లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..

లయన్స్ క్లబ్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

రామడుగు, నేటిధాత్రి:

 

 

లయన్స్ క్లబ్ గోపాలరావుపేట మరియు రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రామడుగు మండల శాఖల ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. లయన్స్ క్లబ్ జండాను అధ్యక్షులు రాంపల్లి శ్రీనివాస్, రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జండాను అధ్యక్షులు కర్ర శ్యాంసుందర్ రెడ్డి ఎగరవేయడం జరిగింది. ఈకార్యక్రమంలో ముదుగంటి రాజిరెడ్డి, కర్ర రాంచంద్రారెడ్డి, కర్ర రాజిరెడ్డి, ముదుగంటి సత్యనారాయణ రెడ్డి, పాకాల మోహన్, గొడుగు అంజియాదవ్, కోట్ల మల్లేశం, చాడ దామోదర్ రెడ్డి, కర్ర ప్రభాకర్ రెడ్డి, ఎడవెల్లి రాజిరెడ్డి, ముదుగంటి చంద్రశేఖర్ రెడ్డి, దుద్దెనపెల్లి లచ్చయ్య, ముదుగంటి లక్ష్మారెడ్డి, పబ్బతి మల్లారెడ్డి, ఎడవెల్లి ముకుందరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

7వ వార్డులో యేబూషి ఆర్యన్ కౌషిక్‌కు పెరుగుతున్న మద్దతు

జమ్మికుంట మున్సిపాలిటీలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా యేబూషి ఆర్యన్ కౌషిక్:-

జమ్మికుంట, నేటిధాత్రి:-

జమ్మికుంట మున్సిపాలిటీలో 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు యేబూషి ఆర్యన్ కౌషిక్ కు ప్రజలు గణనీయంగా మద్దతు తెలుపుతున్నారు.
ఇంతకు ముందు తన తండ్రి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఎప్పుడూ ప్రజల మద్య ఉండి ప్రజలకు సేవ చెయ్యాలనే తపనను గుర్తించి తన తండ్రి మాజీ ఎంపీపీ కీ.శ. యేబూషి రామస్వామి ఆశయాలను కొనసాగించాలని తండ్రి బాటలో నే నడుస్తూ జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న యువ నాయకుడు యేబూషి ఆర్యన్ కౌషిక్ ప్రజాసేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

గత కొంతకాలంగా వార్డులోని సమస్యలను దగ్గరుండి తెలుసుకుంటూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవాభావంతో పనిచేస్తున్న వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.ప్రజా సమస్యల పరిష్కారంలో నిబద్ధత, యువతకు ఉపాధి అవకాశాలపై అవగాహన, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలపై ఆయన స్పష్టమైన దృష్టిని కలిగి ఉన్నారు. ముఖ్యంగా తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, శుభ్రత వంటి సమస్యలను ప్రథమ ప్రాధాన్యంగా తీసుకొని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.

వార్డు అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబానికి న్యాయం చేకూరాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్న ఈ యువ నాయకుడికి ప్రజలంతా తమ అమూల్యమైన మద్దతు అందించాలని స్థానికులు కోరుతున్నారు. మార్పు కావాలంటే, సేవాభావం ఉన్న నాయకుడిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

గోపాలరావుపేట గ్రామ సర్పంచిని సన్మానించిన మార్కెట్ చైర్మన్

గోపాలరావుపేట గ్రామ సర్పంచిని సన్మానించిన మార్కెట్ చైర్మన్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట మార్కేట్ కమిటీ చైర్మెన్ బోమ్మరవేణి తిరుమల తిరుపతి ఆద్వర్యంలో పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. అనంతరం నూతనంగా ఎన్నికైన గోపాలరావుపేట సర్పంచ్ ఎడవెల్లి వనజ నరేందర్ రెడ్డిని, మార్కేట్ కమిటీ డైరక్టర్ బాబు వెలిచాల వార్డ్ మెంబర్ గా గెలిపోందినందున వారి ఇరువురిని మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మరవేణి తిరుమల తిరుపతి సన్మానించారు. ఈకార్యక్రమంలో మార్కేట్ కమిటీ వైస్ చైర్మెన్ పిండి సత్యం, మార్కేట్ కమిటీ డైరక్టర్లు, తదితరులు పాల్గోన్నారు.

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం..

