పెన్షన్ పెంపు కోసం రామడుగులో ధర్నా…

పెన్షన్ల పెంపు కోసం రామడుగు మండలం తహశీల్దార్ కార్యాలయం ముట్టడించిన విహెచ్పిఎస్, ఎమ్మార్పీఎస్ నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

 

 

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం వికలాంగుల పెన్షన్ నాలుగు వేల నుండి ఆరువేలకు పెంచాలని, వృద్దులు వితంతువులు ఒంటరి మహిళలు నేత, గీత, బీడీ కార్మికులతో పాటు మిగితా పెన్షన్ దారుల పెన్షన్ రెండు వేల నుండి నాలుగు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వికలాంగుల హక్కుల పోరాట సమితి (విహెచ్పిఎస్) మరియు చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి (సిపిహెచ్పిఎస్) ఆద్వర్యంలో రామడుగు మండల తాహశీల్దార్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మహాధర్నాను చేపట్టడం జరిగింది. ఈసందర్భంగా విహెచ్పిఎస్ నాయకులు మర్రి కుమార్ చిమ్మల్ల శ్రీనివాస్, జనార్దన్ లు మాట్లాడుతూ పెన్షన్ దారులకు ఇచ్చిన మాటకు కట్టుబడిలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతులు రుణమాఫీ, భూస్వాములకు రైతుబంధు ఇచ్చిన రేవంత్ నిస్సహాయ స్థితిలో ఉన్న పెన్షన్ దారుల పెన్షన్లు ఎందుకు పెంచడం లేదని ప్రశ్నించారు. దొరలు, భూస్వాములు, సంపన్నుల పక్షాననే రేవంత్ ఉన్నారు తప్ప పేద వర్గాల పక్షాన లేడు అనేది పెన్షన్ దారుల విషయంలో రుజువైందన్నారు. నాలుగు వేల పెన్షన్లు సరిపోక వికలాంగులు, రెండు వేల పెన్షన్లు సరిపోక వృద్దులు వితంతువులు మరియు ఇతర చేయూత పెన్షన్ దారులు గోస పడుతుంటే రేవంత్ రెడ్డిలో కనీసం చలనం లేదన్నారు . ఏదిక్కు లేని పెన్షన్ దారులకు న్యాయం చేయలేని రేవంత్ రెడ్డికి తెలంగాణను పరిపాలించే అర్హత లేదన్నారు. మాట ఇచ్చి ఇరవై రెండు నెలలు దాటినా ఇంకా నిలబెట్టుకోక పోవడం రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి నిదర్శనమని, ఇకనైనా తీరు మార్చుకొని తక్షణమే అన్ని రకాల పెన్షన్లు పెంచాలని, నూతన పెన్షన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ దారుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈనెల 21 నుండి 26 వరకు అన్ని గ్రామ పంచాయితీల వద్ద దీక్షలు చేపడతామని హెచ్చరించారు. పెన్షన్లు పెంచుడో లేదా రేవంత్ దిగిపోవుడో ఏదో ఒకటి తేల్చుకుంటామని హేచ్చరించారు. ధర్నా అనంతరం తహశీల్దార్ రాజేశ్వరికి వినతిపత్రం అందజేశారు. ఈకార్యక్రమంలో బెజ్జంకి అనిల్ మాదిగ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు, కొత్తూరి రాజన్న మాదిగ, ఎమ్ఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు బత్తిని అంజయ్య, విహెచ్పిఎస్ నాయకులు జట్టిపల్లి రామవ్వ, అమీనా బేగం కవిత జరీనా, శ్రీపాద మహేష్ చారి, జోగిని రవీందర్, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముట్టడి…

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముట్టడి

నడికూడ,నేటిధాత్రి:

 

వికలాంగులకు,వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,నేత,గీత,బీడీ కార్మికులతో పాటు ఇతర పెన్షన్ దారులందరికీ పెన్షన్ పెరగాలని,నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ వెంటనే మంజూరు కావాలని ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో తాహసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
పై విషయమై తమతో మనవి చేయునది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్ రూ.4000 నుండి రూ 6000/- పెంచుతామని, అలాగే వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల పెన్షన్లు రూ. 2000/-నుండి రూ 4000/- పెంచుతామని హామీ ఇచ్చారు.ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాగ్దానం చేశారు.కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ చేపట్టి 22 నెలలు గడిచినా ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచలేదు.ఇది ఘోరమైన మోసం.ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ వికలాంగులు,వృద్ధులు వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారులకు ఏ మాత్రం సరిపోవడం లేదు.దీని వల్ల వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి.ప్రస్తుత పెన్షన్ వల్ల నెల రోజుల పాటు పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యంగా జీవించే పరిస్థితి కూడా లేదు.అంగవైకల్యం, నిస్సహాయ స్థితి,నిరాదరణ వల్ల ఇప్పటికే ఎన్నో అవమానాలు,అవహేళనలు ఎదుర్కొంటున్న వికలాంగులు, వృద్ధులు,వితంతువులతో పాటు ఇతర పెన్షన్ దారుల యొక్క దీన పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరుతున్నాం. కనీసం సరియైన తిండి తినడానికి కూడా సరిపోని పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని గుర్తు చేస్తున్నాం.
కనుక ఇకనైనా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి వికలాంగుల పెన్షన్ రూ 6000/-అలాగే వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు నేత గీత బీడీ కార్మికులతో పాటు ఇతర చేయూత పెన్షన్ దారుల పెన్షన్ రూ 4000/- పెంచాలని మరియు పూర్తి కండరాల క్షీణత కలిగిన వారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వలె నెలకు రూ 15000/- పింఛను ఇవ్వాలని అలాగే నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పెన్షన్ మంజూరు చేయాలని తమరి ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం అని నడికూడ మండల తహసీల్దార్ పోలేపాక రాణి ని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మండల ఇంచార్జ్ చిలువేరు సంపత్ మాదిగ,నడికూడ మండల అధ్యక్షులు సుమన్ మాదిగ, కార్యదర్శి మేకల రవి మాదిగ,రంజిత్ మాదిగ, శ్యామ్ మాదిగ,మొగిలి మాదిగ,రాజు,రమేష్,ప్రణయ్,తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల కు,చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి.

