విద్యాసంస్థల బందుకు బిఎస్యు ఆర్గనైజేషన్ సంపూర్ణ మద్దతు..

విద్యాసంస్థల బందుకు బిఎస్యు ఆర్గనైజేషన్ సంపూర్ణ మద్దతు

బిఎస్యు ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మందసురేష్

పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో కాలేజీల్లో నేలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ రేపు విద్యార్థి సంఘల నాయకుల ఆధ్వర్యంలో బంధు ప్రకటించడం జరిగింది.ఈ బందుకు బహుజన స్టూడెంట్స్ యూనియన్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మందసురేష్ సంపూర్ణ తెలుపుతున్నామని అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ
ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని అనేక ఏళ్లుగా విద్యార్థి సంఘాలు పోరాటాలు చేశామని,ఎంత చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్లే విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయని,పెండింగ్లో ఉన్న ఎనిమిది వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు బకాయాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ప్రభుత్వ విద్య సంస్థల్లో మౌలిక సదుపాయాలను కల్పించే విధంగా నిధులను కేటాయించాలని,బెస్ట్ అవైలబుల్ నిధులను విదల చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు.

పుస్తక పటనం చాలా మంచిది.

పుస్తక పటనం చాలా మంచిది.

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముందు నవతెలంగాణ పత్రిక వారు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన షాపును సిఐ నాగార్జున, ఎస్. ఐ మాధవ రెడ్డి తో కలిసి సందర్శించారు. సీఐ నాగార్జున మాట్లాడుతూ..పుస్తకాలు చదవడం వల్ల వ్యక్తిత్వ వికాసం, మెరుగైన భాషా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి మరియు ఏకాగ్రత మెరుగుపడతాయని అలాగే, ఒత్తిడి తగ్గి, జ్ఞానం పెరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పరశురాములు, పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శివ తదితరులు ఉన్నారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం..

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకులుగా పనిచేసేందుకు ఈనెల 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ అస్లం ఫర్ కి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, బాటనీ జువాలజీ, కెమిస్ట్రీ కంప్యూటర్ సైన్స్ ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. 24వ తేదీన సంగారెడ్డి తార డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని చెప్పారు.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలి.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయాలి

* పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్.*

హైదారాబాద్/వికారాబాద్,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అలాగే ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికట్టాలని,రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23 న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు.ఈ సందర్భంగా పిడిఎస్యు రంగారెడ్డి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువస్తామని చెప్పి తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందనీ అన్నారు.ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి దిక్కులేడని తక్షణమే నియమించాలన్నారు. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డీఈవో పోస్టులను భర్తీ చెయ్యాలనీ డిమాండ్ చేశారు. ఇంటర్ కళాశాలలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలనీ, పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ విద్యాసంస్థలలో మౌలిక సదుపాయాలు కల్పించి,నిధులు కేటాయించాలని కోరారు.బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలన్నారు.సంక్షేమ హాస్టల్ తో పాటు గురుకులాలకు సొంతభవనాలు నిర్మాణం చేయాలని అలాగే ప్రతి మండలంలో గురుకులాలు,మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.విద్యార్థులందరికీ ఉచిత బస్ పాసులు ఇవ్వాలని,నూతన జాతీయ విద్యా విధానాన్ని తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ 23న వికారాబాద్ జిల్లాలో ఉన్న ప్రైవేటు పాఠశాలల, జూనియర్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ లో భాగస్వామ్యం కావాలనీ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీడీఎస్యు వికారాబాద్ ఇంచార్జ్ కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్,ఎస్ఎఫ్ఐ నాయకులు శేఖర్,సంగమేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.

జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి

 

జులై 23న విద్యాసంస్థలు బంద్ ను జయప్రదం చేయండి

 

మండల ఉపాధ్యక్షులు చెట్టుపల్లి చందు

మంగపేట: – నేటి ధాత్రి

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మంగపేట మండల కమిటీ తరపున రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు కళాశాలలు విజయవంతం చేయండి ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు శెట్టిపల్లి చందు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థులకు న్యాయం చేయలేదని విద్యార్థి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేసి ప్రభుత్వానికి సరైన జవాబు చెప్పిన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం మారినా గాని రెండు సంవత్సరాలు గడుస్తున్న విద్యార్థులకు ప్రాముఖ్యంగా విద్యా శాఖ మంత్రి లేనటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా విద్యా రంగానికి 15% నిధులు కేటాయించాలని రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బిల్లులు విడుదల చేయాలని విద్యార్థులకు బస్సు సౌకర్యాలు బస్సు చార్జింగ్ తగ్గించాలని పూర్తిస్థాయిలో విద్యార్థులకు హాస్టల్లో స్కూల్లలో మౌలిక సదుపాయాలు అకాడమిక్ ఇయర్ ప్రారంభమైన విద్యార్థులకు ఎటువంటి న్యాయం చేయడం లేదని గత ప్రభుత్వం చేసినట్టే ఈ ప్రభుత్వం చేస్తుంది విద్యార్థులు తలచుకుంటే ఏదైనా చేస్తారని ఎస్ఎఫ్ఐగా వారు హెచ్చరించారు అదేవిధంగా విద్యార్థులకు విద్యాశాఖ మంత్రి కేటాయించాలని జూనియర్ కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన అమలు చేయాలని ఖాళీగా ఉన్న టీచర్స్ లెక్చరర్స్ పోస్ట్లు ఎంఈఓ డీఈవోలు పోస్టింగులు అమలు చేయాలని అదేవిధంగా ప్రవేట్ విద్యా సంస్థలపై ప్రభుత్వం బాధ్యత వహించాలని మరియు ప్రైవేటు యూనివర్సిటీలపై పూర్తిగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు బాధ్యత ప్రభుత్వ వహించాలని ఇప్పటికే స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్ విడుదల కాక ప్రైవేట్ కళాశాలలో యాజమాన్యులు సర్టిఫికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి నెలకొంది హాస్టల్లో టైం టేబుల్ ప్రకారంగా విద్యార్థులకు మెస్ పాటించాలని అన్నారు రాష్ట్రంలో మాటల్లో తెలియజేశారు గాని చేతుల్లో లేదని ప్రజా పాలన చేస్తామని ప్రజలకు ఎటువంటి న్యాయం లేనటువంటి పరిస్థితి కూడా నెలకొంది దీనిపై ప్రభుత్వం చెయ్యాలని అన్నారు లేని ఎడల గత ప్రభుత్వం లెక్కే ఈ ప్రభుత్వానికి కూడా విద్యార్థులను ఏకమై సమాధానం చెప్తామని సూచన తెలియజేశారు
లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులం వారి తల్లిదండ్రులతో పాటు ఆందోళన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు

 

శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ..

*శ్రీ ఆదర్శవాణి పాఠశాలలో ఘనంగా
బోనాల పండుగ*

నర్సంపేట,నేటిధాత్రి:

బోనాల పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని దుగ్గొండి మండల కేంద్రంలోని శ్రీ ఆదర్శవాణి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.వేడుకలలో భాగంగా అధ్యాపకుల బృందం ఆధ్వర్యంలో ప్రత్యేక బోనాలు తయారు చేసి సంబరాలకు ముస్తాబు చేశారు.అలాగే విద్యార్థులు పోతురాజుల వేషధారణ నృత్యాలతో బ్యాండ్ మేళాలతో అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ ఆదర్శవాణి విద్యాసంస్థల చైర్మన్ నాగనబోయిన రవి, డైరెక్టర్ బత్తిని బిక్షపతి బోనాల విశిష్టత గూర్చి తెలియజేశారు. చైర్మన్ రవి మాట్లాడుతూ వర్షాకాలంలో చేసుకునే గొప్ప పండుగ బోనాల పండుగ అని, ప్రతి ఒక్కరూ జరుపుకునే పండుగ బోనాల పండుగ పట్ల సంస్కృతి సాంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేయాలని కోరారు.ప్రిన్సిపల్ స్రవంతి మాట్లాడుతూ ఆడపడుచులు అమ్మవారికి ఉపవాసం ఉండి భక్తితో బోనం ఎత్తుకొని ఆడంబరంగా బోనాన్ని సమర్పిస్తారని అన్నారు. అందరూ ఆయురారోగ్యాలు, పాడిపంటలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు పాటలతో ఎంతగానో అలరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.

