మరోసారి గొప్ప మనసు సాటుకున్న మహా రాజ్…

మరోసారి గొప్ప మనసు సాటుకున్న మహా రాజ్…

మృతిడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన ఎస్ఐ రాజ్ కుమార్…

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని తాటి గూడెం గ్రామానికి చెందిన కొమరం నాగేశ్వరరావు అనారోగ్యంతో ఇటీవల మరణించారు, మృతుని కుటుంబ సభ్యులకు ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న నేపథ్యంలో.. ఈ విషయం తెలుసుకున్న ఇంతకుముందు ఈ బయ్యారం మండలంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసినటువంటి ఎస్ఐ రాజ్ కుమార్, వారి కుటుంబానికి 5000/. నగదు ఆర్థిక సహాయం చేశారు.

మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ రాజకుమార్ మంచి మనసుతో.. అప్పుడప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదవాళ్ళకి, కష్టాలతో సతమతమవుతున్న వారికి యువతకి వాలీబాల్ క్రికెట్ క్విట్స్ ఇచ్చి యువతను సన్మార్గంలో నడిపిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ తనవంతు ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సాయం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్న, గొప్ప మనసున్న.. ఎస్ఐ రాజ్ కుమార్, కి మృతుడి కుటుంబ సభ్యులు గ్రామ యువత పెద్దలు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తాటి గూడెం గ్రామ పెద్దమనుషుల యువత సమక్షంలో అందజేయడం జరిగింది…

మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎఫ్ ఆర్ ఓ తేజస్వి ఆర్థిక సహాయం అందజేత…

మృతి చెందిన వ్యక్తి కుటుంబానికి ఎఫ్ ఆర్ ఓ తేజస్వి ఆర్థిక సహాయం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి…

 

తను ఒక ఆడపిల్లనని గర్వించి ముగ్గురు చిన్న ఆడపిల్లలు ఉన్న తండ్రి చనిపోవడంతో మానవత్వం చాటుకున్న ఎడుల్ల బయ్యారం ఎఫ్ ఆర్ ఓ తేజస్వి కరకగూడెం మండలం తాటి గూడెం గ్రామంలో కొమరం నాగేశ్వరరావు అనే వ్యక్తి అనారోగ్యంతో గత 25 రోజుల నుంచి హాస్పటల్లో ఉంటూ నిన్న రాత్రి హైదరాబాదులో మరణించారు అతనికి ముగ్గురు ఆడపిల్లలే వాళ్లు కూడా చిన్నవారని తెలుసుకున్న మహిళా అధికారిని ఏడుల బయ్యారం రేంజ్ ఎఫ్ఆర్ఓ తేజస్వి వారికి తన వంతు ఆర్థిక సహాయంగా 5000 రూపాయలు తన సహాయకుడి ద్వారా అందించడం జరిగినది, ఆడపిల్లలు ఎప్పుడు కూడాను తల్లిదండ్రులకి భారం కాకూడదని తన మనోవేదన ద్వారా తెలియజేయడం జరిగినది కనుక కుటుంబంలో మగ పిల్లగాడు ఎంతో ఆడపిల్ల కూడా అంతే అని ఆడపిల్లలు ఉన్న ప్రతి కుటుంబానికి తనదైన శైలిలో తెలియజేయడం జరిగినది.
, ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు
పోలె బోయిన సాంబశివరావు, రామారావు, కొమరం కాంతారావు
గ్రామ పెద్ద మనుషులు బంధువులు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు…

ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు

* మహదేవపూర్ సెప్టెంబర్10నేటి ధాత్రి *

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని
తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు రజక సంఘం ఆధ్వర్యంలో చెన్నూరి వెంకటయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం జరిగింది.
వీర నారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించిన చాకలి ఐలమ్మ గారి గురించి మాట్లాడుతూ మన తెలంగాణ సాయుధ పోరాట యోధురాలని మరియు చాకలి ఐలమ్మ సామాజిక మానవత్వం కోసం అణిచివేతకు వ్యతిరేకంగా తన జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు ఐలమ్మ పోరాటం కేవలం ఒక వర్గానికి కాకుండా మొత్తం సమాజానికి స్ఫూర్తిదాయమని నేటి యువత ఐలమ్మ ధైర్యసహసాలను ఆదర్శంగా తీసుకొని సమాజంలో న్యాయం మానవత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో చెన్నూరి
వెంకటయ్య బోనగిరి చంద్రయ్య చెన్నూరు శివ, నస్పూరిసాయి, నరేష్, రాంబాబు, మరియు రజక సంఘం సభ్యులు యువకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version