విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి…

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలి

ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మండల విద్యాశాఖ అధికారి రమాదేవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలకు మండల స్థాయి కబడ్డీ కోఖో క్రీడల ప్రారంభోత్సవం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంపీడీఓ పెద్ది ఆంజనేయులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని తెలిపారు.అనంతరం ఆంజనేయులు వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం జిల్లా స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు టీషర్టులు ఉచితంగా అందిస్తానన్నారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య,నోడల్ అధికారి నామాని సాంబయ్య,గెజిటెడ్ ప్రదానోపాద్యాయులు సురేందర్,మదు బాస్కర్,పీడీలు శ్యాం,రజిత ,వినయ్ ,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు,పీఈటీలు పాల్గొన్నారు.

నులి పురుగుల మందులు తప్పనిసరి

 

నులి పురుగుల మందులు తప్పనిసరి

పరకాల ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

పరకాల పట్టణ మరియు పరిసర ప్రాంత పాఠశాలల విద్యార్థులు పిల్లలు మరియు పెద్దలు ఇద్దరూ నులిపురుగుల నివారణ మాత్రలు తీసుకోవాలి ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ సాధారణంగా,ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా నులిపురుగుల ఇన్ఫెక్షన్లను నివారించవచ్చని అన్నారు.పిల్లల పొట్టలో నులిపురుగులు చేరితే రక్తహీనత,పోషకాల లోపం, ఆకలి మందగించడం,కడుపు నొప్పి,వికారం,వాంతులు, విరేచనాలు,బరువు తగ్గడం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వీటికి నివారణగా వైద్యుల సూచనల మేరకు తప్పనిసరిగా పిల్లలు ఆల్బండాజోలు మాత్ర వేసుకోవాలని,ఎవరైనా వేసుకోకుంటే మాప్ అప్ డే రోజు 18వ తేదీన తప్పని సరిగా వేసుకోవాలని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version