ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగించాలి….

ఎస్సీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తు గడువు పొడిగించాలి

ములుగు టౌన్ నేటి ధాత్రి

ములుగు జిల్లాలో షెడ్యూల్డ్ క్యాస్ట్ తరగతుల వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకార రుణాలకు (ఎస్సీ కార్పొరేషన్) దరఖాస్తు గడవు చాలా పరిమితి రోజులు కేటాయించి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కావున వెంటనే దరఖాస్తు మరో నెల రోజుల పాటు గడువు పొడిగించాలని కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి ధ్యేయంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న రుణాల కు చాలా తక్కువ రోజులు పరిమితి విధించి దరఖాస్తు గడువు నిర్ణయించడం జరిగింది . ఈ క్రమంలోనే పండుగలు సెలవులు రావడం వల్ల అనేకమంది అర్హులు ఆయా కులం సర్టిఫికెట్స్ మరియు ఇతర సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడం వల్ల చాలామంది దరఖాస్తుకు సమయానికి చేసుకోలేకపోవడం వల్ల అనేకమంది అనర్హులుగా మిగిలిపోతున్నారని అన్నారు అలాగే కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న ఇవి వెహికల్స్ కి లైసెన్స్ ముఖ్యంగా మహిళలకు టూవీలర్ కి లైసెన్స్ కూడా ఉండాలనే నిబంధనను తొలగించాలని అన్నారు ట్రాఫిక్ RTO వాళ్లే లైసెన్స్ అడగరు కదా మరి ఏ ఉద్దేశంతో కార్పొరేషన్ ద్వారా ఇస్తున్న ఇవి వెహికల్స్ కి లైసెన్స్ ఉంటేనే అర్హులని అడగడం ఎంతవరకు కరెక్ట్ అనేది అధికారుల ఆలోచించాలి లైసెన్స్ కావాలని నిబంధనను తొలగించాలి ఇంకా ఇతర అగ్రికల్చర్ లోన్స్ కు సంబంధించి సబ్సిడీ ఎక్కువ కల్పించాలని కోరడం జరిగింది అలాగే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి లోన్ మంజూరు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది గత ఐదు ఆరు సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అనేవి మంజూరు చేయడంలో గత ప్రభుత్వంతో పాటు ఈ ప్రభుత్వం కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది షెడ్యూల్ క్యాస్ట్ ప్రజలు ఆర్థికంగా నష్టపోయారని ఇప్పటికైనా పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందేలా కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది

ములుగు పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా ఆధారంగా రిజర్వేషన్లు

గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా నిష్పత్తికి సమానంగా రిజర్వేషన్లు (సీట్లు) కల్పించాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

ములుగు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ పాల్గొని
మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, కానీ 2011-2025 ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరిగి అనేక వేల మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందారని ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రాక రాజకీయ రంగంలో కూడా వారి వెనుకబడిపోయి వివక్షతకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోయి బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానం వల్ల రాజకీయ రంగంలో కూడా అవకాశాలు కోల్పోతారని, భారత రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి, సీట్లు కేటాయించాలని ఉందని, అలాగే ప్రభుత్వాలు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని అయినా నేటి పాలకులు అవేమీ పట్టించుకోకుండా బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం అంటే ముమ్మాటికి వారిని అవమానించడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైనదని వెంటనే ఈ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవరించి రాష్ట్రవ్యాప్తంగా మరియు ములుగు జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version