ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా..

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులకు అండగా ఉంటా

ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థుల పరామర్శ

నిరాశ చెందొద్దు..ఓడిపోయిన.. విజేతలు మీరే..

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

దుగ్గొండి నేటిధాత్రి:

 

ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డ్ మెంబర్లుగా
బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులకు భారత్ రాష్ట్ర సమితి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చెందిన బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ధైర్యం నింపేందుకు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శ యాత్ర చేపట్టారు.దుగ్గొండి మండలంలోని గిర్నిబావి, తొగర్రాయి,తిమ్మంపేట, మహమ్మదాపురం,మర్రిపల్లి ,వెంకటాపురం గ్రామాల బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల్లో ఓటమిపాలవగా
ఆయా గ్రామాల అభ్యర్థులను పెద్ది సుదర్శన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి పరామర్శించారు.ఈ సందర్భంగా పెద్ది మాట్లాడుతూ ఓటమి చెందిన అభ్యర్థులకు పార్టీలో భవిష్యత్తులో సముచిత స్థానం కల్పించి గౌరవిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
* ప్రజాసేవయే లక్ష్యం ఇదే పోరాట స్ఫూర్తితో గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మిమ్మల్ని ఆశీర్వదిస్తారని పిలుపునిచ్చారు.

అధికార దుర్వినియోగం అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు, అధికారులు చాలా చోట్ల బిఆర్ఎస్ విజయాలను తారుమారు చేశారని మండిపడ్డారు.కొన్నిచోట్ల ఎన్నికల ఫలితాలపై కోర్టులో సవాల్ చేస్తామని, న్యాయపరంగా, చట్టబద్ధంగా పోరాడి గెలుస్తామని స్పష్టం చేశారు.పోలీసుల అరాచకాలకు అడ్డులేకుండా పోయిందని విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఫలితాలను తారుమారు చేసినా కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరంలేదని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎన్నికలలో ఒకటి ముపాయలైన నిరాశ చెందకుండా ఉండాలని అయినా ఓటమి చెందిన మీరే విజేతలు అని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ధైర్యం చెప్పారు.
ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సుకినే రాజేశ్వర్ రావు,,మాజీ మార్కెట్ ఛైర్మెన్ పొన్నం మొగిలి,మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, బిఆర్ఎస్ నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, సర్పంచ్ శంకేసు కమలాకర్,మండల సీనియర్ నాయకులు,క్లస్టర్ బాధ్యులు, సర్పంచ్ లు.ఉపసర్పంచ్లు,వార్డు సభ్యులు ,మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు,గ్రామ పార్టీ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ..

మాజీ ఎమ్మెల్యే గండ్ర పరామర్శ

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండలం బస్వరాజ్ పల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే కట్ల సాయిలు, కీ.శే బూడిద స్వామి సీతరాంపురం గ్రామ వాస్తవ్యులు కీ.శే మర్రి వెంకటయ్య, కీ.శే బాలాజీ రామాచారి – సంధ్య, కీ.శే ఎలకపల్లి రమేష్ అదే విధంగా బంగ్లాపల్లి గ్రామ వాస్తవ్యులు కీ.శే ధరంసోత్తు సమత, కీ.శే మారపాక భాగ్య ఇటీవల మరణించిన వారి ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియచేసిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి .
వారి వెంట బి అర్ స్ మండల పార్టీ అధ్యక్షులు మోతే కరుణాకర్ రెడ్డి పరశురాంపల్లి సర్పంచ్ ఉడుత సాంబయ్య సీతారాంపూర్ సర్పంచ్ తోట రాకేష్ నాయకులు మార్త శ్రీనివాస్ మంద అశోక్ రెడ్డి చింతరెడ్డి పాపిరెడ్డి పరశురాంపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు కృష్ణ యాదవ్ సీతారాంపూర్ గ్రామ కమిటీ అధ్యక్షులు వైనాల వెంకటేష్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

నన్ను గెలిపించండి ఊరికి సేవ చేస్తా..

