బడ్జెట్లో అంకెలు పెరిగితే దళితులకు ఒరిగేదేముంది..

బడ్జెట్లో అంకెలు పెరిగితే దళితులకు ఒరిగేదేముంది?

సబ్ ప్లాన్ కేటాయింపులు ఫుల్..ఖర్చులు నిల్

కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టిన 2026- 27సం. 53 47,315 కోట్లబడ్జెట్ ప్రవేశ పెట్టింది. దేశంలో 20 శాతం ఉన్న దళితులకు సబ్ ప్లాన్ కింద 1,96,400 కోట్ల రూపాయల కేటాయించింది. కేటాయింపులు పెంచడం ద్వారా దళితులకు ఒరిగేదేముందని వాటి ని ఖర్చు చేయడంలో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల దళితులకు మరింత అన్యాయం జరుగుతుందని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆత్కూరు శ్రీధర్
అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటాయించింది.102 శాఖల ద్వారా కేటాయింపులు చేసిందని,ప్రధానంగా 2025 26 బడ్జెట్ను పోలిస్తే చూస్తే బడ్జెట్ 13,611 కోట్లు కాగా, సబ్ ప్లాన్ కింద 1,68,478 కోట్లు, అంబరిల్లా బడ్జెట్ 9540 కోట్లు కేటాయించారని చెప్పారు సుమారు 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినప్పటికీ అవి ఒకచోట పెట్టి ఫూల్ చేసి నోడల్ ఆఫీసర్ కేటాయించి ఖర్చు చేయకపోవడం వల్ల దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు చేయడం లేదని విమర్శించారు వివిధ శాఖల ద్వారా ఖర్చుపెట్టినప్పటికీ ప్రత్యేకంగా దళితులకు ఖర్చు చేయకపోవడంతో వారి సంక్షేమం కుంటుపడుతుందన్నారు దళితులలో 70శాతం కనీస మౌలిక సౌకర్యాలకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు 60 శాతం మంది దళితులు సరైన దుస్తులు పౌష్టికాహారం కు నోచుకోవడం లేదన్నారు దళితుల జనాభా 20 నుంచి 25 శాతానికి పెరుగుతున్నప్పటికీ బడ్జెట్ మాత్రం 16% దగ్గరే ఆగిందన్నారు.జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయింపులు లేవ న్నారు గ్రామీణ ప్రాంతాలలో వలసలు పెరిగి పట్టణాలకు వలసలు
వస్తున్న అత్యధికులలో దళితులు ఉన్నారని చెప్పారు పట్టణాలలో వారికి సరైన నివాసం లేదన్నారు. ఆర్థికంగా అత్యంత బలహీనంగా సామాజికంగా అణిచివేతకు గురవుతున్న దాడులపై బిజెపి 12 ఏళ్ల పాలనలో దళితులపై మరిన్ని దాడులు పెరిగాయన్నారు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తూ విబిజీ రాంజీ బిల్లు తీసుకురావడం ద్వారా దళితుల నోటికాడబుక్క లాగేసిందాన్నారు గతంలో 90% బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం భరించే దాని స్థానంలో ఇప్పుడు రాష్ట్రాల మీదికి వదిలేసి 60 శాతానికి కేంద్రం తగ్గించుకొని 40 శాతం రాష్ట్రాల పైన భారంమోపుతుందన్నారు 125 రోజుల పని దినాలు పెంచుతామన్న ప్రభుత్వం సుమారు 1.50 000 కోట్ల రూపాయల కేటాయించాలన్నారు.
ఆ చట్టం ప్రారంభ దినాలలో 1,18 000 కోట్లు కేటాయించిన ప్రభుత్వం నేడు దానిని తగ్గించిందన్నారు
బడ్జెట్ కేటాయింపులలో పెంచుతున్నట్లు ప్రకటిస్తున్న ప్రభుత్వం వాటిని ఖర్చు చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదన్నారు మూడు విభాగాల ద్వారా దళితులకు కేటాయింపులు చేస్తున్న ప్రభుత్వం సబ్ ప్లాన్ కింద కేంద్రమే ఒక నోడల్ ఆఫీసర్ ను అపాయింట్ చేసి 102 శాఖల ద్వారా విడివిడిగా కాకుండా ఒకేచోట ఫూల్ చేసి దళితుల ప్రత్యక్ష ప్రయోజనాల కోసం ఖర్చు అయ్యే విధంగా ప్రత్యేక కృషి కొనసాగించాలన్నారు ప్రధానమంత్రి దళితుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధి ఉంటే ప్రతి మూడు నెలలకోసారి ఈ బడ్జెట్ పై సమీక్ష చేయాలన్నారు అంకెల్లో పెంచడం తప్ప ఆచరణలో ఖర్చు చేయకపోవడం వల్ల దళితులకు ఒరిగేది ఏమి ఉండదు అన్నారు.