బాబోయ్ ప్రయి’వేటు’ పాఠశాల..?

బాబోయ్ ప్రయి’వేటు’ పాఠశాల..?

చదువు కొనాల్సిందే…

విద్య హక్కు చట్టమా నీవెక్కడ..?

సదువు సారేడు,ఫిజులు బారేడు…

ఉన్నత అధికారుల పర్యవేక్షణ కరువు…

విద్య అంగట్లో వ్యాపారమేనా..?

పుస్తకాలతో పాటు అన్ని పాఠశాలలో అందుబాటులో…

ఎం ఆర్ పి కంటే అధిక రేటుకు అమ్మకాలు…

విద్యాశాఖ అలసత్వం విద్యార్థులకు శాపమేనా…

నేటి ధాత్రి -మహబూబాబాద్ :-

సదువు సారేడు ఫిజులు బారేడు అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల తీరు చూస్తే.ఉన్నత చదువులు అంగట్లో అందుబాటులో ఉన్నాయి అన్నట్లు ఉంది ప్రయివేటు పాఠశాలల పనితీరు.మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రయివేటు పాఠశాలల దందా మూడు పువ్వులు అరుకాయలుగా సాగుతుంది.ఉన్నత చదువులు విద్యార్థుల తల్లిదండ్రులకు భారంగా మారాయి.ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా తాము పెట్టిందే సిద్ధాంతం అంటూ అధిక ఫిసులు వసులు చేస్తుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పెను భారంగా మారింది. స్కూల్ మొదలు అడ్మిషన్ ల పేరుతొ వేలకు వేలు వసులు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వం నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పాఠ్యపుస్తకాలు అమ్మకూడదని ఆదేశాలు ఉన్న, తమకేమి పట్టనట్లు ఎం ఆర్ పి కి మించి ఇష్టానుసారంగా పాఠ్యపుస్తకాలు,నోటు పుస్తకాలు అమ్ముతు లక్షలు గడిస్తున్నారు.స్కూల్ యూనిఫామ్ లతో పాటు టై లు, బెల్ట్ లు, షు లు అన్ని అంగట్లో అందుబాటులో ఉన్నాయంటూ పవిత్ర పాఠశాలను అంగడి సంతగా మారుస్తున్నారు. ఇదంతా తెలిసిన విద్యాశాఖ అధికారులు సైతం తమకేమి పట్టనట్లు వ్యవహరించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ గోడును ఎవ్వరి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.

మరోవైపు ఉన్నత చదువులకై ప్రభుత్వ గురుకుల, నవోదయ ఎంట్రెన్స్ పరీక్షలు రాసిన విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో టిసి కోరగా దానికి సైతం వేలల్లో డబ్బులు వసులు చేస్తున్నారు.నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వం గుర్తించి నవోదయ, గురుకుల వంటి పాఠశాలల్లో సిటు అందించినప్పటికీ,ప్రయివేట్ పాఠశాలల చేతివాటం వల్ల అధికాస్త తల్లిదండ్రులకు శాపంగానే మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు ప్రయివేటు పాఠశాలలలో మొత్తం ఒక్కసారిగా కడితే 10% డిస్కౌట్ అంటూ ఆఫర్ లు సైతం పెడుతున్నప్పటికీ అధికారులు మాత్రం అటు వైపు కన్నీత్తి చూడటం లేదు. ఒక వైపు తెలంగాణ ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలో నిర్దేశిత ఫీజులను అందుబాటులో ఉంచగా విద్యాశాఖ అలసత్వం వల్ల అధికాస్తా అందని ద్రాక్షగానే మారింది.మరోవైపు పరిమితికి మించి ఆటోలు టాటా ఏసీ లు, బస్సులల్లో విద్యార్థులను తీసుకుని వస్తు ప్రమాదలు జరిగి, విద్యార్థుల ప్రాణాలను గాలిలో దీపాలుగా మారుస్తున్నారు.ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు స్పందించి నిబంధనలు పాటించని పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-62.wav?_=1