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-09T140406.358.wav?_=1

 

నన్ను గెలిపించండి ఊరికి సేవ చేస్తా

నడికూడ,నేటిధాత్రి:

 

గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా నడికూడ మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వంగ మల్లికార్జున్ కి మద్దతుగా మరియు వార్డ్ మెంబెర్స్ మోత్కూరి లక్ష్మీ రమేష్,వంగ శరణ్య మల్లికార్జున్,కోట తిరుపతి, ఎరుకల రాజారెడ్డి,మందోటి విజయేందర్,చేకిలె జమున రవీందర్ లకు మద్దతుగా గ్రామంలో ఇంటింటికి విస్తృత ప్రచారంలో బీజేపీ శ్రేణులతో కలిసి బీజేపీ రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు,56వ డివిజన్ అధ్యక్షులు మహేందర్ పటేల్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు మాట్లాడుతూ
గ్రామపంచాయతీల అభివృద్ధి కేవలం కేంద్ర నిధుల ద్వారానే సాధ్యమని అందుకే బిజెపి బలపరిచిన అభ్యర్థి వంగ మల్లికార్జున్ బ్యాట్ గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెంతల జగన్, ఎరుకల శ్రీనివాస్,ఆకుల రాజు,మందుటి మహేందర్, కోట మల్లయ్య,కోట రవి, శంకర్ లింగం,బిక్షపతి,అంజి, ఆకుల నవీన్,ఎల్లస్వామి, గొనె రాకేష్,గొనె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

పద్మ నగర్.గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన మోర నిర్మల…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-01T152539.292.wav?_=2

 

పద్మ నగర్.గ్రామ సర్పంచ్ గా నామినేషన్ దాఖలు చేసిన మోర నిర్మల…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

 

తంగళ్ళపల్లి మండలం పద్మనగర్.గ్రామానికి చెందిన మోర నిర్మల తంగళ్ళపల్లి మండలం పద్మా నగర్ గ్రామానికి చెందిన మోర నిర్మల ఈరోజు స్థానిక బద్దెనపల్లి గ్రామపంచాయతీకార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసినారు. సందర్భంగా మోర నిర్మల మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం పద్మ నగర్.గ్రామ సర్పంచిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని గ్రామ ప్రజల అందరి ఆశీస్సులతో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడంతో పాటు నన్ను సర్పంచిగా పోటీలనిలబెట్టి నాకు ఎల్లవేళలా అండగా ఉంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతువచ్చే ఎన్నికల ప్రక్రియలో భాగంగా నన్ను గ్రామ ప్రజలు అందరూ బలపరిచినాతోనామినేషన్ దాఖలు చేయించినందుకుగాను. ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని వారికి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఏ ఆపద వచ్చిన అందుబాటులో ఉంటానని గ్రామ అభివృద్ధి కి కృషిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు నామినేషన్ దాఖలు చేయు సందర్భంగా గ్రామ ప్రజలు బలపరిచిన వారు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

37 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-24T123101.073.wav?_=3

 

37 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని

మారపల్లి మల్లేష్
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి

భూపాలపల్లి నేటిధాత్రి

 

37 మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని
ఇచ్చిన పట్టాలు రద్దు చేయడం దుర్మార్గమని
సిపిఐ ఎంఎల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్… అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
జర్నలిస్టుల న్యాయమైన
సమస్యను పరిష్కరించాలని మూడవరోజు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం 37 మంది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి జర్నలిస్టులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యల పైన నిరంతరం కుటుంబాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాం తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాం

సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం…

సునిల్ కుమార్ గౌడ్ కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సహాయం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం నాగుర్లపల్లి గ్రామానికి చెందిన మచ్చిక సునిల్ కుమార్ గౌడ్ గత నెల 26 న గుండెపోటుతో మరణించారు.తను పని చేసిన సిద్దార్థ డిగ్రీ కళాశాలకు చెందిన తోటి అధ్యాపకులు మేరుగు శ్రీధర్ గౌడ్,ఏ.ఓ పరమేష్ ఆధ్వర్యంలో ,10 వ తరగతి స్నేహితులు కలిసి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం మంగళవారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో గౌడ జన పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి మచ్చిక రాజు గౌడ్,గుంటి అశోక్,ప్రభాకర్ రెడ్డి, కోమాండ్ల రఘు, బండారి శ్రీనివాస్, సహాదేవ్, దండెం రవీందర్, రాజు కుమార్,వాళ్ళల రమేష్, అనిల్,మచ్చిక లక్ష్మణ్ గౌడ్, సమ్మయ్య గౌడ్, ఊడ్గుల సాంబయ్య గౌడ్, గంధం చంద్రమౌళి గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్,గాదెగోని లింగయ్య గౌడ్, ఆనంద్ గౌడ్, గండు రమేష్ గౌడ్, సుదీర్ గౌడ్, రవితేజ గౌడ్,సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T181124.663.wav?_=4

 

కళాకారిణి కుటుంబానికి ఆపన్న హస్తం

‘నేటిధాత్రి”,హనుమకొండ.

