మాజీ ఎంపీటీసీ కుటుంబానికి ఆర్ధిక సహాయం…

మాజీ ఎంపీటీసీ కుటుంబానికి ఆర్ధిక సహాయం

రూ.50 వేలు ఆపన్నహస్తం అందించిన మాజీ జెడ్పీ చైర్మన్ ఆకుల శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఇటీవల గుండెపోటుతో మరణించి దుగ్గొండి మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయి కుమార్ దశ దినకర్మ సోమవారం దేశాయిపల్లి గ్రామంలో జరగగా వారి కుటుంబాన్ని పరామర్శించిన వరంగల్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ యాభై వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. తమతో కలిసి ఉండే వ్యక్తి ఆకస్మాతుగా మరణించడంతో పెద్ద దిక్కును కోల్పోయిన సాయి కుమార్ కుటుంబానికి అండగా ఉంటానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. మాజీ ఎంపీటీసీ గా చేసిన సేవలను గుర్తుంచుకొని మానవతా దృక్పధంతో పార్టీలకు అతీతంగా శంబయ్యపల్లి గ్రామస్తులు స్వచ్చందంగా ముప్పై ఒకవెయ్యి ఆరువందల రూపాయలను సేకరించి సాయి కుమార్ కుటుంబ సభ్యులకు అందజేశారు. వీరితో పాటుగా బిఆర్ఎస్ జిల్లా నాయకులు వంగేటి అశోక్ కుమార్, పెండ్యాల రాజు ఇరువురు కలసి ముప్పై ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించారు.

సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు…

సాయికుమార్ మరణం దుగ్గొండి యువతకు తీరనిలోటు

దశదినకర్మ సందర్భంగా రక్తదాన శిబిరం

మాజీ ఎంపీటీసీ సాయికుమార్ యాదిసభలో పలువురు నివాళులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపిటిసి, జిల్లెల్ల సాయికుమార్ మరణం దుగ్గొండి మండల యువతకు స్థానిక ప్రజలకు తీరనిలోటని నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అధ్యక్షుడు కందికొండ మోహన్,పలువురు నేతలు అన్నారు.దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లె గ్రామానికి చెందిన దుగ్గొండి మండల కేంద్రం మాజీ ఎంపీటీసీ జిల్లెల్ల సాయికుమార్ ఈ నెల 4 గుండెపోటుతో మరణించారు.కాగా సోమవారం దశదిన కర్మ కాక్యక్రమం సందర్బంగా
కుమారుడు జిల్లెల ఉమేష్ రక్తదాన శిబిరం నిర్వహించారు.ఈ నేపథ్యంలో సుమారు 30 మంది యువకులు రక్తదానం చేశారు.అలాగే సాయికుమార్ సంస్మరణ యాదిసభ ఏర్పాటు చేశారు.మాజీ మావోయిస్టు నేతలు భారతక్క,సిద్ది రాజు,మురళీ తో ప్రజాసంఘాలు,కుల సంఘాలతో పాటు వివిధ పార్టీల నేతలు నాయకులు పాల్గొన్నారు.సాయి కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం బార్య రమ, కుమారుడు ఉమేష్, కుతురు లక్ష్మిప్రసన్నలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఆయన చేసిన సేవలు జ్ఞాపకాలు గుర్తుకు చేశారు.ఈ కార్యక్రమాలలో జిల్లెల్ల శ్రీనివాస్,కందికొండ నవిన్, కందికొండ రాజు,మద్దూరి ప్రశాంత్, బూస రమేష్,
బూస శోభన్, గాండ్ల సందిప్, వల్లె విజెందర్, బూస ప్రశాంత్, తుత్తూరు లవకుమార్,నల్లబెల్లి చిరంజివి, పెళ్లి రాజశేకర్, జిల్లెల్ల మోహన్,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version