న్యాయమూర్తి పై దాడి… రాజ్యాంగంపై దాడి జరిగినట్టే…

న్యాయమూర్తి పై దాడి… రాజ్యాంగంపై దాడి జరిగినట్టే

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రం లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు కొమ్ము నాగరాజు మాట్లాడుతు, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి పైన జరిగిన దాడి అంటే రాజ్యాంగం పై దాడి అని ప్రజాస్వామ్యం పై దాడి అని దేశ దళిత బహుజనుల పై దాడి రాజ్యాంగాన్ని అవమానించడమేనని మతోన్మాద విష సంస్కృతితో నే ఇలాంటి భౌతిక దాడులు జరుగుతున్నాయి ఈ దేశాన్ని మనువాద కోణంలో పరిపాలించాలనే దురుద్దేశంతో కొంతమంది మనువాదులు దళితుల పట్ల చూపే రాజకీయవాదులు చేసే కుట్రలను మేము ఖండిస్తున్నాం,ఈ సంఘటనను దళిత గిరిజన బహుజనులు వెనుకబడిన వర్గం మేధావులు ప్రజలు వ్యతిరేకించాలని వారు తెలిపారు.

బహుజన్ సమాజ్ పార్టీ బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక.

బహుజన్ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులుగా బొమ్మ సురేందర్ గౌడ్ ఎన్నిక.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండలం కేంద్రంలో లో మంగళవారం రోజున బహుజన సమాజ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి బహుజన్ సమాజ్ పార్టీ జయశంకర్ జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ఆధ్వర్యంలో మండల అధ్యక్షున్ని ఎన్నుకోవడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజులు బహుజనులదే అని అగ్రవర్ణ రాజకీయ పార్టీలను బొందపెట్టాలని మన ఓటు బీఎస్పీకే అని భూపాలపల్లి జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని క్షేత్రస్థాయిలో చేపడుతున్నామని పార్టీ నిర్మాణంలో భాగంగా చిట్యాల మండల అధ్యక్షుడిగా బొమ్మ సురేందర్ గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు ఎన్నికకు సహకరించిన జిల్లా అధ్యక్షులు పొన్నం బిక్షపతి గౌడ్ ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర ఈసీ మెంబర్ సంగీ రవి జిల్లా ఉపాధ్యక్షులు మేకల ఓంకార్ భూపాలపల్లి నియోజకవర్గం ఇన్చార్జి వేల్పుగొండ మహేందర్ గారు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version