మండల సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం కు వీడ్కోలు..

మండల సమైక్య ఆధ్వర్యంలో ఏపీఎం కు వీడ్కోలు..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం లో అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్ గా పనిచేస్తున్న మెండి లతామంగేశ్వరి 8 సంవత్సరాలుగా ఓదెల ఏపిఎం గా బాధ్యతలు చేపట్టి ఈ రోజు బదిలీపై రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం ఏపీఏంగా బదిలీపై వెళ్లడం జరుగుతుంది. ఈ సందర్భంగా మండలంలోని గ్రామ సమైక్యల అధ్యక్షులు గ్రామ సంఘం అసిస్టెంట్లు మరియు సిబ్బంది అందరూ ఏపియం ని శాలువాలతో సన్మానించి వీడ్కోలు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ సురేంద్ర, రాము, సీసీలు మారెళ్ళ శ్రీనివాస్, మల్లయ్య, కొమురయ్య, విజయ రాజకుమారి, స్త్రీనిధి మేనేజర్ ప్రభాకర్ ,పవన్, భవాని, రమేష్, రాము మండల సమైక్య పాలకవర్గ సభ్యులు ఆలేటి స్వప్న రెడ్డి , పి.అనూష, జెఅనూష మరియు విఓ అధ్యక్షురాల్లు, వివోఏ లు పాల్గొనడం జరిగింది.

నాగేందర్ పటేల్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం..

బి ఆర్ ఎస్ యువ నాయకులు నాగేందర్ పటేల్ ఆధ్వర్యంలో నూతన ఎస్సై కి సన్మానం

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-100.wav?_=1

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన క్రాంతికుమార్ పటేల్ కు శుక్రవారం నాడు బోరేగావ్ బి ఆర్ ఎస్ యువ నాయకులు నాగేందర్ పటేల్ ఆధ్వర్యంలో సబ్ ఇన్స్పెక్టర్ కి పుష్ప గుచ్చం ఇచ్చి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఎస్ఐ క్రాంతికుమార్ పటేల్ మాట్లాడుతూ శాంతి భద్రతలు పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు వీరన్న బస్వరాజ్ జైకర్ రామచంద్ర నాగరాజ్ సి,మల్లన్న నాగేంద్ర పటేల్ తదితరులు పాల్గొన్నారు.

భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ..

భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-80.wav?_=2

నాగారం నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా

నాగారం పురపాలక సంఘం ఆవరణంలో భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో జండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది భారతీయ మజ్దూర్ సంఘం ఏర్పడి 70 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జండా ఆవిష్కరణ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాజీ జెడ్పిటిసి మునుగంటి సురేష్, మాజీ కౌన్సిలర్ బిజ్జా శ్రీను గౌడ్, అదేవిధంగా బిఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు రాము, రాఘవేందర్, పురుషోత్తం ప్రవీణ్ మరియు బిఎమ్ఎస్ సభ్యులు నాగారం పురపాలక సంఘ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్ర రెడ్డి, మాట్లాడుతూ కార్మికుల శ్రమ దోపిడీ ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి కచ్చితంగా అందరూ ఐకమత్యంతో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు అదేవిధంగా సురేష్, మాట్లాడుతూ రోజుకు ఎనిమిది గంటలు వారానికి 48 గంటలు పని చేయాలి అంతకుమించి ఎక్కువ పని చేసినట్లయితే వారికి ఓటి ఇవ్వాలి మరియు వారికి ఆదివారం రోజు కచ్చితంగా సెలవుదినంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం..

వామపక్ష విద్యార్ధి సంఘాల ఆధ్వర్యంలో బంధు విజయవంతం

పరకాలలో ప్రశాంతంగా కొనసాగుతున్న బంధు

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-78-1.wav?_=3

పరకాల నేటిధాత్రి
రాష్ట్రంలో పేరుకుపోయిన విద్యార్థుల సమస్యలు ప్రభుత్వం పరిష్కారించాలని విద్యార్ధి సంఘాలు చేప్పట్టిన బందు పరకాల పట్టణంలో ప్రశాంతంగా కొనసాగిందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు.ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్యాణ్,మండల అధ్యక్షుడు మడికొండ మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్ మాట్లాడుతూ పట్టణంలో ప్రైవేట్ స్కూలు మరియు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైతం బందుకు మద్దతు తెలిపారని అన్నారు.ఖాళీగా ఉన్న టీచర్,ఎంఈఓ,డిఈఓ పోస్టులు భర్తీ చేయాలని,ఇంటర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసి,పెండింగ్ స్కాలర్షిప్స్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ నిదులు,అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలకు మౌళిక సదుపాయాలు కల్పించాలని,పెండింగ్ మెస్, కాస్మోటిక్ ఛార్జీలను విడుదల చేయాలని,అద్దె భవననాలలో నడుస్తున్న వసతి గృహలకు స్వంత భవనాలు నిర్మించాలని,గురుకులాలలో అశాస్త్రీయంగా తీసుకు వచ్చిన సమయపాలనను మార్చాలని బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని,ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ నిధులు ఇవ్వాలని,విద్యార్థులకు ఆర్టీసిలో ఉచిత బస్పాసులు ఇవ్వాలని,ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ప్రిన్సిపల్,లెక్చరర్ పోస్తులు భర్తీ చేయాలని ఎన్ఈపి-2020 తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని బందుకు పిలుపునిచ్చామన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు వంశీ,మహేష్,రంజిత్,కృష్ణ,సురేష్,శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

