దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి….

దళితుల ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనను విజయవంతం చేయండి
ఎంఎస్పి వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ బొక్కల నారాయణ మాదిగ

నేటిధాత్రి ఐనవోలు :-

 

హైదరాబాద్ లో నవంబర్ 1 న చేపట్టిన దళితుల ఆత్మగౌరవ నిరసన సన్నాహకాల్లో భాగంగా శుక్రవారం ఐనవోలు మండల కేంద్రం లో ఎమ్మార్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎం.ఆర్.పి. ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బరిగల ఏలియా మాదిగ అధ్యక్షత వహించగా, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మార్పీఎస్ ఎన్ఎస్పి వర్ధన్నపేట నియోజకవర్గం ఇంచార్జ్ జిల్లా జిల్లా ఎమ్మెస్ పి ప్రధాన కార్యదర్శి బొక్కల నారాయణ మాదిగ పాల్గొని మాట్లాడుతూ, ఇది చీఫ్ జస్టిస్ ఇక గవాయి పై జరిగిన దాడి కాదు యావత్తు భారతన్యాయ వ్యవస్థ,రాజ్యాంగం మరియుదళిత సమాజంపై జరిగిన దాడిగా భావించాలి. ఇది ఇంతటితో ఆగదు తర్వాత మన అందరి మీద కూడా దాడి జరుగుతుంది.ఇలాంటి ఘటన భవిష్యత్ లో పునరావతం కాకుండా చూడాలని నారాయణ డిమాండ్ చేస్తూ, తక్షణమే ఢిల్లీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి లాయర్ రాకేష్ కిషోర్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని నవంబర్ 1న హైదరాబాద్ లో మందకృష్ణ సారథ్యంలో జరిగే ఈ ఆత్మగౌరవ నిరసన ప్రదర్శనకు దళిత జాతి ఆత్మ గౌరవాన్ని ప్రతిబింబించేలా ఢిల్లీ మెడలు వంచేలా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అయినవోలు మండలంలో అన్ని గ్రామాల నుంచి ప్రజలను చైతన్యం చేసి వాహనాలు ఏర్పాటు చేసుకొని భారీ సంఖ్యలో దళిత బహుజనులు హైదరాబాద్ తరలి వచ్చి నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో,జిల్లా నాయకులు ఏం దేవదాస్ , బర్ల బాబు మాదిగ జిల్లా ఎం ఎస్ పి ఉపాధ్యక్షులు. ఎమ్మెస్ పి మండల అధ్యక్షులు ఇస్రం బాబు మాదిగ,
అధికార ప్రతినిధి ఎస్.చంద్రమౌళి మాదిగ,మండల ఉపాధ్యక్షులు బొక్కల అనిల్ మాదిగ మాదిగ, ఉపాధ్యక్షులు బరిగల ఆరోగ్యం మాదిగ,జిల్లా నాయకులుమాదాసి కరుణాకర్ మాదిగ,మార్పిఎస్ సీనియర్ నాయకులు బారిగెల ఏలియా చింత, కోడి కుమార్ స్వామి మాదిగ కొండపర్తి అధ్యక్షులు విష్ణు మాదిగ సిహెచ్ ఆయన అధ్యక్షులు మొలుగురి సంజీవ మాదిగ ఉడుత గూడెం అధ్యక్షులు టి శ్రీనివాస్ మాదిగ
గర్నపెల్లి అధ్యక్షులు జి కుమారస్వామి మాదిగ.
రాంనగర్ అధ్యక్షులు ఆకుల పెళ్లి సాగర్ మాదిగ అధ్యక్షులు రాంనగర్ ఎమ్మెస్ వి ప్రధాన కార్యదర్శి యాకర శ్రీనివాస్ మాదిగ జిల్లా వై అనిల్ మాదిగ బి సోమన్న సంతోష్ మాదిగ ఎం. ఆర్. పి. ఎస్ మరియు అనుబంధ సంఘాల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

