రాజ్యసభ ఎంపీగా దొమ్మటి సాంబయ్యకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ యువ నాయకులు అల్లం కార్తీక్ కోరారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా నిబద్ధతతో పనిచేస్తున్నారని గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రజలతో మమేకమై సేవలందించారని పేర్కొన్నారు.అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకుడని ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి సాంబన్న అని అన్నారు.రాజ్యసభలో ప్రజల గొంతుకగా నిలబడగల సామర్థ్యం సాంబన్నకు ఉందన్నారు.పేదలు,రైతులు, కార్మికుల సమస్యలను దేశవ్యాప్తంగా ప్రస్తావించగల ధైర్యం ఆయనకు ఉందని రాజకీయ అనుభవం,ప్రజాదరణ రెండూ ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారని పేర్కొన్నారు.అలాంటి సమయంలో సాంబన్నకు అవకాశం ఇవ్వడం సముచితమని సమాజంలోని వివిధ వర్గాల మద్దతు సాంబన్నకు ఉందని తెలిపారు. పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని పరిగణించి అవకాశం ఇవ్వాలని కోరారు.
అదనపు కలెక్టర్కు అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకై వినతిపత్రం
సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపెల్లి మల్లేష్.
టేకుమట్ల మండల కేంద్రం మండలంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు చేయాలని సిపిఐ ఎంల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ జిల్లా అదనపు కలెక్టర్ అశోక్ కుమార్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది సానుకూలంగా స్పందించిన అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ టేకుమట్ల, చిట్యాల, మొగుళ్ళపల్లి మండలాల్లో అగ్నిమాపక కేంద్రం లేకపోవడం వల్ల రైతులు, వ్యాపార వాణిజ్య వర్గాలు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే భూపాలపల్లి జిల్లా కేంద్రం నుండి అగ్ని మాపక కేంద్రం ఈ మూడు మండలాలకు చేరుకోవడం ఆలస్యం అవుతుందని, తద్వారా ధన, ప్రాణ నష్టం సంభవిస్తుందనిఅన్నారు. నిన్నటి రోజున రాఘవరెడ్డి పేట గ్రామానికి చెందిన రైతు గడ్డి కట్టలకు నిప్పు అంటుకోగా భూపాలపల్లి నుండి అగ్ని మాపక కేంద్రం గ్రామానికి చేరుకునే సరికే అవి అగ్నికి ఆహతి అయ్యాయాని, ఇకనైనా ప్రభుత్వం స్పందించి టేకుమట్ల మండలంలో అగ్ని మాపక కేంద్రం ఏర్పాటు చేస్తే టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాలకు సౌకర్యం వంతంగా ఉంటుందని ఆయన డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి అంబాల అశ్వథామ తదితరులు పాల్గొన్నారు..
ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండా గ్రామ ప్రజలు రైతులు రైతు కూలీలు ఈ సంవత్సరం వ్యవసాయం ఆశించినంతగా దిగుబడి రాకపోవడంతో గ్రామస్తులు పల్లెలు విడిచి హైదరాబాద్ లాంటి నగరాలకు పనుల కోసం వలస వెళ్లవలసిన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారు గత డిసెంబర్ నెలలో ప్రతి మిర్చి పనులు అయిపోవడంతోను ఏటువంటి కూలి పనులు దొరకక గ్రామ ప్రజలు 100 రోజుల ఉపాధి హామీ పనులు కోసం పై అధికారులను సంప్రదించిన ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇదివరకే ఉన్న ఉపాధి హామీ పనుల పాత పాస్ పుస్తకాలు పనిచేయడం లేదు కొంతమంది మాత్రమే ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. మిగతా వారికి లిస్టులో మీ పేరు లేదు అని కొత్త ఉపాధి పుస్తకాలు తీసుకొని పనిలోకి రావాలని సలహా ఇస్తున్నారు. దయచేసి ఈ విషయమై పై అధికారులు స్పందించి ఉపాధి హామీ కొత్త పుస్తకాలు మంజూరు చేసి మాకు ఉపాధిహమి పనులు కల్పించి ఆదుకోవాలని రైతులు రైతులు రైతుకూలీలు గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కరకగూడెం మండలం,కరకగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని వైకుంఠధామం నుంచి మైసమ్మ చెట్టు పక్కగా ఉన్న రహదారి రైతుల రాకపోకలకు అనుకూలంగా లేకపోవడంతో, ఈరోజు మన అభిమాన నాయకులు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు , ఎన్.