వికలాంగుల కు,చేయూత పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలి.

◆:- పెన్షన్ దారులను మోసం చేసిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి

◆:- పెన్షన్ దారులతో ఝరాసంగం తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించిన ఎం ఆర్ పి ఎస్ , వీ హెచ్ పి ఎస్ నాయకులు.

వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ రాయికోటి నర్సిములు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

ఝరాసంగం సెప్టెంబర్ 15 కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం వికలాంగులకు 6000/- మరియు చేయుత పెన్షన్ దారులకు 4000/- వెంటనే పెన్షన్ పెంచాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కో కన్వీనర్ రాయికోటి నర్సిములు డిమాండ్ చేశారు.ఈ సందర్బంగా నర్సిములు మాట్లాడడం జరిగింది.వికలాంగులకు మరియు వృద్ధులకు,వితంతువులకు,ఒంటరి మహిళలకు,చేనేత కార్మికులకు,బీడీ,గీత కార్మికులకు మరియు కండరాల క్షీణత 15000/- పెన్షన్ పెంచాలని డిమాండ్ చేయడం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు 4000 /-నుండి 6000,/-మరియు చేయూత పెన్షన్ దారులకు 2000/- నుండి 4000 /-ఇస్తానని ఎన్నికలో హామీ ఇచ్చి ఇప్పటికి రేవంత్ రెడ్డి సర్కార్ అధికారం లోకి వచ్చి 21 నెలలు గడిచిపోయిన ఇప్పటివరకు వారికి పెన్షన్ పెంచలేదని విమర్శించారు.పెన్షన్ పెంచకుండా నిర్లక్ష్యం చేస్తున్న రేవంత్ రెడ్డి తీరుకు నిరసనగ తహసీల్దార్ కార్యాలయం వికలాంగుల హక్కుల పోరాట సమితి ( వి హెచ్ పి ఎస్ ) మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎం ఆర్ పి ఎస్ ) ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు పెన్షన్ దారులతో మహాధర్న నిర్వహించడం జరిగింది. తదనంతరం డిప్యుటీ తహసీల్దార్ కర్ణాకర్ రావు కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో పెన్షన్ పెంచాలని అనేక రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాము. పెన్షన్ దారులకు వెంటనే పెన్షన్ పెంచాలని తమరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరడం జరిగింది, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, నేత, బీడీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కుప్పా నగర్ నర్సిములు, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు శోభరాణి సావిత్రి, బిస్మిల్లా, ఖాదర్ అల్లి గినియర్ పల్లి నబీ,నాగమ్మ, గుండమ్మ నిర్మలమ్మ తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయండి.

ఈనెల 15న తాసిల్దార్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయండి

మడిపల్లి శ్యాంబాబు మాదిగ
జిల్లా ఇన్చార్జి

అంబాల చంద్రమౌళి మాదిగ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ విహెచ్ పేస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాల అత్యవసర సమావేశం
ఎంఆర్పిఎస్ భూపాలపల్లి టౌన్ అధ్యక్షులు దోర్నాల భరత్ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి
మడిపల్లి శ్యాంబాబు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగలు హాజరై మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేముందు వృద్ధులకు వితంతువులకు 2000 నుండి 4000 వరకు వికలాంగులకు 4000 నుండి 6000 వరకు పెన్షన్లు పెంచి ఇస్తామని మాట ఇచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాటి వేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిలదీయడానికి ఈనెల 15వ తేదీన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అన్ని మండలాల తాసిల్దార్ కార్యాలయాల ముట్టడించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా మాట్లాడుతూ ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల ప్రతి గ్రామం నుండి వచ్చి ఈ ముట్టడి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ఉన్నటువంటి అన్ని గ్రామాల నుండి వికలాంగులు వృద్ధులు విత్తంతులు బీడీ గీత నేత నూతన పెన్షన్ దరులందరూ పెద్ద ఎత్తున ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు కార్యక్రమంలో పాల్గొన్నవారు ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు బొల్లి బాబు మాదిగ
నోముల శ్రీనివాస్ మాదిగ జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేంద్ర మాదిగ దూడపాక శ్రీనివాస్ మాదిగ
టౌన్ ఇన్చార్జి అంతడుపుల సురేష్ మాదిగ మిరపటి అశోక్ మాదిగ రేణిగుంట్ల రవి మాదిగ మంద తిరుపతి మాదిగ ఎర్ర భద్రయ్య మాదిగ చంటి మాదిగ నూనెపాకుల కుమారు మాదిగ మంద కిరణ్ మాదిగ మంచినీళ్ల వైకుంఠం మాదిగ బోడికల శ్రీకాంత్ మాదిగ ఒంటెరి రాజేష్ మాదిగ కుమ్మరి అనిల్ మాదిగ బోడికల సమయ మాదిగ సునీల్ మాదిగ మంగళ రవి
తదితరులు
పాల్గొన్నారు.