 

తేదీ: 21/ 10 /2025 మంగళవారం సాయంత్రం నాలుగు గంటలకు బాలసముద్రంలో గల చక్రవర్తి హాస్పిటల్లో తోటి కళాకారిణి పట్టపురి అనిత గారి అమ్మ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతుంది, ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లా సినిమా మరియు టీవీ కళాకారుల సంఘం అధ్యక్షుడు “సదా.రుద్రారపు” వెంటనే స్పందించి తన తోటి కళాకారుల సహాయ సహకారంతో చక్రవర్తి హాస్పిటల్ సందర్శించి తమ వంతు సహాయంగా 5000 రూపాయలను ఇచ్చి పరామర్శించారు,ఇక నుండి కళాకారుల విషయంలో ఈ సంఘం ముందుంటుందని కళాకారులందరూ అభిప్రాయంవ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా యాక్టింగ్ మరియు టీవీ కళాకారుల అసోసియేషన్ మెంబర్స్, అనిల్ కుమార్ సుద్దాల, పాల కుమారస్వామి,ఎరుగొండ లావణ్యగౌడ్,ఎలుకపాటి రాజు తదితరులు పాల్గొన్నారు.

బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం..

బీసీల హక్కుల సాధన కోసం తెలంగాణ రాష్ట్ర బంద్ కు న్యాయవాదుల సంఘీభావం:-

42% రిజర్వేషన్ బిల్లు వెంటనే ఆమోదించాలి వరంగల్ ఉమ్మడి జిల్లా న్యాయవాదుల డిమాండ్:-

వరంగల్/హన్మకొండ, నేటిధాత్రి, అక్టోబర్ 18:-

 

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన “బీసీ హక్కుల సాధన బంద్” కు వరంగల్–హనుమకొండ జిల్లా న్యాయవాదుల సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి.బంద్ సందర్భంగా, వరంగల్ హనుమకొండ జిల్లా న్యాయవాదులు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున కోర్టు ఎదుట ధర్నా నిర్వహించి మరియు ర్యాలీ చేపట్టి కాళోజీ సెంటరు నుండి అమరవీరుల స్థూపం వద్దకు వెళ్లి నినాదాలిచ్చి తమ మద్దతును తెలియజేశారు.

ఈ సందర్భంగా జరిగిన బంద్ సభలో, జిల్లా న్యాయవాద సంఘాల అధ్యక్షులు వలుస సుధీర్, పులి సత్యనారాయణ మాట్లాడుతూ —
“బీసీలు రాష్ట్ర జనాభాలో అతి పెద్ద వర్గం అయినప్పటికీ, సమాన అవకాశాలు ఇంకా లభించడం లేదు అన్నారు.అందుకే బీసీ రిజర్వేషన్ శాతం 42% కు పెంచి, ఆ బిల్లును పార్లమెంట్‌లో వెంటనే ఆమోదించి 9వ షెడ్యూల్‌లో చేర్చడం అత్యవసరం” అని అన్నారు.అలాగే “బీసీలకు న్యాయం చేయడం అంటే సామాజిక న్యాయం సాధించడం.విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో సరైన వాటా దక్కే వరకు ఈ ఉద్యమం ఆగదు అన్నారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం కోసం ప్రతీ ఒక్కరూ ఐక్యంగా నిలవాలి” అని పిలుపు నిస్తూ బీసీ రిజర్వేషన్ల సాధనలో న్యాయవాద సంఘాలు ముందు వరుసలో నిలిచి పోరాడుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ బార్ ఉపాధ్యక్షులు మైదం జయపాల్, కార్యవర్గ సభ్యులు మర్రి రాజు, హనుమకొండ ప్రధాన కార్యదర్శి కొత్త రవి, కోశాధికారి సాంబశివరావు, సీనియర్ న్యాయవాదులు మాజీ అధ్యక్షులు ఎలుకుర్తి ఆనంద్ మోహన్, గుడిమల్ల రవి కుమార్ , చిల్లా రాజేంద్ర ప్రసాద్ , జి. విద్యాసాగర్ రెడ్డి మరియు గంధం శివ, నారగోని నర్సింగరావు,సాయిని నరేందర్,నల్ల మహాత్మ, గుర్రాల వినోద్ , వి వి రత్నం, జగన్ మోహన్ రెడ్డి , యాకస్వామి , రాచకొండ ప్రవీణ్ , రామచందర్ , శ్రీనివాస్ గౌడ్,తదితర పలువురు సీనియర్ జూనియర్ న్యాయవాదులు,బీసీ సంఘాల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