యాదవ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కమిటీ ఎన్నిక.

తంగళ్ళపల్లి మండల యాదవ సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో పూర్తిస్థాయి కమిటీ ఎన్నిక…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం యాదవ సంఘం అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్. ప్రధాన కార్యదర్శి ముందటి తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో. మండలంలో పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో గౌరవ అధ్యక్షులుగా ఆత్మకు చంటి యాదవ్. ఉపాధ్యక్షులుగా మెడ కొక్కుల చరణ్ యాదవ్. కోశాధికారిగా మోతే మహేష్ యాదవ్. కార్యదర్శిగా చె న్నవనేని తిరుపతి యాదవ్. సహాయ కార్యదర్శులుగాబో ల్ల వేణి ఎల్లం. ప్రచార కార్యదర్శులుగా గుట్ల ఐలయ్య. దొంతుల ఆంజనేయులు. అరకుటి మహేష్. కొత్తపల్లి శ్రీనివాస్. వినవేని మల్లేశం. కార్యవర్గ సభ్యులుగా.. ఉడతల కుంటయ్య. దొంతుల ఆంజనేయులు చంద్రము. దొరగొ రాజేశం. త్యాగ దేవయ్య. జగ్గాని రాజేశం. తిరుపతిలు. ఏకగ్రీవంగా నీ ఎన్నుకున్నారని ఈ కార్యక్రమం తంగళ్ళపల్లి మండల కేంద్రంలోని యాదవ సంఘం కార్యాలయంలో మండల యాదవ సంఘం అధ్యక్షులు బండి దేవేందర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన ప్రకటించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు బండి దేవేందర్ యాదవ్ ప్రధాన కార్యదర్శి ముందర తిరుపతి యాదవ్ మాట్లాడుతూ. యాదవ సంఘం బలోపేతానికి అభివృద్ధికి. నిరంతరం కృషి చేస్తామని పేర్కొంటూ యాదవులందరూ. ఐక్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు అనంతరం. తేదీ. 20వ . 07.2025. రోజున నూతన కమిటీ ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని. దీనికి మండలంలోని యాదవ కురుమ సోదరులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలియజేస్తూ ఇట్టి కార్యక్రమంలో మండల యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో.

డాక్టర్ పూజ ఆధ్వర్యంలో చినమిడిసిలేరు గ్రామంలో హోమియోపతి వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-7.wav?_=4

చిన్న మీడిసిలేరు గ్రామంలో కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల హోమియోపతి వైద్యరాలు డాక్టర్ పూజ ఆధ్వర్యంలో హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు
ఈ ఆరోగ్య కేంద్రంలో 67 మంది ప్రజలను చూసి హోమియోపతి మందులను అందించారు
డాక్టర్ పూజ మాట్లాడుతూ హోమియో మందులు సైడ్ ఎఫెక్ట్ లేకుండా చక్కగా పనిచేసే మందులు ఈ మందులు అందరూ ఉపయోగించుకోవాలి
దీర్ఘకాలిక రోగాలకు చర్మ రోగాలకు పిడ్స్ కిడ్నీలో రాళ్ళు స్త్రీల సమస్యలు ఫైల్స్ మొదలగు అన్ని వ్యాధులకు ఈ మందులు చక్కగా పనిచేస్తాయి
అందరు హోమియోపతి మందులు అలవాటు చేసుకోవాలని తెలియజేశారు
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కొయ్యూరులో ఈ మందులు ఉచితంగా లభిస్తాయి కనుక చర్ల మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని తెలియజేశారు

DR నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం.

డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో బోదనెల్లి గ్రామంలో వైద్య శిబిరం

నేటి ధాత్రి చర్ల

చర్ల మండలం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్న బోదనెల్లి గ్రామంలో
డాక్టర్ నగేష్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించారు
ముగ్గురు జ్వరం బాధితులకు రక్త పరీక్ష మరియు ఆర్డిటి చేసినారు మలేరియా లేదని నిర్దారణ చేసి చికిత్సచేసినారు
32 మందికి సాధారణ వ్యాధుల కు మందులు ఇచ్చినారు
గర్భిణీ స్త్రీలకు పరీక్షలు చేసినారు
అలాగే ప్రతి నెల గర్భిణీ స్త్రీల పరీక్షలు చేయించుట కొరకు ఆసుపత్రికి రావాలని మరియు సురక్షిత కాన్పు కొరకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రము సత్యనారాయణపురంకి రావాలి అని తెలిపారు
ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేసినామని తెలిపారు
డ్రై డే కార్యక్రమాలు చేపించి ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని తెలిపారు
జ్వరాలు వచ్చిన వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా ఆసుపత్రికి కి రావలెనని చెప్పడం జరిగింది
దోమల వలన వచ్చే వ్యాధుల గురించి చెప్పడం జరిగినది
కాచి చల్లార్చిన నీళ్లు త్రాగాలి
నీటి నిల్వలు లేకుండా చూడాలని
దోమలనుంచి రక్షణ కొరకు దోమతెరలు కట్టుకోవాలి ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో
హెచ్ఈఓ బాబురావు
యమ్ హెల్ హెచ్ పి
సంధ్య హెల్త్ అసిస్టెంట్స్ వరప్రసాద్
కవిత
ఆశా కార్యకర్తలు
పోతమ్మ తదితరులు పాల్గొన్నారు

వరండాలు, చెట్ల కింద పై చదువులు.

వరండాలు, చెట్ల కింద పై చదువులు
• ఆరు బయట వంట
• సరిపడ గదులు లేక ఇబ్బందులు..

నిజాంపేట: నేటి ధాత్రి

Principal Padma Reddy’s

ఆరు బయట చెట్ల కింద, వరండాలలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరు బయట చదువులు కొనసాగించలేమని విద్యార్థులు వాపోతున్నారు. సరైన గదులు లేక ఆరుబయటే వంట కూడా కొనసాగించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరు బయట వంటశాలకు విష సర్పాలు వస్తున్నాయని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి పాఠశాలకు అదనపు గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించాలని వేడుకుంటున్నారు.

ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి వివరణ

పాఠశాలలో అదనపు గదులు లేక ఆరుబయటే చదువులు కొనసాగించడం వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకోబోయినట్లు పేర్కొన్నారు.

మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య.

మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య

జైపూర్,నేటి ధాత్రి:

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2.wav?_=5

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్మన సంపత్ (30) అనే వ్యక్తి మద్యం మత్తులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై రాజేందర్ సోమవారం తెలిపారు.జూలై 11న రాత్రి తాగిన మైకంలో పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులు గమనించి చెన్నూరు ఆసుపత్రికి తరలించారు.అనంతరం కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు మృతుడికి భార్య స్వప్న, సోదరుడు రాజేందర్ ఉన్నారని తెలిపారు.

సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ.

సిరిసిల్ల సాహితి సమితి ఆధ్వర్యంలో దర్పణం పుస్తకం ఆవిష్కరణ

సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోనీ ఈరోజు సిరిసిల్ల సాహితి సమితి అధ్యక్షులు జానపాల శంకరయ్య, మరియు కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ ఆధ్వర్యంలో మల్లేష్ చక్రాల కోనరావుపేటకు చెందిన రచయిత (ధర్పణం)కవిత పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగినది.అధ్యక్షులు జానపాల శంకరయ్య మాట్లాడుతు..ధర్పణం పుస్తకం నేటి సమాజంలో
నేటి యువతకు ఎంతగానో తొడపడుతున్నది.
సాహిత్యంతో నేటి యువత సద్వినియోగం చేసు కొని సమాజం లో ఉన్న అసమానతలు తొలిగించాలి అని తెలిపారు. అలాగే బాల సాహిత్య వేత్త వాసరవేణి పర్శరాములు మాట్లాడుతు పుస్తక రచయిత తన అక్షరాలను పూల మల్లికాల కుర్చీ
సమాజానికి తెలియజేస్తుంది అని తెలిపారు.
మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచంధర్ మాట్లాడుతు ధర్పణం ఒక అద్భుతం పుస్తకం అని
అంతేకాకుండా సమాజంలో జరిగే పరిమానాలు
తెలియజేసే విధంగా ఉన్నది అని తెలిపారు. అంతేకాకుండా సిరిసిల్ల మానేరు కవులు, రచయతలకు ఒక పుట్టిన్నీళ్లు అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో కోడం నారాయణ, బూర దేవానందం, ఏనుగుల ఎల్లయ్య,గడ్డం పర్శరాములు,గాయకుడు సుల్తానా మల్లేష్,
అంకారపు రవి, తదితరులు పాల్గొన్నారు.

