గంజాయి నియంత్రణ పై అవగాహన సదస్సు

గంజాయి నియంత్రణ పై అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి : 

 

 

మందమర్రి పట్టణం సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో విద్యార్థినీ విద్యార్థులకు మందమర్రి పోలీస్ అధికారులు గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీనిపై తల్లిదండ్రులు ఎక్కువగా శ్రద్ధ తీసుకొని పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తల్లిదండ్రుల పిల్లలకు సూచించారు గంజాయి మత్తులో పడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు ఇటువంటి అరాచకాల్ని అరికట్టడానికి మేము శాశ్వత ప్రయత్నం చేస్తున్నాము మీరు కూడా మాకు సహకరించాలని తల్లిదండ్రులను కోరడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి బెల్లంపల్లి ఏసిపి, సింగరేణి జిఎం, లైన్స్ క్లబ్ సభ్యులు, వివిధ పార్టీ నాయకులు హాజరు కావడం జరిగింది.

పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు.

పొత్కపల్లిలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన సదస్సు

ఓదెల (పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోలో బుధవారం మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు పోత్క పల్లి – కాల్వ శ్రీరాంపూర్ ప్రధాన కూడలి వద్ద ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సమాజాన్ని కూడా నాశనం చేస్తుందన్న సందేశాన్ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పై దికొండ రమేష్ నేతృత్వంలో (బ్రేక్ ద చైన్స్ ఆఫ్ సబ్ స్టాన్స్ అబూస్ ఆర్ వన్ బ్యాడ్ ఛాయిస్ కాన్ చేంజ్ ఏ లైఫ్) అనే నినాదాలతో స్థానిక జడ్.పి. హెచ్.ఎస్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి ఫ్లాష్ మాబ్ (నృత్య ప్రదర్శన) నిర్వహించారు. ఈ ప్రదర్శన పొత్కపల్లి సెంటర్లో స్థానికుల దృష్టిని ఆకర్షించింది. అవగాహన సభలో ఎస్పై రమేష్ మాట్లాడుతూ, “డ్రగ్స్ వాడకాన్ని యువత ఫ్యాషన్గా తీసుకోవడం ప్రమాదకరం. ఇది భవిష్యత్తును నాశనం చేస్తుంది. మత్తులో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు, నేరాలకు దారి తీస్తాయి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు యువతకు మార్గనిర్దేశం చేయాలి,” అని అన్నారు. స్కూళ్లు, కళాశాలల్లో డ్రగ్స్ వినియోగం గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. విద్యార్థులలో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఈ అవగాహన కార్యక్రమంలో హైస్కూల్ అధ్యాపక బృందం, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్.

మత్తు పదార్థాల అవగాహన సదస్సు ఎస్ఐ రేఖ అశోక్

విద్యార్థులు మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దు

చదువుతూనే మీ భవిష్యత్తు

చదవాలిరా ఎన్ని ఆటంకాలు వచ్చినా చదివే మూలధనం

విద్యార్థులకు చదివే నీ గమ్యానికి నిచ్చిన

చదివే జ్ఞానం పెంచుతుంది

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండల కేంద్రంలో
ఆదర్శ మోడల్ స్కూల్ లో స్థానిక ఎస్ ఐ వారి ఆధ్వర్యంలో మారక ద్రవ్యాల నిర్మూలనకై, ఆన్లైన్ లో జరిగే ఆర్ధిక మోసాల పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణపురం ఎస్ ఐ రేఖ అశోక్ మాట్లాడుతూ మత్తును కలిగించే మారక ద్రవ్యాలను వాడకూడదని వాటిని వినియోగిస్తే కలిగే అనర్థాలు ఎంతో వివరించడం జరిగింది. ఆర్ధిక మోసాలకు కారణమైన అనవసరపు మెసేజ్ లు, వాటి లింకులు ఓపెన్ చేసి రిప్లై ఇస్తే కలిగే ఆర్ధిక నష్టాల పట్ల అవగాహన
కలిగించారు మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ఈ.తిరుపతి మాట్లాడుతూ
విద్యార్థులు తమ పూర్తి సమయాన్ని చదువుకోసం కేటాయించి గొప్ప ప్రయోజకులు కావాలని అందుకోసం ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. మారక ద్రవ్యాలు వినియోగిస్తే మన శరీరంపై కలిగే దుష్ప్రభావాలను చక్కగా వివరించారు ఈ కార్యక్రమంలో టీచర్స్ బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన.

సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన

నిజాంపేట నేటి ధాత్రి:

 

సైబర్ క్రైమ్ నేరాలపై పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిజాంపేట ఎస్సై రాజేష్ సూచించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిజ్ఞానంతో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసగిస్తున్నారు ఎవరైనా ఫోన్ చేస్తే ఓటిపిలు చెప్పొద్దన్నారు . అలాగే సైబర్ నేరాల బారిన పడితే 1930 కి కాల్ చేయాలని ఆయన సూచించారు

అతిసారా వ్యాధి పై అవగాహనా.