పరకాలలో బందు ప్రశాంతం…

పరకాలలో బందు ప్రశాంతం

పరకాల నేటిధాత్రి

 

తెలంగాణ లో బీసీ లకు స్థానిక సంస్థ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాలని బీసీ నాయకులు ఇచ్చిన బంద్ లో శనివారం రోజున పట్టణంలోని వ్యాపారస్థులు,ప్రజలందరు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఈ బంద్ కు పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీలతోపాటు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.విద్యాసంస్థలు,కాలేజీలు సెలవు ప్రకటించాయి.

ఎన్ఎస్ఎస్ జయశంకర్ కన్వీనర్‌గా ముక్క యుగంధర్ నియామకం

ఎన్ఎస్ఎస్ జయశంకర్ జిల్లా కన్వీనర్ గా ముక్క యుగేందర్ నియామకం.

చిట్యాల, నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ముక్క యుగంధర్ ను ను ఎన్ఎస్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గా నియమించినట్లు ఎన్ఎస్ఎస్ కాకతీయ యూనివర్సిటీ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ తెలిపారు. శుక్రవారం రోజున యుగేందర్ పూర్వపు కన్వీనర్ ప్రసన్నకుమార్ నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ ఈ పదవి తన బాధ్యతను మరింత పెంచిందని, ఉత్సాహంగా రానున్న రోజుల్లో భూపాలపల్లి జిల్లాలో ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలు విజయవంతం కావడంలో కీలకపాత్ర పోషిస్తానని తెలిపారు. తన ఎంపికకు సహకరించిన మహబూబాబాద్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్, వరంగల్ జిల్లా కన్వీనర్ రాంబాబు, జనగాం జిల్లా కన్వీనర్ జంబు, ములుగు జిల్లా కన్వీనర్ ప్రసన్నకుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

బీసీ బంద్ విజయవంతం చేయాలి- కేయూ బీసీ టీచర్స్ అసోసియేషన్.

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జరగబోయే 42% బీసీ రిజర్వేషన్లకు మద్దతుగా కాకతీయ విశ్వవిద్యాలయ బీసీ టీచర్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బీసీ టీచర్స్ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ నాగయ్య జనరల్ సెక్రెటరీ డాక్టర్ రమేష్, కాకతీయ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ చిర్ర రాజు, డాక్టర్ శేషు,డాక్టర్ శ్రీకాంత్ యాదవ్, డాక్టర్ రాధిక, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సాంబశివరావు, డాక్టర్ మల్లేష్, డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్, డాక్టర్ విజయ్ పాల్గొన్నారు.

ఆన్ మ్యాన్డ్ అంజి కుటుంబానికి అండగా విద్యుత్ సిబ్బంది…

ఆన్ మ్యాన్డ్ అంజి కుటుంబానికి అండగా విద్యుత్ సిబ్బంది

-ఆర్థిక సహాయం అందజేసి ఉదారతను చాటుకున్న విద్యుత్ ఉద్యోగులు
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి విద్యుత్ సెక్షన్ లో ఆన్ మ్యాన్డ్ కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న జన్నే అనిల్ (అంజి) గత మూడు నెలల క్రితం విద్యుత్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగులగా..ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య చికిత్సలు పొందుతూ..తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాలాడుతూ గత 11 రోజుల క్రితం మృతి చెందాడు. కాగా విషయం తెలుసుకున్న విద్యుత్ సిబ్బంది శుక్రవారం మృతుడు అంజి కుటుంబాన్ని పరామర్శించి, రూ. 27,500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి వారి ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ 327 జిల్లా నాయకులు జక్కు రాజేందర్ గౌడ్, పి ఆర్ వి కె ఎస్ జిల్లా నాయకులు గూగులోతు శ్రీనివాస్ నాయక్, ఫోర్ మెన్ యాదగిరి, లైన్ మెన్ లు, మచ్చ సత్యం, శ్రీనివాస్, అనిల్, మోత్కూరి రాములు, ఆర్టీజన్ కార్మికులు, ఆన్ మ్యాన్డ్ కార్మికులు, స్పాట్ బిల్డర్స్ పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ….

