మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు..

మైసమ్మ గల్లీలో లడ్డును కైవసం చేసుకున్న మాజీ మండల అధ్యక్షుడు

నిజాంపేట , నేటి ధాత్రి

 

మెదక్ జిల్లా నిజాంపేట మండలం పరిధిలోని నస్కల్ గ్రామంలో మైసమ్మ గల్లీలో వినాయక నవరాత్రులలో పూజలు అందుకున్న లడ్డును మాజీ మండల అధ్యక్షుడు బక్కన గారి మంజుల లింగం గౌడ్ 5018 రూపాయలకు కైవసం చేసుకున్నాడు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రుల్లో పూజలు అందుకున్న లడ్డును దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు అలాగే నిజాంపేట మండల ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మైసమ్మ గల్లి నిర్వాహకులు కాలనీవాసులు పాల్గొన్నారు

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-03T124445.869-1.wav?_=1

శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ కమిటీ సన్మానము

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంశంకర్ గంజ్ లో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక పూజల సందర్భంగా వర్తక సంగం అధ్యక్షులు పాలాది సుమన్ ను ఆలయ కమిటీ నిర్వహికులు ఆహ్వానించారు ఈమేరకు సుమన్ దంపతులను సన్మానం చేశారు ఈసందర్భంగా ఆలయ కమిటీ నిర్వహికులను సుమన్ అభినందించారు ఈకార్యక్రమంలో చిట్యాల నాగరాజు దాచ లక్ష్మినారాయణ గోనూర్ రామకృష్ణ దాచశివ తదితరులు పాల్గొన్నారు

పట్టణంలో వెలిసిన అమ్మవారి విగ్రహం….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-22T153958.695-1.wav?_=2

పట్టణంలో వెలిసిన అమ్మవారి విగ్రహం….

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కే వన్ మోరీ ఏరియాలో గల బతుకమ్మ ఘాట్ సమీపంలో అమ్మ వారి విగ్రహం వెలిసింది.గత ఏడాది క్రితం నుండి ఈ ప్రాంతంలో అమ్మవారు ఉన్నట్లు మహిళ భక్తురాలు చెప్తున్నట్లు స్థానికులు అంటున్నారు. శుక్రవారం అమ్మ వారి భక్తురాలు దుర్గా మాతను నెలకొల్పే ప్రాంతంలో అమ్మవారు ఉన్నట్లు తెలుపడంతో స్థానికులు, పూజారి గోల సాయినాథ్ వెళ్ళి చూడగా అమ్మవారి విగ్రహం ప్రత్యక్షమై వెలసినట్లు తెలుపుతున్నారు.అమ్మవారి విగ్రహం వెలువడంతో పట్టణంలోని ప్రజలు విగ్రహాన్ని తిలకించేందుకు భారీగా తరలి వచ్చారు. అనంతరం పూజారి గోల సాయినాథ్ మాట్లాడారు. లోక కళ్యాణార్థం అమ్మవారు ఈ ప్రాంతంలో వెలిశారని,అమ్మవారికి గుడి నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించాలని కోరుతున్నారు. గుడి నిర్మించి పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం పట్టణంలోని ప్రతి ఒక్కరిపై ఉంటుందని తెలిపారు. స్థానిక నాయకులు కంబగౌని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ… త్వరలోనే పురోహితుల సమక్షంలో అమ్మవారి గుడిని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్టించేలా చొరవ తీసుకుంటామని అన్నారు.

రేవన సిద్దేశ్వర దేవాలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు..

రేవన సిద్దేశ్వర దేవాలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీటీసీ

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-28T124208.113.wav?_=3

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఈదుల్ పల్లి గ్రామం శ్రీ రేవన సిద్దేశ్వర దేవాలయంలో శ్రీ స్వామివారికి శ్రావణ మాసం మొదటి సోమవారం తాజా మాజీ ఎంపిటిసి శ్రీ శంకర్ పటేల్ దంపతులు రుద్రభిషేకం బిల్వార్చన చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు ఆరోగ్యం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాగణంగా కుంకుమ పూజ కార్యక్రమం.

వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహాగణంగా కుంకుమ పూజ కార్యక్రమం

చందుర్తి నేటిధాత్రి:

శ్రావణమాసం మొదటి శుక్రవారం పురస్కరించుకొని చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రోజున శ్రావణమాసం మొదటి శుక్రవారం సందర్భంగా శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమ పూజ కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు కందాలై వెంకటరమణాచారి ఆధ్వర్యంలో మహా ఘనంగా మహిళలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రావణమాసంలో ఎంతో పవిత్రమైన రోజు శుక్రవారం రోజున ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందాన్ని తెలిపారు ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం ఆలయంలో కనుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు ఆగస్టు 8 రోజున వరలక్ష్మి వ్రతం సందర్భంగా వరలక్ష్మి వ్రతము కుంకుమ పూజ మహా ఘనంగా నిర్వహిస్తామని ఆలయ అర్చకులు తెలిపారు ఇట్టి కార్యక్రమానికి భక్తులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొగలరని ఆలయ అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు భక్తులు మహిళలు పాల్గొన్నారు.

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం..

భక్తులతో కిక్కిరిసిన కేతకి సంగమేశ్వర స్వామి ఆలయం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-87.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. సోమవారం అమావాస్య సందర్భంగా భక్తులతో కిక్కిరిసి పోయింది. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం బారులు తీరారు. తెలుగు రాష్ట్రాలు ఉండే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, తదితర ప్రాంతాల భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మందుగా భక్తులు ఆలయం స్వామి వారి అమృత పుష్కరిణిలో స్నానాలు ఆచరించి జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు “ఓం నమశ్శివాయ అనే పంచాక్షరి నామాన్ని స్మరిస్తూ” గర్భాలయంలోని శ్రీ పార్వతీ సమేత కేతకి సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కాగా భారీగా తరలివచ్చిన భక్తులకు స్వామి వారి దర్శనం కోసం మూడు గంటల సమయం పడుతోంది. ఇంకా భక్తుల రద్దీ కొనసాగుతోంది.

స్వామి వారికి ప్రత్యేక పూజలు..

గురువారం అమావాస్య సందర్భంగా ఆలయంలోని శ్రీ పార్వతీ సమేత సంగమేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవా, అభిషేకం, క్షీరాభిషేకం, పాలాభిషేకం, మహా మంగళ హారతి క్రతువును నిర్వహించారు. అమ్మ వారికి కుంకుమార్చన మహా మంగళహారతి నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ చైర్మన్ శేఖర్ పటేల్
,కార్యనిర్వాహణ అధికారి శివ రుద్రప్ప,తగిన ఏర్పాట్లు చేశారు.

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఝరాసంగం ఎస్సై క్రాంతి కుమార్ పటేల్. ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం..

గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తా మీడియాతో మురుగన్

పలమనేరు(నేటి ధాత్రి) జూలై 23:

చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గంట ఊరు తిరుపతి గంగమ్మ ఆలయాన్ని అభివృద్ధి ప్రాయంలో నడిపించడమే ధ్యేయంగా పెట్టుకున్నారు గంటా వూరు బీసీ కాలనీ వాసులు ఇదే క్రమంలో భాగంగా ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆలయ అభివృద్ధి కోసం కృషి చేస్తామని ఈరోజు మీడియా సమావేశంలో తెలిపారు వివరాల్లోకి వెళ్తే గడిచిన 20 సంవత్సరాలకు ముందు గంటా వూరు బీసీ కాలనీలో చిన్న ఆలయం ఉండేది అభివృద్ధి చేస్తే ప్రసిద్ధి చెందిన ఆలయంగా అప్పుడే వెలుగులోకి వచ్చేది కానీ ఎవరు అభివృద్ధి చేయకపోవడంతో అలాగే ఉండిపోయింది,ఈ ఆలయాన్ని తమిళనాడు రాష్ట్రానికి
చెందిన మురుగన్ అభివృద్ధి ప్రయాయంలో నడిపిస్తున్నారు,
పలమనేరులో ఉన్న గంగమ్మ గుడి కి దీటుగా తీసుకెళుతున్నారు, ఈ సందర్భంగా ఆయన
మీడియా సమావేశంలో
మాట్లాడుతూ
ఎన్నో కష్టాలు పడుతున్న తనకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ గుడి ప్రాంగణంలో తన ఆర్థిక పరిస్థితుల గురించి ఆవేదన చెందుతున్న తరుణంలో సాక్షాత్తు అమ్మవారు తనకు ఎంతో సహకరించి తన ఆర్థిక ఇబ్బందులను పోగొట్టుందని అప్పటినుంచి ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయడమే దేయంగా పెట్టుకుని ముందుకు వెళుతున్నట్లు ఆయన తెలిపారు, అదే క్రమంలో తన ముందు సహకారం అభివృద్ధి కోసం ముందుకు వచ్చి అభివృద్ధి చేస్తున్నట్లు తెలుపుతూ ఈ గుడికి సంబంధించి ట్రస్ట్ ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచే అభివృద్ధి చేసి చూపుతున్నట్లు ఆయన తెలిపారు, ఇప్పటికే దాదాపు ఆలయ అభివృద్ధి చేశామని ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతలు సహకరిస్తే ఇంకా ఎంతో అభివృద్ధి చేసి అమ్మవారి ఆలయాన్ని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేస్తామని తెలిపారు, ఇందుకు సహకారంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన మీడియా సమావేశంలో తెలిపారు, ఈ కార్యక్రమానికి గంటా వూరు తిరుపతి గంగమ్మ ఆలయ కమిటీ మెంబర్స్ మరియు ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు..

త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో.!

త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో బోనాల జాతర

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పట్టణ బురద గూడెంలో మహంకాళి బోనాల జాతర….
మంచిర్యాల జిల్లా మందమర్రి బుర్రగూడెంలోని త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దేవి ఆలయంలో బోనాల జాతర ఉంటుందని భక్తులందరూ పాల్గొని బోనాలను విజయవంతం చేయాలని ఆలయ అర్చకులు సతీష్ భవాని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని రేపు ఆదివారం మందమర్రి కామాఖ్య ఆలయం లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుందని ఈ బోనాల జాతరకు ప్రతి ఇంటి నుండి బోనాలతో రావాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు అర్చకులు సతీష్ భవన్ తెలిపారు

హనుమాన్ దేవాలయానికి సిమెంట్ పంపిణి.

హనుమాన్ దేవాలయానికి సిమెంట్ పంపిణి.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

కల్వకుర్తి నియోజకవర్గం, కల్వకుర్తి మండలంలోని లింగసాని పల్లి గ్రామ హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల వెంకటేష్ గ్రామ పెద్దలు మరియు ఆలయ కమిటీ సభ్యులు ఆలయ నిర్మాణానికి సహకరించమని కోరగా తన వంతుగా సిమెంట్ ని అందజేస్తానని తెలియజేసి, ఆలయ నిర్మాణానికి సిమెంట్ పంపారు.ఈ కార్యక్రమంలో లింగస్వామి పల్లి గ్రామ పెద్దలు రాములు,కిరణ్, శేఖర్ రెడ్డి పరశురాములు, భీమయ్య,సత్యం,శ్రీను, శంకర్ ,వెంకట్ రెడ్డి, వెంకటేశ్వరావు, రొడ్డ వెంకటేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్త.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల సత్త చాటుదాం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ నియోజకవర్గం లోని సంఘం శ్రీ కేతకి సంగమేశ్వర దేవాలయ ఆవరణలో జరిగిన బీసీ రాజకీయ చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి తీన్మార్ మల్లన్న గారు మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో బీసీలు చైతన్యమై మెజార్టీ స్థానాల్లో గెలవాలని వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేలు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు కావాలని చెప్పేసి వారు తెలియజేశారు రాష్ట్రంలో మెజార్టీ జనాభా బీసీలు ఉన్నప్పటికీ 70 ఏళ్లుగా oc మాత్రమే సీఎంలుగా ఉంటున్నారని వచ్చే 2028లో తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి బీసీనే ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు Dr. పెద్ద గొల్ల నారాయణ కొండాపూర్ నర్సింలు శంకర్ విశ్వనాథ్ యాదవ్ ధనరాజ్ గౌడ్ సంగన్న దత్తు సిద్దు నరసింహ గోపాల్ వేణు లక్షమన్ తదితరులు పాల్గొన్నారు అదే విదంగా వివిధ గ్రామాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మరియు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం .

భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి పై జరిగిన దాడి హేయమైన చర్య

బిజెపి చర్ల మండల అధ్యక్షులు నూపా రమేష్

నేటిదాత్రి చర్ల

చర్ల భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిలర్ నెంబర్ బాబా పాహి మ్ అధ్యక్షతన మండల కార్యాలయం నందు జరిగిన సమావేశంలో మండల అధ్యక్షులు నూప రమేష్ మాట్లాడుతూ
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం కార్యనిర్వహణాధికారి రమాదేవి పై పురుషోత్త పట్టణంలో దేవస్థానం భూమిలో కొంతమంది ఆక్రమణదారులు మరియు అరాచకవాదులు కలిసి చేసిన భౌతిక దాడి హేయమైన చర్యఅని ఆయన అన్నారు ఈ దాడిని ఖండిస్తూ ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు
గతంలో కూడా ఒకసారి ఈవో రమాదేవి పై మరియు ఆలయ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారని ఇలాంటి దాడిని తీవ్రంగా ఖండిస్తోంది కావున వెంటనే ఈ చర్యలు పాల్పడిన అరాచకవాదులను శిక్షించాలని ఈఓ రమాదేవి ఆరోగ్యంపై తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఇర్ఫా సుబ్బారావు కార్యదర్శిలు ముత్తవరపు శ్రీనివాసు చారి విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

సోమవారం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ పద్ధతిలో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగాణంలో ఉన్న వేదాశీర్వచన మండపంలో ఎమ్మెల్యేకు పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, ప్రోటోకాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో.!

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా

లక్ష తులసి పుష్పార్చన

వనపర్తి నేటిదాత్రి :

వనపర్తి పట్టణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పుష్పార్చన ప్రత్యేక పూజలు సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథంచార్యులు ఇ ఓ ఎస్ ఆంజనేయులు 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ తిరుమల్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలకు వనపర్తి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు

గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో అగ్ని ప్రమాదం దురదృష్టం..

*గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో అగ్ని ప్రమాదం దురదృష్టం..

*అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ,

అగ్నిమాపక అధికారులు , సిబ్బందికి అభినందనలు.

నగర పాలక సంస్థ మేయర్ డా శిరీష..

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 03:

 

 

 

 

తిరుపతి గోవిందరాజల దేవాలయ ప్రాంతంలోని సన్నిది వీధిలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరం. ప్రమాదం చోటు చేసుకున్న సన్నిది ప్రాంతాన్ని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డా శిరీష సందర్శించారునగర పాలక సంస్థ విపత్తు నివారణ, అగ్ని మాపక శాఖ అధికారి శ్రీనివాస రావుతో కలిసి అగ్ని ప్రమాదానికి గురైన షాపును మరియు సన్నిది వీధిలో ఉన్న ఇతర షాపులను సందర్శించి ఘటన కారణాలను అడిగి తెలుసుకున్నారు.షాపు నిర్వాహకులు అగ్నిప్రమాద శాఖ నిబంధనలు పాటించి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని కోరారు. నిర్లక్ష్యం వద్దు ఆలయ ప్రాంతంలో భక్తుల సందర్శన ఉంటుంది కనుక ఈ ప్రాంతంలో ఉన్న షాపులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

సమగ్ర నివేదిక ఇవ్వాలని విపత్తు నివారణ అగ్ని మాపక శాఖకు ఆదేశం.