అతిసారా వ్యాధి పై అవగాహనా

ముత్తారం నేటి ధాత్రి:

వర్షాకాలం సీజన్ దృశ్య ఆతిసార వ్యాధి రాకుండా ఓ ఆర్ ఎస్ జింక్ కార్నర్ ను మండల వైద్యాధికారి అమరేందర్ రావు ఆదేశాను సారము హెచ్ డబ్ల్యూ సి ఇంచార్జ్ బొల్లం దీప్తి జింక్ కార్నర్ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహనా ఆరోగ్య విద్యా బోధన చేయడం జరిగింది ముత్తారం మండలం మచ్చుపేటలో ఎచ్ డబ్ల్యూ సి సెంటర్ లో ఎమ్ ఎల్ ఎచ్ పి బొల్లం దీప్తి మాట్లాడుతూ ఓ ఆర్ ఎస్ అనేది నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్, ఇది ద్రవాలు మరియు లవణాలను తిరిగి నింపడం ద్వారా మితమైన నిర్జలీకరణం మరియు అతిసారం యొక్క చికిత్సకు సహాయపడుతుంది. జింక్ అనేది శరీరానికి అవసరమైన ఒక పోషకం, ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఓ ఆర్ ఎస్ మరియు జింక్ రెండూ కలిసి అతిసారం యొక్క చికిత్సలో ప్రభావవంతంగా ఉంటాయి, ముఖ్యంగా పిల్లల విషయంలో. ఓ ఆర్ ఎస్ (నోటి రీహైడ్రేషన్ సొల్యూషన్):అతిసారం ద్వారా కోల్పోయిన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపుతుంది, ఇది నిర్జలీకరణం మరియు ఇతర సమస్యలను నివారిస్తుంది.
దీనిని నీటిలో కరిగించి త్రాగాలి. ద్రవ స్థాయిలను తిరిగి నింపడానికి క్రమం తప్పకుండా త్రాగాలి అని ఓ ఆర్ ఎస్ అతిసారం చికిత్సలో ఒక ముఖ్యమైన భాగం, ఇది పిల్లలలో మరణాల సంఖ్యను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, అతిసారం యొక్క వ్యవధిని తగ్గిస్తుంది మరియు తీవ్రతను తగ్గిస్తుంది రోజుకు ఒకసారి జింక్ టాబ్లెట్ నీటిలో కరిగించి త్రాగాలని సూచించారు ఈ కార్యక్రమం మాజీ సర్పంచ్ సతీష్ లో సిబ్బంది పుష్పలత లత టీచర్ కళావతి లు పాల్గొన్నారు

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం

◆ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

◆ డా౹౹ఎ.చంద్రశేఖర్ ,మాజీమంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్

◆ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫె: ఐదాస్ జానయ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

కోహిర్ మండలంలోని బిలాల్ పూర్ గ్రామంలో రైతుల అవగాహనా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉదేశ్యం, సాగు చేస్తున్న పంటలను ఎ విధంగా సంరక్షించుకోవాలి, మరియు వ్యవసాయ పంటలకు సరిపడ ఎరువులను ఎలా వాడాలని శాస్త్రవేత్తల ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా
ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్ మరియు మాజీ మంత్రి డా౹౹ఎ.చంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు బహు చక్కగా ఉపయోగపడే ఇలాంటి అవగాహన కార్యక్రమాలను చేయడం శుభపరిణామం అని, కాలనుసారంగా ఎలాంటి పంటలను వేయాలో ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రైతులు తెలుసుకోవచ్చు అని వారు వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ గారు,బసంత్ పూర్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్ర్తావేత్త విజయ్ కుమార్, మండల అధ్యక్షులు రామలింగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ ,సామెల్ గారు,కోహిర్ మండల మాజీ జడ్పీటీసీ రాందాస్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ, మాజీ ఎంపీటీసీలు మలన్న పాటిల్, అశోక్, అనిల్ ,కోహిర్ మండల ఎస్సి సెల్ అధ్యక్షులు అనిల్,ఎస్టీ సెల్ అధ్యక్షులు రాథోడ్ వినోద్ కుమార్, కాంగ్రెస్ నాయకులు శుక్లవర్ధన్ రెడ్డి గారు,శంశీర్, మునీర్ పటేల్ ,ముర్జల్,అశోక్,మోసిన్ ,వీరారెడ్డి , దయానంద పాటిల్, నరసింహా రెడ్డి,మరియు INTUC (F) రాజ్ కుమార్ కోహిర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముజామిల్ తదితరులు పాల్గొన్నారు.