ఆర్.ఇ.జి. ఎస్ జేఈ తో మరియు గ్రామ పెద్దలు కొంపెల్లి పెద్ద రామలింగం గ,జలగం వెంకన్న ,స్తానిక రైతులతో కలిసి ఆ రహదారిని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరడం జరిగింది. గ్రామంలోని మౌలిక వసతుల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తెలిపారు
భారతదేశ 77 వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశంలో కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ ఈ గణతంత్ర దినోత్సవం ఎందరో స్వాతంత్య్ర సమరయోధుల త్యాగఫలం, వారి సుదీర్ఘ పోరాటం ద్వారా వచ్చిన స్వాతంత్ర్య ఫలాలను పరిపాలనలో అమలు చేయాల్సిన బాధ్యతలు, విధులను తెలిపే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు.దిశానిర్దేశం చేయడానికి రచించిన రాజ్యాంగం అత్యంత విలువైనది. ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగం మూలం. మనదేశం భిన్నత్వంలో ఏకత్వం కలది. వివిద వర్గాల వారు వారి విశ్వాసాలకు అనుగుణంగా భగవద్గీత, ఖురాన్, బైబిల్ ను గౌరవిస్తారు.కాని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు గౌరవించేది దేశ రాజ్యాంగాన్ని. దేశాన్ని అభివృద్ధి పధంలో నడపడానికి అందరూ కృషి చేయాలి అని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజి ఆత్మ చైర్మన్ విజయ్ కుమార్, మాజి ఆలయ చైర్మన్ నీల వెంకటేశం,మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,మాజి పి ఆర్ యు సి సి మెంబర్ షేక్ ఫరీద్,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్,ఆర్ సుభాష్,పట్టణ మహిళా అధ్యక్షురాలు మంజుల,అనుషమ్మ, పద్మజ,గ్రామల మాజి సర్పంచ్ లు ఎంపీటీసీ లు,మున్సిపల్ వార్డ్ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సోమవారం పరకాల పట్టణంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు చేయలేదని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్రంగా విమర్శించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెప్పేది ఒకటి,చేసేది మరోటని,వారి పాలన మొత్తం అసత్య ప్రచారాలు,మోసాల పునాదుల మీద నడుస్తోందని ధ్వజమెత్తారు.బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తయిన అభివృద్ధి పనులకు రంగులు వేసి మళ్లీ ప్రారంభాలు చేయడమే కాంగ్రెస్ పాలనకు పరాకాష్ట అన్నారు.మా ప్రభుత్వంలో వేసిన శిలాపలకలను ధ్వంసం చేసి కొత్తవి పెట్టి శంకుస్థాపనలు చేయడం తప్ప,పరకాలలో కొత్తగా మంజూరైన అభివృద్ధి పనులు ఒక్కటైనా లేవని స్పష్టం చేశారు.సంక్షేమ పథకాలు గల్లంతయ్యాయని,కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా రెండు నెలల పెన్షన్లు,రైతుబంధు ఎగ్గొట్టి లబ్ధిదారులు,రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు.కేసీఆర్ పాలనలో ఎక్కడా కొరత లేకుండా అందుబాటులో ఉన్న యూరియా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు లభించడం లేదో ప్రజలు ఆలోచించాలని సూచించారు.స్థానిక ఎమ్మెల్యేకు పరకాలలో అభివృద్ధి కనిపించడం లేదని వ్యాఖ్యానించడంపై స్పందిస్తూ, ప్రజల్లో తిరిగితే అభివృద్ధి ఉందో లేదో తెలుస్తుందని ఎద్దేవా చేశారు.ఒకసారి పరకాల ప్రజలను అడిగితేనే నిజం చెబుతారని అన్నారు.