రాత్రి జరిగిన అగ్ని ప్రమాదాన్ని సకాలంలో నివారించిన తిరుపతి విపత్తు నివారణ
అగ్ని మాపక అధికారులను, సిబ్బందిని మేయర్ అభినందించారు.అదే సమయంలో గోవిందరాజుల దేవాలయ ప్రాంతంలో జరిగిన ఘటన నేపథ్యంలో నగరంలోని కీలక ప్రాంతాలలో ఉన్న షాపులలో నిబంధనలు పాటించే విధంగా చూడాలని మొత్తం నగర పరిధిలో వాస్తవ పరిస్థితితులపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. తిరుపతి నగరం శ్రీవారి భక్తులు సందర్శించే ప్రాంతం కనుక ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. షాపు నిర్వాహకులకు తగిన జాగ్రత్తలు తీసుకునేలా చైతన్యం కల్పించాలని అదే సమయంలో నిబంధనలు పాటించే విషయంలో రాజీ ధోరణి ఉండకూడదన్నారు.అగ్ని ప్రమాదానికి గురి అయిన షాపుతో సహా మొత్తం పరిస్తితి పై నివేదిక ఇవ్వాలని నగర పాలక సంస్థ విపత్తు నివారణ శాఖను ఆదేశించారు.

మైసమ్మతల్లి గుడికి స్లాప్ ప్రారంభోత్సవం.

మైసమ్మతల్లి గుడికి స్లాప్ ప్రారంభోత్సవం

ఏనుమాముల నేటిధాత్రి:

 

నగరంలోని 14వ డివిజన్ ఏనుమాముల ముసలమ్మ కుంట ఫేస్ వన్ గ్రామంలో మైసమ్మ తల్లి గుడి స్లాప్ ప్రారంభోత్సవ సందర్భంగా ముసలమ్మ కుంట ఫేస్ వన్ డెవలప్ కమిటీ అధ్యక్షుడు కాశెట్టి కమలాకర్ పిలుపుమేరకు సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్ వెళ్లి సందర్శించి వారికి డెవలప్ కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి చేరి రాధాకృష్ణ. సుందరయ్య నగర్ గ్రామ పార్టీ అధ్యక్షుడు. త్రికోవెల శీను. కాలనీలో ఇంకా అభివృద్ధి పనులు ఎక్కువ చేయాలని అన్నారు. డెవలప్మెంట్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శిలు, కోశాధికారి, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

నక్షత్ర హారతి రామాలయానికి అందజేత.

నక్షత్ర హారతి రామాలయానికి అందజేత

గణపురం నేటి ధాత్రి

 

 

 

 

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శనివారం ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా గణపురం మండల కేంద్రంలోని గాంధీనగర్ వాస్తవ్యులు ఎలిగేటి సంధ్యారాణి మురళి ఆర్టిసి డ్రైవర్ దంపతులు స్వామివారికి ప్రత్యేక పూజ నిర్వహించి పూజ అనంతరం ఆలయానికి 5,000 రూపాయలతో నక్షత్ర హారతిని ఇతర పూజ సామాగ్రిని ఆలయానికి అందజేశారు పూజ అనంతరం ఆలయ అర్చకులు మురళి సంధ్యారాణి దంపతులకు తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన్ గౌడ్ కమిటీ సభ్యులు మూల శ్రీనివాస్ గౌడ్ బండారు శంకర్ బటిక స్వామి మాదాసు అర్జున్ బూర రాజగోపాల్ మాదాసు మొగిలి పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితర సభ్యులు భక్తులు పాల్గొన్నారు

కొత్తరంగులతో కనుసొంపైన హనుమాన్ దేవాలయ కమాన్.