రైతులతో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల అవగాహన సదస్సు.

రైతులతో వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల అవగాహన సదస్సు…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి:

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం. రేపాక గ్రామంలో. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం యొక్క బాబు చెక్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తల మరియు వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో జూన్ 13న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులకు 10 అంశాల పైన అవగాహన కల్పించారు పంటలకు సిఫారసు చేసిన మోతాదులోని యూరియాను ఉపయోగించడం పచ్చి రొట్ట ఎరువుల వర్మి కంపోస్ట్ పశువుల ఎరువుల వాడడం భూసార పరీక్షల ఫలితాలను బట్టి పంటకు. ఎరువులు అందించడం రసాయన ఆధారిత పురుగుమందులను అవసరం మీదకు మాత్రమే ఉపయోగించడం మరియు పంటల్లో పద్ధతులు పాటించడం పంట వైభవ సమయంలో. పంట బీమా పొందడానికి మరియు నష్టపరిహారం కోసం పంట కోసం కొనుగోలు చేసిన వివిధ విత్తనాల రసాయనిక ఎరువుల మరియు రసాయనిక మందుల కొనుగోలు రసీదులను భద్రపరచడం సాగునీటి యజమాన్యం. బిందు మరియు తుంపర్ సేద్యం మల్చింగ్ పద్ధతుల సుస్థిరమైన వ్యవసాయం కోసం పంట మార్పిడి మరియు పంట వైవిధ్యాకరణ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటడం. పి జె టి ఏ యు. యూట్యూబ్ ఛానల్ మరియు బీజేపీ యూ వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని ఉపయోగించడం ద్వారా వ్యవసాయ సంబంధిత సమాచారం తెలుసుకోవడం వర్మీ కంపోస్టు తయారీ మరియు. పుట్టగొడుగుల పెంపకంపై అవగాహన. పంట బీమా పథకాలు వెదురు మొక్కలు మరియు. ఆయిల్ పామ్ సాగు. అనంతరం రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటలకు సంబంధించిన పలు విషయాలపై చర్చించి సందేహాలను నివృతం చేసుకున్నారు రైతులు ఈ కార్యక్రమం తెలుసుకున్న అంశాలను తప్పకుండా పాటిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల సిరిసిల్ల అసోసియేట్ డిఎన్ డాక్టర్ సునీత దేవి. వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ రాజేందర్. డాక్టర్ జె చిరంజీవి. మండల వ్యవసాయ అధికారి కే సంజీవ్. ఉద్యాన శాఖ అధికారి వి గోవర్ధన్. వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్. గౌతమి లక్ష్మణ్. వ్యవసాయ కోర్స్. అభ్యసిస్తున్న. విద్యార్థులు ఏ సాత్విక. ఎస్ బాలకృష్ణ. రైతులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు.

భూ భారతి రెవెన్యూ అవగాహన సదస్సు

తహసీల్దార్ శ్రీనివాసులు

భూపాలపల్లి నేటిధాత్రి:

 

మున్సిపాలిటీ పరిధిలో జంగేడు కాసింపల్లి లో భూ భారతి అవగాహన సదస్సు నిర్వహించిన భూపాలపల్లి తహసీల్దార్ వి శ్రీనివాసులు డిప్యూటీ తాసిల్దార్ అంజలి రెడ్డి అనంతరం భూ భారతి దరఖాస్తులు స్వీకరించారు.ఈ సందర్భంగా తాసిల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. భూ రికార్డుల్లో పేర్లు తప్పులు విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు భూ స్వభావం తప్పులు, నిషేదిత జాబితాలో ఉన్న
భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, పట్టా పాసు బు క్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్ బి లో చేర్చిన భూముల సమస్యలు, భూ సేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబందించిన దరఖాస్తులు సదస్సులో స్వీకరించి భూ భారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ ప్రక్రియ పూర్తి చేస్తా మని అన్నారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తైన క్షేత్రస్థాయి పరిశీలన ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ అంజలీ రెడ్డి, రెవెన్యూ ఆర్ ఐ రామస్వామి సర్వేర్ శ్రీనివాస్ రావు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా

ఏరువాక సాగారో.. రన్నో చిన్నన్నా..

జహీరాబాద్ నేటి ధాత్రి:

వాగులు, వంకలు, ఏరులు అన్నీ వానాకాలంలో కలిసి ‘పోయి ప్రవహించి పంటలకు ప్రాణంగా నిలుస్తాయి కాబట్టి ఏరువాక అని పేరు వచ్చిందని కొంత మంది అభిప్రాయం. ఏరు అంటే ఎద్దులకు కట్టి దున్నటానికి సిద్ధంగా ఉన్న నాగలి అని అర్ధం. వాక అంటే దున్నటం. నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఏర్పడిన చాలును “సీత” అంటారు. నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు. అలాంటి వ్యవ సాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే పూల పౌర్ణమి అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి… దాన్ని ఈరోజు ఎందుకు చేసుకుంటారంటే.. వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తరువాత వర్షాలు కురవ డం మొదలవుతాయి.

