ స్థూపం ప్రారంభం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T121835.235.wav?_=8

 

ధనసిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర జవాన్ స్థూపం ప్రారంభోత్సవ

◆:- ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ….

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ధనసిరి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమర జవాన్ స్థూపం ప్రారంభోత్సవ పాల్గొని
ఈ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశానికి చేస్తున్న సేవ అభినందనీయం అని ,నేటి యువతక జవాన్ లను ఆదర్శంగా తీసుకోవాలి అని , మన నియోజకవర్గం ధనసిరి గ్రామంలో 80 మంది వరకు సైనికులుగా ఉన్నారు ఇది మన అందరికి గర్వ కారణం అని అన్నారు .

 

ఎమ్మెల్యే గారితో పాటు గా జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, పాక్స్ చైర్మన్ మచ్చెందర్, రైల్వే బోర్డు మెంబర్ షేక్ ఫరీద్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్, మాజి సర్పంచ్ లు హస్బి రాజు ,చిన్న రెడ్డి ,మహిపాల్ ,అశోక్ రెడ్డి, ప్రవీణ్, బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వీరులను స్మరించిన సాయినగర్

ఎందరో మహానుభావుల త్యాగం ఫలితం ఈ స్వాతంత్ర మన దేశానికి వచ్చింది

తిరుపతి(నేటి ధాత్రి)ఆగస్టు 15:

 

 

మన కోసం కాకుండ దేశం కోసం జీవించాలి 79 వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం సాయినగర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ సర్పంచ్ డివి రమణ గావించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగం ఫలితం ఈ స్వాతంత్ర మన దేశానికి వచ్చింది అన్నారు.మహాత్మా గాంధీ ఒక చెంప మీద కొడితే ఇంకో ఇంకో చెంప కూడా చూపించారని. భగత్ సింగ్ తక్కువ వయసులోనే ఉరివేస్తున్నప్పుడు చిరునవ్వు చిందించారని భగత్ సింగ్ గారి తల్లి ఆవేదన చెందుతూ ఏడుస్తుంటే ఏంటమ్మా అని అడిగినప్పుడు దేశం కోసం నా కుమారుడు అమరడు అయ్యారు నాకు మరో ఒక కుమారుడు ఉంటే దేశ స్వాతంత్ర కొరకు పంపేదాని అని అన్నారు. మరొక్క సందర్బం లో ఉక్కు మనిషి గా పేరు గాంచిన సర్ధార్ వల్ల భాయ్ పటేల్ 1909 సంవత్సరలో తల్లీ మరణించిన బాధను దిగ మింగుకుని జైల్లో ఉన్న వారి కోసం వాదించి విజయం సాధించారు.అదేవిదంగా అజాత్ హిందూ ఫోజ్ సంస్థను స్థాపించి తన యుద్ధ పోరాటాలు ద్వారా బ్రిటిష్ వారిని భయబ్రాంతులకు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురి చేశారు.అల్లూరి సీతా రామరాజు,జాన్సీ లక్ష్మి భాయ్ లాంటి ఎందరో వీరుల ప్రాణ త్యాగాల ఫలితం గా ఈ స్వతంత్రం వచ్చింది అని తెలిపారు.అనంతరం గ్రామ సభ నిర్యహించారు సోలార్ ప్రాజెక్టు ను ఉపయోగించు కోవాలి అని కోరారు.భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు పంచాయతీకి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ప్రతి ఒక్కరు మన కోసం కాకుండ దేశం ప్రయోజనాలు కోసం జీవించాలి అని పిలుపు ఇచ్చారు.
ఈ కార్యక్రమం లో పంచాయతీ సెక్రటరీ,ఉప సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులు, వార్డ్ మెంబర్లు, నాయకులు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది, పంచాయతీ పాఠశాల ఉపాధ్యాయులు,ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి సిబ్బంది, డ్వాక్రా సంఘమిత్రలు, మహిళలు, యువత, పాల్గొన్నారు.

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-51.wav?_=9

పరకాల పట్టణంలో పలుచోట్ల ఘనంగా జెండా పండుగ

క్యాంపు కార్యాలయంలో జెండా ఎగరావేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

పలు ప్రభుత్వ కార్యాలయాల్లో జెండా ఎగరవేసిన అధికారులు

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో అమరధామం యందు ఆగస్టు 15 రోజున 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు రేవూరిప్రకాశ్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

ఆర్డీఓ కార్యాలయంలో….

పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్డీఓ డాక్టర్.కన్నం.నారాయణ జెండా ఎగరావేయడం జరిగింది.అనంతరం జాతీయ గీతాలాపన చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ లో….