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు మద్దతు తెలిపిన జహీరాబాద్ బిసి జేఏసీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : భవాని మందిర్ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు స్వచ్ఛంద బంద్ కు బీసీ బంధువులు మరియు అన్ని పార్టీల బీసీ కార్యకర్తలు తమ తమ మద్దతు తెలుపాలని మనం బీసీలు అందరం ఏకతాటికి రావాలని మనకు జరిగినా అన్యాయాన్ని ఈ బంద్ ధార తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని జహీరాబాద్ బీసీ జేఏసీ నెంబర్లు కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీసీ కుల సంఘాలు మరియు బిఆర్ఎస్ పార్టీ బీసీ సోదరులు మరియు బిజెపి పార్టీ బీసీ సోదరులు జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జహీరాబాద్ నియోజకవర్గం అన్ని మండలాల నుండి బీసీ బందులు. ఈరోజు అతిధి హోటల్లో బీసీ తాలుక జేఏసీ ఆధ్వర్యంలో సమావేశం కావడం జరిగింది
రేపు జరగబోయే బంద్ కు తమ తమ మద్దతు తెలుపుతున్నామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ పెద్ద గొల్ల నారాయణ ,, కోహిర్ మండల్ మాజీ జెడ్పిటిసి , నర్సింలు,, కొండాపురం నరసింహులు, విశ్వనాథ్ యాదవ్ బిజెపి, తట్టు నారాయణ , బిఆర్ఎస్ పార్టీ జహీరాబాద్ మండల అధ్యక్షులు వెంకటేశం బిఆర్ఎస్ జర సంఘం మండల్ మొహమ్మద్ఇమ్రాన్, బీసీ మైనార్టీ, సంగారెడ్డి జిల్లాఅధ్యక్షులు, శంకర్ సాగర్ బి సి,,. జగన్ బిజెపి,మాదినం శివప్రసాద్ జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదిపర్లు పాల్గొనడం జరిగింది

ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు…

ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

గుంపల్లి మునీశ్వర్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రైతు భవన్ లో ఏఐటీయూసీ హమాలి యూనియన్ అవగాహన సదస్సు కార్మిక యూనియన్ అధ్యక్షులు లంకదాసర అశోక్ అధ్యక్షతనలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంపల్లి మునీశ్వర్ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన కార్మికుల పరిస్థితి మరింత అద్వానంగా ఉన్నదని ఏఐటియుసి పోరాటాలతో 50 కిలోల బస్తాలు వచ్చాయని హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వం నుండి తగిన ఆదరణ లేకపోవడం దారుణమని అన్నారు.బరువులు మోసేటప్పుడు లారీల నుండి దించేటప్పుడు ఎత్తేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని కాళ్లు చేతులు విరిగిన ప్రాణాలు పోయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఠా జట్టు హమాలీల సంక్షేమ బోర్డును పునర్దించాలని మన మార్కెట్లో దడ్వాయిలు,కాంట్రవెస్తూ అటు రైతులకు హమాలి కార్మికులకు చేదోడు వాదోడుగా

ఉంటున్నారు.మార్కెట్లో ప్రధానంగా మార్కెట్ యార్డ్ లో పనిచేసే వారందరూ రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు ఎండి చాలీచాలని ఆదాయంతో బతుకుతున్నారని అన్నారు. మార్కెట్లో పనిచేసే హమాలీ దడువాయి,గంపకూలి కార్మికులకు పని భద్రత కల్పించాలని,రైతు ప్రజా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మికులకు ప్రమాద బీమా నష్టపరిహారం మూడు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని మార్కెట్లో పనిచేస్తున్న వారందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని మరియు కార్మికులందరికీ 3000 యూనిఫామ్ ను ప్రతి సంవత్సరం ఇవ్వాలని,మార్కెట్ యార్డ్ కార్మికుల లైసెన్స్ రెన్యువల్ చేసి 58 నుంచి 60 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మార్కెట్ యార్డుల పాలకవర్గంలో కార్మికుల నుంచి ఇద్దరికీ డైరెక్ట్ గా అవకాశం కల్పించాలని యార్డులో క్యాంటీన్ మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్,ఏ ఐ టి యు సి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్,కార్మిక నాయకులు కోడే పాక ఐలయ్య,కోకిల శంకర్, కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరే రవి,ధార్వా యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్,గంపకూలి లచ్చమ్మ తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు.