* ప్రిన్సిపల్ జన్ను విజయ్ కుమార్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండల కేంద్రంలోని
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ విద్య శాఖ ఆదేశాల మేరకు అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం చేస్తున్నామని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయ్ కుమార్ ఒక ప్రకటనలో సోమవారం రోజున తెలిపారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల లో 2025 -2026 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న కంప్యూటర్స్ విభాగంలో రెండు పోస్టులు, ఎకనామిక్స్ విభాగంలో ఒక పోస్ట్ ఖాళీగా ఉన్నాయని ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటల లోపు కళాశాలలో సంబంధిత ధ్రువీకరణ పత్రాలు రెండు జతలు జిరాక్స్ కాపీలు సమర్పించవలసిందిగా తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టులో 50 శాతం మార్కులు పొంది ఉండాలని ఇతరులు 55 శాతం మార్కులు పొంది ఉండాలని సంబంధిత సబ్జెక్టుల్లో అర్హతలు పీజీ తో పాటు నెట్, సెట్, పీహెచ్డీ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జన్ను విజయకుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లాస్థాయి పద్యపఠన పోటీలకు లేఖన ఎంపిక..

జిల్లాస్థాయి పద్యపఠన పోటీలకు లేఖన ఎంపిక

అభినందించిన ప్రధానోపాధ్యాయులు స్వరూప.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-61.wav?_=2

నర్సంపేట,నేటిధాత్రి:

దాశరథి కృష్ణమచార్యా శత జయంతి వేడుకల్లో భాగంగా జిల్లా స్థాయి పద్యపఠన పోటీలకు నర్సంపేట మండలంలోని మహేశ్వరం గ్రామంలో గల జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థిని ఇజ్జగిరి లేఖన ఎంపికయ్యింది.ఈసందర్భంగా విద్యార్థిని ఇజ్జగిరి లేఖనను పాఠశాలల
ప్రధానోపాధ్యాయులు స్వరూప అభినందించారు. హెచ్ఎం మాట్లాడుతూ నర్సంపేట మండలంలో మొత్తం 54 మంది విద్యార్థులు పాల్గొనగా కేవలం 4 విద్యార్థులు ఎంపిక అయ్యారన్నారు.అందులో భాగంగా తమ పాఠశాల విద్యార్థిని లేఖన ఎంపిక అయ్యిందని పేర్కొన్నారు.లేఖన ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణం అని ప్రధానోపాధ్యాయులు స్వరూప ఆనందం వెళ్లుబుచ్చారు. అనంతరం లేఖనను సన్మానించి ప్రధానోపాద్యాయురాలు ఉపాధ్యాయులు,తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు..

ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపు రద్దు

కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసిన ఎన్ఎంసీ

నేటిధాత్రి, వరంగల్
వరంగల్ జిల్లాలోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) రద్దు చేసి, కళాశాలలో ఈ ఏడాది ప్రవేశాలను నిలిపివేసింది. 150 సీట్లున్న ఆ కళాశాలకు రెండేళ్ల కిందటే ఎన్ఎంసీ అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం కళాశాలలో రెండు ఎంబీబీఎస్ బ్యాచుల విద్యార్థులున్నట్లు వైద్యవర్గాలు వెల్లడించాయి. కళాశాల గుర్తింపు రద్దు వెనుక గతంలో కళాశాలలో తనిఖీలకు వచ్చిన అధికారులకు యాజమాన్యం లంచం ఇచ్చిన కేసు ప్రభావం చూపిందని వైద్యవర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో ప్రస్తుతం 30 వరకు ప్రైవేటు వైద్య కళాశాలలున్నాయి. వాటిలో రెండు కళాశాలలు గత ఏడాది డీమ్డ్. యూనివర్సిటీగా మారాయి. ఫాదర్ కొలంబో కళాశాల గుర్తింపు రద్దుతో ఈ ఏడాది మిగిలిన 27 కళాశాలల్లోని సీట్లకే కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కౌన్సెలింగ్ నిర్వహించనుంది.

లంచం కేసు ప్రభావమే..?