భారత్‌పై సుంకాలు..20% లోపే..

భారత్‌పై సుంకాలు..20% లోపే

అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్‌ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి…

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిర్ణయం తాత్కాలిక వాణిజ్య ఒప్పందానికి సన్నాహాలు

బ్రిటన్‌ తర్వాత మనతోనే ఈ తరహా అవగాహన

ట్రంప్‌ సర్కారు నిర్ణయం

వాషింగ్టన్‌, జూలై 12: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికయ్యాక ట్రంప్‌ సుంకాల బాదుడుకు పలు దేశాలు విలవిల్లాడుతున్నాయి. ప్రపంచ షేర్‌ మార్కెట్లు ‘బేర్‌’మంటున్నాయి. చైనా లాంటి దేశాలపై పదుల్లో కాకుండా.. వందల శాతాల మేర సుంకాల బాదుడుతో ట్రంప్‌ దూసుకుపోతున్నారు. ఇటీవల బ్రిక్స్‌ దేశాలకు 50శాతానికి పైగా సుంకాలు తప్పవని, భారత్‌ కూడా మినహాయింపు కాదని హెచ్చరించిన సంగతి తెలిసిందే..! అయితే.. త్వరలో భారత్‌తో కుదరనున్న తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ప్రకారం అమెరికా దిగుమతి చేసుకునే భారతీయ ఉత్పత్తులపై సుంకాలను 26%(ముందుగా ప్రకటించినది) కాకుండా.. 20% కంటే తక్కువగా ప్రకటించే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపినట్లు పలు వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ ఒప్పందంతో ట్రంప్‌ పాలనలో వాణిజ్య ఒప్పందం చేసుకున్న అరుదైన దేశాల జాబితాలో భారత్‌ చేరనుంది. ఇప్పటికే బ్రిటన్‌ ఈ జాబితాలో ఉంది.

ఇక ఆసియా దేశాలైన మయన్మార్‌పై 40%, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లపై 20% మేర అమెరికా సుంకాలు కొనసాగుతున్నాయి. భారత్‌ మాత్రం అధిక సుంకాల జాబితాలో చేరకపోవచ్చని బ్లూమ్‌బెర్గ్‌ కూడా ఓ నివేదికలో పేర్కొంది. మరోవైపు అమెరికాతో వాణిజ్య చర్చలకు భారత్‌ వడివడిగా అడుగులు వేస్తోంది. ఓ ప్రతినిధి బృందం అమెరికాకు చేరుకుని, అక్కడి అధికారులతో చర్చలు జరపనుంది. ఇప్పటికే భారత్‌ తన తుది ప్రతిపాదనను అమెరికాకు అందజేసింది. జన్యు మార్పిడి(జీఐ) పంటలకు భారత్‌ వ్యతిరేకంగా ఉన్న విషయం తెలిసిందే..! అయితే.. అమెరికా తన తాత్కాలిక వాణిజ్య ఒప్పందంలో భాగంగా భారత్‌పై జీఐ పంటల విషయంలో ఒత్తిడి చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి భారత్‌ అంగీకరించకపోవచ్చని తెలుస్తోంది. ఇటు ఔషధ రంగ నియంత్రణ సమస్యలు కూడా ఇంకా పరిష్కారం కావాల్సి ఉంది. ప్రస్తుత చర్చల తర్వాత తాత్కాలిక ఒప్పందం కుదురుతుందని, ఈ ఏడాది చివరికి తుది ఒప్పందంపై ప్రకటన ఉంటుందని సమాచారం.

కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేత కార్మికులకుఅవగాహన.

*మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో
నేత కార్మికులకు,అవగాహన కార్యక్రమం*

