ఘనంగా పల్లకి సేవ

ఘనంగా పల్లకి సేవ

జహీరాబాద్ నేటి ధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

సంగారెడ్డి: జహీరాబాద్ మండలం హోతికే గ్రామ శివారులోని భవానీ మాత, మహేశ్వరి మాత మందిరంలో పౌర్ణమి సందర్భంగా పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం పూజా కార్యక్రమాల తర్వాత నిర్వహించిన పల్లకి సేవలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధికారులు, ప్రముఖులు పాల్గొని దేవీ ఆశీస్సులు పొందారు.

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

కోటగుళ్ళు, ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ పూజలు

గణపురం నేటి ధాత్రి

Vaibhavalaxmi Shopping Mall

గణపురం మండల కేంద్రంలోని శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లు, శ్రీ దక్షిణముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల అర్చకులు గోవర్ధన వేణుగోపాలాచార్యులు, జూలపల్లి నాగరాజు లు సిఐని సాదరంగా ఆహ్వానించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు.

మొగుళ్లపల్లిలో అన్నపూర్ణ దర్శనం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T134201.800.wav?_=1

 

అన్నపూర్ణ గా దర్శనమిచ్చిన అమ్మవారు ప్రత్యేక పూజలు నిర్వహించిన కట్కూరి సంధ్య-శ్రీధర్ దంపతులు*
మొగుళ్లపల్లి నేటి ధాత్రి:

 

ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా చల్లగా ఉండాలని కోరుకుంటూ మొగుళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన కట్కూరి సంధ్య-శ్రీధర్ దంపతులు మండల కేంద్రంలోని సామూహిక శ్రీ సాంబశివ దేవాలయంలో కొలువైన దుర్గామాత అమ్మవారిని దర్శించుకొని..ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆ దంపతులు మాట్లాడారు. దుర్గామాత అమ్మవారి కృపాకటాక్షంలతో, ఆ తల్లి చల్లని దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, శాంతి సామరస్యంతో, అష్టైశ్వర్యాలతో, పాడి పంటలతో, పిల్లాపాపలతో నిండు నూరేళ్లు కలకాలం వర్ధిల్లాలని, ఆ అమ్మవారి దీవెనలు ప్రజలందరిపై నిత్యం ఉండాలని వేడుకున్నట్లు ఆ దంపతులు తెలిపారు. కాగా 3వ రోజున ఆలయ అర్చకులు భైరవ పట్ల వెంకటేశ్వర శర్మ అమ్మవారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. అనంతరం దుర్గామాత అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం అమ్మవారి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ భజన మండలి సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో…

దశాబ్ద కాలంగా భవాని మాత సేవలో
పొత్కపల్లి యువత ..

సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్న యువత..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