వైద్య కళాశాలల్లో తనిఖీలకు వచ్చిన ఎన్ఎంసీ బృందాలకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలపై దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు, ఎన్ఎంసీ అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ఎంసీ నిబంధనల మేరకు కళాశాలల్లో అధ్యాపకులు, మౌలిక సదుపాయాలు లేకపోయినా.. తమ కళాశాలలకు అనుకూలంగా నివేదికలివ్వాలని మధ్యవర్తుల ద్వారా వాటి యాజమాన్యాలు ఎన్ఎంసీ అధికారులకు లక్షల్లో లంచాలు ముట్టజెప్పాయి. దానిపై గత నెల 30న సీబీఐ కేసు నమోదు చేసింది.

అందులో తెలంగాణకు చెందిన పలు కళాశాలల పేర్లు కూడా వెలుగులోకి వచ్చాయి. అందులో ఫాదర్ కొలంబో వైద్య కళాశాల కూడా ఉంది. కళాశాల ట్రస్టీ ఫాదర్ జోసెఫ్ కొమ్మారెడ్డి రెండు విడుతల్లో 20లక్షల చొప్పున మొత్తం 46లక్షల రూపాయలు లంచం చెల్లించినట్లు సీబీఐ ఎఫ్ఎఆర్ లో పేర్కొంది. ఆ కేసు ప్రభావంతోనే కళాశాల గుర్తింపు రద్దయిందని వైద్య వర్గాలు అనుమానిస్తున్నాయి. సీబీఐ ఎఫ్ఐఆర్ లో 36 మంది పేర్లుండగా, అందులో ఆరుగురు ఏపీ, తెలంగాణకు చెందిన వారున్నారు. తెలంగాణకు చెందిన ప్రభుత్వ వైద్యురాలు డాక్టర్ రజనీరెడ్డి పేరును కూడా సీబీఐ తన ఎఫ్ఐఆర్ లో చేర్చింది.

23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి.

23 న విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలి

నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగా సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 23న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ ను విజయవంతం చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు దిడ్డి పార్థసారథి,పీడీఎస్యు, జిల్లా అధ్యక్షులు గుర్రం అజయ్, జిల్లా అధ్యక్షులు నరేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలు,ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకోడం కారణంగా అధికారాన్ని కోల్పోయిందని,గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని పేర్కొన్నారు.ఈకార్యక్రమలో ఎస్ఎఫ్ఐ డివిజన్ కార్యదర్శి పైస గణేష్,పిడిఎస్యు డివిజన్ అధ్యక్షులు రవి,ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు పవన్ వరుణ్,నాయకులు కిరణ్, క్రాంతి ప్రవళిక కళ్యాణి శ్వేత రజిని నాగేంద్ర,గౌతమ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి.

జూలై 23న విద్యాసంస్థల బంద్ ను విజయవంతం చేయండి-వామపక్ష విద్యార్థి సంఘాలు

కరీంనగర్, నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడినీ అరికట్టాలని, రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న తేదీన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలు, జూనియర్ కళాశాలల బంద్ నిర్వహిస్తున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు ప్రకటించారు. కరీంనగర్ జిల్లాలోని తెలంగాణ చౌక్ వద్ద వామపక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో బంద్ జయప్రదం చేయాలని వాల్ పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయివేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి. విద్యాశాఖ మంత్రిని తక్షణమే నియమించాలి. ఖాళీగా ఉన్న టీచర్, ఎంఈవో, డిఈవో పోస్టులను భర్తీ చెయ్యాలి.ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న బోజన పథకాన్ని అమలు చేయాలి. పెండింగ్ స్కాలర్ షిప్ లను విడుదల చేయాలి. అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక సదుపాయాలు కల్పించి, నిధులు కేటాయించాలి. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ బకాయిలు విడుదల చెయ్యాలి. విద్యార్థులకు ఆర్టీసీలో ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలి. ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చెయ్యకుండా అసెంబ్లీలో తీర్మానం చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. బంద్ విజయవంతానికి విద్యార్థులు విద్యాసంస్థల యాజమాన్యాలు సహకరించాలని వారు కోరారు. ఈసమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామారపు వెంకటేష్, మచ్చ రమేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్, పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా కార్యదర్శి కుతాటి రాణా ప్రతాప్, పిడిఎస్యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అంగడి కుమార్, ఎఐఎఫ్డిఎస్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి గడ్డం శ్రీకాంత్, పిడిఎస్యూ జిల్లా నాయకులు ముల్కాల మారుతి, ఏఐఎస్ఎఫ్ నగర అధ్యక్షులు కేశబోయిన రాము యాదవ్, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి అసంపెల్లి వినయ్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆకాశ్, తదితరులు పాల్గొన్నారు.

విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయండి.

విద్య సంస్థల బంద్ ను జయప్రదం చేయండి.

ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వామపక్ష సంఘాల పిలుపు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక రావి నారాయణ రెడ్డి భవన్ లో వామ పక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విలేకర్ల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సోతుకు. ప్రవీణ్ కుమార్, ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షులు బొడ్డు స్మరణ్ ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి నేరెళ్ల జోసెఫ్ లు మాట్లాడుతూ ఈ నెల జులై 23వ తేదీనా రాష్ట్ర వ్యాప్త విద్య సంస్థల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది అని తెలిపారు.విద్యరంగ సమస్యలు పరిష్కరించడం లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందన్నారు.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో ఫీజులను తగ్గించాలని, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అని అన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థల నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న టీచింగ్,నాన్ టీచింగ్,ఎంఈఓ,డిఈఓ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రభుత్వ స్కూల్ వ్యాన్ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలను నిర్వహిస్తామని తెలిపారు.ఈ నెల 23న జరిగే విద్యాసంస్థల బంద్ ని
ప్రభుత్వ, ప్రెవేట్ కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాలు,విద్యార్థులు తల్లిదండ్రులు బందులో పాల్గొని మద్దతు తెలియజేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు పొంగంటి రాజేష్ వికాస్ అతుకూరి తిరుపతి ముద్దమల్ల విష్ణు హర్షవర్ధన్ నరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.a

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ..

వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ

నల్లబెల్లి, నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-51.wav?_=3

మండలంలోని పంతులుపల్లి ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు, వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారి సౌజన్యంతో ఉచితంగా నోటు బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల ఏఏపిసి చైర్మన్ ఎరుకుల వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్ గోనె శ్రీదేవి, మాజీ ఎంపిటిసి ఏడాకుల రవిందర్, మామిండ్లవీరయ్యపల్లి మాజీ సర్పంచ్ ఆసం చంద్రమౌళి అతిధులుగా హాజరై విద్యార్థులకు నోటు బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతంలోని తమ పాఠశాల విద్యార్థులకు నోటు బుక్స్ పంపించిన వాసవి క్లబ్ వరంగల్ సెంట్రల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈకార్యక్రమంలో పాఠశాల సహోపాధ్యాయులు కూనమల్ల రాజన్ బాబు ,విద్యార్థులు పాల్గొన్నారు.

నాలుగున్నర దశాబ్దాలకు మోక్షం..

నాలుగున్నర దశాబ్దాలకు మోక్షం

◆:- మిర్జాపూర్ (బి) పీజీ కళాశాలలో కో-ఎడ్యుకేషన్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-48.wav?_=4

జహీరాబాద్ నేటి ధాత్రి:

