77 వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని ,జాతీయ జెండాను ఆవిష్కరించిన
జహీరాబాద్ నేటి ధాత్రి:
77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఝరాసంగం గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ మాట్లాడుతూ.. ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించిందని, వారి మేధోకృషితోనే మన రాజ్యాంగం రూపుదిద్దుకుందని కొనియాడారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ వర్ధిల్లుతుండటం గర్వకారణమని పేర్కొన్నారు. రాజ్యాంగ నిర్మాతలను స్మరిస్తూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ మండల పశువైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి గ్రామ తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బాని,వార్డ్ మెంబర్లు నవీన్ కుమార్, సంగమేష్ ప్రవీణ్, ప్రకాష్ సింగ్, తేజమ్మ,మాలి పటేల్ సంతోష్ కుమార్, నాగేశ్వర్ సజ్జన్,మాలి పటేల్,ఎజాస్ బాబా, మాలి పటేల్ శ్రీనివాస్,తమ్మలి విజయ్ ప్రకాష్ సింగ్ కుమార్, మహమ్మద్ అజరు, గోపాల్ కుమారి,లక్ష్మీకాంత్,ఉమేష్, ఠాగూర్ సంజు, గాజుల కృష్ణ,పార్టీ పెద్దలు నాయకులు కార్యకర్తలు వార్డ్ మెంబర్లు తదితరులు
పాల్గొన్నారు.