 

 

 

 

Whether you choose to walk or run, you are a child.
Whether you choose to walk or run, you are a child.

ఒక వారం అటూ ఇటూ అయినా కుడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు అది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున
ఏరువాక అంటే దుక్కిని ప్రారంభిం చడం అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం, ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయ వచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారి తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలి తాలు తారుమారైపో తాయి. సమష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్క ఫలదీకరణం చేందేం దుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగిం చేందుకు.. ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండర్ ను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంత మంది అత్యుత్సాహంతో ముందే ప్రారంభించకుండా, కొందరు బద్దకించ కుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

తొలకరి పలకరింపుతో ఆనందంలో రైతులు.

ఏరువాక పౌర్ణమికి ముందే జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో తొలకరి జల్లులు. పలుకరించడంతో మట్టి వాసనతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మే చివరి వారం నుంచి జిల్లాలో పలు మండల్లాలో వర్షాలు కురిసినప్పటికి రైతులు దుక్కులు దున్నుకోవడానికి అవసరమైన పెరిగి వర్షపాతం నమోదు కాకపోవ మంతో అశాశం వైపు నిరాశగా ఎదురు చూశాదు కానీ గత మూడు నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వర్షాలు కురవడంతో రైతుల ఆశలకు రెక్కలు వచ్చాయి.

రైతుల పండుగ ఎరువక.

ఈ రోజు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రం చేసుకుంటారు. రైతులు. వాటికి పసుపు కుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దులు సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వాటిని శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూసి కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమతో అలంకరిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తామ కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దులతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఒక ఏరువాక సాగుతుండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

పెరిగిన పత్తి సాగు విస్తీర్ణం

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం సాగు విస్తరణ పెరిగినట్లు జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు. గత సంవత్సరం వర్షాకాలం ఖరీఫ్ సీజన్లో 7.40 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, ఈ వర్షాకాలం సీజన్లో 8,04,512 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతా యని అంచనా వేశారు. దీంట్లో 3లక్షల 87,539 వేల ఎకరాల్లో పత్తిపంట సాగవుతుందని, 1,65,173 లక్షల ఎకరాల్లో వరిపంట, 4 వేల ఐదు వందల ఎకరాల్లో. మొక్క జొన్న, 79,163 వేల ఎకరాల్లో సోయాబిన్, 84, 821 వేల ఎకరాల్లో కంది, 7,987 వేల ఎకరా ల్లో మిను ములు, 14,826 వేల ఎకరాల్లో పెసర్లు, 20వేల ఐదు వందల ఎకరాల్లో చెరుకు, 18వేల ఐదువందల ఎకరాల్లో కూరగాయల పంటలసాగవుతాయని అంచనా వేశారు.

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన.!

శాస్త్రవేత్త ఆధ్వర్యంలో అన్నదాత అవగాహన కార్యక్రమం…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..,

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం రాళ్లపేట గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అవగాహన కార్యక్రమాన్ని బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వాహరయమంగా కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా వ్యవసాయ దత్తత గ్రామమైన రాళ్లపేట గ్రామంలో.

వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో.

రైతులకు అధిక దిగుబడుల గురించి చెప్పటాల్సిన .

అధునాతన వ్యవసాయ సాంకేతిక విధానాలపై అవగాహన కల్పిస్తూ.

శాస్త్రవేత్తలు మాట్లాడుతూ రైతులకు క్షేత్రస్థాయిలో అవసరమయ్యే ఆరు అంశాలు అనగా.

తక్కువ యూరియా వాడండి.

సాగు ఖర్చులు తగ్గించండి.

అవసరం మేరకే రసాయనాలు వినియోగించండి.

నెల. తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి రసిదరులు భద్రపరచుకోండి.

కష్టకాలంలో నష్టపరిహాన్ని పొందండి.

సాగు నీటిని ఆదా చేయండి.

భవితరాలకు అందించండి.

పంట మార్పిడి పాటించండి.

సుస్థిర ఆదాయాన్నిపోద్దండి చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి.

అనే అంశాలపై అవగాహన కల్పించారు వీటితోపాటు వరిలోని వివిధ రకాల నూతన వంగడాలు కూరగాయలు సాగు పంటల్లో చీడపురుగు పీడలు నివారణ చర్యలు పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

డాక్టర్ ఆర్ సతీష్ మాట్లాడుతూ.

నైట్రోజన్ ఎరువులు మరియు పురుగుల మందులు సరైన నియోగం పచ్చి రొట్టఎరువుల.