ఓదెల మండలం లోని పొత్కపల్లి గ్రామానికి యువత గత దశాబ్దకాలంగా దుర్గాభవాని కమిటీగా ఏర్పాటై భవాని మాత సేవలో తరిస్తూ మన సనాతన ధర్మాన్ని ,భక్తి మార్గాన్ని భావి తరాలకి అందిస్తుంది.యువత అంటే మనకు ఉండే ఆలోచనలకి ఆమడదూరంలో ఉంటూ సనాతన ధర్మానికి, భక్తిగా చిరునామాగా నిలుస్తూ పొత్కపల్లి యువత భవాని సేవలో దశ్జబ్దకాలంగా త్రికరణశుద్ధిగా ముందుకు సాగుతుంది.ఓదెల మండలంలోని ఎంతో ప్రాచుర్యం పొందిన పొత్కపల్లి శ్రీ రాజ వేణుగోపాలస్వామి మరియు భవాని సహిత మహాలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గత దశాబ్ద కాలంగా భవాని మాత ఉత్సవాలు స్థానిక యువత ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తు హిందూ ధర్మ పరిరక్షణకు మేము సైతం చెడుపై పోరాటానికి సిద్ధం అంటూ భక్తిభావంతో ముందుకు సాగుతున్నారు పొట్కపల్లి గ్రామంలో నీ యువత కులాల కతీతంగా భవాని మాత కమిటీగా ఏర్పడి,భవాని మాత ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తు ఎందరిలోనో స్ఫూర్తి నింపుతున్నారు.ఆనాడు మరాఠా రాజ్య స్థాపకుడైన చత్రపతి శివాజీ మహారాజ్ భవాని మాత ఉత్సవాలను ప్రారంభిస్తే దానిని మరింత ఘనంగా ముందుకు తీసుకెళ్లడానికి పొత్కపల్లి యువత సంకల్పించారు. సమాజ హితమే తమ అభిమతంగా దశాబ్దకాలంగా భవాని మాత ఉత్సవాలని అకుంఠిత దీక్షతో చేస్తున్నారు. ఓ పక్క కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూనే మరోపక్క భవాని మాలలు ధరించి భక్తిని ,బాధ్యతలని సమపాళ్లలో నిర్వర్తిస్తూ యువతకి ఒక మార్గాన్ని జీవనవిధానాన్ని చూపిస్తున్నారు అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజాన్ని మంచి దిశగా ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క భక్తి భావంతో పాటు సామజిక స్ఫూర్తిని రగిలిస్తున్నారు భవాని కమిటి గ్రామ కూడళ్లలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల లో అయిన హెల్మెట్ ధరించాలని, స్థానిక వ్యాపారులని ప్రోత్సహించాలని,స్వదేశీ ఉత్పత్తులు కొనడం దేశభక్తికి శోభా అని,విద్యతోనే వెలుగు విద్యార్థులే రేపటి దేశ భవిష్యత్తు అని గుర్తు చేస్తూ అందరిలో చైతన్యం తీసుకువస్తున్నారు. మాదకద్రవ్యాలు,మద్యం, జూదం జీవితం చెడగొట్టే మార్గాలు కావున వాటికీ దూరంగా ఉండి భవిష్యత్తుని వెలిగించండి అని యువతకి హితబోధ చేస్తున్నారు. నవరాత్రి ఉత్సవం ఒక ఆనందం మాత్రమే కాదు మన గ్రామాన్ని ఒకటిగా నిలబెట్టే శక్తి అని చెబుతు రాక్షస సంహారానికి ప్రతీక అయిన నవరాత్రులని ఘనంగా నిర్వహిస్టు నవ సంకల్పంతో ముందుకు సాగుతూ యువత అంటే ఇలానే ఉండాలి అనే స్ఫూర్తిని ప్రతివో ఒక్కరిలో కలిగిస్తూ పోత్కపల్లి యువత ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.

రాగిడి మంగ శ్రీనివాస్ రెడ్డి
సామజిక కార్యకర్త

అభివృద్ధి కోసం కలెక్టర్‌ను కలిసిన ఏఐఎంఐఎం నాయకులు…

జహీరాబాద్: రోడ్లు మరియు పాఠశాలల అభివృద్ధి అభ్యర్థనలు కలెక్టర్‌కు సమర్పించిన నాయకులు

“◆:- ఏఐఎంఐఎం జహీరాబాద్ నాయకులు అథర్ అహ్మద్ ముహమ్మద్ తసఫుర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ సహబ్ ఏఐఎంఐఎం చీఫ్ & ఎంపీ హైదరాబాద్ నాయకత్వంలో & కౌసర్ మొహియుద్దీన్ ఏఐఎంఐఎం ఎమ్మెల్యే & సంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ సూచనల మేరకు ఎండి అథర్ అహ్మద్ అధ్యక్షుడు జహీరాబాద్ ముహమ్మద్ తసఫుర్ యువ నాయకుడు & కోశాధికారి జహీరాబాద్ షేక్ ఇలియాస్ జాయింట్ సెక్రటరీ జహీరాబాద్ తో కలిసి జిల్లా కలెక్టర్‌ను కలిసి షహీన్ నగర్ ఫయాజ్ నగర్ కాలనీ జహీరాబాద్ మునిసిపాలిటీలో అభివృద్ధి పనులు కోరుతూ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. జడ్పీహెచ్ఎస్ ఉర్దూ మీడియం స్కూల్ ఫయాజ్ నగర్ కాలనీకి రోడ్డు నిర్మాణం మరియు మరమ్మత్తు షాహీన్ నగర్‌లో కొత్త ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు స్థానిక మదర్సా, పోచమ్మ ఆలయం చర్చికి యాక్సెస్ రోడ్ల నిర్మాణం వంటి అభ్యర్థనలు ఉన్నాయి. స్థానిక సమాజానికి ప్రయోజనం చేకూర్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని అధికారులను కోరారు.

కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ

కపిలతీర్థంలో ఎలాంటి తొక్కిసలాట జరుగలేదు.. తిరుపతి పోలీసులు క్లారిటీ

 

 

మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసిలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు స్పందించారు. కపిలతీర్థంలో తొక్కిసిలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు.

మహాలయ అమావాస్య సందర్భంగా కపిలతీర్థం వద్ద తొక్కిసిలాట జరిగిందని ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంపై తిరుపతి జిల్లా ఎస్పీ ఏల్. సుబ్బరాయుడు (Tirupati SP Subbarayudu) స్పందించారు. ఇవాళ(ఆదివారం) మీడియాతో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడారు. కపిలతీర్థంలో తొక్కిసిలాట జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ వార్తలు అసత్యమని కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎలాంటి తొక్కిసిలాట జరుగలేదని క్లారిటీ ఇచ్చారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.
భక్తుల రద్దీని పూర్తిగా నియంత్రిస్తూ సజావుగా ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. తప్పుడు సమాచారం సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భక్తులు నిజమైన సమాచారం కోసం పోలీస్ శాఖ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల భద్రత కోసం తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం నిత్యం కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తుందని పేర్కొన్నారు. ‘ప్రజల భద్రత – మా ప్రధాన లక్ష్యం’ అని ఉద్ఘాటించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడమహాలయ అమావాస్య – కపిలతీర్థం వద్ద పోలీస్ శాఖ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసిందని తెలిపారు . ఈరోజు(ఆదివారం) మహాలయ అమావాస్య సందర్భంగా తిరుపతి కపిలతీర్థం ఆలయంలో తర్పణాలు వదిలే భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున ముందుగానే తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రించడానికి అదనపు పోలీస్ సిబ్బందిని నియమించామని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్ రద్దీ లేకుండా వాహనాల కదలికలు సజావుగా సాగేందుకు ప్రత్యేక ట్రాఫిక్ ఏర్పాట్లు చేశామని వివరించారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.

వాహనాల పార్కింగ్ స్థలం పరిమితంగా ఉండటంతో, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటూ ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి డ్రోన్ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పుకొచ్చారు. తాను స్వయంగా కపిలతీర్థం ఆలయ పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ, అధికారులు, సిబ్బందికి తగిన సూచనలు ఇస్తూ ఏర్పాట్లను పరిశీలించానని పేర్కొన్నారు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు.

ఆలయాన్ని సందర్శించే ఆసుపత్రిని మర్చిపాయె…

ఆలయాన్ని సందర్శించే ఆసుపత్రిని మర్చిపాయె???
మర్రి చెట్టుకున్న విలువ మనుషుల ప్రాణాలకు లేకపాయే???
పక్కనుండే వెళ్లిపోయినా ప్రజలు ఇక్కట్లను గుర్తు చేయని కోటరీ..
బురద నీటితో ఉన్న ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడకపోవటంలో ఆంతర్యం ఏమిటీ
సమయం లేకనా.. సమాచార లోపమా????