రెండేళ్లుగా వంద పడకల ఆసుపత్రి,దామెర చెరువు మినీ ట్యాంక్ బండ్,ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్,డిగ్రీ కాలేజ్ ఎందుకు పూర్తికాలేదో స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దామెర చెరువులో ఉన్న బోట్ ఎటు పోయిందో కూడా ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.కాంగ్రెస్ అంటేనే స్క్యాములు,పర్సంటేజీల ప్రభుత్వం అని వ్యాఖ్యానించిన చల్లా ధర్మారెడ్డి,సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు పరిపాలనపై పట్టు పూర్తిగా తప్పిందన్నారు.ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు.మేడారంలో క్యాబినెట్ సమావేశం పెట్టినా జాతర పనులు ఇప్పటికీ పూర్తికాలేదని,అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయడం లేదని మండిపడ్డారు.ప్రజలు మళ్లీ బిఆర్ఎస్ పాలనను కోరుకుంటున్నారని,కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజలు గుర్రుగా ఉన్నారని అన్నారు.వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో పరకాల గడ్డపై గులాబీ జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు,సొసైటీ,మార్కెట్ చైర్మన్లు,డైరెక్టర్లు, కో ఆప్షన్లు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సారెస్పీ డిబిఎం 38 కెనాల్ భూముల పరిరక్షణ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై పలు ప్రశ్నలు సంధించారు. గీసుకొండ నుంచి భూపాలపల్లి జిల్లా వరకు విస్తరించి ఉన్న ఈ కెనాల్కు సంబంధించి, అధికారులు కేవలం నల్లబెల్లి గ్రామానికే పరిమితమై హద్దులు కేటాయించడం అన్యాయమని అన్నారు. కెనాల్ ప్రారంభం నుంచి చివరి వరకు కుడి ఎడమ హద్దులను శాస్త్రీయంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పట్టా భూములు కలిగిన రైతులను, ఇళ్లలో నివసిస్తున్న సామాన్యులను నోటీసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలోనే ఈ తరహా చర్యలు చేపట్టడం వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం కొంతమందిని లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. కాలువ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, పట్ట దారుల నుండి కొనుగోలు చేసిన బాధితులకు పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, నిబంధనల పేరుతో కేవలం ఒకే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీటీసీ జన్నుజయరావు, మాజీ సర్పంచ్ గుండాల కుమార స్వామి,సర్పంచ్ లు నాగెళ్ళి జ్యోతి ప్రకాష్, పులి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, వార్డు సభ్యులు పరికి కోర్నేలు , కనకం నవీన్, నాగేల్లి అనిల్, పిట్టల ప్రవీణ్, బూస లక్ష్మణ మూర్తి, మైలగని కుమార స్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేల్లి శ్రీనివాస్, సట్ల శ్రీనివాస్ గౌడ్,గోనెల నరహరి, బత్తిని బిక్షపతి,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు,హన్మకొండ జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు తెలంగాణ రైతు రక్షణ సమితి నూతన సంవత్సర క్యాలెండర్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాగూర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి రైతు రక్షణ సమితి నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు.రైతుల హక్కుల సాధన కోసం సమితి చేపడుతున్న కార్యక్రమాలు అభినంద నీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు వరికెల కిషన్ రావు హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ సలహాదారులు సుధాకర్ ఉపాధ్యక్షులు చవుల్ల రామారావు హింగే రవీందర్ కార్యదర్శి సురావు బాబురావు జిల్లా నాయకులు అంబిరి శ్రీనివాస్,నడికూడ ఎల్కతుర్తి పరకాల మండల అధ్యక్షులు వాంకే రాజు, కొక్కు తిరుపతి,లక్కర్స్ మధుకర్ కమలాపూర్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సుధాకర్, ఎల్కతుర్తి ప్రధాన కార్యదర్శి కొదటీ మాధవరావు రైతు నాయకులు లోనే సతీష్ తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా సాధన సమితి రైతు సంఘం చైర్మన్ చిట్టెంపల్లి బాలరాజ్ సంగారెడ్డి జిల్లా
జహీరాబాద్ నేటి ధాత్రి:
టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే క్యాంపస్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాగునీటి పరిస్థితులు, పంటల మద్దతు ధరలు, రైతు సంక్షేమ పథకాల అమలు తీరు తదితర అంశాలపై ఎమ్మెల్యేతో సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు అనుకూల కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని, క్షేత్రస్థాయిలో రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని చిట్టెంపల్లి బాలరాజ్ కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమమే టిఆర్ఎస్ పార్టీ ప్రధాన లక్ష్యమని, రైతుల సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ తమ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఐక్యత, శాంతి, సౌభ్రాతృత్వం పెంపొందాలని ఆకాంక్షిస్తూ ఇరువురు శుభాకాంక్షలు పంచుకున్నారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగి, జిల్లాలో రైతు సమస్యలపై సమిష్టిగా ముందుకు సాగేందుకు దోహదపడిందని నాయకులు తెలిపారు.
ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గం సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ఝరాసంగం గ్రామాలలో బి.ఆర్.ఎస్ అభ్యర్థులు వినోద బాలరాజ్ తరపున శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్, నామ రవి కిరణ్ మరియు ఝరాసంగం గ్రామ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియా గ్రామ మాజీ తాజా సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ టౌన్ ప్రెసిడెంట్ బాబా నాయకులతో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి బి ఆర్ ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్ధల గెలుపు కొరకు కృషి చేయాలని అనంతరం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చైర్మన్ మాట్లాడుతూ లియూరియా కోసం రైతుల అగచాట్లు, బోనస్ బకాయిలు, రైతు భరోసా ఎగవేత, చాలిచాలని కరెంటు, మద్దతు ధర లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. మహిళలకు 2500, వృద్ధులకు 4000, తులం బంగారం, నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు విద్యార్థులకు విద్యా బరోసా విద్యార్థినులకు స్కూటీలు ధాన్యానికి బోనస్, గ్యాస్ సబ్సిడీ వంటి హామీలు అమలు చేయకుండా ఓట్లు అడిగే నైతికత కాంగ్రెస్ పార్టీకి లేదని ఘాటుగా విమర్శించారు..
వనపర్తి డి ఎస్ ఓ పై లోకాయుక్తలో రాచాల ఫిర్యాదు వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై రాష్ట్ర లోకాయుక్తలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర చైర్మైన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. మంగళవారం బషీర్ బాగ్ లోని లోకాయుక్తకు ఫిర్యాదు చేసిన అనంతరం రాచాల యుగంధర్ గౌడ్ విలేకరుల తో మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న డి ఎస్ ఓ పై ఆధారాలతో లోకాయుక్త లో ఫిర్యాదు చేశామని రాచాల తెలిపారు. రైస్ మిల్లు కు సంబంధించి మిషన్లు మోటర్లు,ప్రభుత్వ విద్యుత్ కనెక్షన్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయించడంతో జిల్లా సివిల్ సప్లయ్ అధికారి కాశీ విశ్వనాధ్ పై ఏప్రిల్ నెలలో జిల్లా కలెక్టర్ , విజిలెన్స్ డిజి , సివిల్ సప్లయ్ కమిషనర్ కు కూడా ఫిర్యాదు చేశామని చెప్పారు. తనకు అనుకూలంగా ఉండే మిల్లర్లకు మాత్రమే డి ఎస్ ఓ ధాన్యం కేటాయిస్తూ.ప్రభుత్వ.రూల్స్ పాటిస్తున్న మిల్లులకు బియ్యం కేటాయించకుండా కక్ష చూపుతున్నారని ఆరోపించారు.
కొంత మంది అధికారుల చర్యల కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అలాంటి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని రాచాల కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నాయకులు గాలిగల్ల సాయిబాబా, చింటు తదితరులు ఉన్నారు.
విపక్షాల ఆందోళనలతో లోక్సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.
విపక్షాల ఆందోళనలతో లోక్సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్సభలోని సభ్యులు తమ ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దాంతో విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలని సూచించారు. కానీ ముందు సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నాంకు స్పీకర్ వాయిదా వేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో బాంబు పేలుళ్లు, ఎస్ఐఆర్ (SIR), రైతుల సమస్యలు, ఢిల్లీలో కాలుష్యంపై సభలో చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ముందు ప్రశ్నోత్తరాలు చేపట్టాలని.. ఆ తర్వాత చర్చకు సిద్ధమంటూ స్పీకర్ స్పష్టం చేశారు. అందుకు విపక్ష సభ్యులు సమేమీరా అనడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను మధ్యాహ్నాంకు వాయిదా వేశారు.
మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ప్రతిపక్షాలు బయటకు రాలేదంటూ ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంట్లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదని ఆమె పేర్కొన్నారు. SIRపై విమర్శకుల నోరు మూయిస్తున్నారంటూ కేంద్రంపై ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.
శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో ధాన్యం కొను గోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్య శారద గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం తరలింపులో తీరును స్వయంగా పరిశీలించారు ఇప్పటివరకు రైతుల నుంచి సేకరించిన ధాన్యం ఎంత ఇంకా ఎంత ధాన్యం సేకరిం చాల్సి ఉందని ఆరా తీశారు.
కొనుగోలు కేంద్రంలో రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలు సుకున్నారు. రైతులకు నీడగా టెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించింది వడ్ల తేమ శాతా న్ని పరిశీలించి నిబంధనల మేరకు తాలు మట్టిలేని వడ్లను వెంటనే కొనుగోలు చేయాల న్నారు వడ్ల కొనుగోలు వివ రాలు క్యాబ్ ఎంట్రీ లపై ఆరా తీశారు. ఈ విషయంపై కలెక్టర్ మండిపడ్డారు.
ధాన్యం కొను గోలు ఆలస్యం కాకూడదు రవాణా పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ వని పంట కొనుగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని తెలిపారు. కొనుగోలు చేసిన వడ్లను వెం టనే మిల్లులకు తరలించాలని ఆదేశించారు రైతులను ఇబ్బం దులను గురి చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, తాత్కాలిక మండల వ్యవ సాయ అధికారి శ్రీనివాస్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు
జగన్ హయాంలో రైతులు నష్టపోయారు.. ఎంపీ కలిశెట్టి ఫైర్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి తెలుగుదేశం పార్టీ విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (TDP Vizianagaram MP Kalisetty Appalanaidu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రైతుల కోసం చేసిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు. జగన్ పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని ధ్వజమెత్తారు. అన్నదాతలు వైసీపీ హయాంలో చాలా నష్టపోయారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో రెండు విడతలుగా ‘అన్నదాత సుఖీభవ’ నిధులు విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇవాళ(సోమవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
రైతులకు ఇప్పటికే రూ.14,000 ఇచ్చామని చెప్పుకొచ్చారు. త్వరలో మూడో విడతగా రూ.6,000 విడుదల చేస్తామని పేర్కొన్నారు. మొత్తం సంవత్సరానికి రూ.20,000 అన్నదాతలకు సహాయం చేశామని తెలిపారు. ప్రకృతి విపత్తుల్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ఫీల్డ్లోకి వచ్చి చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. రైతాంగం ఎన్డీఏ నాయకత్వానికి పూర్తిగా అనుకూలంగా ఉందని తెలిపారు. జగన్ నాంపల్లి కోర్టుకు హాజరు కావడాన్ని కూడా పూర్తిగా రాజకీయ ర్యాలీగా మార్చారని విమర్శలు చేశారు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు.
ఏపీకి పెట్టుబడులు భారీగా వస్తున్నాయని.. ఇదంతా చంద్రబాబు నాయకత్వం వల్లే సాధ్యమవుతోందని వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సమ్మిట్లో రూ.12 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ల ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని పేర్కొన్నారు. సీఎం సతీమణి నారా భువనేశ్వరి ప్రజల్లో మమేకమై వారి ప్రశంసలు అందుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ను నెంబర్ వన్ రాష్ట్రంగా చేస్తామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
దుగ్గొండి మండల వ్యవసాయ అధికారిగా నూతన బాధ్యత చేపట్టిన గాజుల శ్యామ్ మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి,ధారావత్ రాజు,కూరతోట సురేష్,అజ్మీర తిరుపతి,శంకేసి రమేష్,బండారి ప్రకాష్,డ్యాగం శివాజీ,కోలుగూరి సుమంత్ లు మర్యాదపూర్వకంగా కలిశారు.
రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం-వెలిచాల తిర్మల్ రావు
గంగాధర, నేటిధాత్రి:
తమ రాజకీయ లబ్ధి కోసం బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై పనిగట్టుకొని అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిరుమలరావు పేర్కోన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెలిచాల తిరుమలరావు మాట్లాడుతూ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న కొనుగోలు కేంద్రంలో రైతులు ఇబ్బంది పడకుండా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సహకారంతో ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను బిఆర్ఎస్ నాయకులు భూతద్దంలో పెట్టి చూపిస్తూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని దుయ్యబెట్టారు. నాటి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో రైతులు అరిగోసపడ్డ పట్టించుకున్న నాధుడే లేడని, క్వింటాలకు ఆరు కిలోల వరకు కట్ చేసి రైతులను ఇబ్బందులకు గురిచేసిన విషయాన్ని మర్చిపోలేదని గుర్తు చేశారు. కేంద్రాల్లో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారని, ఇరవై ఏళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్న నారాయణపూర్ నిర్వాసితుల ఎదురుచూపుకు తెరదించుతూ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇరవై మూడున్నర కోట్లు మంజూరు చేయించారని తెలిపారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ నారాయణపూర్ నిర్వాసితులను పట్టించుకోలేదని గుర్తు చేశారు. నారాయణపూర్ రిజర్వాయర్ పై పూర్తి అవగాహన ఉన్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిహారం మంజూరు చేశారని గుర్తు చేశారు. అబద్దాలతో కాలం గడుపుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, అభివృద్ధికి సహకరించాలని సూచించారు. ఈకార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, మాజీ ఎంపిపి రాజగోపాల్ రెడ్డి, పడితపల్లి కిషన్, మాజీ వైస్ ఎంపిపి కర్ర బాపురెడ్డి, కాంగ్రెస్ నాయకులు సాగి అజయ్ రావు, బూరుగు గంగన్న, రేండ్ల రాజిరెడ్డి, రోమాల రమేష్, వంగల శ్రీనివాస్, ముద్దం నగేష్, కనకట్ల తిరుపతి, దోమకొండ మహేష్, జితేందర్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
మూడ్ శోభన్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి
భూపాలపల్లి నేటిధాత్రి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం “2025 విత్తన చట్టం” ముసాయిదా ప్రకటించింది. ఈ ముసాయిదాపై సూచనలు, అభ్యంతరాలు, సలహాలు డిసెంబర్ 11వరకు పంపిచాల్సిందిగా కోరింది. చట్టాన్ని పరిశీలిస్తే కార్పోరేట్ సంస్థలకు రైతుల నుండి వేలకోట్ల రూపాయల దోచుకునేదుకే విడుదల చేసినట్లు స్పష్టమౌతున్నది.దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్ టేబుల్ సమావేశాలు సదస్సులు, సెమినార్ లు నిర్వహిస్తామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడ్ శోభన్ ప్రకటించారు . 2004లో నాటి కాంగ్రేస్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన ముసాయిదా చట్టానికి 2010లో, 2019లో సవరణలు చేసినప్పటికీ నేటికి ఆమోదం పొందలేదు తిరిగి 2025 విత్తన ముసాయిదా చట్టాన్ని తెచ్చారు.
ఈ ప్రతిపాదిత చట్టంలో కేంద్ర విత్తన కమిటీకి చైర్మెన్ సహా మరో 27 మందిని ఎన్నుకోవాలి. షెడ్యూల్ 1 పార్ట్ ఎ లో చూపిన నామినేట్ కమిటీలో మెజార్టీ కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న వారినే నియమిస్తారు. అలాగే సెక్షన్ 9 ప్రకారం రిజిస్ట్రేషన్ కమిటీ మరియు సబ్ కమిటీలు, సెక్షన్ 10 ప్రకారం వేసే రాష్ట్ర విత్తన కమిటీల ఎంపికలో పారదర్శకత లేదు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వారినే ఎన్నుకుంటారు. 1966 విత్తన దిగుమతి చట్టం, దాని సవరణ చట్టం 1986 తర్వాత దేశంలోను, రాష్ట్రాలలోను విత్తనోత్పత్తి పెరిగి ప్రస్తుతం అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాము. టాటా, బిర్లా, ఐటిసి లాంటి సంస్థలే కాక విదేశీ కార్పోరేట్ సంస్థలైన మన్శాంటో, బేయర్, డూ-పాయింట్, సింజెంటా, కార్గిల్ సంస్థలు విత్తన రంగంపై పూర్తి పట్టు కలిగి ఉన్నాయి. విత్తన ధరలను ఇష్టారీతిగా పెంచటం, నాణ్యత లేని విత్తనాలను, పాలినేషన్ తక్కువ ఉన్న విత్తనాలను రైతులకు అంటగట్టి లాభాలు సంపాదిస్తున్నారు. రైతుల పంటల ఉత్పాదకతను దెబ్బతీస్తున్నారు. వీటి నియంత్రణకు గత ప్రభుత్వాలు జంకి విత్తన చట్టం తేవడానికి ముందుకు రాలేదు. వాస్తవానికి విత్తన చట్టం రాజ్యాంగం రీత్యా రాష్ట్ర జాబితాలోనిది. 2017లో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని ఆమోదించకుండా కేంద్రం అడ్డుకున్నది. రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజినీకాంత్ , జిల్లా ఉపాధ్యక్షులు రాదారపు మల్లయ్య లు పాల్గొన్నారు.