కొత్తరంగులతో కనుసొంపైన హనుమాన్ దేవాలయ కమాన్

 

పరకాల నేటిధాత్రి:

 

హన్మకొండ జిల్లా పరకాల మండలపరిధిలోని మల్లక్కపేట గ్రామంలో గల భక్తంజనేయ స్వామి దేవాలయ కమాన్ కొత్త హంగులను పులుముకుంది.ఆలయ ముఖ ద్వారానికి భక్తుల సహ కారంతో నూతనంగా రంగులు మరియు విద్యుత్ దీపాల కాంతులతో కొత్త శోభ సంతరించుకుంది.సమారుగా 80 వేల రూపాయలతో ఈ పనులు జరిగినట్టు ఆలయ చైర్మన్ అంబీరు మహేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఆలయ కమిటీ చైర్మన్ అంబీర్ మహేందర్ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో ఆలయం నూతన వసతులతో విరాజీళ్ళుతుందని చెప్పడానికి ఇదే నిదర్శనంగా చెప్పుకోవచ్చు.ఆలయ అభివృద్దికి సహకరించే దాతలు ఆలయ చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి లను సంప్రదించాలని కోరారు.

ఆలయం అభివృద్ధికి కృషి చేసిన అశోక్.

ఆలయం అభివృద్ధికి కృషి చేసిన అశోక్

భూపాలపల్లి నేటిధాత్రి:

shine junior college

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డులో శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో ఫ్లోరింగ్ చేయించిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకుడు దుర్గం అశోక్ ఆలయం చుట్టుపక్కల పిచ్చి మొక్కలు మొలిసినాయి భక్తులకు దర్శనానికి ఇబ్బందిగా ఉంది ఈ విషయాన్ని గమనించిన దుర్గం అశోక్ భక్తుల కోరిక మేరకు ఆలయం చుట్టుపక్కల సిమెంట్ కంకరతో ఫ్లోరింగ్ చేయించడం జరిగింది. గ్రామస్తులు అశోక్ కు అభినందనలు తెలియజేశారు రాబోయే రోజులలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు వార్డు అభివృద్ధి కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత.

రామాలయానికి పూజా సామాగ్రి అందజేత

గణపురం నేటి ధాత్రి:

shine junior college

గణపురం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ పట్టాభి సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం స్వామివారికి ఆలయ అర్చకులు ముసునూరి నరేష్ ప్రత్యేక పూజ నిర్వహించారు గణపురం మండల కేంద్రంలోని సోమేశ్వర మెడికల్ స్టోర్స్ నిర్వాహకులు పబ్బ. వర్షిని. రాకేష్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు పూజ అనంతరం రాకేష్.వర్షిని దంపతులు 3.000 రూపాయలతో నిత్య ధూప దీప సంబంధించిన పూజా సామాగ్రిని ఆలయ అర్చకులు కి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు తాళ్లపల్లి గోవర్ధన గౌడ్ కమిటీ సభ్యులు బండారు శంకర్ మూల శ్రీనివాస్ గౌడ్ బాటిక స్వామి మాదాసు అర్జున్ మాదాసు మొగిలి బూర రాజగోపాల్ పాండవుల భద్రయ్య దయ్యాల భద్రయ్య ఉయ్యాల బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

శివాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ.

శివాలయ పునర్నిర్మాణానికి భూమి పూజ

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య.

దేవరకద్ర నేటి ధాత్రి:

మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండల కేంద్రంలో ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ సిజీఎఫ్ నిధులు రూ.40 లక్షలతో చేపట్టిన శివాలయం పునర్నిర్మాణంకు సంబంధించి బుధవారం దేవాలయం వద్ద చేపట్టిన పునర్నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం అడ్డాకుల మండలం రాచాల గ్రామంలో.. గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రో” జయశంకర్ బడిబాట కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.

Shiva temple

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అందరు చదువుకోవాలని లక్ష్యంతో. బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడి బాట కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో మెరుగైన సౌకర్యాలతో పాటు అర్హత, అనుభవం కలిగిన టీచర్లున్నారని, విద్యార్థులు చదువుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని, ఇప్పటికే అన్ని స్కూళ్లకు యూనిఫాం లు, పాఠ్యపుస్తకాలను చేర్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version