12న తహసిల్దార్ ఆఫీస్ ముట్టడి

12న తహసిల్దార్ ఆఫీస్ ముట్టడి *
వికలాంగులకు వృద్ధులకు పింఛన్ వెంటనే పెంచాలి
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ
మహాదేవపూర్ సెప్టెంబర్ 9 నేటి ధాత్రి *

 

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహాదేవపూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆవరణంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ 12 నతహసిల్దార్ కార్యాలయాల ముట్టడికి వికలాంగులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా తాసిల్దార్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు పింఛన్ పెంచాలని లేకపోతే స్థానిక ఎలక్షన్లో చిత్తుచిత్తుగా ఓడిస్తామని హెచ్చరించారు వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య మాట్లాడుతూ. వికలాంగులకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని మా బాధను ప్రభుత్వం పట్టించుకోవాలని జాప్యం చేయకుండా తక్షణమే పింఛన్లు పెంచాలని అదేవిధంగా కొత్త ఫించనులను కూడా మంజూరు చేయాలని వికలాంగులకు న్యాయం చేసే వరకు నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ విహెచ్పిఎస్ మండల అధ్యక్షుడు వీరగంటి సమ్మయ్య .అంబటిపల్లి విహెచ్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తిరుమల చారి. మహాదేవపూర్ ఎమ్మార్పీఎస్ గ్రామ కార్యదర్శి లింగాల. సుశాంత్ తోపాటు తదితరులు పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-70-2.wav?_=1

 

ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వికలాంగుల సన్నాహక సదస్సు కార్యక్రమం

◆:- పాల్గొన్న బిజెపి సీనియర్ నాయకురాలు జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఆదివారము రాత్రి ఎన్ కన్వెన్షన్ లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన పెద్దలు, గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారి వికలాంగుల సన్నాహక సదస్సులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం తీసుకురావడానికి ఎమ్మార్పీఎస్ ఏ కారణం అని చెప్పడం జరిగింది, అలాగే రేషన్ బియ్యం పంపిణీ నాలుగు కేజీల నుంచి ఆరు కేజీల వరకు పెంచాలని పోరాటం చేసింది కూడా ఎమ్మార్పీఎస్ ఏ అని కూడా వారు సభలో చెప్పడం జరిగింది, అలాగే చిన్నపిల్లల గుండె సమస్యలకి ఉచిత వైద్యం చేయించాలని కూడా ఎమ్మార్పీఎస్ ఏ పోరాటం చేసిందని మరియు ఇప్పుడు వికలాంగుల పెన్షన్ 200 నాటి నుండి 2000 వరకు పెరిగేంత వరకు ఎమ్మార్పీఎస్ పోరాటం చేసింది అని మరియు 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ 4000 నుండి 6000 వరకు పెంచడం జరుగుతుందని అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని లేనిపక్షంలో రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి రాజీనామా చేయాలని సెప్టెంబర్ 9 వ తేదీన మహా గర్జన పేరుతో భారీ బహిరంగ సభ ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులైన మందకృష్ణ మాదిగ గారు వికలాంగులకు పిలుపునివ్వడం జరిగింది. వారు మాట్లాడిన తర్వాత జ్యోతి పండాల్ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ ద్వారా వివిధ అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేస్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులైన గౌరవనీయులు మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ మాదిగ గారికి సన్మానం చేయడానికి అవకాశం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ అబ్రహం మాదిగ మరియు మండల అధ్యక్షులకి, వారి టీమ్ అందరికీ మరియు రాయికోటి నరసింహులు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో వికలాంగులు వృద్ధులు, ఒంటరి మహిళలు ఎంఆర్పిఎస్ టీం మరియు తదితరులు పాల్గొన్నారు,

మోసం చేసిన సర్కారు – మందకృష్ణ మాదిగ హెచ్చరిక..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-69-2.wav?_=2