నేటి ధాత్రి అయినవోలు :-

 

 

అయినవోలు మండల కేంద్రంలో ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు ఐలోని మల్లికార్జున స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన శివాలమర్రి గా పేరుపొందిన 200ఏళ్ల నాటి మర్రిచెట్టు నేలకొరిగింది. ఇదే విషయంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను మరియు దేవాదాయ శాఖ అధికారుల సమాచారం మేరకు ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు హుటాహుటిన టెక్సబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు తో కలిసి అట్టి శివాల మర్రి స్థలాన్ని సందర్శించారు. అన్ని శాఖల సమన్వయంతో నేలకొరిగిన ప్రతిష్టాత్మకమైన శివాలమర్రి ని మళ్లీ పున ప్రతిష్టాపన చేస్తామని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే అదే అయినవోలు మండలంలో కురుస్తున్న గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా వర్షం నీరు రెండు గేట్ల వద్దనే నిలిచిపోయి లోపలికి వెళ్లేందుకు రోగులు ఇబ్బందులు పడుతున్నారని పత్రికల్లో కథనాలు ప్రచురితం అవుతున్న కూడా ఎమ్మెల్యే పట్టించుకోకుండా వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. మర్రిచెట్టు నేలకొరిగింది అనగానే హుటాహుటిన బయలుదేరి వచ్చిన ఎమ్మెల్యే అదే మండల కేంద్రంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడే ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు పడుతున్నారు. ఇట్టి విషయాన్ని స్థానిక నేతలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడంలో విఫలమయ్యారా. అంటే రోగులకు ఇక్కట్లు తలెత్తుతున్నాయన్నా కూడా ఎమ్మెల్యే అటువైపు కన్నెత్తి చూడలేదు అంటే ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమయ్యారనే చెప్పాలి.ఏది ఏమైనా ఒక చెట్టుకు ఇచ్చిన విలువ మనుషుల ప్రాణాలను కాపాడే ఒక ఆసుపత్రికి ఇవ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రజలు చర్చించుకుంటున్నారు.

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు..

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మైసమ్మ గల్లీలో వినాయక నవరాత్రులలో పూజలు అందుకున్న లడ్డును మాజీ మండల అధ్యక్షుడు బక్కన గారి మంజుల లింగం గౌడ్ 5018 రూపాయలకు కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే నిజాంపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మైసమ్మ గల్లి నిర్వాహకులు కాలనీవాసులు పాల్గొన్నారు

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T124445.869-1.wav?_=2

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంశంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పూజల సందర్భంగా వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ ను ఆలయ కమిటీ నిర్వహికులు ఆహ్వానించారు ఈమేరకు సుమన్ దంపతులను సన్మానం చేశారు ఈసందర్భంగా ఆలయ కమిటీ నిర్వహికులను సుమన్ అభినందించారు ఈకార్యక్రమంలో చిట్యాల నాగరాజు దాచ లక్ష్మినారాయణ గోనూర్ రామకృష్ణ దాచశివ తదితరులు పాల్గొన్నారు

పట్టణంలో వెలిసిన అమ్మవారి విగ్రహం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T153958.695-1.wav?_=3

పట్టణంలో వెలిసిన అమ్మవారి విగ్రహం….

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే వన్ మోరీ ఏరియాలో గల బతుకమ్మ ఘాట్ సమీపంలో అమ్మ వారి విగ్రహం వెలిసింది.గత ఏడాది క్రితం నుండి ఈ ప్రాంతంలో అమ్మవారు ఉన్నట్లు మహిళ భక్తురాలు చెప్తున్నట్లు స్థానికులు అంటున్నారు. శుక్రవారం అమ్మ వారి భక్తురాలు దుర్గా మాతను నెలకొల్పే ప్రాంతంలో అమ్మవారు ఉన్నట్లు తెలుపడంతో స్థానికులు, పూజారి గోల సాయినాథ్ వెళ్ళి చూడగా అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమై వెలసినట్లు తెలుపుతున్నారు.అమ్మవారి విగ్రహం వెలువడంతో పట్టణంలోని ప్రజలు విగ్రహాన్ని తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. అనంతరం పూజారి గోల సాయినాథ్ మాట్లాడారు. లోక కళ్యాణార్థం అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిశారని,అమ్మవారికి గుడి నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతున్నారు. గుడి నిర్మించి పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పట్టణంలోని ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు. స్థానిక నాయకులు కంబగౌని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ… త్వరలోనే పురోహితుల సమక్షంలో అమ్మవారి గుడిని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించేలా చొరవ తీసుకుంటామని అన్నారు.