ప్రాముఖ్యత మరియు వరి తెగులు. నెక్ బ్లాస్ట్ నివారణ సమగ్ర సస్యరక్షణ. Ipm.

పద్ధతులు నిర్వహించారు.

అలాగే. ఐ సి డి ఎస్. సూపర్వైజర్ శ్రీ నిర్మల దేవి మాట్లాడుతూ చంటి పిల్లల తల్లిదండ్రులు.

పిల్లల ఆహారం మరియు వారి ఆరోగ్యం పై తగినంత జాగ్రత్త వహించాలని తెలియజేస్తూ వ్యవసాయ అధికారి.

కే సంజీవ్ మరియు ఏఈఓ లు నాణ్యమైన విత్తనాలు వేసేసమయం గురించి రైతులకు సూచనలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో రైతుల తెగుళ్లు.

కోతుల బెడద.

మట్టి నమూనాలు.

పరీక్ష కేంద్రాలకు పంపించాలని కోళ్ల పెంపకం గురించి సందేహాలు నివృత్తి చేసుకున్నాడు ద్వారా పెరటిలో పెంచుకునే విత్తనాలు మరియు జగిత్యాల విత్తనాలను రైతులకు అందజేశారు.

ఇట్టి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా.పాక్స్.

చైర్మన్ బండి దేవదాస్.

మండల వ్యవసాయ విస్తరణ అధికారి డి సలీం.

ఏ కరుణాకర్. ఆర్ గౌతం. ఎం మౌనిక. అంగన్వాడి టీచర్. ఎన్ వినోద. విద్యార్థులు. అభిలాష్. రాకేష్. రాళ్ల పేట గ్రామ రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నా

సైబర్‌ నేరాలపై యువతక అవగాహన.

సైబర్‌ నేరాలపై యువతక అవగాహన…

బాలానగర్ నేటి ధాత్రి:

 

సైబర్‌ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ పోలీసులు బుధవారం అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రజలకు పలు విషయాలపై సైబర్ క్రైమ్ పై యువతకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. మొబైల్‌ ద్వారానే 80 శాతం సైబర్‌ నేరాలు జరుగుతున్నాయని సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్‌ నేరాలకు కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని విద్యార్థులు, యువత అవగాహన పెంచుకుని ఏటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొబైల్ వినియోగదారులు అపరిచిత వ్యక్తులకు ఓటిపి, వ్యక్తిగత సమాచారం ఇవ్వకూడదన్నారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై సుజ్ఞానం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..

వ్యవసాయ కళాశాలలో రైతులకు అవగాహన సదస్సు..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి..

 

 

 

 

 

తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో.

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వ విద్యాలయం బాబు జగ్జీవన్ రావు వ్యవసాయ కళాశాలలో జరిగిన రైతుల అవగాహన సదస్సులో పాల్గొన్న రైతులు అధికారులు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయ అధికారులు ఆధ్వర్యంలో జూన్ 4న రైతులతో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమం రైతు వేదికలో జరిగిందని ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తూ పంటలకు సిఫారసు చేసిన మోతాదులోనే యూరియాను పచ్చి రొట్ట ఎరువులను వర్మి కంపోస్టు జీవన ఎరులను భూసార పరీక్ష ఫలితాలను బట్టి పంటలకు ఎరువులను.

అందించడం బట్టి రసాయన ఆధారిత పురుగు మందులను.మాత్రమే ఉపయోగించడం మరియు సమగ్ర సస్య రక్షణ పద్ధతులను పాటించడం పంట కోసం చేసిన వివిధ విత్తనాలను రసాయనిక ఎరులను మరియు రసాయనిక మందులు కొనుగోలు చేసిన రసీదులను.

భద్ర పరచాలని. సాగునుటి యజమాన్యం తడి పొడి పద్ధతితో పాటు వరి సాగు.

మల్చింగ్ సుస్థిరమైన వ్యవసాయ కోసం పంట మార్పిడి మరియు పంట వైవిద్దీకరణ పూల మరియు మునగ సాగు పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటడం యూట్యూబ్ ఛానల్ ను మరియు ఏ యు వారి చేను కబుర్లు రేడియో కార్యక్రమాన్ని..

ఉపయోగించడం ద్వారా వ్యవసాయానికి సంబంధించిన సమాచారం తెలుసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అనంతరం రైతుల వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరియు అధికారులతో పంటకు సంబంధించిన విషయాలపై చర్చించి సందేహాలను నివృత్తి చేసుకున్నారు తదుపరి కార్యక్రమంలో అంశాలను పాటిస్తామన్నారు ఇట్టి కార్యక్రమంలో.