మోసం చేసిన సర్కారు.. తాడోపేడో తెల్చుకుందాం: మందకృష్ణ మాదిగ,

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: రాష్ట్రంలోని 50 లక్షల పెన్షనర్లకు 20 నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అధికారం చేపట్టి 20 నెలలవుతున్న ఇచ్చిన హామీ అమలు చేయకుండా పెన్షనర్లను మోసం చేస్తున్న ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకుందామని ఆయన హెచ్చరించారు. సెప్టెంబర్ 9న హైదరాబాదులో నిర్వహించ పెన్షనర్ల బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన పెన్షనర్ల బహిరంగ నియోజకవర్గ సన్నాహక సదస్సును ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.20 నెలల నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించక తప్పదన్నారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ, పెన్షన్ల పెంపు, రేషన్ బియ్యం పెంపు తదితర సంక్షేమ పథకాల కోసం తాను చేసిన పోరాటం, దాని నేపథ్యాలను పేపర్, ఆడియో క్లిప్పింగ్స్ లతో సభకు వివరించి తన పోరాటపటీమను వివరించారు. విపక్షాల అసమర్థత, అధికార కరపక్షం నిర్లక్ష్యంతో పేదల సమస్యలు గుర్తు రావని, హామీలను పట్టించుకోరని మండిపడ్డారు. తను ఎప్పుడూ.. అణగారిన వర్గాల పక్షంలోనే పోరాడుతానన్నారు. ఇక్కడ అన్ని వర్గాల వారికి సేవ చేసే అవకాశం తనకు కలుగుతుందన్నారు. ఎమ్మార్పీఎస్ అందరికీ భరోసానిచ్చే బ్రాండ్ అని స్పష్టం చేశారు. ప్రభుత్వం పెన్షనర్ల పట్ల చేస్తున్న మోసాన్ని ఎండగట్టేందుకే బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తున్నామన్నారు.వికలాంగులకు రూ.6000తో పాటు వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులు ఇతర పెన్షన్లన్ని డబుల్ చేసేంతవరకు పోరాటం ఆగదన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా వికలాంగులు, పెన్షనర్లందరూ భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా విపక్ష పార్టీ నేతలు, పనులు, పెన్షనర్లు మందకృష్ణ మాదిగను మాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, ఎమ్మార్పీఎస్, పెన్షనర్లు సంఘం నేతలు అబ్రహం మాదిగ ఉల్లాస్ మాదిగ జయరాజ్, నర్సింలు, రామరవి కిరణ్, జ్యోతి, నారాయణ, విశ్వనాథ్ యాదవ్, జైరాజ్ మాదిగ, మైకల్ మాదిగ, రవికుమార్, నిర్మల్ మాదిగ, రాజు, మనోజ్, నగేష్, యేసప్ప, రాజేందర్, సింగితం రాజు, తదితరులు పాల్గొన్నారు.

మంథని కి మందకృష్ణ రాక వికలాంగుల సమస్యలపై పోరు

మంథని కి మందకృష్ణ రాక వికలాంగుల సమస్యలపై పోరు
**వికలాంగులకు 6000 చేనేత పింఛన్ దారులకు 4000
ఇవ్వాలని డిమాండ్**
ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి
మహాదేవపూర్ఆగస్టు19(నేటి ధాత్రి)

 

భూపాలపల్లి ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మాడిపెల్లి శ్యాం బాబు మాదిగ
మహాదేవపూర్ మండలంలోని పాత్రికేయుల భవనం ముందు ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో. వికలాంగుల సదస్సు నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా మడిపెళ్లి శ్యాంబాబు మాట్లాడుతూ . రేపు మంథని కి మందకృష్ణ మాదిగ వస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోక .పోవడంతో వికలాంగులు వృద్ధులు వితంతువులు అధిక సంఖ్యలో మంథని కి వచ్చి సమస్యల కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు .వికలాంగుల దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని వారి పరిస్థితులు అగమ్య గోచరంగా ఉంటే ప్రభుత్వం వారి సమస్యను పట్టించుకోకపోవడం ఇచ్చిన మాటను పక్కన పెట్టడం చూస్తుంటే వికలాంగులపై చిన్న చూపు ఉన్నదని స్పష్టమవుతుందనీఇప్పటికైనా. వికలాంగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి వికలాంగులకు 6000 వితంతువులకు చేయుత పింఛన్. వృద్ధులకు. ఒంటరి మహిళలకు .చేనేత బీడీ .గౌడన్న .లకు 4000 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు మహాదేవపూర్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా వారి సమస్యలను పరిష్కరించకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పవని. వికలాంగులు ఏకతాటిపై వచ్చి మీ ప్రభుత్వం పై వువ్వెత్తున మరో పోరాటానికి సిద్ధం అయితరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఇన్చార్జులు దుమ్ము వెంకటేశ్వర్లు . రుద్రారపు రామచంద్రం . జిల్లా యువసేన అధ్యక్షులు మంద తిరుపతి. ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన కొమురక్క. మాదిగ యువసేన మండల అధ్యక్షులు మంథని రవితేజ టౌన్ అధ్యక్షులు చింతకుంట్ల సదానందం ప్రధాన కార్యదర్శి లింగాల సుశాంత్ కొలుగురి శ్రీకాంత్ చింతకుంట సాయి. కోడిపాక రమేష్ .తదితరులు పాల్గొన్నారు

24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక

24న జహీరాబాద్ కు మందకృష్ణ మాదిగ రాక

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఈ నెల 24న జహీరాబాద్ లో పెన్షన్ పెంపు కోసం నిర్వహించే మహా గర్జన సన్నాహక సదస్సుకు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జహీరాబాద్ నియోజకవర్గంలోని వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తప్పక హాజరు కావాలని తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా అధ్యక్షులు నర్సింహులు కోరారు.

వికలాంగుల సింహ గర్జనను విజయవంతం చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-4-2.wav?_=3

వికలాంగుల సింహ గర్జనను విజయవంతం చేయాలి
మండలంలో వికలాంగుల సమీక్ష సమావేశం
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి దుమ్ము వెంకటేశ్వర్లు

మహాదేవపూర్ ఆగస్టు6 (నేటి ధాత్రి )