రేవన సిద్దేశ్వర దేవాలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు..

రేవన సిద్దేశ్వర దేవాలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీటీసీ

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T124208.113.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఈదుల్ పల్లి గ్రామం శ్రీ రేవన సిద్దేశ్వర దేవాలయంలో శ్రీ స్వామివారికి శ్రావణ మాసం మొదటి సోమవారం తాజా మాజీ ఎంపిటిసి శ్రీ శంకర్ పటేల్ దంపతులు రుద్రభిషేకం బిల్వార్చన చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు ఆరోగ్యం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాగణంగా కుంకుమ పూజ కార్యక్రమం.

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాగణంగా కుంకుమ పూజ కార్యక్రమం

చందుర్తి నేటిధాత్రి:

శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రోజున శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణాచారి ఆధ్వర్యంలో మహా ఘనంగా మహిళలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణమాసంలో ఎంతో పవిత్రమైన రోజు శుక్రవారం రోజున ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందాన్ని తెలిపారు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఆలయంలో కనుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆగస్టు 8 రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతము కుంకుమ పూజ మహా ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొగలరని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు మహిళలు పాల్గొన్నారు.

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం..

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-87.wav?_=5

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిక్కిరిసి పోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మందుగా భక్తులు ఆలయం స్వామి వారి అమృత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు “ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ” గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామి వారికి ప్రత్యేక పూజలు..

గురువారం అమావాస్య సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవా, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి క్రతువును నిర్వహించారు. అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ శేఖర్ పటేల్
,కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప,తగిన ఏర్పాట్లు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్. ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం..

గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా మీడియాతో మురుగన్

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 23:

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంట ఊరు తిరుపతి గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి ప్రాయంలో నడిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు గంటా వూరు బీసీ కాలనీ వాసులు ఇదే క్రమంలో భాగంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈరోజు మీడియా సమావేశంలో తెలిపారు వివరాల్లోకి వెళ్తే గడిచిన 20 సంవత్సరాలకు ముందు గంటా వూరు బీసీ కాలనీలో చిన్న ఆలయం ఉండేది అభివృద్ధి చేస్తే ప్రసిద్ధి చెందిన ఆలయంగా అప్పుడే వెలుగులోకి వచ్చేది కానీ ఎవరు అభివృద్ధి చేయకపోవడంతో అలాగే ఉండిపోయింది,ఈ ఆలయాన్ని తమిళనాడు రాష్ట్రానికి
చెందిన మురుగన్ అభివృద్ధి ప్రయాయంలో నడిపిస్తున్నారు,
పలమనేరులో ఉన్న గంగమ్మ గుడి కి దీటుగా తీసుకెళుతున్నారు, ఈ సందర్భంగా ఆయన
మీడియా సమావేశంలో
మాట్లాడుతూ
ఎన్నో కష్టాలు పడుతున్న తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ గుడి ప్రాంగణంలో తన ఆర్థిక పరిస్థితుల గురించి ఆవేదన చెందుతున్న తరుణంలో సాక్షాత్తు అమ్మవారు తనకు ఎంతో సహకరించి తన ఆర్థిక ఇబ్బందులను పోగొట్టుందని అప్పటినుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే దేయంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు, అదే క్రమంలో తన ముందు సహకారం అభివృద్ధి కోసం ముందుకు వచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలుపుతూ ఈ గుడికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచే అభివృద్ధి చేసి చూపుతున్నట్లు ఆయన తెలిపారు, ఇప్పటికే దాదాపు ఆలయ అభివృద్ధి చేశామని ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సహకరిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేసి అమ్మవారి ఆలయాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తామని తెలిపారు, ఇందుకు సహకారంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు, ఈ కార్యక్రమానికి గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీ మెంబర్స్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు..

