సర్దార్ పటేల్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఓదెలలో రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం…

సర్దార్ పటేల్ స్ఫూర్తిని గుర్తుచేస్తూ ఓదెలలో రన్ ఫర్ యూనిటీ ప్రోగ్రాం…
ఎస్సై దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి :

 

పోత్కపల్లి పోలీసుల ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినోత్సవం సందర్భంగా ‘రాష్ట్రీయ ఏక్తా దివస్ – 2025’ ను పురస్కరించుకొని పోత్కపల్లి పోలీసు విభాగం ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం నిర్వహించనున్నట్లు ఎస్సై దీకొండ రమేష్ తెలిపారు. ఈ కార్యక్రమం భాగంగా 2 కిలోమీటర్ల రన్ ఉదయం 6:00 గంటలకు ఓదెల జగదాంబ సెంటర్ నుండి ఒర్రెగడ్డ వరకు నిర్వహించబడుతుంది.
దేశ ఐక్యత, సమగ్రత, సోదరభావాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమంలో మండలంలోని ప్రజలందరూ, యువత, విద్యార్థులు, ప్రభుత్వ సిబ్బంది, అన్ని సంఘాల ప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని ఎస్సై రమేష్ పిలుపునిచ్చారు.
దేశ నిర్మాణంలో ఏకత అత్యవసరం. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి మహానేత స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ రన్ ఫర్ యూనిటీ లో భాగస్వామ్యం అవ్వాలి అని ఆయన పేర్కొన్నారు.

“రన్ ఫర్ యూనిటీ”లో భాగమవ్వండి…

“రన్ ఫర్ యూనిటీ”లో భాగమవ్వండి…

ఆర్కే పి ఎస్ఐ జి రాజశేఖర్

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

రన్ ఫర్ యూనిటీ అనేది సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఏటా అక్టోబర్ 31న నిర్వహించే ఒక మారథాన్ అని, ఇది దేశ ఐక్యతను చాటడానికి ఉద్దేశించబడింది అని రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ అనే నినాదంతో రామకృష్ణాపూర్ పట్టణ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా 2 కే రన్ నిర్వహిస్తుందని పట్టణంలోని విద్యార్థులు, యువకులు, నాయకులు, ప్రతీ ఒక్కరు పెద్ద ఎత్తున పాల్గొని 2కే రన్ ను విజయవంతం చేయాలని ఎస్సై తెలిపారు. ఉదయం సింగరేణి ఠాగూర్ స్టేడియం నుండి రామాలయం చౌరస్తాలోని హనుమాన్ విగ్రహం వరకు 2 కే రన్ ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ ఏక్తా దివాస్ వేడుకలను రామకృష్ణాపూర్ లో ఘనంగా నిర్వహిస్తున్న సందర్భంగా జాతీయ సమైక్యతను చాటిచెప్పే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని రామకృష్ణాపూర్ పోలీస్ విభాగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, ప్రజలందరూ 2కే రన్ లో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version