మహాదేవపూర్ మండల కేంద్రంలోని వికలాంగుల మరియు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల సింహగర్జనలో విజయవంతం చేయడానికి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వెంకటేశ్వర్లు అన్నారు ఆయన మాట్లాడుతూ మండలంలోని వికలాంగులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని వికలాంగులకు ఆరు వేలు రూపాయలు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత బిడి గౌడ్ అన్నలకు 4000 రూపాయలు పించని ఇవ్వాలని డిమాండ్ చేశారు మందకృష్ణ వికలాంగుల సింహ గర్జన ఆగస్టు 13వ. తేదీన లక్షలాది వికలాంగులతో భారీ బహిరంగ సభ పెడుతున్న సందర్భంగా మండల కేంద్రంలోని వికలాంగులు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మండల రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సమస్యలు పరిష్కారానికి హైదరాబాదును చుట్టు ముట్టాలనిమన హక్కులను సాధించుకునే వరకు ఎమ్మార్పీఎస్ మనకు అండగా ఉంటుందని ఈ తరుణంలో వికలాంగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆగస్టు13న వికలాంగుల సింహ గర్జన విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ లు దుమ్ము వెంకటేశ్వర్లు రుద్రారపు రామచంద్రం జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య ప్రధాన కార్యదర్శి కన్నబోయిన కొమురక్క వికలాంగుల టౌన్ ప్రెసిడెంట్ మీర్జా ముస్తాక్ అధ్యక్షులు అంజలి మరియు ఎమ్మార్పీఎస్ యూత్ అధ్యక్షులు మంథని రవితేజ. టౌన్ ప్రెసిడెంట్ చింతకుంట సదానందం. ప్రధాన కార్యదర్శి లింగాల సుశాంత్ తదితరులు పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

 

నడికూడ,నేటిధాత్రి:

మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ని ఎన్నిక చేయడం జరిగింది.ఈ కమిటీ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు దుప్పటి మొగిలి మాదిగ ఆధ్వర్యంలో మండల ఇన్చార్జీలు చిలువేరు సంపత్ మాదిగ కో ఇన్చార్జి మేకల రవి మాదిగ ముఖ్య అతిథులుగా వచ్చి మాట్లాడడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం వృద్ధులు వితంతువులు వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ పెరగాలని తేదీ 7 8 2025 రోజున హనుమకొండలో జరగబోవు సభను విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మండల నూతన కమిటీ కన్వీనర్ గా సంగాల సుమన్ మాదిగ, కోకన్వీనర్ గా దుప్పటి ప్రవీణ్ మాదిగను ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు మొగిళి మాదిగ, సురేందర్ మాదిగ,రాజయ్య మాదిగ,దేవమని మాదిగ, సుమన్ మాదిగ,మోహన్ మాదిగ,తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మార్పిఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

ఎమ్మార్పిఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

మైకీల్ మాదిగ ఝరాసంగం ఎమ్మార్పీఎస్  మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో  రాయికోటి నర్సింములు విహెచ్పిఎస్ జిల్లా నాయకులు సమన్వయంతో ఝరాసంగం మండలం కేంద్రంగా ఏర్పాటు చేసిన ఆత్మ గౌరవ పతాక ఆవిర్భావ వేడుకలో  ముఖ్య అతిథులుగా విచ్చేసిన అబ్రహం మాదిగ ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు, ఉల్లాస మాదిగ ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్  లు మాట్లాడుతూ సామాజిక న్యాయం పునాదిగా ముప్పై ఏళ్ల పాటు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసి విజయం సాధించి మాదిగ జాతి ఆత్మ గౌరవ ప్రతీకగా భారతీయ సమాజంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు నిలిచిపోయారని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో సైతం ఉద్యమం నడిపిన చరిత్ర ఎమ్మార్పీఎస్ కు మాత్రమే దక్కిందని అన్నారు. ప్రమోషన్లలో రిజర్వేషన్లు సాధించిన ఘనత ఒక్క ఎమ్మార్పీఎస్ దేనని అన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిరక్షణ ఉద్యమం చేసి చట్టాన్ని కాపాడిందన్నారు. ఎమ్మార్పీఎస్ నడిపిన గుండె జబ్బు పిల్లల ఉద్యమం చేసి దేశవ్యాప్త ఆరోగ్యశ్రీ పథకం రావడానికి స్ఫూర్తి నిచ్చిందని అన్నారు. వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్లు పెరగడానికి ఎమ్మార్పీఎస్ చేసిన ఉద్యమ ఫలితం అన్నారు. ఆకలి కేకల ఉద్యమ యాత్రతో రేషన్ బియ్యం పెంపు జరిగిందన్నారు. అమరవీరుల తల్లుల కడుపుకోత ఉద్యమంతో అమరుల కుటుంబాలకు న్యాయం జరిగేలా చేసిందని అన్నారు. ఇలాంటి ఎన్నో సామాజిక ఉద్యమాలు నిరంతరం చేసి సమాజంలోని అన్ని వర్గాలకు అండగా ఎమ్మార్పీఎస్ నిలిచిందని అన్నారు.

వెంకటేశం బిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం మండల అధ్యక్షులు, రబ్బానీ ఎంఐఎం ఝరాసంగం మండల అధ్యక్షులు, నరసింహ గౌడ్ కేతకి సంగమేశ్వర ఆలయ కమిటీ మాజీ చైర్మన్, ఎజాజ్ బాబా టిఆర్ఎస్ పార్టీ ఝరాసంగం పట్టణ అధ్యక్షులు, శివరాజ్ బహుజన సంఘర్షణ సమితి అధ్యక్షులను సన్మానీచడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు.జైరాజ్ మాదిగ జిల్లా
ఉపాధ్యక్షులు,నిర్మల్,ధనరాజ్,హనోక్ తరుణ్, నాగేష్, ప్రశాంత్, రాజు,దినాకర్,ప్రశాంత్, నరేష్, ఇమ్మానుయేల్, అభిషేక్, బన్నీ, డాన్నీ, శ్రీను, రమేష్,నర్సిoములు,శ్రీకాంత్,ప్రవీణ్, చిరంజీవి, బాలరాజ్, రహీం, అరుణ్,భాను మాదిగలు పాల్గొన్నారు.

ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల.

ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యుల నీ సన్మానించిన జ్యోతి పండాల్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

జ్యోతి పండాల్ తన నివాసంలో ఎమ్మార్పీఎస్ మరియు తీన్మార్ మల్లన్న టీం సభ్యులని సన్మానించడం జరిగింది. 30 సంవత్సరాల నుండి అలుపెరుగని పోరాటం చేసి ఏ బి సి డి ఎస్సీ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి అండగా ఉండి వారికి సహాయం అందించి, అలాగే మొన్న మందకృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకను జరుపుకున్న సందర్భంగా పార్టీలకి అతీతంగా అందరి నాయకులను పిలిచి సన్మానించి వారి మంచి మనసుని చాటుకున్నారు, వారి మంచి మనసుని అభినందిస్తూ మన జహీరాబాద్ నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులని మరియు ఇన్చార్జిలందరినీ కూడా సన్మానించడం జరిగింది. అలాగే మొన్న జరిగిన తీన్మార్ మల్లన్న బీసీ మీటింగ్ కి చాలా కృషి చేసి ఆ మీటింగ్ని చాలా విజయవంతం చేసినందుకు గాను తీన్మార్ మల్లన్న టీం సభ్యులకి కూడా సన్మానం జరిగింది. ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా ఒక చిన్న గ్రామంలో ఒక్క మీటింగ్ తో రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించి మన జహీరాబాద్ పేరుని ఎక్కడికో తీసుకెళ్లిన పవర్ ఫుల్ టీం కి జ్యోతి పండాల్ అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్యోతి పండాల్, తీన్మార్ మల్లన్న టీం జహీరాబాద్ ఇన్చార్జి నరసింహ, శ్రీకాంత్, హనుమంతు, రాకేష్, ఉల్లాస్ మాదిగ జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, జయరాజ్ మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు, నిర్మల్ కుమార్ మాదిగ మొగుడంపల్లి ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్, టింకు మాదిగ జహీరాబాద్ మండల ఇన్చార్జ్ ఎమ్మార్పీఎస్, సుకుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ కార్యదర్శి జహీరాబాద్, జీవన్ మాదిగ ఎమ్మార్పీఎస్, రాఘవులు, సాయికుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.

వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదు.

వికలాంగుల హక్కుల కోసం పోరాటం ఆగదు
మహదేవపూర్ జులై 12 (నేటి ధాత్రి )
ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్

మహాదేవపూర్ మండల కేంద్రంలో సోమవారం రోజున వికలాంగుల హక్కుల కోసం జిల్లా అధ్యక్షులు వంశి గౌడ్ రానున్న తరుణంలో మండలంలో ఉన్న వృద్ధులు వికలాంగులు వితంతువులు అధిక సంఖ్యలో పాల్గొని తమ సమస్యలపై ప్రభుత్వం ఇచ్చిన మాటను మార్చిన క్రమంలో మరో పోరాటంలో సిద్ధం కావడానికి ఆ రోజున మండల కమిటీ నిర్మాణం చేసి వికలాంగులకు 6000 వృద్ధులు వితంతువులకు 4వేల పింఛన్ ఇవ్వాలని మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మండలంలోని వృద్ధులు వికలాంగులు వితంతువులు అధిక సంఖ్యలో హాజరై మన సమావేశాన్ని ఏర్పాటు చేసి మండల సమావేశాన్ని ఎన్నుకొని మనకోసం పోరాటం చేయాల్సిందిగా వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు పిలుపునిస్తున్నాం అని బెల్లంపల్లి సురేష్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పేర్కొన్నారు వికలాంగుల హక్కుల కోసం ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు వారికి అండగా దండగా ఉంటారని పిలుపునిచ్చారు

హాస్టల్ వార్డెన్ లు స్థానికంగా ఉండేలా జిల్లా అధికారులు చొరవ

హాస్టల్ వార్డెన్ లు స్థానికంగా ఉండేలా జిల్లా అధికారులు చొరవ చూపాలి.

ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి జిల్లా నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ

చిట్యాల. నేటి ధాత్రి :

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నేరెళ్ల ఓదెలు మాట్లాడుతూ స్థానికంగా ఉన్నటువంటి అన్ని హాస్టల్ వార్డెన్లు స్థానికంగా ఉండాలని , కొందరు వార్డెన్లు స్థానికంగా ఉండకపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు ,వర్షాకాలం సీజన్లో చెరువులు కుంటలు వాగులు నిండి ఉంటాయి కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు పిల్లలు ప్రతిరోజు బడికి వెళ్తున్నారా లేరా స్కూళ్లకు వార్డెన్లు వెళ్లి అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేసుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని ఓదెలు అన్నారు అలాగే స్కూలు టీచర్స్ కూడా హాస్టల్ పిల్లలు స్కూల్కు వస్తున్నారా లేరా అనే విషయాన్ని వార్డెన్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు మొగులపల్లి మండలంలో గనుక చూస్తే ఎస్సీ హాస్టల్ ఒక బాలుడు టేకుమట్ల మండలం పంగిడిపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి సరిగా స్కూలుకు వెళ్లాక వాగుల పడి చనిపోయినాడు ఈ విషయాన్ని అందరూ వార్డెన్లు దృష్టిలో పెట్టుకొని స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండాలని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు.

మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని ఘనంగా.!

మందకృష్ణ మాదిగ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ గౌరవ మందకృష్ణ మాదిగ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు జెండా ఎగరవేయడం జరిగింది సీనియర్ నాయకులు నల్లాల చలపతి గారి చేతుల మీదుగా స్థానిక నాయకులు జీడి సారంగం పట్టణ అధ్యక్షులు చిలుముల రాజ్ కుమార్ మాదిగ సీనియర్ నాయకుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ చిలుముల రాజు ఉప్పులేటి నరేష్. కంబాల రాజనర్స్. సుమన్ కందిపాటి రవి సంగి సది దాసరి ఎల్లారం దాసరి రాజనర్సు వాసాల శంకర్ ఈసంపల్లి మల్లేష్ కలవల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం.

జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం

గట్లకానిపర్తిలో నూతన జెండా గద్దె నిర్మాణ పనులు ప్రారంభం

శాయంపేట నేటిధాత్రి:

 

 

 

శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గట్లకా నిపర్తి గ్రామంలో ఎమ్మెస్ పి మండల ఇన్చార్జ్ మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో నూతన జెండా గద్దె నిర్మాణం సమావే శం జరిగింది.ఈ కార్యక్ర మంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇంచార్జ్ కందుకూరి సోమన్న మాదిగ ,ఎమ్మెస్ పి జిల్లా అధ్యక్షులు బండారి సురేందర్ మాదిగ , ఎమ్మార్పీ ఎస్ జిల్లా అధ్యక్షులు గద్దల సుకుమార్ మాదిగలు హాజరై మాట్లాడి అనంతరం ఎమ్మార్పీ ఎస్ నూతన జెండా గద్దె నిర్మా ణం పనులను ప్రారంభించా రు.ఈ కార్యక్రమంలో ముక్కెర ముఖేష్ మాదిగ, ఎంఎస్ ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎర్ర రాము మాదిగ ఎమ్మార్పీఎస్ నాయకులు,బొమ్మకంటి రవీంద్ర మాదిగ ,ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి ,
మామిడి విజయ్ మాదిగ
ఏం వైయస్ మండల అధ్యక్షు లు మామిడి తిరుపతి మాదిగ ,బొమ్మకంటి కుమార స్వామి మాదిగ ,బొమ్మకంటి సాంబయ్య మాదిగ ,చింతం రాజేందర్ మాదిగ ,బొమ్మకంటి కుమారస్వామి మాదిగ ,చిలుక కిరణ్ మాదిగ,బొమ్మకంటి భద్రయ్య మాదిగ ,బొమ్మకంటి సుధాకర్ మాదిగ ,బొమ్మకట్టి సదానందం మాదిగ, బొమ్మకం టి కుమార్ మాదిగ ,బొమ్మకం టి సాంబయ్య మాదిగ ,బొమ్మ కంటి ఆనందం మాదిగ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ నాయకులు.

కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ నాయకులు

◆: జహీరాబాద్ ఎమ్మార్పీఎస్ మాదిగ,అబ్రహం

జహీరాబాద్ నేటి ధాత్రి:

కలెక్టర్ కార్యాలయంలో నూతనంగా సంగారెడ్డి జిల్లాకు పాలనాధికారిగా బాధ్యతలు చేపట్టిన పీ ప్రావీణ్య గారిని మర్యాదపూర్వకంగా ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మరియు అనుబంధ సంఘాల నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది… ఇట్టి కార్యక్రమంలో
రామరపు శ్రీనివాస్ మాదిగ, వి స్ రాజు మాదిగ,అబ్రహం మాదిగ, బుచ్చంద్ర మాదిగ, పెద్ద గీత మాదిగ,కవిత మాదిగ, ఉల్లాస్ మాదిగ, విజయ్ మాదిగ, అశోక్ మాదిగ, ఫోటోల్ల వెంకటేష్ మాదిగ, నిర్మల్ మాదిగ,కృష్ణ మాదిగ,నటరాజ్ మాదిగ, నవీన్ మాదిగ,వీరయ్య మాదిగ, మోహన్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక.