బీ సి బందుకు ప్రజలు సహకరించాలి…

బీ సి బందుకు ప్రజలు సహకరించాలి

అఖిలపక్ష ఐక్యవేదిక. మద్దతు

వనపర్తి నేటిదాత్రి .

 

బీ సీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలుకు తెలంగాణ రాష్ట్ర బందుకు మద్దతు వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్య వేదిక మద్దతు ఇస్తామని జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ తెలిపారు
పార్టీలకు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా “సతీష్ యాదవ్.
బి సి బందుకు అన్ని రాజకీయ పార్టీలకు కృతజ్ఞతతో తెలుపుతూ వారిని ఆహ్వానిస్తూ వారితో బంద్ లో పాల్గొoటా మని తెలిపారు చేయాలో తెలుసుకుంటూ వారిని ముందు పెట్టి మేము బందును ప్రశాంతంగా విజయవంతం చేయాలని.పిలుపునిచ్చారు,
ఈసమావేశంలో సతీష్ యాదవ్ టీజేఎస్ జిల్లా అధ్యక్షులు ఖాదర్ పాషా యాదయ్య , టిడిపి నాయకులు కొత్తగొళ్ల శంకర్, కాంగ్రెస్ నాయకులు వెంకటేశ్వర్లు,పాల్గొన్నారు

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం మహేష్ యాదవ్ నుండి

మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం.

కల్వకుర్తి / నేటి ధాత్రి :

Vaibhavalaxmi Shopping Mall

 

అనారోగ్యంతో చనిపోయిన కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి 5000 రూపాయలు చొప్పున 30000 ఆర్థిక సాయం అందించిన బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ .. కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామంలో కొన్ని రోజుల క్రితం 5 మంది అనారోగ్యంతో మృతి చెందారు అదేవిధంగా బైకు ప్రమాదంలో ఓ వ్యక్తి కింద పడి గాయాలవడం తో ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు మహేష్ యాదవ్ చనిపోయిన బుడ్డమ్మ , రాజు, పున్నమ్మ ,నరసింహ లకు అదేవిధంగా బైకు యాక్సిడెంట్లో ప్రమాద వశాత్తు కిందపడ్డ యాదయ్య లకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు .ఈ సందర్భంగా మహేష్ యాదవ్ మాట్లాడుతూ.. మృతుల కుటుంబాలను పరామర్శించి మొత్తం 6 కుటుంబాలకు 30000 ఆర్థిక సాయం చేస్తూ ఎవరు అధైర్య పడొద్దు ధైర్యంగా ఉండాలని ఎలాంటి ఇబ్బంది వచ్చిన నాకు తెలియజేయాలని మీ కుటుంబాలకు అండగావుంటా అని భరోసా ఇచ్చారు. నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, చంటి, బిక్షపతి, నవీన్, సాదిక్, రాజేష్, లక్ష్మణ్,మధు,మహేష్, రాకేష్, వినోద్ రమేష్,శ్రీకాంత్, శ్రీధర్, వంశీ,శేఖర్ గ్రామస్తులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

బీసీల రిజర్వేషన్ కోసం రామాయంపేట బంద్ పిలుపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T140829.637.wav?_=5

 

బీసీల రిజర్వేషన్ కోసం రామాయంపేట బంద్ పిలుపు..