స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామపంచాయతీ కార్మిక సిబ్బందిగా పనిచేస్తున్న కనకం దుర్గమ్మ భర్త కుమార్ గురువారం రోజున మృతిచెందినారు. వీరిది చాలా బీద కుటుంబం దహన సంస్కారం కొరకై ఆర్థిక అత్యవసరాల కొరకు ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న గోపాలరావుపేట గ్రామానికి చెందిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు ఎనిమిది వేల ఏడు వందల నగదును అందజేశారు. ఈకార్యక్రమంలో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దాసరి కనుకయ్య, ప్రధాన కార్యదర్శి దాసరి రవిశాస్త్రి, గౌరవ అధ్యక్షులు ఒద్దుల హన్మంత రెడ్డి, అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు దాసరి అనిల్, ఉపాధ్యక్షులు సిపెల్లి తిరుపతి, మాజీ ఎంపిటిసి దాసరి అరుణ్ కుమార్, ఐదవ వార్డు సభ్యులు ఏపూరి పరుశురాంగౌడ్, మాజీ వార్డు మెంబర్స్ దాసరి బాబు, సిపెళ్లి వెంకటేష్, సేవా సంస్థ సభ్యులు ముంజ శేఖర్ గౌడ్, దాసరి శ్రీనివాస్, సీపెళ్లి చంద్రయ్య, జీపీ కార్మిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జోరుగా అక్రమ ఇసుక రవాణా

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-24T135003.120.wav?_=1

 

 

జోరుగా అక్రమ ఇసుక రవాణా

చోద్యం చూస్తూన్న అధికారులు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోతే వాగు ద్వారా అనుమతి లేకుండా సమయపాలన లేకుండా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను ఆసరాగా చేసుకొని శివారు ప్రాంతమైన గోపాలరావుపేట గ్రామంలో ఇసుక డంపులు ఏర్పాటు చేసి పక్కనే ఉన్న జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు అక్రమ ఇసుకను మినీ లారీ ద్వారా రవాణా చేస్తున్నారు. ఇసుక మాఫియాకు రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల అధికారుల నిర్లక్ష్యంతో మండలంలోని ప్రజలలో ఒకింత అసహనానికి గురవుతున్నారు. అక్రమ దందా వల్ల రైతులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు

 

 

 

 

. రామడుగు మండల మోతే వాగు పరిసర గ్రామాలైన మోతే, కొరటపల్లి, కోక్కెరకుంట, రామడుగు తదితల గ్రామాల ద్వారా ఇసుక బకాసురులు అక్రమంగా వాగులోని ఇసుకను తొలగించడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి నీటి నిలువలు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న గోపాలరావుపేట గ్రామంలో ట్రాక్టర్ల ద్వారా గ్రామ శివారు ప్రాంతాలలో గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి ఇసుక డంపింగ్ చేసి వాటిని మినీ లారీ (టిఎస్02యూడి2215) ద్వారా ఇతర జిల్లాలకు గత మూడు సంవత్సరాలకు పైగా తరలిస్తున్న విషయం స్థానిక గ్రామపంచాయతీ, పోలీస్ అధికారులకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని గ్రామ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడిన వాహనాలను రెవెన్యూ అధికారులకు అప్పగించిన తూతూ మంత్ర జరిమానాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతున్నట్లు వాగు పరిసర ప్రాంతాల్లోని రైతులు, మండలంలోని ప్రజలు అధికారులపై బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోవడం, పరిసరాల వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు ఎదురవుతున్నాయని, ఈపరిస్థితుల్లో అధికారులు ఇప్పటికీ చోద్యం చూస్తూ ఉండటం అక్రమార్కులకు లబ్ది చేకూర్చుతోందని, సమగ్ర, నిరంతర చర్యలు తీసుకోకపోతే ఇసుక మాఫియా మరింత చెలరేగే ప్రమాదం ఉందని అధికారులు ప్రత్యేకమైన, కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు, రైతులు డిమాండ్ చేస్తున్నారు. కావున ఇప్పటికైనా అధికారులు మేల్కొని పటిష్టమైన చర్యలు తీసుకొని ఇందిరమ్మ ఇంటి నిర్మాణాల కోసం అనుమతి ఇచ్చిన ట్రాక్టర్లను మాత్రమే ఆయా గ్రామాలలోకి ఇచ్చిన సమయంలోనే ఇసుక రవాణా చేయాలని, అనుమతిలేని ట్రాక్టర్లను పెట్టుకొని అట్టి వాహనాలను సీజ్ చేయడంతో పాటు ప్రకృతి సంపదన కాపాడి, అక్రమ రవాణాను అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుతున్నారు

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో మూడవ స్థానం సాధించిన అక్షర హై స్కూల్ విద్యార్థిని.