నవంబర్ 1న దళిత ఆత్మగౌరవ ర్యాలీ – చలో హైదరాబాద్…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి నిరసనగా నవంబర్ 1న ‘చలో హైదరాబాద్’ దళిత ఆత్మగౌరవ మహా ర్యాలీ

​నేటి ధాత్రి,పటాన్ చెరు:

 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవం, న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం నవంబర్ 1వ తేదీన ‘చలో హైదరాబాద్’ మహా ర్యాలీని విజయవంతం చేయాలని ఎంఆర్‌పిఎస్,ఎంఎస్‌పి అనుబంధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
​ఈ మహా ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లపై పటాన్ చెరు నియోజకవర్గంలోని ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌పి ముఖ్య కార్యకర్తల సమావేశం పొట్టోల్ల వెంకటేశం మాదిగ ఎంఎస్‌పి రాష్ట్ర సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
​ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ, సీజేఐ గవాయి పై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ఇది భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, దళితుల ఆత్మగౌరవం మరియు అస్తిత్వంపై జరిగిన దాడిగా భావించాలన్నారు.
​నవంబర్ 1న హైదరాబాద్‌లో జరగబోయే ఈ భారీ బహిరంగ ర్యాలీలో నియోజకవర్గం నుంచి లక్షలాది మంది పాల్గొనాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గం నుండి దళిత వర్గాలు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం ఎంఆర్‌పిఎస్ సీనియర్ నాయకులు, నియోజవర్గ బాధ్యులు, మండల ఇన్‌చార్జులు పూర్తి సమయం కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు.
​ఈ సమావేశంలో నల్లోల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఎంఆర్‌పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి, వెలుమల ప్రమోద్ మాదిగ ఎంఆర్‌పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, క్యాసారం నటరాజ్ మాదిగ ఎంఎస్‌పి జిల్లా అధికార ప్రతినిధి, కొంగేరి కృష్ణ మాదిగ ఎంఎస్‌పి జిల్లా ప్రధాన కార్యదర్శి, ముక్క గళ్ళ ఆంజనేయులు మాదిగ ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు, కందుకూరి ఏసయ్య మాదిగ ఎంఆర్‌పిఎస్ అమీన్పూర్ మండలం ఇంచార్జి, బందెల రవికుమార్ మాదిగ ఎంఆర్‌పిఎస్ ఆర్‌సి పూర్ టౌన్ కన్వీనర్, దర్బార్ రమేష్ మాదిగ కో కన్వీనర్, కర్రెనుల బాలేష్ మాదిగ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చలో హైదరాబాద్ కు జర్నలిస్టులు..

 

చలో హైదరాబాద్ కు జర్నలిస్టులు

 

నడికూడ,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ప్రశ్నించి, ప్రజా బోనులో ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో జర్నలిస్టు సంఘాలు వైఫల్యం చెందాయన్నారు,కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదని తెలంగాణ మాదిగ జర్నలిస్ట్ ఫోరం 2వ రాష్ట్ర మహ సభ మంగళవారం.హైదరాబాద్ రవీంద్ర భారతి లో జరుగనున్న మహాసభకు వరంగల్ హనుమకొండ జిల్లా జర్నలిస్టులు హైదరాబాద్ కు తరలి వెళ్లారు,వారిలో రాష్ట్ర ఆధికార ప్రతినిధి పెండెల సుమన్,జిల్లా అధ్యక్షులు సందెల రాజు,జిల్లా ప్రధాన కార్యదర్శి కోడెపాక భాస్కర్, పరకాల మండల అధ్యక్షులు మడికొండ పవన్,నడికూడ, మండల అధ్యక్షులు చుక్క సతీష్,జిల్లా నాయకులు ఒంటెరు రమేష్ చంద్ర,పెండెల శ్రీనివాస్,అర్షం,మధుసుదన్ హనుమకొండ శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version