విద్యార్థులకు భారత రాజ్యాంగం బుక్కుల పంపిణీ…

విద్యార్థులకు భారత రాజ్యాంగం బుక్కుల పంపిణీ

కెవిపిఎస్, టిఏజిఎస్ జిల్లా కార్యదర్శులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

భారత రాజ్యాంగమే భారత ప్రజలకు రక్షణ అని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అత్కూరి శ్రీదర్ అన్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని బీసీ స్టూడెంట్ మేనేజ్మెంట్ గర్ల్స్ పాస్టర్స్ ఎస్సీ గర్ల్స్ హాస్టల్స్ కస్తూరిబాయి హాస్టల్స్ లో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం,కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం బుక్స్ బహుకరించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత దేశంలో మత గ్రంథాలు కులాల,మతాల మధ్య అసమానతలు, వివక్షతలు పెంచి, ప్రజలను అంధకారంలోకి నెట్టి ప్రశ్నించే తత్వాన్ని చంపితే, భారత రాజ్యాంగం మాత్రం అసమానతలను,వివక్షతలను తొలిగించడానికి కారణమైంది,ప్రశ్నించే తత్వాన్ని పెంచింది అన్నారు, భారత రాజ్యాంగం చదవడం ద్వారానే అణగారిన వర్గాలకు ఆత్మ స్థైర్యం వస్తుంది,హక్కులు పరిరక్షించబడతాయి అన్నారు, భారత రాజ్యాంగం ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు,పాలకులు భారత రాజ్యాంగం మౌలిక సారూప్యతని దెబ్బతీసి,అశాస్త్రీయమైన భావజాలానికి అవకాశం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని, అలాంటి తిరోగామి శక్తులను నిలువరించాలంటే భారత పౌరులందరూ రాజ్యాంగాన్ని చదవాలి,అప్పుడు మాత్రమే దేశ సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు, ఈ ప్రయత్నంలో భాగంగానే హాస్టల్స్ కు బుక్స్ బహుకరించడం జరిగింది

ములుగు పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా ఆధారంగా రిజర్వేషన్లు

గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా నిష్పత్తికి సమానంగా రిజర్వేషన్లు (సీట్లు) కల్పించాలి

ములుగు టౌన్ నేటి దాత్రి

 

ములుగు జిల్లాలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు జరగబోయే గ్రామ సర్పంచ్ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ( కెవిపిఎస్) ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రత్నం ప్రవీణ్ కోరారు

కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కమిటీ సభ్యులు రత్నం ప్రవీణ్ పాల్గొని
మాట్లాడుతూ గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించారని, కానీ 2011-2025 ఈ మధ్యకాలంలో వారి జనాభా పెరిగి అనేక వేల మంది యువత కొత్తగా ఓటు హక్కు పొందారని ఎస్సీ ఎస్టీల జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేటాయిస్తే వారికి జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు రాక రాజకీయ రంగంలో కూడా వారి వెనుకబడిపోయి వివక్షతకు గురయ్యే ప్రమాదం ఉందని ఇప్పటికే ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాల వలన విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కోల్పోయి బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడుతున్న వారికి ఇప్పుడు ఈ రిజర్వేషన్ విధానం వల్ల రాజకీయ రంగంలో కూడా అవకాశాలు కోల్పోతారని, భారత రాజ్యాంగంలో కూడా ఎస్సీ ఎస్టీలకు వారి జనాభా కనుగుణంగా రిజర్వేషన్లు కల్పించి, సీట్లు కేటాయించాలని ఉందని, అలాగే ప్రభుత్వాలు అన్ని కులాల వారిని సమానంగా గౌరవించాలని రాజ్యాంగంలో పొందుపరిచారని అయినా నేటి పాలకులు అవేమీ పట్టించుకోకుండా బీసీలకు 2024 జనాభా లెక్కల ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు కల్పించి, ఎస్సీ, ఎస్టీలకు మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించడం అంటే ముమ్మాటికి వారిని అవమానించడమేనని, ఇది రాజ్యాంగ స్పూర్తికి పూర్తి వ్యతిరేకమైన చర్య, రాజ్యాంగ విరుద్ధమైనదని వెంటనే ఈ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లను సవరించి రాష్ట్రవ్యాప్తంగా మరియు ములుగు జిల్లాలో కూడా ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని లేనిచో కెవిపిఎస్ ఆధ్వర్యంలో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version