ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి నాసిరకం బీటీ రోడ్ పై ఆగ్రహం

నాసిరకం బీటీ రోడ్డు నిర్మాణంపై ఎమ్మెల్యే ఆగ్రహం.

* కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి.

* ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లేఖ.

జడ్చర్ల /నేటి ధాత్రి.

 

మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం
బాలానగర్ మండలంలోని బోడగుట్ట తండా నుంచి దేవుని గుట్ట తండా వరకు నిర్మించిన 1 కిలోమీటర్ బీటీ రోడ్ ఏమాత్రం నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నాసీరకంతో నిర్మించడానికి కారణమైన కాంట్రాక్టర్, ఈ రోడ్డు నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి కోరారు.
ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కు లేఖ రాశారు. దేవునిగుట్ట తండాలో వేసిన బీటీ రోడ్డు ఒక రోజుకే గుంతలు పడిపోవడం, చేతితో లాగితే రోడ్డుపై వేసిన బీటీ పెళ్లపెల్లలుగా రావడం, బీటీ కింద కంకర వేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో ఈ రోడ్డు నిర్మాణం విషయంగా తాండా ప్రజలు ఆందోళన వ్యక్తం చేయడం, అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గతంలోనే ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించి నాసిరకంగా వేసిన కొత్త బీటీ రోడ్ మొత్తాన్ని తీసివేసి దాని స్థానంలో పూర్తి నాణ్యత ప్రమాణంతో కొత్త రోడ్డు వేయాలని అధికారులను ఆదేశించడం ఈ మేరకు అధికారులు నాసిరకంగా వేసిన రోడ్డు మొత్తాన్ని తీసివేయడం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అనిరుద్ రెడ్డి ట్రైబల్ వెల్ఫేర్ ఈఈకి లేఖ రాశారు.
ఈ నాసిరకం రోడ్డు కారణంగా ప్రభుత్వం అప్రదృష్ట పాలయిందని ప్రజాధనం వృథా అయిందని పేర్కొన్నారు. ఈ రోడ్డు నిర్మాణంలో బీటీ కింద వేయాల్సిన WBM కంకర లేకపోవడం, కంకర వేయకుండానే రోడ్డు వేయడం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం అని అభిప్రాయపడ్డారు. ఈ నాసిరకం రోడ్డు నిర్మాణానికి కారణమైన కాంట్రాక్టర్, పర్యవేక్షించిన అధికారులు, నాణ్యతను ధ్రువీకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అనిరుధ్ రెడ్డి డిమాండ్ చేశారు.

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం…

బోడగుట్ట తండాలో పోషణ మాసోత్సవం

కేసముద్రం/ నేటిదాత్రి

 

కేసముద్రం మండలంలోని అంగన్వాడి కల్వల క్లస్టర్ లోని పిక్లా తండా శివారు బోడగుట్ట తండా అంగన్వాడి సెంటర్లో గురువారం పోషణ మాసోత్సవం కార్యక్రమం నిర్వహించారు ఇందులో పోషకాలను అందించే 20 రకాల పిండి వంటలు, కొత్త రకమైన వంటకాలు, అలంకరణ బాగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా అంగన్వాడి సూపర్వైజర్ ఎస్ ప్రేమ జ్యోతి మాట్లాడుతూ… చిన్నపిల్లలకు ఎలాంటి జంక్ ఫుడ్ ఇవ్వవద్దని, నూనె పదార్థాలు, చక్కెర, చిప్స్ వంటి వాటికి దూరంగా ఉంచాలన్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల పరీక్ష చేయించుకుని తగిన పోషకాహారం తీసుకోవాలన్నారు. గర్భిణిగా ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతమైన బేబీ జన్మిస్తుందని చెప్పారు. పిల్లల పెరుగుదల విషయంలో ఎప్పటికప్పుడు పోషకాహారం అందిస్తూ ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల ఆహార పదార్థాలను చిరుధాన్యాలతో తయారుచేసి పిల్లలకు అందించారు. హాజరైన వారందరితో పోషకాహారం పై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం గనె యాదగిరి, కార్యదర్శి ఇ.నివాస్ రెడ్డి, టీచర్ గానె పావన, క్లస్టర్ లోని అంగన్వాడి టీచర్లు జీ. నీల, టి. వాణి, ఈ. జ్యోతి, బి. సునీత, బి. స్వప్న, జి. పద్మ, ఆశ వర్కర్లు ఎం. నాగలక్ష్మి, ఎస్. ఉపేంద్ర, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గ్రామస్తులు, పిల్లలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version