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలోనీ మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ద్వారా ఈ రోజు ప్రగతి నగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కార్మికులలో నిద్ర సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు. నిద్రలేమి వల్ల అనేక మానసిక సమస్యలు, శారీరక అనారోగ్యాలు వస్తాయని అన్నారు.జీవన శైలి వ్యాధులు బ్లడ్ ప్రెషర్, డయాబెటిస్, క్యాన్సర్స్ , ఆత్మహత్య ఆలోచనలు ఎక్కుగా ఉంటున్నాయని అన్నారు. ప్రతికూల ఆలోచనల్ని విడనాడి అనుకూల దృక్పథాన్ని అలవర్చుకోవడం ద్వారా, చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా అనేక జీవన శైలి వ్యాధుల బారి నుండి బయట పడవచ్చని అన్నారు.కార్మికుల కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య వివాదాలు ఎక్కువగా ఉన్నాయని మైండ్ కేర్ సెంటర్ ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఉండటం సహజమని తెలుపుతూ సమస్యపై కాకుండా వాటి పరిష్కారమార్గాల మీద దృష్టి నిలిపి ఓపికతో పరిష్కరించుకోవాలని అన్నారు.కార్మికుల్లో పొదుపు ప్రవృత్తి తక్కువగా ఉందని, తమ ఆదాయంలోంచి ఎంతో కొంత పొదుపు చేయడం అలవర్చుకోవాలని అన్నారు.సిరిసిల్ల ప్రభుత్వ వైద్యశాలలో శారీరక, మానసిక ఆరోగ్య వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఎటువంటి మానసిక సమస్యలు ఎదురైనా వాయిదా వేయకుండా వెను వెంటనే పరిష్కరించుకోవాలని అన్నారు.
మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ పవర్ లూమ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిందని, ఎటువంటి మానసిక సమస్య ఎదురైనా తమను సంప్రదించాలని కార్మికులకు సూచించారు.ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ సిబ్బంది కొండ ఉమ, రాపెల్లి లత, బూర శ్రీమతి, కార్మికులు పాల్గొన్నారు.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ.

నేడు బిజెపి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా నిరసన ర్యాలీ

సిరిసిల్ల టౌన్ (నేటి ధాత్రి):

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈరోజు యాభై ఏళ్ల క్రితం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీని భారత రాజ్యాంగ వ్యతిరేక దినంగా పరిగణిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన తన్నీరు ప్రభాకర్ రావు, గాల్ రెడ్డిలను సన్మానించారు. ఈ సందర్భంగా నర్సయ్య గౌడ్ మీడియాతో మాట్లాడాతూ..
యాభై ఏళ్ల క్రితం ఇదే రోజున దేశంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించి రాజ్యాంగాన్ని హత్య చేశారని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆరోపించారు. ఈ నిరసన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మౌన ప్రదర్శన, నిరసన ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. ఇందిరాగాంధీ 1975 లో అధికారం కొరకు, అహంకారంతో కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఎమర్జెన్సీని విధించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని విమర్శించారు. ఈ ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థలను అణిచివేస్తూ ఒక కుటుంబం కోసం చేసిన పని అని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ భారత ప్రజలు మరచిపోలేని చీకటి రోజు అని అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అధికారం, అహంకారం కొరకు ఎమర్జెన్సీని తీసుకురావడం వల్ల దేశానికి నష్టం జరిగిందన్నారు. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ బిజెపి అగ్రనాయకులు అద్వానీ, వాజపేయి, మోడీ లు నినదిస్తే అణిచివేసేందుకు కుట్రలు పన్నారని గుర్తు చేశారు. ఎమర్జెన్సీ రోజును ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘన దినోత్సవమని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.

ఉప్పర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సిమెంట్ పంపిణీ.

కల్వకుర్తి/ నేటి ధాత్రి:

 

 

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండల్ వెల్దండ గ్రామపంచాయతీ జోగు రవి కుమార్ s/o యాదయ్య గారు,రాష్ట్ర నాయకులు మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ చారిటబుల్ ట్రస్ట్ రిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్ల నిర్మాణంలో భాగంగా ఇల్లు నిర్మాణం కోసం సిమెంట్ పంపించారు. మంగళవారం నిరుపేద కుటుంబాలకు ఇంటి నిర్మాణం కోసం మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ తన ట్రస్టు ద్వారా సిమెంట్, ఇప్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆ కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ ధన్యవాదాలు తెలిపారుసిద్ధగొని రమేష్ గౌడ్ , మధుసూదన్ రెడ్డి, జోగు రవి కుమార్, ప్రభాకర్ కార్యక్రమంలో
తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు.

బీజేపీ పట్టణశాఖ ఆధ్వర్యంలో ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు

హాజరైన బీజేపీ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు

పరకాల నేటిధాత్రి:

 

బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్.కాళీ ప్రసాద్ రావు హాజరయ్యారు.ఈసందర్బంగా మాట్లాడుతూ యోగా అనేది భారతదేశంలో ఉద్భవించిన పురాతన భౌతిక,మానసిక మరియు ఆధ్యాత్మిక అభ్యాసం ‘యోగ’అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించింది మరియు శరీరం మరియు మనస్సు కలయికకు ప్రతీకగా చేరడం లేదా ఏకం చేయడం అని,నేడు ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆచరించబడుతోంది మరియు జనాదరణ పొందుతూనే ఉందని,దాని సార్వత్రిక విజ్ఞప్తిని గుర్తించి,11 డిసెంబర్ 2014న ఐక్యరాజ్యసమితి 69/131 తీర్మానం ద్వారా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించిందని అన్నారు.యోగా సాధన వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడం అంతర్జాతీయ యోగా దినోత్సవం లక్ష్యమని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని స్థాపించే ముసాయిదా తీర్మానాన్ని భారతదేశం ప్రతిపాదించింది మరియు రికార్డు స్థాయిలో 190 సభ్య దేశాలు ఆమోదించాయన్నారు.