79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణలోని పరకాల పోలీస్ వారి ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతికుమార్ స్టేషన్ ప్రాంగణం లో జెండా ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎస్ఐలు రమేష్ బాబు,విఠల్,మహిళపోలీసులు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

CI Krantikumar

ఎమ్మార్వో కార్యాలయంలో…..

పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్బంగా ఎమ్మార్వో విజయలక్ష్మి జెండా ఎగరావేయడం జరిగింది.ఈ సందర్బంగా మాట్లాడుతూ మహనీయులను అనుదినం స్మరించుకోవాలని వారి త్యాగల ఫలమే ఈ రోజని అన్నారు.ఈ కార్యక్రమంలో డీటీ.సుమన్,ఎలక్షన్ డీటీ.సూర్యప్రకాష్,ఎం.ఆర్ఐ అశోక్ రెడ్డి,దామోదర్,ఏఎస్ఓ కుమారస్వామి, ధరణి ఆపరేటర్ రఘుపతి,సీనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్,ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ భద్రయ్య, జూనియర్ అసిస్టెంట్ అర్జున్,రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎంపిడిఓ కార్యాలయం లో…….

79 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది.ఆంజనేయులు జాతీయ పతాకాన్ని ఎగరావేశారు.అనంతరం విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అవోపా అధ్యక్షులు ఎల్లంకి బిక్షపతి,కార్యాలయ పర్యవేక్షకులు సిహెచ్ శైలశ్రీ, ఏపిఓ ఇందిర,కార్యాలయ, ఈజీయస్ సిబ్బంది,కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ మార్కెట్ లో……

స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ,ఏఐటీయూసీ హమాలి యూనియన్ ఆధ్వర్యంలో సిపిఐ జిల్లాకౌన్సిల్ సభ్యుల లంక దాసరి అశోక్ అధ్యక్షతన 79వ స్వతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.అనంతరం హమాలి యూనియన్ నాయకులు మహనీయుల చిత్రపటాలకు పూలతో నివాళులు అర్పించి జెండావిష్కరణ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నాగెళ్లి శంకర్,శ్రీపతి రాజయ్య,హమాలీ సీనియర్ ముఠామేస్త్రి బొట్ల భద్రయ్య,కొడపాక ఐలయ్య,కోయిల శంకరయ్య,కోట యాదగిరి,గుట్ట రాజయ్య ల్,దొడ్డే పోచయ్య,కార్మిక నాయకులు పాల్గొన్నారు.

పరకాల ఫర్టిలైజర్ డీలర్స్ ఘనంగా స్వాతంత్ర వేడుకలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-47.wav?_=10

ఫర్టిలైజర్స్,పెస్టిసైడ్స్,సీడ్స్ డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు

జెండా ఎగరావేసిన అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు

పరకాల నేటిధాత్రి

ఫెర్టిలైజర్స్,పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పట్టణంలోని అరుణ ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్ నందు అసోసియేషన్ అధ్యక్షులు గందె వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి వాడికారి శివాజీ కోశాధికారి ఎర్రం లక్ష్మణ్ ల పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణ ఫర్టిలైజర్ అధ్యక్షులు అరుణ ఫర్టిలైజర్ యజమాని గందె వెంకటేశ్వర్లు జెండా ఎగరావేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పరకాల ప్రజలకు తెలియపరుస్తూ ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఈ స్వాతంత్రం భారతదేశంలోని ప్రతి పౌరుడు ఐక్యమత్యంతో భారత దేశ ఔనిత్యాన్ని చాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఫర్టిలైజర్ షాప్ యజమానులు,ఫర్టిలైజర్ పెస్టిసైడ్స్,సీడ్స్ కంపెనీ ఎంప్లాయిస్,పట్టణ షాపు గుమాస్తా సంఘం మరియు ఎంప్లాయిస్,హమాలీ సభ్యులు,రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నిజాంపేట లో ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-43.wav?_=11

నిజాంపేట లో ఘనంగా 79వ స్వాతంత్ర వేడుకలు

నిజాంపేట: నేటి ధాత్రి

79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజాంపేట మండలం ప్రభుత్వ కార్యలయాలు, వివిధ పార్టీ కార్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం లో ఎమ్మార్వో శ్రీనివాస్, స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ. రాజేష్. ఎంపీడీఓ కార్యలయంలో రాజీరెడ్డి, రైతు వేదికలో సోమలింగారెడ్డి, విద్యుత్ కార్యలయంలో ఏఈ గణేష్, కాంగ్రేస్ పార్టీ కార్యలయంలో వెంకట్ గౌడ్, గ్రామాల్లో గల పాఠశాలలలో ప్రధానోపాధ్యాయులు మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version