భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం.

భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మరియు మానేరు రచయిత సంఘం ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సదస్సు.

సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )

సిరిసిల్ల జిల్లాలోని భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం సౌజన్యంతో మరియు మానేరు రచయితల సంఘం సంయుక్త నిర్వహణలో సిరిసిల్ల సిరివెలుగులు డా, నలిమెల భాస్కర్ మరియు జూకంటి జగన్నాథం సమాలోచన రెండు రోజుల జాతీయ సాహిత్య సదస్సు..

ప్రభుత్వ డిగ్రీ కళాశాల అగ్రహారంలో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శాతవాహన విశ్వవిద్యాలయం రిజిస్టర్ ఆచార్య రవికుమార్ జాస్తి,అగ్రహారం డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ టి.శంకర్, డాక్టర్ నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం, మరియు ఎస్.ఆర్.ఆర్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలవకుంట రామకృష్ణ, టి.టి.సి.జి.టి.ఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్, కాడూరు సురేందర్ రెడ్డి, దక్షిణ ప్రాంత ఆఫీసర్ ఇంచార్జ్ ఎన్బిటి డాక్టర్ పత్తిపాక మోహన్,
సదస్సు కన్వీనర్ కటుకం శారద, రచయిత అన్నవరం దేవేందర్ , మరియు మానేరు రచయితల సంఘం అధ్యక్షులు టీవీ నారాయణ, కార్యనిర్వాహ అధ్యక్షులు ఎలుగొండ రవి, మానేరు రచయితల సంఘం సభ్యులు బూర దేవానందం,ఆడెపు లక్ష్మణ్, చిటికెన కిరణ్ కుమార్, జి.శ్రీమతి,అనిత మాడూరి, దూడం గణేష్, రొండి అర్జున్, మల్యాల దీపిక, ఈడపు సౌమ్య, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే.

మన సంస్కృతిని ప్రపంచానికి చాటిన ఘనత కవితక్కదే….
– జాగృతితోనే బతుకమ్మ సంబరాలకు పునర్జీవం
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌
– మంథనిలో ఘనంగా కవితక్క జన్మదిన వేడుకలు

మంథని :- నేటి ధాత్రి

మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచస్థాయిలో చాటిన ఘనత కల్వకుంట్ల కవితక్కకే దక్కుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మాజీ ఎంపీ,ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకల్లో బాగంగా గురువారం మంథని పట్టణంలోని రాజగృహాలో వేడుకలు నిర్వహించారు. ఈసందర్బంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం కూతురు అయినా ఒక సాధారణ నాయకురాలిగా కవితక్క తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుందన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సైతం తనవంతుగా ముఖ్య పాత్ర పోషించిందని, ప్రజల్లో అనునిత్యం మమేకమై వారి కష్టసుఖాలను తెలుసుకునేవారన్నారు. జాగృతి సంస్థను ఏర్పాటుచేసి అనేక సేవలు అందించడంతో పాటు ప్రపంచంలోని తెలుగువాళ్లకు మన సంస్కృతిని చాటి చెప్పారన్నారు. అలాగే ప్రతి గ్రామంలో బతుకమ్మ ఆటలు ఆడుకునేవారని, కానీ జాగృతి సంస్థ ద్వారా కవితక్క అంగరంగ వైభవంగా బతుకమ్మసంబరాలు నిర్వహించి విశిష్టతను చాటారని, తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మకు పునర్జీవం ఇచ్చారని ఆయన కొనియాడారు. నిత్యం ప్రజల కోసం, తెలంగాణ కోసం ఆలోచన చేసే కవితక్కకు మంథని నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు అభిమానుల పక్షాన పుట్టిన రోజు శుభాకాంక్షలను ఈ సందర్బంగా ఆయన తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version