జనరల్ అసెంబ్లీ 69వ సెషన్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగంలో ఈ ప్రతిపాదనను మొదట ప్రవేశపెట్టారు.యోగా అనేది మనస్సు మరియు శరీరం,ఆలోచన మరియు చర్య యొక్క ఐక్యతను కలిగి ఉంటుందని మన ఆరోగ్యానికి మరియు మన శ్రేయస్సుకు విలువైన సంపూర్ణ విధానం. యోగా అంటే వ్యాయామం మాత్రమే కాదు,మీతో, ప్రపంచంతో మరియు ప్రకృతితో ఏకత్వం యొక్క భావాన్ని కనుగొనడానికి ఇది ఒక మార్గం,యోగా అనేది శారీరక శ్రమ కంటే ఎక్కువ మరియు రోజువారి జీవితంలో సమతుల్య వైఖరిని కొనసాగిస్తుందని పనితీరులో నైపుణ్యాన్ని ఇస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కాచం గురుప్రసాద్,ఆర్పి జయంతి లాల్,కాసగాని రాజ్ కుమార్, ఎరుకలు దివాకర్,మార్తా రాజభద్రయ్య,ఎర్రం రామన్న, సంగా పురుషోత్తం,బాసాని సోమరాజు పటేల్,మార్త బిక్షపతి,సందీప్,కుమారస్వామి నరసయ్య,పావుశెట్టి సునీత,దంచనాదుల కిరణ్ కుమార్,కందుకూరి గిరి ప్రసాద్,కాలుగుల గోపీనాథ్, గోగుల రాజిరెడ్డి,రవీందర్ యాదవ్,నగేష్,బాలాజీ మురళి,ఆర్పీ సంగీత,చెట్ల రజినీకాంత్,సంగా ప్రభాకర్, బండి యాదగిరి,మధుసూదన్ రెడ్డి, రాంబాబు,ప్రజా ప్రతినిధులు,బిజెపి నాయకులు,పతాంజలి వాకర్స్ అసోసియేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.

లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్.!

మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్

 

 

 

మెట్ పల్లి జూన్ 20 నేటి దాత్రి

 

 

 

 

మెట్ పల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో నిన్న రాత్రి లయన్స్ క్లబ్ నూతన అధ్యక్ష కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు లయన్స్ సెకండ్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ గుంటుక చంద్ర ప్రకాష్ లయన్ పి డి జి అనంతుల శివప్రసాద్ , రీజనల్ చైర్మన్ గుంటుక సురేష్, కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వడి నర్సింగారావు పాల్గొన్నారు.

 

లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులుగా వెల్మల శ్రీనివాసరావు
సెక్రెటరీగా సురకంటి జైపాల్ రెడ్డి ట్రెజరర్ గా వేములవాడ చంద్రశేఖర్
ఈ ప్రమాణ స్వీకారం చేశారు.

వీరిచే ముఖ్యఅతిథిగా లయన్స్ సెకండ్ డిస్టిక్ గవర్నర్ గుంటుక చంద్ర ప్రకాష్ లయన్స్ పి డి జి అనంతులశివప్రసాద్ ప్రమాణ స్వీకారం చేయించి మెట్పల్లి అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు.

అనంతరం లయన్స్ గుంటుక చంద్రప్రకాష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సేవలో ముందుంటుందని ప్రపంచంలో 210 దేశాలకు పైగా లయన్స్ క్లబ్ సేవలు చేస్తున్నారని ఇది పేదలకు ఉచిత కంటి శిబిరాలు వైద్య శిబిరాలు చేస్తూ ఉచిత సహాయాలు అందజేస్తుందని అన్నారు.

పి డి జి అనంతల శివప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో సేవా భావంతో పనిచేసే సంస్థ మన లయన్స్ క్లబ్ ఇంట్రర్నేషనల్ అని మన తెలంగాణలో మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఉత్తమ సేవ కార్యక్రమంలో ముందుంటుందని ఇది సంతోషకరమైనదని వారు చేస్తున్న సేవకు లయన్స్ క్లబ్ తరఫున నేను వారిని అభినందిస్తున్నానని అన్నారు.

నూతన అధ్యక్షులు వెల్మల శ్రీనివాసరావు మాట్లాడుతూ 17 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ సేవలు అందిస్తుందని దీనికి ప్రభుత్వ పరంగా స్థలము కేటాయించాలని నర్సింగరావు కు వినతి పత్రం అందించామని దానికి వారు సానుకూల స్పందన తెలియజేశారని అన్నారు.

