బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం…

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం

కేసముద్రం/ నేటిదాత్రి

 

కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

రావణాసుర బొమ్మ దాత….సమ్మిగౌడ్ చిలువేరు…

రావణాసుర బొమ్మ దాత….సమ్మిగౌడ్ చిలువేరు

కేసముద్రం/ నేటి దాత్రి

 

కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో యువత యూత్ క్లబ్ అనుబంధంగా గత 20 సంవత్సరాల నుండి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలలో భాగంగా రావణాసుర వధ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.ఈ కార్యక్రమానికి కేసముద్రం మున్సిపాలిటీలోని సమ్మి గౌడ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చిలువేరు సమ్మయ్య గౌడ్ తన వంతుగా రావణాసుర బొమ్మకు దాతగా నిలిచారు..ఈ సందర్భంగా సమ్మి గౌడ్ ఫౌండేషన్ అధినేత సమ్మయ్య గౌడ్ మాట్లాడుతూ… గ్రామ ప్రజలంతా కలిసి దసరా ఉత్సవాలను పురస్కరించుకొని చేస్తున్నటువంటి రావణాసుర వద కార్యక్రమంలో నన్ను మీ కుటుంబ సభ్యునిగా భావించి మీతోపాటు భాగస్వామిని చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తపరిచారు. అదేవిధంగా గ్రామ యువత యూత్ మాట్లాడుతూ… అన్నా మా గ్రామం నుండి మా యువత యూత్ అడిగిన వెంటనే స్పందించి దసరా ఉత్సవాలలో భాగంగా రావణ సుర వద కార్యక్రమానికే కాదు మీరు మా గ్రామంలో పేదింటికి ఒక బిడ్డగా ఆడబిడ్డలకు అన్నగా యువతకు సోదరునిగా గ్రామ ప్రజలకు ఒక బిడ్డగా మీరు చేస్తున్నటువంటి సేవలు మరువలేనివని సమ్మి గౌడ్ ఫౌండేషన్ పట్ల వర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో యువత యూత్ క్లబ్ అధ్యక్షులు తండా సంపత్, ఉపాధ్యక్షులు పలస రాకేష్,రావణాసుర ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎటురోజు పరిపూర్ణ చారి, ఉపాధ్యక్షులు తండా శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు కోమాకుల రమేష్, పబ్బతి సారంగం, శాగంటి రాములు, ముదురుకోళ్ల రమేష్, అడప రమేష్, ఎండి షబ్బీర్, ప్రవీణ్, శ్రీకాంత్, గంట రవి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి,.

మట్టి విగ్రహాలు వాడండి, పర్యావరణాన్ని కాపాడండి,

కేసముద్రం/ నేటి దాత్రి

 

రాబోయే వినాయక చవితి సందర్భంగా ప్రజలు మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాలను మాత్రమే ఉపయోగించాలని జనవిజ్ఞాన వేదిక కేసముద్రం మండల అధ్యక్షులు చిర్ర యాకాంతం గౌడ్, ప్రధాన కార్యదర్శి బండారు నరేందర్ గౌడ్ పిలుపునిచ్చారు.

వారు విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ, “ప్రతి సంవత్సరం వినాయక చవితి అనంతరం ప్లాస్టర్ ఆఫ్ పారిస్( పి ఓ పి) విగ్రహాలను నదులు, చెరువులు, కాలువల్లో నిమజ్జనం చేయడం వలన నీటి కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది. ఆ విగ్రహాల్లో వాడే కెమికల్ రంగులు నీటిని కలుషితం చేసి, చేపలు మరియు జలచరాల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తున్నాయి. చివరికి ఇది మనిషి ఆరోగ్యానికే హానికరమవుతోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదే సమయంలో మట్టితో తయారు చేసిన విగ్రహాల ప్రాముఖ్యతను వివరించారు. మట్టి విగ్రహాలు నీటిలో కరిగిపోవడం వలన పర్యావరణానికి ఎటువంటి నష్టం కలగదని, మట్టి తిరిగి నేలలో కలిసిపోయి భూమి సారాన్ని పెంచుతుందని తెలిపారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించడంలో కూడా ఇది ఉపయోగకరమని, స్థానిక కూలీలకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో మట్టి విగ్రహాల వాడకం సహకరిస్తుందని అన్నారు.

ప్రజలందరూ పర్యావరణ హిత దృక్పథంతో ముందుకు వచ్చి మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలనీ, శుభ్రమైన వాతావరణాన్ని భవిష్యత్తు తరాలకు అందించడంలో భాగస్వాములు కావాలని జనవిజ్ఞాన వేదిక నాయకులు పిలుపునిచ్చారు.

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

విద్యార్థుల ఆలోచన శక్తి మేదస్సు అభివృద్ధి కోసం

స్వగ్రామ విద్య అభివృద్ధికి అంకితభావం…

కేసముద్రం,ఇనుగుర్తి హై స్కూల్స్ కి చెస్ బోర్డుల బహుకరణ

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మరియు ఇనుగుర్తి మండలాల విద్యార్థుల క్రీడా ప్రోత్సాహానికి అమెరికాలో నివాసముంటున్న వెంకటగిరి గ్రామానికి చెందిన ఎన్ ఆర్ ఐ గుజ్జ శ్రీనివాసరావు, ఆయన సతీమణి మంజుల దంపతులు విశేష సహకారం అందించారు. విద్యార్థుల ఆలోచనా శక్తి, మేధస్సు అభివృద్ధి కోసం మండలంలోని 14 ప్రభుత్వ హైస్కూల్స్‌కి ఒక్కొక్క పాఠశాలకు 6 చొప్పున చెస్ బోర్డులు బహుకరించారు.

ఈ కార్యక్రమంలో కేసముద్రం మండల విద్యాశాఖాధికారి కాలేరు యాదగిరి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు బందెల రాజు, బండారు నరేందర్, ధన్నసరి సింగిల్ విండో చైర్మన్ మర్రి రంగారావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వరరావు, బి ఆర్ ఎస్ నాయకులు నీలం దుర్గేశ్, గుగులోత్ వీరునాయక్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా పేర్కొన్నారు.

అమెరికాలో నివసిస్తూ స్వగ్రామ విద్యార్థుల అభివృద్ధికి అంకితభావంతో ముందుకు వస్తున్న గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతులు నిజమైన ఆదర్శ దాతలు అన్నారు.

చెస్ ఆట విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తిని, వ్యూహాత్మక ఆలోచనను పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తుంది అని దాత అభిప్రాయపడ్డారు.

స్వగ్రామ విద్యా అభివృద్ధికి అంకితభావంతో చేసిన గుజ్జ శ్రీనివాసరావు, మంజుల దంపతుల సహకారం కేసముద్రం మండల విద్యా రంగంలో చిరస్మరణీయంగా నిలుస్తుందని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version