అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశాని రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమమును ఘనంగా నిర్వహించాలని.అన్నారు,. గ్రామాలలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ భావజారాన్ని ప్రజలకు తెలియ పరచాలని , మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే వర్ధంతి కార్యక్రమంలో అందరూ హాజరు కావాలని మహానీయుడు కన్న కలలను నిజం చేయాలని భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని , అందుకు కుల మతాలకు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు అంబేద్కర్ వాదులు మేధావులు ఉద్యోగులు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ ఈనెల 6న అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ శ్రీలపాక ప్రణీత్ గడ్డం సదానందం కట్కూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version