రామాయంపేట అక్టోబర్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

తెలంగాణ బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ రాబోయే 18వ తేదీ శనివారం రామాయంపేట బంద్ నిర్వహించాలని నిర్ణయించారు.
మెదక్ జిల్లా బీసీ సంక్షేమం, రాజకీయ, కుల, మహిళా, యువజన, ఉద్యోగుల, దివ్యాంగుల, విద్యార్థి సంఘాల జేఏసీ నాయకత్వంలో రామాయంపేట మండల కేంద్రంలోని శ్రీకర ఫంక్షన్ హాల్‌లో సమావేశం జరిగింది.
సమావేశంలో నేతలు మాట్లాడుతూ — రాష్ట్ర జనాభాలో 65 శాతం బీసీలు ఉన్నా, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో కేవలం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించడం అన్యాయం అని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు సముచిత న్యాయం చేయాలంటే 42 శాతం రిజర్వేషన్ల బిల్లును చట్టబద్ధం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీసీ జేఏసీ పిలుపు మేరకు రామాయంపేట పట్టణం మరియు మండలంలోని ప్రజలు, వ్యాపార వాణిజ్యవేత్తలు, కుల సంఘాలు, విద్యా సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు ఉద్యోగులు, యువజన సంఘాలు, అలాగే ఎస్సీ–ఎస్టీ, ఇతర ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు బీసీ బంద్‌కు స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.
నాయకులు బీసీ సమాజం ఐక్యంగా ముందుకు వచ్చి బంద్‌ను ఘనవిజయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం. మామిడి సిద్ధరాములు. పోచమ్మల అశ్విని శ్రీనివాస్. రేవెల్లి వినయ్ సాగర్. బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-15T132740.736.wav?_=6

 

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం..

నిజాంపేట, నేటి ధాత్రి

 

మండల కేంద్రానికి చెందిన విభూతి జ్యోతి (40) గత రెండు రోజుల క్రితం మనస్థాపంతో ఉరివేసుకొని చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబమైన వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పంజా మహేందర్ ఆయన సన్నిహితుల ద్వారా మృతు రాలి కుటుంబానికి 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నసీరుద్దీన్,సామల మహేష్, పెద్ద పైడి రాజిరెడ్డి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి…

బడుగు బలహీన వర్గాలకు అండగా సీఎం సహాయనిధి

◆:- టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడుగు బలహీన వర్గాలకు సీఎం సహాయనిధి చాలా అండగా నిలుస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. కార్పొరేట్ హాస్పిటల్లో లక్షల్లో కోట్లల్లో డబ్బులు పెట్టుకొని వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న వారికి సీఎం సహాయనిధి ద్వారా కొంతవరకైనా లబ్ధి పొందవచ్చు అని టిఆర్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ అన్నారు.
మొన్న వరంగల్లో టిఆర్పి పార్టీ అధ్యక్షులు శ్రీ తీన్మార్ మల్లన్న గారి ఆధ్వర్యంలో జరిగిన టిఆర్పి రాష్ట్ర కార్యవర్గం సమావేశంలో బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు పేద ప్రజలకి మా పార్టీ అధికారంలోకి వస్తే, ఉచిత వైద్యం అందించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలన్న సంకల్పంతో మా పార్టీ అధ్యక్షులు వివిధ వర్గాల పేద ప్రజల కోసం సీఎం సహాయనిధి ద్వారా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాము.కావున జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా ద్వారా సీఎం సహాయ నిధి కోసం అప్లై చేసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటున్నాను.

ప్రమాద బాధితుడికి 50 వేల సాయం చేసిన తట్టు విశ్వనాథ్…

క్షత్తగాత్రుడికి పరామర్శించి 50000 యాభై వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందించిన

◆:- తట్టు విశ్వనాధ్*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

కడమంచి కిషోర్ తండ్రి లక్ష్మయ్య వయస్సు 30 సంవత్సరాలు గ్రామము అనేగుంట మండలం జహీరాబాద్ గారు బూచినెల్లి శివారులో .హైవే రోడ్డు పై బైక్ స్కిడ్ కావడం వల్ల కింద పడి తలకు తీవ్ర గాయలై సంగా రెడ్డి లోని ప్రైవేట్ ఆసుపత్రి (ధరణి) లో తలకు ఆపరేషన్ జరిగి చికిత్స పొందుతున్నారు ఇట్టి విషయాన్ని కుటుంబ సభ్యులు జహీరాబాద్ మండల బిఆర్ఎస్ అధ్యక్షులు తట్టు నారాయణ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఆదుకోవాలని కోరగా తక్షణమే తన తమ్ముడైన తట్టు విశ్వనాథ్ కు తెలుపగా సంగారెడ్డి లోని ఆసుపత్రికి చేరుకొని కిషోర్ ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తట్టు విశ్వనాథ్ 50000/- వేయిల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు కిషోర్ కుటుంబ సభ్యులు కడిమించి ప్రేమలమ్మలక్ష్మయ్య లు తట్టునారాయణ మరియు తట్టు విశ్వనాధ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జగదీశ్, కోమారి కిష్టయ్య, కడిమించి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version