ఇసిపేట గ్రామ ఎంఆర్పిఎస్ కమిటీ ఎన్నిక. చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక
నేర్పటి శీను కుమ్మరి శ్రీనాథ్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశంకర్ జిల్లా భూపాలపల్లి మొగులపల్లి మండల ఇన్చార్జి MRPS నేరెళ్ల ఓదెలు మాదిగ.కో ఇన్చార్జీలు రేణికుంట్ల సంపత్ మాదిగ. రామ్ రామ్ చందర్ మాదిగ . మొగులపల్లి మండల.ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి మాదిగ. జీడి సంపత్ మాదిగ ఆధ్వర్యంలోMRPS ముఖ్య కార్యకర్తల సమావేశ నికి ముఖ్య అతిథులుగా మొగులపల్లి మండల ఇన్చార్జ్ నేరెళ్ల ఓదెలు మాదిగ. కో ఇన్చార్జి రేణికుంట్ల సంపత్ మాదిగ లు హాజరై వారు మాట్లాడుతూ ” ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించిన తరువాత , పద్మశ్రీ అవార్డు గ్రహీతమంద కృష్ణ మాదిగతన పేరు పక్కన మాదిగ అని చేర్చుకున్న తరువాత మాదిగ సమాజానికి ఎనలేని దైర్యం కలిగింది. ఆ దైర్యంతోనే మాదిగలంతా తమ పేరు పక్కన కులం పేరు చేర్చుకొని ఆత్మ గౌరవాన్ని చాటుకున్నారని అన్నారు.రాజ్యాంగంలో పొందుపరిచిన ఎస్సీ రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన అందక పోవడం వల్లనే మాదిగలు అన్ని రంగాల్లోవెనుకబడిపోయారు.కనుక జనాభా ప్రాతిపదికన ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరించాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగ నేతృత్వంలో ముప్పై ఏళ్ళు రాజీలేని పోరాటం సాగిందని అన్నారు. ఆ పోరాట ఫలితంగానే నేడు తెలంగాణ రాష్ట్రంలో వర్గీకరణ చట్టం అమలులోకి వచ్చిందని,దాని ద్వారామాదిగలకు 9% రిజర్వేషన్లు దక్కాయి.ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలు మాదిగ విద్యార్థులు నిరుద్యోగులు అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి రావాలని పిలుపునిచ్చారు.అలాగే ఎస్సీ వర్గీకరణతో పాటు ఆరోగ్యశ్రీ, వికలాంగులు , వృద్దులు, వితంతువుల, ఒంటరి మహిళల పెన్షన్లు, తెలంగాణ అమరుల కుటుంబాలకు ఉద్యోగాలు , మహిళల భద్రత కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు మొదలగునవి ఎమ్మార్పీఎస్ సాధించి అన్ని వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు . కనుక దండోరా జెండా సమస్త అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలో జూలై 7 న ఎమ్మార్పీఎస్ 31 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా చేసుకోవాలని అన్నారు.ప్రతి గ్రామంలో దండోరా జెండా ఆవిష్కరణలు చేయాలని అన్నారు. ప్రతి గ్రామంలో సభలు జరిపి ఉద్యమానికి తోడుగా ఉన్న అన్ని కులాల పెద్దలను సత్కరించాలని అన్నారు.
ఇసిపేట గ్రామ కమిటీ ఎన్నిక చేయడం జరిగింది
గౌరవ అధ్యక్షులుగా. జన్నె సదయ్య.మాదిగ
అధ్యక్షులు : నేర్పట్టి శీను మాదిగ
ఉపాధ్యక్షులు : జన్నె క్రాంతి మాదిగఅధికార ప్రతినిధిగా. బొచ్చు రాకేష్ ముఖ్య సలహాదారులుగా. నేర్పాటి శ్రీను మాదిగ. జన్నెమొగిలి మాదిగ ప్రధాన కార్యదర్శి : బొచ్చు రాజు మాదిగ కార్యదర్శి : నేర్పట్టి అశోక్ మాదిగ కోశాధికారిక. గడ్డం చిరంజీవి మాదిగ.
ప్రచార కార్యదర్శిగా నేర్పటి రాజయ్య మాదిగ
సంయుక్త కార్యదర్శిగా. గడ్డం
రాజు. మాదిగ లను
చింతలపల్లి ఎమ్మార్పీఎస్ గ్రామ కమిటీ ఎన్నిక.అధ్యక్షులుగా. కుమ్మరి శ్రీనాథ్ఉపాధ్యక్షులుగా. శ్రావణ్అధికార ప్రతినిధిగా. అజయ్ ప్రధాన కార్యదర్శిగా. ప్రభాస్కార్యదర్శిగా. రాంబాబు
కోశాధికారిగా. అంతడుపుల రాజు
ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు అంతడుపుల సారంగపాణి జీడి సంపత్. రొంటాల రాజ్ కుమార్. జంపయ్య తదితరులు పాల్గొన్నారు

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక.

ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సమయ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి

 

shine junior college

 

 

మహదేవపూర్ మండల కేంద్రంలో బ్రాహ్మణపల్లి ఎస్సీ కాలనీ లో నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు అదేవిధంగా మండల ఇన్చార్జి అంబాల చంద్రమౌళి సూచనకు మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో గ్రామ శాఖ గౌరవ అధ్యక్షులు కాలువ మల్లయ్య గ్రామ అధ్యక్షులు పేట రాజు సమ్మయ్య ఉపాధ్యక్షులు అంబాల సంజీవ్ కార్యదర్శి నిట్టూరి అంకయ్య ప్రధాన కార్యదర్శి బొడ్డు రమేష్ ప్రచార కార్యదర్శి పేట రవి నూతన గ్రామ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జరగబోయే ఊరు ఊరునా దండోరా జెండా జూలై 7న ఘనంగా ఆవిష్కరించుకొని ఈ దేశంలోనే మాదిగ జాతి ఒక శక్తివంతంగా ఎదిగి సబ్బండ కులాలకు పెద్దన్న పాత్ర పోషిస్తున్న మందకృష్ణ మాదిగ ఈ క్రమంలో జాతి చేసిన పోరాటాలు ఎన్నో ఉన్నాయని సామాజిక న్యాయం సాధించిన తరుణంలో విజయోత్సవాలు చేసుకోవాలని మండలంలో గ్రామాల ప్రజలు యొక్క దండోరా విజయాలని అందిపుచ్చుకున్న ప్రతి ఒక్కరు జూలై 7న జెండా కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆత్కూరి సారయ్య పేట దేవేందర్ మాదిగ యువసేన మండల అధ్యక్షులు మంత్రి రవితేజ చింతకుంట సదానందం చింతకుంట రాము తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version