వనపర్తి గాంధీ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు…

వనపర్తి గాంధీ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మున్సిపల్ఎన్నికలలో ఆర్యవైశ్య లు పోటీ చేయాలి న్యాయ వాది రామకృష్ణ

వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈకార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బిజెపి నేత బచ్చురాo కోశాధికారి ఏపూరి శ్రీనివాసులు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజ్ లగిశేట్టి అశోక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కోట్ర రామకృష్ణ న్యాయవాది దార వెంకటేష్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ మాజీ వర్తక సంగం అధ్యక్షులు లగిశెట్టి నరసింహ లగిశెట్టి సాయి ప్రసాద్ వర్తక సంగం ట్రెజరర్ వై వెంకటేష్ దోమ శివ కె.బి శ్రీనివాసులు బొడ్డు శంకర్ చుక్కయ్య వజ్రాల సాయిబాబా కాలూరి భాస్కర్ కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పిన్నo వసంత నరేందర్ మాజీ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ ఆర్యవైశ్యులు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈసందర్భంగా న్యాయవాది కొట్ర రామకృష్ణ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు ఏ పార్టీ తరఫున పోటీ చేసిన తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఆర్యవైశ్యులు మున్సిపల్ 33 వార్డులో పోటీ చేయుటకు ముందుకు రావాలని నామినేషన్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయంగా ఆర్యవైశ్యులు బలోపేతం కావాలని కోరారు గత మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ గద్వాల్ మున్సిపాలిటీలో ఆర్య వైశ్యులు మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించారని కౌన్సిలర్లుగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు .మున్సిపల్ కౌన్సిలర్లు గా ఆర్యవైశ్యులు విజయం సాధించి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు

రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం…

రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

రాజ్యాంగం మన భారతదేశానికి దిశా నిర్దేశం అని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక మహా గ్రంథమని స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడు లో దేశభక్తి ఐక్యత సోదర భావాన్ని మరింత బలపరిచే పర్వదినం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మాసంపల్లి అఖిల్, నాయకులు బత్తిని మల్లయ్య, పరికి త్యాగరాజు, మాసంపల్లి ప్రభాకర్, బిక్షపతి, హరీష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

నిరంజన్ ఆధ్వర్యంలో గోడిశాల అరవింద్ గౌడ్.

నిరంజన్ ఆధ్వర్యంలో గోడిశాల అరవింద్ గౌడ్ చిత్రపటానికి నివాళులు

 

పరకాల నేటిధాత్రి:

 

భారతీయ జనతా పార్టీ పరకాల పట్టణ శాఖ
అధ్యక్షులు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో షహీద్ గొడిశాల అరవింద్ గౌడ్ 26వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పోశాల ఆదిత్య అరవింద్ గౌడ్ పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ కార్యక్రమంలో
అమరవీరుల సంస్కరణ పరకాల అధ్యక్షులు దేవునూరి మేఘనాథ్,మున్సిపల్ మాజీ కౌన్సిలర్ ఆర్పీ జయంతి లాల్,చందుపట్ల రాజేందర్ రెడ్డి,మార్త రాజభద్రయ్య,దార్నా నారాయణదాసు,కుక్కల విజయ్,సంఘపురుషోత్తం,మిడిదొడ్డి నరేష్
నాగేల్లి రంజిత్,పావుశెట్టి శ్రీనివాస్,గండ్ర శ్రీనివాస్ రెడ్డి, కానుగుల గోపీనాథ్,వనం రాజు,ఆర్పీ.సంగీత,సయ్యద్ గలిఫ్,వెనిశెట్టి రాజేష్,పాలకుర్తి ప్రతాప్,రామకృష్ణ నివాళులర్పించారు.

గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో.

గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు

 

పరకాల నేటిధాత్రి:

పరకాల పట్టణంలోని గందె సీతారాములు కంపెనీ యజమాని గందె సత్యానందం ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో శ్రీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది పర్వదినం రోజున వేసవికాలంలో మండుటెండలో బాటసారిలకు వివిధ గ్రామాల నుంచి పనులకు పరకాలకు వస్తున్న రైతు సోదరులకు ప్రజలకు దాహార్తిని తీర్చుటలో తన వంతు సహాయం చేసే సదుద్దేశంతో ఉచిత చలివేంద్రమును ప్రారంభించడం జరిగింది.గత కొన్ని సంవత్సరాలుగా ఈ చలివేంద్రమును నిర్వహిస్తూ బాటసారిలకు చల్లని నీటిని అందిస్తున్నామని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరకాల పరిసర గ్రామ ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కొత్త సంవత్సరంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందచాహలతో సంతోషంగా ఉండాలని కోరారు.ఈ కార్యక్రమంలో శ్రీ కుంకుమేశ్వర స్వామిదేవస్థానం మాజీ చైర్మన్ గందె వెంకటేశ్వర్లు శిరీష దంపతులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version