శాస్త్రవేత్తలు. డాక్టర్ . సిహెచ్. రమేష్. డాక్టర్ హిందూజ. ఎన్ ఏ..lcar.llrr. శాస్త్రవేత్త డాక్టర్ శృతి. కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్తలు. శ్రీనివాస్ రెడ్డి. వేణుగోపాల్. వ్యవసాయ అధికారి. కే సంజీవ్. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.

ఈ శ్రీనివాస్ రెడ్డి. ప్రాథమిక వ్యవసాయ సహాయ సంగం చైర్మన్ కె భాస్కర్. విజేందర్ రెడ్డి. వ్యవసాయ విస్తరణ అధికారులు. గౌతమ్ లక్ష్మణ్. విద్యార్థులు సిద్ధార్థ్ మరియు సన్నీ ప్రసాద్ రైతులు మరియు మహిళలు తదితరులు పాల్గొన్నారు

సీజనల్ వ్యాధుల అవగాహన.

*సీజనల్ వ్యాధుల అవగాహన. * *

డాక్టర్ నాగరాణి .

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి .

 

 

 

*మొగుళ్ల పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది మరియు ఆశ కార్యకర్తలకు సీజనల్ వ్యాధులకు సంబంధించిన సమావేశం నిర్వహించడం జరిగినది .ఈ సందర్భంగా డాక్టర్ నాగరాణి మాట్లాడుతూ వేసవికాలం పూర్తి కాలేదు ఎండలు బాగా ఉండటంవల్ల వడదెబ్బ తలిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అదేవిధంగా వర్షాలు కూడా అధికముగా పడడం వల్ల నీరు నిల్వ ఉండి దోమలు పెరిగి మలేరియాl, డెంగ్యూ ,చికెన్ గున్యా లాంటి వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రజలకి తగిన సూచనలు ఇవ్వాలని వైద్యాధికారి తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్లు సునీత, జమున, హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి ఏఎన్ఎంలు ఆశాలు పాల్గొన్నారు

వావిలాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ.

** వావిలాలలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ
జమ్మికుంట: నేటిధాత్రి

 

 

 

ఈ రోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డాక్టర్ చందు డిప్యూటీ డి ఎం హెచ్ ఓ హుజురాబాద్ పర్యవేక్షణలో వావిలాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల వైద్య సిబ్బంది పొగాకు వ్యతిరేక దినోత్సవం అవగాహన ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సిబ్బంది ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను సిగరెట్ వినియోగం వల్ల వచ్చే నష్టాలను పొగాకు ఒక జీవితమే కాకుండా కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుందని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది భారత ప్రభుత్వం పొగాకును కొన్ని బహిరంగ ప్రదేశాల్లో వినియోగించడం నిషేధికరించింది. అందుకే ప్రతి సంవత్సరం పొగాకు, ధూమపానం చేయడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు మే 31 తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటారు. పొగాకు వినియోగాన్ని తగ్గించుకుంటూ పోవడమే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యమని పొగాకును వినియోగించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో అంతేకాకుండా పొగాకును వాడడం వల్ల భవిష్యత్తు తరాలకు ఎలాంటి నష్టాలు జరుగుతాయో ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.
ఈ అవగాహన ర్యాలీలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్స్ డాక్టర్ సంధ్యారాణి,డాక్టర్ చందన, డాక్టర్ మహోన్నత పటేల్, డాక్టర్ పరహానుద్దీన్,డాక్టర్ హిమబిందు,డాక్టర్ సంధ్య, మోహన్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ సూపర్వైజర్స్ రత్నకుమారి, అరుణ,కుసుమ కుమారి, సదానందం మరియు ఆరోగ్య శాఖ సిబ్బంది నరేందర్ ,సరళ, వనజ, సావిత్రి ,సాజిదా పర్వీన్, రాధా మరియు ఆశాలు తదితరులు పాల్గొన్నారు

ఇండియన్ గ్యాస్ వినియోగదారుల ఈ-కె వై సి అవగాహన.

ఇండియన్ గ్యాస్ వినియోగదారుల ఈ-కె వై సి అవగాహన సదస్సు

మందమర్రి నేటి ధాత్రి:

ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ సింగరేణి కాలరీస్ కోఆపరేటివ్ సెంట్రల్ స్టోర్ మందమరి నందు డెలివరీ బాయ్స్ సిస్టం ఆపరేటర్స్ ను ఉద్దేశించి డివిజనల్ మేనేజర్ సింగరేణి సూపర్ బజార్ శ్రీరాంపూర్ బెల్లంపల్లి పాలకుర్తి రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడినది ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు ఆదేశానుసారము ప్రతి ఒక్క వంటగ్యాస్ వినియోగదారుడు వారి గ్యాస్ కనెక్షన్ నిమిత్తము.

