పార్థివ దేహానికి నివాళు లు..

పార్థివ దేహానికి నివాళు లు

మృతిని కుటుంబానికి ఎమ్మార్పీఎస్ నాయకులు అండగా ఉంటాం

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మా ర్పీఎస్ మండల కమిటీ నాయ కులు సామాజిక ఉద్యమంలో సాంబయ్య మాదిగ అత్యంత క్రియాశీలక, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చట్టబద్ధ సాధన కో సం సుదీర్ఘ పోరాటం దండోరా లో కీలక పాత్ర పోషించడం జరిగింది కాబట్టి పార్థివ దేహా నికి పూలమాల వేసి నివాళు లర్పించడం జరిగింది.ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్ధ సాధన కోసం సుదీర్ఘంగా దండోరా ఉద్యమంతో ముం దుకు నడిపించారు. మృతుని కుటుంబానికి ఎమ్మార్పీఎస్ ఉద్యమం అండగా ఉంటుం దని విద్య వైద్య విషయంలో అండగా, మాదిగ జాతి ఎప్పటికీ పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిం చారు.ఈ కార్యక్రమంలో ముక్కెర

ముఖేష్ మాదిగ, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తుడుంవెంకటేష్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల అధ్య క్షుడు మామిడి భాస్కర్ మాది గ ఎంఎస్ పి మండల అధ్య క్షులు బొమ్మకంటి రవీందర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి బొమ్మగంటి పోశాలు మాదిగ ఎమ్మార్పీఎస్ మండల నాయకులు బొమ్మ కంటి సాంబయ్యమాదిగ మాజీ సర్పంచ్. సాంబయ్య,చింతం రాజేందర్ మాదిగ డబ్బా రవి మాదిగ టైలర్ కుమార్ మహేం ద్ర మాదిగ మచ్చిరెడ్డి కుమార్ మాదిగ. స్టీరింగ్ కుమార్ మా దిగ ,కోయిల బిక్షపతి మాదిగ పాల్గొన్నారు.

మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రయాణం……

మందకృష్ణ మాదిగ పిలుపుమేరకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ప్రయాణం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండల నుండి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ తరలివెళ్లిన నాయకులు. ఈ సందర్భంగా ఈరోజు ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ . పిలుపుమేరకు దళితుల ఆత్మ గౌరవ. నిరసన ర్యాలీకి. హైదరాబాద్ కి రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఎమ్మార్పీఎస్. ఎం ఎస్ పి. విహెచ్పిఎస్. వారి ఆధ్వర్యంలో నాయకులందరూ తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కొన్ని దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేస్తున్నామని. వాటికి అనుగుణంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్న ఇంకా ప్రకటించకపోవడం బాధాకరమని. మా అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపుమేరకు దళితుల ఆత్మ గౌరవ నిరసన ర్యాలీకి తరలి వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎమ్మార్పీఎస్. నిరసనకు వెళుతున్న వారిలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ మాదిగ. ఎమ్మెస్పీ జిల్లా అధికార ప్రతినిధి గుండ్రెడ్డి రాజు మాదిగ. ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ సావనపల్లి రాకేష్ మాదిగ. దొబ్బల ఆనంద్. ఎమ్మార్పీఎస్ తంగళ్ళపల్లి మండల అధ్యక్షులు సవనపల్లి బాలయ్య. వీహెచ్పీఎస్ మండల కన్వీనర్ మునిగేశంకర్. ఎమ్మార్పీఎస్ నాయకులు మల్లారపు నరేష్. మురాయిపల్లి భూమరాజు. గస్కటి కళ్యాణ్. జింక శ్రీధర్. బాలయ్య పోచయ్య ఆరేపల్లి బాబు. వీరందరూ కలిసి నిరసన ర్యాలీకి వెళ్లడం జరిగింది

నవంబర్ 1న దళిత ఆత్మగౌరవ ర్యాలీ – చలో హైదరాబాద్…

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడికి నిరసనగా నవంబర్ 1న ‘చలో హైదరాబాద్’ దళిత ఆత్మగౌరవ మహా ర్యాలీ

​నేటి ధాత్రి,పటాన్ చెరు:

 

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) బి.ఆర్. గవాయి పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ, దళితుల ఆత్మగౌరవం, న్యాయవ్యవస్థ పరిరక్షణ కోసం నవంబర్ 1వ తేదీన ‘చలో హైదరాబాద్’ మహా ర్యాలీని విజయవంతం చేయాలని ఎంఆర్‌పిఎస్,ఎంఎస్‌పి అనుబంధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
​ఈ మహా ర్యాలీకి సంబంధించిన ఏర్పాట్లపై పటాన్ చెరు నియోజకవర్గంలోని ఎంఆర్‌పిఎస్, ఎంఎస్‌పి ముఖ్య కార్యకర్తల సమావేశం పొట్టోల్ల వెంకటేశం మాదిగ ఎంఎస్‌పి రాష్ట్ర సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో నిర్వహించబడింది.
​ఈ సందర్భంగా ఎంఆర్‌పిఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మైసగళ్ళ బుచ్చేంద్ర మాదిగ మాట్లాడుతూ, సీజేఐ గవాయి పై జరిగిన దాడి కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదని, ఇది భారత రాజ్యాంగం, న్యాయవ్యవస్థ, దళితుల ఆత్మగౌరవం మరియు అస్తిత్వంపై జరిగిన దాడిగా భావించాలన్నారు.
​నవంబర్ 1న హైదరాబాద్‌లో జరగబోయే ఈ భారీ బహిరంగ ర్యాలీలో నియోజకవర్గం నుంచి లక్షలాది మంది పాల్గొనాలని ఆయన కోరారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు దగ్గరలో ఉన్న పటాన్ చెరు నియోజకవర్గం నుండి దళిత వర్గాలు, రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ, ప్రజాస్వామ్య స్ఫూర్తి కలిగిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం కోసం ఎంఆర్‌పిఎస్ సీనియర్ నాయకులు, నియోజవర్గ బాధ్యులు, మండల ఇన్‌చార్జులు పూర్తి సమయం కేటాయించాలని ఆయన స్పష్టం చేశారు.
​ఈ సమావేశంలో నల్లోల్ల ప్రవీణ్ కుమార్ మాదిగ ఎంఆర్‌పిఎస్ జిల్లా అధికార ప్రతినిధి, వెలుమల ప్రమోద్ మాదిగ ఎంఆర్‌పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి, క్యాసారం నటరాజ్ మాదిగ ఎంఎస్‌పి జిల్లా అధికార ప్రతినిధి, కొంగేరి కృష్ణ మాదిగ ఎంఎస్‌పి జిల్లా ప్రధాన కార్యదర్శి, ముక్క గళ్ళ ఆంజనేయులు మాదిగ ఎంఈఎఫ్ సీనియర్ నాయకులు, కందుకూరి ఏసయ్య మాదిగ ఎంఆర్‌పిఎస్ అమీన్పూర్ మండలం ఇంచార్జి, బందెల రవికుమార్ మాదిగ ఎంఆర్‌పిఎస్ ఆర్‌సి పూర్ టౌన్ కన్వీనర్, దర్బార్ రమేష్ మాదిగ కో కన్వీనర్, కర్రెనుల బాలేష్ మాదిగ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version