ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి…

ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మం డల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు తదనంతరం దీన్ దయాల్ ఉపాధ్యాయ స్మరిం చుకుంటూ మండల అధ్యక్షు డు నరహరిశెట్టి రామకృష్ణ మాట్లాడుతూ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జీవిత సారాన్ని గుర్తు చేశారు.పండి ట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ స్థాపకులలో ఒకరు. ఆయన జీవితం ఏకత్వం, మానవతా భావన, అంత్యో దయ సిద్ధాంతాల స్పష్టమైన ప్రతీక. విద్యార్థులు, యువత మరియు ప్రజల జీవితాలను మార్గదర్శకంగా మార్చిన ఆయ న సిద్ధాంతాలు, సూత్రాలు ప్ర స్తుత సమాజానికి స్ఫూర్తి ఇస్తాయని పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ విద్యారంగం లో చేసిన సేవలు, సామాజిక సదుపాయాల పట్ల ఆయన ఇచ్చిన దృష్టి, మానవతా సూత్రాలపట్ల ఆయన ప్రతిబద్ధ తపై ప్రత్యేకంగా స్పష్టంగా చెప్పారు. పండిట్ దీన్ దయా ల్ ఉపాధ్యాయ ఆలోచనలు, సమాజంలోని అసమానతల నివారణకు మార్గం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం వంటి విలువలను ప్రతిబింబి స్తాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి భూతం తిరుపతి, యువర్ మోర్చా జిల్లా నాయ కులు కొత్తపల్లి శ్రీకాంత్ మండ ల ఉపాధ్యక్షుడు కోమటి రాజ శేఖర్, భూత్ అధ్యక్షులు బాసా ని నవీన్,గొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు….

ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు

ఏడునూతుల నిషిధర్ రెడ్డి
బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలోని మంజు నగర్ లో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి ఆధ్వర్యంలో “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ” జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరబెల్లి రఘునాథ్ హాజరయ్యారు.ముందుగా పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ..పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సాధారణ ప్రజల కోసం, సమాజంలో చివరి అంచున ఉన్నవారి కోసం ఆలోచించిన మహానుభావుడు,ఆయన అంత్యోదయ తత్వం ‘చివరి వ్యక్తి అభ్యున్నతి’ అనే ఆలోచన నేటికీ దేశానికి మార్గదర్శనం చేస్తోంది. ప్రతి కార్యకర్త ఆయన బాటలో నడవాలి.ఆయన ఆలోచనలే మన బీజేపీకి బలమైన పునాది” అని పేర్కొన్నారు.
తరువాత జరిగిన మేధావుల సదస్సులో ఆయన మాట్లాడుతూ…
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 11 ఏళ్లుగా నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నారని,ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచ వేదికపై మరింత గౌరవాన్ని సంపాదించిందని, పేదలకు సంక్షేమ పథకాల రూపంలో మోదీ చేస్తున్న సహాయం కోట్లాది కుటుంబాలకు ఆశాకిరణంగా నిలుస్తోందని,ఉజ్వల యోజన,జనధన్ ఖాతాలు, ఆయుష్మాన్ భారత్, హర ఘర్ విద్యుత్, స్వచ్ఛ భారత్ వంటి పథకాలతో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతోంది. మోదీ 11 ఏళ్ల పాలనలో పారదర్శకత, అవినీతి రహితత, సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధానంగా నిలిచాయి అని వివరించారు.సింగరేణి కార్మికులు రాత్రి పగలు కష్టపడి దేశానికి “బొగ్గు సరఫరా చేస్తున్నారు.వారి శ్రమ వల్ల పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు అండగా నిలుస్తోంది, భద్రత, వైద్యం, గృహ వసతి, బోనస్ మరియు పింఛన్ సౌకర్యాలను అందిస్తోంది. భవిష్యత్తులో కూడా వారి శ్రేయస్సు కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది అని మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిషిధర్ రెడ్డి మాట్లాడుతూ
“దీన్ దయాల్ ఉపాధ్యాయ్ గారి ఆలోచనలను ప్రతి కార్యకర్త జీవన సూత్రంగా తీసుకోవాలి. బీజేపీ యొక్క ప్రతి అడుగు పేదల కోసం, కార్మికుల కోసం, రైతుల కోసం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే మనం కూడా ప్రజలతో మమేకమై కష్టనష్టాలను అర్థం చేసుకుంటూ కృషి చేయాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య,పార్లమెంట్ కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు,జిల్లా ప్రధాన కార్యదర్శి లు దొంగల రాజేందర్, పెండ్యాల రాజు, తాటికొండ రవి కిరణ్,జిల్లా కార్యదర్శి భూక్య భాగ్య,జిల్లా మీడియా కన్వీనర్ మునెందర్,కార్యాలయ కార్యదర్శి తిరుపతి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలసాని తిరుపతిరావు, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు సయ్యద్ గాలిఫ్,అర్బన్ అధ్యక్షులు గీస సంపత్, రూరల్ అధ్యక్షులు పులిగుజ్జు రాజు నాయకులు సునీత,కొమరన్న, శివకృష్ణ తదితరులున్నారు.

మండలంలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు…

మండలంలో ఘనంగా పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు
* నివాళులర్పించిన బిజెపి జిల్లా కౌన్సిల్ నెంబర్

మహాదేవపూర్ సెప్టెంబర్ 25 (నేటి ధాత్రి)

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యర్యంలో బీజేపీ జిల్లా కౌన్సిల్ నెంబర్ ఆకుల శ్రీధర్ అధ్యక్షతన గురువారం రోజున శ్రీ పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా బస్ స్టాండ్ ఆవరణలో వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులూ అర్పించారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాజీ అధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రo సిద్ధాంతకర్త అని, పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ 1916 సెప్టెంబర్ 25 న ఉత్తరప్రదేశ్ లోని మధుర దగ్గర ‘నగ్ల’ చంద్రబాన్ అనే గ్రామంలో జన్మించారని, మొదట కొద్దీ మంది స్వయం సేవకులలో ఒకరిగా చేరి ప్రాదేశీక సహా ప్రచారక్ స్థాయికి ఏదిగారని, భారతీయ జనతా పార్టీ హైందవ రాష్ట్రం సిద్ధాంతానికి పునాదిగా చెప్పబడే ఏకత్మాత మానవతా వాదం, శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు రచించారాని, ఏకాత్మ మానవవాదం ప్రవచించి సమాజంలో అట్టడుగునా వున్నా వ్యక్తికి ప్రభుత్వ పథకాల్లో తొలి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ విధానాన్ని రూపొందించిన శ్రీ పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్బంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులని వారు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాదేవపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రాంశెట్టి మనోజ్, మండల ప్రధాన కార్యదర్శి బల్ల శ్రావణ్ కుమార్, బీజేపీ నాయకులు దాడిగేలా వెంకటేష్, శంకర్, శ్రవణ్, మహేష్, రాకేష్, హరీష్, పాల్గొన్నారు,

పండిత్ దిన్ డయల్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలి….

పండిత్ దిన్ డయల్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలి.

బిజెపి మండలధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్.

చిట్యాల,నేటిధాత్రి :

 

చిట్యాల మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో పండిత్ దీందాయల్ ఉపాధ్యాయ 109వ జయంతిని బిజెపి చిట్యాల మండల బుర్ర వెంకటేష్ గౌడ్ అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు
అనంతరం ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర లోని జీవితం నాగ్ల చంద్రబాన్ గ్రామంలో1916 సెప్టెంబర్ 25న జన్మించారని ఆయన చిన్ననాటి నుండే దేశభక్తిని అలవర్చుకొని రాష్ట్రీయ స్వయంసేవక్ (సంఘ్ ఆర్ఎస్ఎస్) లో సహా ప్రచారక్ పనిచేశారని దేశం కోసం ధర్మం కోసం కీలకంగా పనిచేశారని మంత్రం శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి ప్రో బలంతో జనసంఘలో స్థాపనలో కీలకంగా వ్యవహరించాలని ఉపాధ్యక్షులుగా కార్యదర్శులుగా వ్యవహరించి జన సంఘం అధ్యక్షులుగా కూడా పనిచేశారని లక్నో దినపత్రిక స్వదేష్ లకు సంపాదకీలుగా ఏకాత్మత మానవ వాదం శంకరాచార్య జీవిత చరిత్ర వంటి పుస్తకాలు హిందీలో చంద్రగుప్త మౌర్య నాటకం మరాటి వంటి ఆధ్యాత్మిక దృష్టిలో పెట్టుకొని మానవ సేవ చేయడమే సరైన జీవిత విధానమని ఆయన నమ్మారని ,దేశం కోసం ధర్మం కోసం పనిచేసిన దీన్ దాయల్ ఉపాధ్యాయ గారిని ఆదర్శంగా తీసుకొని ఆశయాలను కొనసాగించాలని వెంకటేష్ గౌడ్ అన్నారు ,ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు మైదం శ్రీకాంత్ చెక్క నరసయ్య నీలి సుధాకర్ రెడ్డి గుర్రపు రవి ఏ లేటి శ్రీనివాస్ రెడ్డి బండారి భద్రయ్య అనుప మహేష్ కేంసారాపూ ప్రభాకర్ మదరపు రాజు గొపగాని రాజు బురి తిరుపతి బోయిని అజయ్ కధం రాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version