Indian Gas

ఈ-కేవైసీ అనుసంధానం చేసుకునే కొరకై సహకరించాలని కాల పరిమితి అయిపోయిన గ్యాస్ పైప్ ను వెంటనే మార్చుకోవాలని లేని యెడల ప్రమాదాలు సంభవిస్తాయని ఆయన తెలిపారు ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో సింగరేణి సూపర్ బజార్ డివిజనల్ మేనేజర్ పాలకుర్తి రాజు బ్రాంచ్ మేనేజర్ సుదర్శన్ ఎల్ పి జి కోఆర్డినేటర్ రాజు ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ ఇన్చార్జ్ మాధవరావు ప్రసాద్ మరియు డెలివరీ బాయ్స్ సిస్టం ఆపరేటర్స్ రామకృష్ణాపురం, మందమరి, బెల్లంపల్లి పాల్గొన్నారు.

పురుగు మందుల చట్టంపై అవగాహన.

పురుగు మందుల చట్టంపై అవగాహన 
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి      
      
మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మొగుళ్ళపల్లి మండల పరిధిలోని అన్ని గ్రామాలకు చెందిన విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల విక్రయదారులకు(డీలర్లకు) రైతు వేదిక మొగుళ్ళపల్లి లో విత్తన, ఎరువుల మరియు పురుగు మందుల చట్టాలపై అవగాహన/సమావేశం నిర్వహించడం జరిగింది. ఇట్టి సమావేశంలో   ఈ క్రింద సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని . 
డీలర్లు తప్పనిసరిగా లైసెన్సు కలిగి ఉండాలి మరియు అందరికి కనిపించే విధముగా  
    ఎదురుగాపెట్టాలి. లైసెన్సు లేకుండా విత్తనాలు గాని, ఎరువులు గాని మరియు పురుగు 
    మందులు అమ్మకం చేయరాదు. డీలర్ యొక్క షాప్ పేరు, ఇంటి/డోర్ నెంబర్ మరియు ఇతర  
    వివరాలు పేయింట్ తో రాయాలి
స్టాక్ రిజిస్టర్ మరియు బిల్లు బుక్కులపై వ్యవసాయ అధికారితో సర్టిపై చేయించుకోవాలి. డీలర్లు తప్పనిసరిగా మరియు విధిగా రైతు కొనుగోలు చేసిన సరుకులకు బిల్లులు/రశీదు  
    ఇవ్వాలి. బిల్లులపై తప్పనిసరిగా డీలర్ యొక్క లైసెన్సు నెంబర్ వేయాలి. 
కంపనీల నుండి వచ్చే సరుకులకు ఇన్వాయిస్ లేనిదే అమ్మకాల స్థలంలో లేదా గోదాముల్లో 
    దింసుకోనరాదు.బిల్లు మరియు డి.సి.లు లేనిదే స్టాక్ సరఫరా చేయరాదు.స్టాక్ బోర్డు అందరికి కనిపించే విధముగా ఎదురుగాపెట్టాలి, రోజువారీగా నిల్వల వివరాలు స్టాక్ 
     బోర్డుపై రాయాలి.బ్లాక్ మార్కెటింగ్, ఎక్కువ ఏం.ఆర్.పి (MRP) కి అమ్మినచో లైసెన్సు రద్దుపరచబడును.లైసెన్సు లో పేర్కొన్న గోడౌన్లో మాత్రమే సరుకును నిల్వ చేయాలి లేని ఎడల అనధికారికంగా  
      పేర్కొని స్వాధీనం చేసుకోవడం/సీజ్ చేయడం జరుగుతుంది. సరుకు లెక్కపెట్టే విధముగా   నిల్వచేయాలి. డీలర్లు తామ యొక్క లైసెన్సు గడువు మీరినట్లైతే ఎటువంటి అమ్మకాలు జరపరాదు.డీలర్లు సరుకులను ఫ్యాకెట్ రూపంలో మాత్రమే అమ్మకం చేయాలి, లూసుగా అమ్మకం  జరపరాదు.లైసెన్సులో పేర్కొన్న అడ్రెస్ లో మాత్రమే అమ్మకంగాని, నిల్వలుగాని చేయాలి.డీలర్లు చట్టంలో పొందపరిచిన విధముగా రికార్ద్లు , రిజిస్టర్లు ,బిల్లులు విధిగా పాటించాలి.
 స్థానిక మండల వ్యవసాయ అధికారి, పి. సురేందర్ రెడ్డి మరియు. అలాగే అన్ని గ్రామాల డీలర్లు, AEO లు ఇట్టి సమావేశంలో పాల్గొన్నారు

భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన.