నాలుగు దశాబ్దాలుగా మెన్స్ పీజీగా కొనసాగిన న్యాల్ కల్ మండలం మిర్జా పూర్(బి) ఓయూ (ఉస్మానియా అనుబంధ) పీజీ కళాశాల కో-ఎడ్యుకేషన్ గా మారనుంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తొలి పీజీ కళాశాలగా పేరొందిన ఈ కళాశాలలో ఇకపై మహిళలకు ప్రవేశాలు దక్కను న్నాయి. ఏళ్లుగా చేస్తున్న ప్రతిపాదనలకు కార్యరూపమిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త కోర్సులు మంజూరైతే కళాశాల పూర్వ వైభవం సంతరించు కోనుంది.జహీరాబాద్ ప్రాంతంలో చక్కెర, అనుబంధ రసాయన కోర్సులతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బంగ్లా మీర్జాపూర్ గ్రామంలో 1980 అక్టోబరు 30న ఈ పీజీ కళాశాలను ప్రారంభించారు. జహీరాబాద్-బీదర్ రహదారిపై గల మిర్జాపూర్(బి) గ్రామానికి స్వర్గీయ మాజీ మంత్రి, మాజీ ఎంపి మొగిలిగుండ్ల బాగారెడ్డి కృషి వల్ల ప్రభుత్వం పీజీ కళాశాలను ప్రత్యేకించి మంజూరు చేసింది. మిర్జాపూర్(బి)లో ఓయూ పీజీ కళాశాలఏర్పాటు చేసింది. అవసరమైన భూమి లభ్యత, కూత వేటు దూరంలో కొత్తూర్ (బి) చక్కెర కర్మాగారం, నీటికి నారింజ ప్రాజెక్టు అనువుగా ఉండటంతో మాజీ ఎంపీ బాగారెడ్డి పట్టుబట్టి పీజీ కళాశాల ఏర్పాటు చేయించారు.ఎంబీఏ, ఎమ్మెస్సీ ఆర్గానిక్స్ కొత్త కోర్సులకు ఏటా చేస్తున్న విజ్ఞప్తులకు ఈసారి ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ నుంచి సానుకూల స్పందన లభించింది. కో-ఎడ్యుకేషన్ కు ఆమోదం కూడా లభించగా, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ఆదరణ ఉన్న ఎంబీఏ, ఎమ్మెస్సీ ఆర్గానిక్స్ కోర్సుల ప్రతిపాదనలకు మోక్షం దక్కనుంది. పీజీ కళాశాల పూర్వ విద్యార్థి ప్రిన్సిపల్ శివశంకర్ దృష్టిసారించి కోర్సులుసాధించేలా కృషి చేస్తున్నారు. ఇవి సుంజూరైతే డే కమ్, రెసిడెన్షియల్ తరగతులు కొనసాగే అవకాశాలున్నాయి.

Co-education in Mirzapur (B) PG College.

ప్రతిపాదనలు పంపించాం:

శివశంకర్, ప్రిన్సిపల్ పీజీ కళాశాల మిర్జాపూర్(బి)
కళాశాలకు కో-ఎడ్యుకేషన్ మంజూరైంది. ఇక కొత్త కోర్సుల కోసం ఉస్మానియా విశ్వ విద్యాలయం సహా సంబంధిత ఉన్నతాదికారులకు ప్రతిపాదనలు పంపించాం. ఆగస్టు, సెప్టెంబరులో సీపీ గేట్ ప్రవేశ అర్హత పరీక్ష ఫలితాల తర్వాత కొత్త కోర్సులు దాదాపుగా మంజూరు కానున్నాయి.

కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

ఉచిత బస్సు ప్రయాణమే కాదు ఆ బస్సుకు ఓనర్ లను చేసిన ఘనత కాంగ్రెస్ ది .

పంచాయతీరాజ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-37.wav?_=5

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పిఎసిఎస్ గ్రౌండ్ లో భూపాలపల్లి నియోజకవర్గ ఇందిర మహిళా శక్తి సంబరాలు సెర్ప్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షుతన ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పంచాయతీరాజ్ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మంత్రి సితక్క మాట్లాడుతూ తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేస్తూ దేశంలోని ఆదర్శంగా నిలిచిందని మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ ఆర్టిసి బస్సులు ఇస్తూ పెట్రోల్ బంకులు ఇస్తూ సోలార్ వంటి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ మహిళా సాధికారత సాధించే దిశగా మహిళలను చైతన్యం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు మహిళలకు జీవిత బీమా కల్పిస్తూ మహిళా సంఘంలో ఉంటూ ఆ సభ్యురాలు మరణిస్తే వారి కుటుంబానికి 10 లక్షల రూపాయలు బీమా సౌకర్యం అందిస్తున్నామని అలాగే 15 సంవత్సరాల అమ్మాయిలను కూడా మహిళా సంఘాలలో చేర్పిస్తున్నామని అన్నారు అలాగే ఆదర్శ కమిటీల ద్వారా ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేస్తూ ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు యూనిఫామ్లను కుట్టిచ్చి ఇచ్చే బాధ్యత మహిళా సంఘాలకు ఇచ్చామని దీని ద్వారా వాళ్ళు ఆర్థిక అభివృద్ధి సాది స్తున్నారని ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు మహిళల కోసం చేస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు, సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకె కాక రైతులకు కూడా 2 లక్షల రుణాలు మాఫీ చేసి వారికి పెట్టుబడి సహాయం అందిస్తూ దేశంలోనే రైతు సంక్షేమం కోరిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందని ఏ ప్రాంతానికైనా ఉచితంగా ప్రయాణిస్తున్నారని మహిళల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్సేనని, అలాగే భూపాలపల్లి నియోజకవర్గంలో చిట్యాల మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని మంత్రిని కోరగా వెంటనే సీతక్క సానుకూలంగా స్పందించి తప్పకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది , భూపాలపల్లి నియోజకవర్గంలో ఉన్న తెగిపోయిన రోడ్లను కూడా అభివృద్ధి చేయాలని అడగగా వెంటనే హాని ఇవ్వడం జరిగిందని అన్నారు, అనంతరం మహిళలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకు లింకే చెక్కులు, జీవిత బీమా చెక్కులు, టేకుమట్ల చిట్యాల శాయంపేట మండలాలకు ఆర్టీసీ బస్సులను మహిళా సమైక్య లకు మంత్రి సితక్క చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ విజయలక్ష్మి, సర్ప్ డైరెక్టర్ రజిని మరియు డి ఆర్ డి ఎ పి డి బాలకృష్ణ జిల్లా సెర్ప్ అధికారులు, ఎంపీడీవో మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, మండల కాంగ్రస్ పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, మధు వంశీ కృష్ణ 6 మండలాల సెర్ప్ అధికారులు ఆరు మండలాల నుంచి వచ్చిన మహిళా సమైక్య సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు మండల జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ.

