మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడకండి: ఎమ్మెల్యే దొంతి

మేడారం జాతరలో ప్లాస్టిక్ ను వాడద్దు

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

ప్రకృతి సిద్ధమైన మేడారం జాతరలో ప్లాస్టిక్ వాడద్దని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.ఏ.ఎస్.ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ఎర్రబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో
తన క్యాంప్ ఆఫీస్ లో ప్లాస్టిక్ వాడకండి…మేడారాన్ని రక్షించండి అనే వాల్ పోస్టర్ ఎమ్మెల్యే మాధవరెడ్డి ప్రారంభించారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే మేడారం జాతర లో ప్లాస్టిక్ వస్తువులను వాడకుండా ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ గాలి,నీరు,భూమిని కలుషితం చేయకుండా పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మేడారం జాతరకు వెళ్ళే ప్రతి భక్తుడి పై ఉందన్నారు.సంస్థ నిర్వాహకుడు రాజశేఖర్ మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్ళే భక్తులు ఇంటి దగ్గర నుండి ప్లాస్టిక్ రహిత వస్తువులను
తీసుకెళ్లి వాడుతూ,మేడారం అడవితల్లిని రక్షించాలని కోరారు.ఈకార్యక్రమంలో స్వయంకృషి స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్,గండిగిరి,సంస్థ సభ్యులు తంగెళ్ల రవికాంత్,రాముసేవక్, నాగుర్లపల్లె మాజీ సర్పంచ్ రాజహంస,లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.

ప్రపంచంలో భారత్ అగ్రగామికోసం ఆర్ఎస్ఎస్ దీక్ష…

ప్రపంచంలో భారత్ అగ్రగామికోసం ఆర్ఎస్ఎస్ దీక్ష *

ఆర్ ఎస్ ఎస్ గ్రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక్ *

మహాదేవపూర్ అక్టోబర్01 నేటి ధాత్రి *

మహాదేవపూర్ మండల కేంద్రంలోని భారతదేశం ప్రపంచంలో అగ్రగామి కావడానికి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా పంచ పరివర్తన కార్యక్రమాన్ని చేపట్టిందనీ ఆర్ఎస్ఎస్ రాష్ట్ర గ్రామ వికాస్ సంయోజక్ సత్యనారాయణ అన్నారు. ఆర్ఎస్ఎస్ కు దేశమే ముఖ్యమని కార్యకర్తలు కూడా దేశం తర్వాతనే ఇతర విషయాలకు ప్రాధాన్యమిచ్చే వారే ఈ సంస్థకోసం నిలబడతారని అన్నారు. పంచ పరివర్తనలో భాగంగా చెట్లు నాటడం, ఒకసారి వాడే ప్లాస్టిక్ను నిషేధించడం, భూగర్భ జలాలను పెంపొందించడానికి కట్టుబడి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. స్వ ఆధారిత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వభాష, స్వవేషం, స్వ సంస్కృతి తోపాటు స్వదేశీ వస్తువులను వాడాలని సూచించారు. హిందూ కుటుంబాలు సమిష్టిగా ఉండేలా మానక మానసిక స్థితిని పెంపొందించే విధంగా చూడాలన్నారు. పండుగ పర్వదినాలలో సమిష్టి కుటుంబంలోని వారందరూ కలుసుకునే సంప్రదాయాన్ని పాటించారన్నారు. పూర్వకాలం నుండి హిందుత్వంలో జ్ఞానానికే ప్రథమ ప్రాధాన్యం ఉన్నదే తప్ప కుల మతాలకు వర్గ విభేదాలకు తావు లేదని అలాంటి సమాజాన్ని పునర్ నిర్మించాలన్నారు అన్నారు. కుల మతాలను పాటించకుండా అందరిలో దైవమున్నాడని భావించే సమరసత కోసం కృషి చేయాలని అన్నారు. పౌర విధులను సక్రమంగా నిర్వహించారని రాజ్యాంగం, చట్టాలను పాటించడం ద్వారా సమాజంలో పౌర భావనను పెంపొందించడం ద్వారా భారతదేశాన్ని మరోపదేళ్లలో ప్రపంచంలోని అన్నారు. శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రజలకు ఆర్ఎస్ఎస్ లో పరిచయం చేయడానికి ప్రతి మండలంలో వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖండ కార్యవాహ గడ్డం శ్రీనివాస్, విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు దేవరావు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version