లింక్ సేల్స్తో రైతులపై వ్యాపారుల పెత్తనం లింక్ సేల్స్ తో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చిన్న సన్నకారు రైతులు అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం
నేటి ధాత్రి అయినవోలు:-
ఐనవోలు మండలంలో యూరియా దందా రోజురోజుకీ భగ్గుమంటోంది. పంటలకు అత్యవసరంగా అవసరమైన యూరియాను కృత్రిమ కొరత సృష్టించి, వ్యాపారులు లింక్ సేల్స్ పేరుతో రైతులపై అన్యాయాలు పెంచుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మండలంలోని చాలా దుకాణాల్లో యూరియా కావాలంటే మరో వస్తువు కొనాల్సిందేనని డీలర్లు తెగబడుతున్నారు. “స్టాక్ లేదు”, “రేపు రండి” అనే నాటకం, గోదాముల వెనకాల దాచిన సంచులు, నల్లబజారు ధరలకు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న సేల్స్… ఇవన్నీ రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి.రైతులు ఉదయం నుంచే దుకాణాల ముందు క్యూల్లో నిలబడ్డా, చివరకు నిరాశతో వెళ్లాల్సిన పరిస్థితి. పంట దశ కీలకంగా ఉన్న ఈ సమయంలో యూరియా దొరకక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.వ్యాపారుల దందా పెరుగుతున్నా, వ్యవసాయ శాఖ, విజిలెన్స్ అధికారులు మాత్రం ఏ చర్యలు తీసుకోవడం లేదు. చర్యలు తీసుకోవడంలో అధికారుల నిర్లక్ష్యం రైతులలో మరింత ఆగ్రహం రేపుతోంది. ప్రభుత్వం ఇచ్చిన సబ్సిడీ యూరియాను కొరతగా చూపించి నల్లబజారులో అమ్మడం స్పష్టమైన దందా. వెంటనే తనిఖీలు జరగాలి. దందా ఆపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తాం” అని రైతులు హెచ్చరిస్తున్నారు.
అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో విసుగు చెందారు
ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండకడుదాం-సుంకె రవిశంకర్
కరీంనగర్, నేటిధాత్రి:
Vaibhavalaxmi Shopping Mall
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ ఎస్ సత్తా చాటాలని, ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు అందజేసి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హోటల్ లో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈసందర్బంగా చొప్పదండి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, దీనిని ఎన్నికల్లో చూపించేలా కార్యకర్తలు కలిసికట్టుగా పని చేయాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వలేకపోయిందని విమర్శించిరు.
రైతులు, మహిళా రైతులు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నారని, కొన్నిచోట్ల చెప్పులు కూడా క్యూలో పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై నిందలు వేస్తూ రేవంత్ సర్కారు కాలం వెళ్లబుచ్చుతోందని, రేవంత్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్తో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడిందని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు గొప్పగా అమలు చేసిన కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి తెచ్చేలా నాయకులు, కార్యకర్తలు శ్రమించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా 420 హామీలను, ఆరు గ్యారెంటీలను అమలు చేయలేకపోయిందని విమర్శించారు. యూరియా కోసం రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పింఛన్లు పెంచుతామన్న హామీని గాలికొదిలేశారని దు య్యబట్టారు. బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇప్పటికీ డ్రామాలాడుతోందని ధ్వజమెత్తారు.
ఈవిషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు. బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ ఎవరికీ వచ్చిన క్రమశిక్షణ గల పార్టీగా అందరు బిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని ఈసందర్బంగా కోరారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.