కస్తూర్బా పాఠశాలను తనిఖీ చేసిన డిఇఓ

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-26.wav?_=6

న్యాల్కల్ కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు చూసి శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. విద్యార్థులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత.

న్యాల్కల్ KGBV హాస్టల్లో విద్యార్థినులకు అస్వస్థత

జహీరాబాద్ నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-22.wav?_=7

న్యాల్ కల్ లో కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ లో ఐదుగురికి విద్యార్థులు అస్వస్థతకు గురి . విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. జహిరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పరీక్షల నిమిత్తం పంపించారు . విద్యార్థుల ఆరోగ్యం క్షేమంగానే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. గతంలో జరిగిన విద్యార్థులకి మళ్లీ అస్వస్థత గురి కావడం చర్చనీ అంశం . వర్షాకాలం పరిశుభ్రత లోపించిందా ఆహారం లోపమా తెలియాల్సిందే. జిల్లా అధికారులు పర్యవేక్షణ లోపించింది .

Nyalkal KGBV hostel.

వెంటనే తహసిల్దార్ ప్రభులు మండల గిర్ధవర్ శ్యామ్ రావు హాస్టల్ లో పరిస్థితులను పరిశీలించారు.

హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..

హై అలర్ట్.. 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు..

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి.

దేశ రాజ‌ధాని ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వ‌చ్చాయి. దీంతో వెంటనే అలర్ట్ అయిన బాంబు నిర్వీర్య బృందాలు ముమ్మరంగా త‌నిఖీలు చేపట్టాయి. బాంబు బెదిరింపు మెయిల్ వ‌చ్చిన పాఠశాలలకు పోలీసులు, బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్‌లు, అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే, ఈ వారంలో రాజధానిలోని పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం ఇది నాలుగో సారి.

ఆవోప ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్.!

ఆవోప ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వాటర్ బాటిల్స్ పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

అవోపా కల్వకుర్తి యూనిట్ అధ్యక్షుడు పాపిశెట్టి సతీష్ గుప్తా ఆధ్వర్యంలో యు.పి.ఎస్ పంజుగుల విద్యార్థులకు యు.పి.ఎస్ పంజుగుల హెచ్ఎం ఎల్లయ్య గౌడ్ అధ్యక్షతన 70 మంది విద్యార్థులకు నోట్ బుక్స్ , ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆవోప జనరల్ సెక్రెటరీ యాద శోభన్ బాబు , సీనియర్ అవోపా సభ్యులు గాదె కుమారస్వామి , గాదె ఉమాదేవి , పోల రాజేంద్రప్రసాద్, ఉపాధ్యాయ బృందము తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version