ముఖ్యఅతిథి జువ్వాడి నర్సింగారావు మాట్లాడుతూ నేను కోరుట్ల మెట్పల్లి నియోజకవర్గాల్లో అన్ని గ్రామాలు తిరగానని అందులో లయన్స్ క్లబ్ సేవలు బాగున్నాయని చాలామంది చెప్పారని వారి సేవలను పేద ప్రజలు మరవరని ఇటువంటి సేవ చేయడం లయన్స్ క్లబ్ వారికి చెందిందని ఉచిత వైద్య శిబిరాలు ఉచిత కంటి శిబిరాలు పేద విద్యార్థులకు నోట్ బుక్కులు పంపిణీ పేదలకు చలికాలంలో చద్దర్లు పంపిణీ హాస్టల్లో వారి సదుపాయ ఫ్యాన్లు గాని ఇతర సామగ్రిని ఇవ్వడం చాలా మంచి కార్యక్రమం వారికి నా సంపూర్ణ మద్దతు ఉంటుందని వారికి నా సహాయం ఎప్పుడు కావాలన్నా అందిస్తానని అన్నారు .

ఈ కార్యక్రమంలో జెడ్ సి గడ్డం శంకర్ రెడ్డి లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఇల్లెందుల శ్రీనివాస్, సెక్రెటరీ గూండా రాకేష్, క్యాషియర్ నాంపల్లి వేణు గోపాల్, 2025-26 జోన్ చైర్మన్ లయన్ పోలీస్ శ్రీనివాస్,పాస్ట్ ప్రెసిడెంట్లు లయన్ డొంతుల ఆంజనేయులు,గంగుల మురళి,పోహార్ తుకారాం పాల్గొన్నారు.

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు.

జమ్మికుంట యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు
జమ్మికుంట నేటిధాత్రి:

 

యూత్ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి మరియు హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆదేశాల మేరకు, యూత్ కాంగ్రెస్ జమ్మికుంట మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ ఆధ్వర్యంలో, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జమ్మికుంట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా, జమ్మికుంట యూత్ కాంగ్రెస్ పక్షాన రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు

అనంతరం యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు బుడిగె శ్రీకాంత్ మాట్లాడుతూ; దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబానికి చెందిన నాయకుడు, 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి నాలుగవ తరం వారసులు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 75 యేళ్లలో దాదాపు 50 ఏళ్లకు పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిందని అన్నారు. రాహుల్ గాంధీ 2004లో భారత రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా గెలిచి, ఆ తదుపరి ఎఐసిసి అధ్యక్షులుగా యువ నాయకత్వాన్ని వహించారన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి, అదే విధంగా న్యాయ యాత్ర ద్వారా పేద అట్టడుగు మరియు వెనుకబడిన ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని తిరిగి పొందడానికి జై భీమ్, జై బాపు, జై సంవిదాన్ అనే కార్యక్రమంతో ప్రజలకు రాజ్యాంగం యొక్క గొప్పతనం తేలవాల్సిన అవసరం ఉందని, దాని కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. రేపటి ఉజ్వల భవిష్యత్తు కోసం భారతదేశ ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు రాహుల్ గాంధీ అని రానున్న రోజుల్లో ఈ దేశ ప్రజల ఆశీర్వాదంతో వారిని ప్రధానమంత్రిగా చూడబోతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో; యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్లపల్లి నాగరాజు, కార్యదర్శి దొడ్డె సంధ్య నవీన్, పింగిలి చైతన్య రమేష్, అసెంబ్లీ కార్యదర్శి పాతకాల రమేష్, రోమాల రాజ్ కుమార్, మండల ఉపాధ్యక్షులు దేవునూరి వినయ్, ప్రధాన కార్యదర్శి బిజిగిరి శ్రీకాంత్, కార్యదర్శి యేబుషి అజయ్, పైడిపల్లి వెంకటేష్, నాయకులు జావిద్, సూర్య రెడ్డి, ఇల్లందుల శివ, బండి పవన్, అష్రఫ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ.