త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో.!

త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో బోనాల జాతర

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పట్టణ బురద గూడెంలో మహంకాళి బోనాల జాతర….
మంచిర్యాల జిల్లా మందమర్రి బుర్రగూడెంలోని త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో బోనాల జాతర ఉంటుందని భక్తులందరూ పాల్గొని బోనాలను విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు సతీష్ భవాని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని రేపు ఆదివారం మందమర్రి కామాఖ్య ఆలయం లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఈ బోనాల జాతరకు ప్రతి ఇంటి నుండి బోనాలతో రావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు అర్చకులు సతీష్ భవన్ తెలిపారు

హనుమాన్ దేవాలయానికి సిమెంట్ పంపిణి.

హనుమాన్ దేవాలయానికి సిమెంట్ పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని లింగసాని పల్లి గ్రామ హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల వెంకటేష్ గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ నిర్మాణానికి సహకరించమని కోరగా తన వంతుగా సిమెంట్ ని అందజేస్తానని తెలియజేసి, ఆలయ నిర్మాణానికి సిమెంట్ పంపారు.ఈ కార్యక్రమంలో లింగస్వామి పల్లి గ్రామ పెద్దలు రాములు,కిరణ్, శేఖర్ రెడ్డి పరశురాములు, భీమయ్య,సత్యం,శ్రీను, శంకర్ ,వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరావు, రొడ్డ వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్త.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్త చాటుదాం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ ఆవరణలో జరిగిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలు చైతన్యమై మెజార్టీ స్థానాల్లో గెలవాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు కావాలని చెప్పేసి వారు తెలియజేశారు రాష్ట్రంలో మెజార్టీ జనాభా బీసీలు ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా oc మాత్రమే సీఎంలుగా ఉంటున్నారని వచ్చే 2028లో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీనే ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు Dr. పెద్ద గొల్ల నారాయణ కొండాపూర్ నర్సింలు శంకర్ విశ్వనాథ్ యాదవ్ ధనరాజ్ గౌడ్ సంగన్న దత్తు సిద్దు నరసింహ గోపాల్ వేణు లక్షమన్ తదితరులు పాల్గొన్నారు అదే విదంగా వివిధ గ్రామాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం .

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి పై జరిగిన దాడి హేయమైన చర్య

బిజెపి చర్ల మండల అధ్యక్షులు నూపా రమేష్

నేటిదాత్రి చర్ల

చర్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిలర్ నెంబర్ బాబా పాహి మ్ అధ్యక్షతన మండల కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మండల అధ్యక్షులు నూప రమేష్ మాట్లాడుతూ
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం కార్యనిర్వహణాధికారి రమాదేవి పై పురుషోత్త పట్టణంలో దేవస్థానం భూమిలో కొంతమంది ఆక్రమణదారులు మరియు అరాచకవాదులు కలిసి చేసిన భౌతిక దాడి హేయమైన చర్యఅని ఆయన అన్నారు ఈ దాడిని ఖండిస్తూ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు
గతంలో కూడా ఒకసారి ఈవో రమాదేవి పై మరియు ఆలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఇలాంటి దాడిని తీవ్రంగా ఖండిస్తోంది కావున వెంటనే ఈ చర్యలు పాల్పడిన అరాచకవాదులను శిక్షించాలని ఈఓ రమాదేవి ఆరోగ్యంపై తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇర్ఫా సుబ్బారావు కార్యదర్శిలు ముత్తవరపు శ్రీనివాసు చారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యేకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.!

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version