ఉచిత వైద్య శిబిరం.

ఉచిత వైద్య శిబిరం. ‌ ‌ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన
మండల వైద్యాధికారి డాక్టర్ నాగరాణి డాక్టర్ సంధ్య

మొగులపల్లి నేటి ధాత్రి

మొగుళ్లపల్లి మండలం మెట్టుపల్లి గ్రామంలో మండల ప్రభుత్వ వైద్యాధికారిణి డాక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో ,డాక్టర్ సంధ్య గారి ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని మంగళవారము నిర్వహించినారు. గ్రామంలో 53 మందికి వైద్య పరీక్షలు చేసి, జరపీడుతులకు రక్త నమూనాలు ఒకటి తీసి ల్యాబ్ కు పంపినారు .ఈ సందర్భంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి డాక్టర్ గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ,సిజను వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నివాస గృహాల చుట్టూ నీరు నిలవకుండా జాగ్రత్త వహించాలని తెలియజేసినారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది హెల్త్ అసిస్టెంట్ బిక్షపతి, ఏఎన్ఎం స్వరూప ,ఆశాలు కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version