స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

shine junior college

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని వెంకంపేట ప్రాథమిక పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్స్ వితరణ కార్యక్రమం చేపట్టనైనది. ఈ కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం మరియు ఎం.ఈ.ఓ అధ్యక్షత వహించగా దూస రఘుపతి ఎం.ఈ.ఓ మాట్లాడుతూ విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా నోట్ బుక్స్ అందించడం ఒక మంచి కార్యక్రమం అని తెలియజేశారు అంతేకాకుండా విద్యార్థులు భవిష్యత్తులో విద్య ద్వారా అభివృద్ధి చెందాలని కోరడం జరిగినది. స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు కోమాకుల ఆంజనేయులు,కార్యదర్శి శ్రీపతి కాశీరాం సభ్యులు నవీన్ గోవర్ధన్, సతీష్, రమేష్ తదితరులు చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించినారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫౌండేషన్ కార్యదర్శి మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో ఫౌండేషన్ స్థాపించామని 2011 నుండి వెంకంపేట పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నమని తెలియజేశారు.. ఇట్టి కార్యక్రమాన్ని ఇకముందు కూడా కొనసాగించుటకు పాఠశాల అధ్యాపక బృందాన్ని కోరడమైనది. సంస్థ సభ్యులు ఇకముందు కూడా ఇదే విధిగా కొనసాగించడానికి అంగీకరించినారు ..కావున పిల్లలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్ఫూర్తి ఫౌండేషన్ ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఇకముందు కొనసాగించాలని పాఠశాల అధ్యాపకులు కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ హెచ్.ఎం రాణి మరియు పాఠశాల ఉపాధ్యాయినీలు పద్మ, సౌభాగ్య తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.

పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం:-

హాజరైన రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు దుస్సా జనార్దన్:-

 

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, (లీగల్):-

 

 

 

 

శనివారం హనుమకొండ లోని నేత హాస్టల్ లో పద్మశాలి అడ్వకేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వరంగల్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పద్మశాలి న్యాయవాదుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని ఇటీవల జరిగిన బార్ అసోసియేషన్ల ఎన్నికలలో వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు గా వలుస సుదీర్, కోశాధికారి గా సిరిమల్ల అరుణ, కార్యవర్గ సభ్యులుగా యం.

మేఘనాథ్, పరకాల బార్ అసోసియేషన్ మహిళ కార్యదర్శిగా గజ్జెల సధారణి, జనగామ జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి రామకృష్ణ గెలుపొందిన తదితర న్యాయవాదులను ఆయన ఘనంగా సన్మానించారు.

ఇట్టి సందబంగా దుస్సా జనార్ధన్ మాట్లాడుతూ ప్రతీ యువ న్యాయవాది నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని అన్నారు.

Advocates

 

ఈ కార్యక్రమం లో పావ అధ్యక్షులు గంజి గణేష్, సీనియర్ న్యాయవాదులు మార్గం వీరస్వామి, దాసరి ప్రేంసాగర్, కొండబత్తుల రమేష్ బాబు, పోపా రాష్ట్ర అధ్యక్షులు శామంతుల శ్రీనివాస్, బిల్లా ప్రభాకర్, మేరుగు సుభాష్, రవీందర్, పాము రమేష్, ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు, మహబూబాబాద్ జిల్లా పద్మశాలి అధ్యక్షులు చిలుకమారి వెంకటేశ్వర్లు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.

డాక్టర్ హారిక ఆధ్వర్యంలో హాస్టల్స్ లో దోమల.!

డాక్టర్ హారిక ఆధ్వర్యంలో హాస్టల్స్ లో దోమల మందు స్ప్రే నిర్వహణ

నేటి ధాత్రి చర్ల:

 

 

 

 

 

 

కొయ్యూరు ప్రాథమిక వైద్యశాల స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ హారిక ఆధ్వర్యంలో చర్ల మండల కేంద్రంలోని హాస్టల్స్ లో పర్యటించి హాస్టల్ పరిసరాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పిల్లలకు నాణ్యమైన మంచి పోషకాహారాన్ని అందించాలని వార్డెన్ కు సూచించారు వర్షాకాలం దోమలు అధికముగా వచ్చే ప్రమాదం ఉన్నది దోమలు మనలను కుట్ట కుండ జాగర్తలు తీసుకోవాలని
విద్యార్థులకు జ్వరం వచ్చినట్లయితే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకురావాలని అక్కడ మంచి వైద్యం అందుతుందని తెలియజేశారు

హాస్టల్ చుట్టూ ప్రక్కలా నీరు నిలవకుండా చూసుకోవాలని పరిసర ప్రాంతాల్లో పంచాయతీ కార్మికులతో బ్లీచింగ్ చల్లిస్తూ ఉండాలని పిచ్చి మొక్కలు చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని తెలియజేశారు

 

Mosquito

 

ఈ కార్యక్రమంలో సబ్ యూనిట్ ఆఫీసర్ ధర్మారావు హెల్త్ సూపర్వైజర్ రాంప్రసాద్ మలేరియా టెక్నికల్ సూపర్వైజర్ రామకృష్ణ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తులసి హెల్త్ అసిస్టెంట్ ధర్మారావు నరసింహారావు స్వరూప
ఆశా కార్యకర్తలు రంగమ్మ కృష్ణవేణి ఉషారాణి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version