వనపర్తి గాంధీ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు…

వనపర్తి గాంధీ చౌక్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

మున్సిపల్ఎన్నికలలో ఆర్యవైశ్య లు పోటీ చేయాలి న్యాయ వాది రామకృష్ణ

వనపర్తి నేటిధాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ లో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు పట్టణ వర్తక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పట్టణ వర్తక సంఘం అధ్యక్షులు పాలాది సుమన్ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు ఈకార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బిజెపి నేత బచ్చురాo కోశాధికారి ఏపూరి శ్రీనివాసులు వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం గౌరవ అధ్యక్షులు పూరి బాలరాజ్ లగిశేట్టి అశోక్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ వర్తక సంఘం గౌరవ అధ్యక్షులు కోట్ర రామకృష్ణ న్యాయవాది దార వెంకటేష్ జర్నలిస్ట్ పోలిశెట్టి సురేష్ మాజీ వర్తక సంగం అధ్యక్షులు లగిశెట్టి నరసింహ లగిశెట్టి సాయి ప్రసాద్ వర్తక సంగం ట్రెజరర్ వై వెంకటేష్ దోమ శివ కె.బి శ్రీనివాసులు బొడ్డు శంకర్ చుక్కయ్య వజ్రాల సాయిబాబా కాలూరి భాస్కర్ కాలూరు శ్రీనివాసులు శెట్టి పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు శ్రీమతి పిన్నo వసంత నరేందర్ మాజీ అధ్యక్షురాలు కలకొండ భాగ్యలక్ష్మి యువజన సంఘం అధ్యక్షులు బచ్చు వెంకటేష్ పట్టణ ఆర్యవైశ్యులు వర్తక సంఘం సభ్యులు పాల్గొన్నారు అనంతరం పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బచ్చురాం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు ఈసందర్భంగా న్యాయవాది కొట్ర రామకృష్ణ మాట్లాడుతూ వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో ఆర్యవైశ్యులు ఏ పార్టీ తరఫున పోటీ చేసిన తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు ఆర్యవైశ్యులు మున్సిపల్ 33 వార్డులో పోటీ చేయుటకు ముందుకు రావాలని నామినేషన్లు వేయాలని ఆయన పిలుపునిచ్చారు రాజకీయంగా ఆర్యవైశ్యులు బలోపేతం కావాలని కోరారు గత మున్సిపల్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ గద్వాల్ మున్సిపాలిటీలో ఆర్య వైశ్యులు మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించారని కౌన్సిలర్లుగా ప్రజలకు సేవలందించారని కొనియాడారు .మున్సిపల్ కౌన్సిలర్లు గా ఆర్యవైశ్యులు విజయం సాధించి ప్రజలకు సేవలు అందించాలని ఆయన కోరారు

రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం…

రాజ్యాంగం మన దేశానికి దిశా నిర్దేశం.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

రాజ్యాంగం మన భారతదేశానికి దిశా నిర్దేశం అని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఒక మహా గ్రంథమని స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలను అర్పించిన మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య వ్యవస్థలో జీవిస్తున్నామని. గణతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుడు లో దేశభక్తి ఐక్యత సోదర భావాన్ని మరింత బలపరిచే పర్వదినం అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ మాసంపల్లి అఖిల్, నాయకులు బత్తిని మల్లయ్య, పరికి త్యాగరాజు, మాసంపల్లి ప్రభాకర్, బిక్షపతి, హరీష్, రాజు, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు….

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులుని ఘనంగా జన్మదిన వేడుకలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన శుభాకాంక్షలు , సంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొనిదొడ్డి నరసింహ సంగారెడ్డి జిల్లా కార్య కార్యదర్శి వరప్రసాద్ కార్యక్రమంలో మండల మొగుడంపల్లి అధ్యక్షుడు శ్రీను, మొగుడంపల్లి మండల ప్రధాన కార్యదర్శి లతీఫ్ షాప్, అధ్యక్షుడు , మొగుడంపల్లి యూత్ అధ్యక్షులు మహేష్ మండల్ సోషల్ మీడియా కన్వీనర్ సుభాష్ సాగర్ పాల్గొన్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో ధనసిరి గ్రామంలో వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు 60 మంది చేరడం జరిగింది తెలంగాణ రాజాధికారి పార్టీలో అందరూ కలిసి తీన్మార్ మల్లన్న జన్మదినాలు జరుపుకోవడం జరిగింది,

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత…..

గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరి బాధ్యత.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

మండల కేంద్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు తోడ్పాటు అందివ్వాలని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా ఎస్ ఆర్ ఎస్ పి భూముల ఆక్రమణ జరగడంతో అక్రమంగా భూములను ఆక్రమించుకున్న వారిపై న్యాయంగా చట్టబద్ధంగా పోరాటం చేయటంతో సంబంధిత అధికారులు స్పందించి సరిహద్దులను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. భూముల ఆక్రమణ అంశంపై మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్పందించి సొంత గ్రామ అభివృద్ధికి సహకరించి కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని కోరారు. రాజకీయ కక్ష సాధింపు తోనే ఇలాంటి కార్యక్రమాన్ని చేస్తున్నానని కొందరు నాపై దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని. నా సొంత స్వలాభం కోసం ఇలాంటి కార్యక్రమాన్ని ముందు వేసుకొని చేయాలని నాకు ఎలాంటి ఉద్దేశం లేదని గ్రామ అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పోరాడతానని. దానికోసం మరింత ఉద్యమాన్ని ఉధృతం చేసి గ్రామ ప్రజల వెంట ఉంటానని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పటికైనా గ్రామ ప్రజలు రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి గ్రామ అభివృద్ధి కొరకై పని చేయాల్సిన అవసరం ఎంతగానో ఉందని స్పష్టం చేశారు.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

#కబ్జా చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

మండల కేంద్రంలోని రేవులకుంట, వెంకటపాలెం చెరువు భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సంపత్ కు వినతిపత్రం అందించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం చెరువు శిఖం భూములను సైతం ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి చెరువుల శిఖం భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని. అదేవిధంగా శిఖం భూములను కబ్జా చేసి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ మాసంపల్లి అఖిల్, పరికిత్యారాజు, బూస కుమారస్వామి, వైనాల జంపయ్య, మేకల మోహన్, కోల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version