— భూ భారతి పై రెవెన్యూ సిబ్బంది కి అవగాహన
• జూన్ 2 నుండి భూ భారతి దరఖాస్తుల స్వీకారణ
• అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలి

మెదక్ ఆర్డీఓ రమాదేవి

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా తీసుకువచ్చిన భూ భారతి పై రెవెన్యూ సిబ్బందికి మెదక్ ఆర్డీఓ రమాదేవి అవగాహన కల్పించారు. ఈ మేరకు నిజాంపేట మండల తహసీల్దార్ కార్యాలయాన్నీ ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు.. మెదక్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 2 న భూ భారతికి సంబంధించి దరఖాస్తులను తీసుకోవడం జరుగుతుందన్నారు. భూమిలకు సంబంధించిన సమస్యల పై సంబంధిత ధ్రువ పత్రాలను జోడించి దరఖాస్తు ఫామ్ తో కలిపి అధికారులకు అందివాలన్నారు. భూ భారతి లో దరఖాస్తు చేసుకున్న సమస్యలను విచారించి పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు. సత్వర సమస్యల పరిష్కారం కోసం భూ భారతి నీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చెయ్యడం జరిగిందన్నారు. అలాగే అకాల వర్షాల దృశ్య కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అరబోసిన రైతులు టార్పాలిన్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. వేగవంతగా కొనుగోలు జరపాలని ఇంచార్జులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం లో తహసీల్దార్ శ్రీనివాస్, డిప్యుటీ తహసీల్దార్ రమ్యశ్రీ,సీనియర్ అసిస్టెంట్ రమేష్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు ప్రీతీ, ఇమాద్, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలజడ్పీహెచ్ పాఠశాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు బడిబాట మరియు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చిట్యాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు జరిగినవి. ఈ సందర్భంగాఎంఇఓ కోడేపాక రఘుపతి మాట్లాడుతూ అందరూ విద్యావంతులైనప్పుడే ఆ సమాజం బాగుంటుందన్నారు. ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వినియోగించుకొని ప్రతి పౌరుడు అభివృద్ధి పథంలో కొనసాగాలని కోరారు. 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు సైతం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బైరం కల్పన, ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి, మహిళా సంఘం నాయకురాళ్లు,, అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి,మరియు వివో ఏ చందర్, కోమల ఉపాధ్యాయులు బండారి సదయ్య, గోపగాని భాస్కర్, బొమ్మ.రాజమౌళి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన .

మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన

రామడుగు  నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండల ట్రైనీ ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో గోపాలరావుపేట గ్రామ బస్టాండ్ వద్ద మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ట్రైనీ ఎస్సై సతీష్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం వలన ముఖ్యంగా యువతపై కలిగే శారీరక, మానసిక మరియు సామాజిక ప్రభావాలను వివరించారు. అలాగే మత్తు పదార్థాలపై నియంత్రణ అవసరాన్ని తెలిపారు. అనంతరం మత్తు పదార్థాల నివారణ చర్యలలో భాగంగా ఆప్రాంతంలో కుక్కల బృందంతో (డాగ్ స్క్వాడ్) తనిఖీ చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ .

ప్రజల్లో చైతన్యం ద్వారానే అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణ

అటవీ అభివృద్ధి సంస్థ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ప్రజల్లో చైతన్యం,అవగాహన ద్వారానే అడవులు, ప్లాంటేషన్లలో అగ్ని ప్రమాదాల నివారణ పూర్తిగా సాధ్యమవుతుందని తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ(టీజీ ఎఫ్ డీసీ) మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ అన్నారు.అటవీ అభివృద్ధి సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని మంగళవారం జైపూర్ మండలంలోని ముదిగుంట శివారులో ఉన్న నీలగిరి ప్లాంటేషన్ లో అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వేసవిలో ప్లాంటేషన్ లలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించినప్పుడు మంటలు ఎలా ఆర్పాలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు.

Forest fires

సంస్థ పరంగా బ్లోయర్ లతో మంటలు ఎలా నియంత్రిస్తారో వివరించడం జరిగింది. ప్లాంటేషన్లు,అటవీ ప్రాంతాల మీదుగా వెళ్లేవారు బీడీలు సిగరెట్లు తాగి నిర్లక్ష్యంగా పడేయవద్దని చెప్పారు. అడవులు,ప్లాంటేషన్లు కాలడం వల్ల పర్యావరణానికి నష్టం కలుగుతుందన్నారు.వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్థ మంచిర్యాల రేంజ్ ప్లాంటేషన్ మేనేజర్ గోగు సురేష్ కుమార్ తో పాటు కాగజ్ నగర్,బెల్లంపల్లి రేంజ్ ల ప్లాంటేషన్ మేనేజర్లు లక్ష్మణ్, సునీత,ఫీల్డ్ సూపర్వైజర్లు రాజేష్,శ్రీనివాస్,వాచర్లు, సిబ్బంది శంకర్,సాయికిరణ్, లచ్చన్న,రాకేష్,ఓదెలు, సంజీవ్ లు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version