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-24T133353.022.wav?_=2

 

 

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయిలో మూడవ స్థానం సాధించిన అక్షర హై స్కూల్ విద్యార్థిని

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

ఇటీవల మధ్యప్రదేశ్ రాష్టం ఇండోర్ లో డిసెంబర్ 14 నుండి 19వ తేదీ వరకు జరిగిన 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ కరాటే విభాగములో కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన అక్షర హై స్కూల్ విద్యార్థిని తూడి అక్షర జాతీయస్థాయిలో తెలంగాణ నుండి మూడవ స్థానం సాధించింది. ఈసందర్భంగా తూడి అక్షరను కరీంనగర్ సిపి గౌస్ ఆలం అభినందించారు. వరసగా రెండు సార్లు ఎస్జిఎఫ్ గేమ్స్ లో జాతీయస్థాయికి ఎంపిక కావడం విశేషం. ఈకార్యక్రమంలో కరస్పాండెంట్ మినుకుల మునీందర్, కరాటే మాస్టర్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

చెరువు శిఖం భూములను సంరక్షించాలి.

#కబ్జా చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.

#చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలి.

#కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

మండల కేంద్రంలోని రేవులకుంట, వెంకటపాలెం చెరువు భూమిని కొందరు వ్యక్తులు అక్రమంగా కబ్జా చేస్తున్నారని కాంగ్రెస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు బత్తిని మహేష్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మండల తహసిల్దార్ కార్యాలయంలో ఆర్ఐ సంపత్ కు వినతిపత్రం అందించారు. అనంతరం మహేష్ మాట్లాడుతూ మండల కేంద్రానికి చెందిన కొందరు రాజకీయ నాయకులు వారి స్వలాభం కోసం చెరువు శిఖం భూములను సైతం ఆక్రమించుకొని వ్యవసాయం చేస్తున్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి చెరువుల శిఖం భూములను సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని. అదేవిధంగా శిఖం భూములను కబ్జా చేసి ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ మాసంపల్లి అఖిల్, పరికిత్యారాజు, బూస కుమారస్వామి, వైనాల జంపయ్య, మేకల మోహన్, కోల లింగయ్య, తదితరులు పాల్గొన్నారు.

రోడ్డెక్కిన రేకూర్తి ప్రజలు..

రోడ్డెక్కిన రేకూర్తి ప్రజలు

మాభూముల యొక్క రిజిస్ట్రేషన్లు కొనసాగించాలి -రేకుర్తి గ్రామ ప్రజలు

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రేకుర్తి శివారులోని భూములకు సంబంధించిన సర్వేనెంబర్లు 1 నుండి 230 వరకు ఉన్న భూముల్లో కలేక్టర్ ఆదేశాల మేరకు దాదాపు గత ఆరు నెలల నుండి రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం జరిగింది. రేకుర్తి రెవెన్యూ గ్రామానికి సంబoదించిన భూములను సెక్షన్ 22ఏలో నుండి తొలగించి రిజిస్ట్రేషన్ చేయాలని, కలెక్టర్ ను తప్పు ద్రోవ పట్టిస్తున్న క్రింది స్థాయి అధికారులను సస్పెండ్ చేయాలని, రేకుర్తి భూములు ఇన్ని రోజులు రిజిస్ట్రేషన్ మరియు మొటేషన్ అయ్యిన వాటిని ఇప్పుడు నిలిపివేయడంలో ఆంతర్యం ఏమిటని, కలెక్టర్ తహసీల్దార్ ను విచారణ చేసి నివేదికను ఇవ్వాలని అడిగిన కానీ ఇంత వరకు మోకా మీదకు వెళ్లి ఎలాంటి విచారణ చెప్పంటని తహసీల్దార్ అంటూ సంబంధిత భూబాధితులు రోడ్డుపై నిరసన చేయడం జరిగింది. ఈసందర్భంగా సంబంధిత భూయజమానులు గ్రామానికి సంబంధించిన భూముల రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వలన గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఇట్టి భూములలో ఇప్పటికే గ్రామ ప్రజలు గ్రామ పంచాయితీ మరియు పురపాలక సంఘం అనుమతులతో ఎనభై శాతం ఇండ్లు నిర్మించుకొని నివసించుచున్నామని, ఇట్టి ఇండ్లకు ఇంటి పన్ను మరియు అన్ని రకాల పన్నులు, గృహ రుణాలు కొన్ని సంవత్సరాల నుండి చెల్లించుచున్నామని, ఇంతకు ముందు కలెక్టర్ ఆదేశాలకు పూర్వము ఇట్టి భూములు అన్ని కరీంనగర్ మరియు గంగాధర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు కాబడి అన్నింటిని అప్పటి ఎమ్మార్వో మరియు ఆర్డీవోలు వారి పేర్లమీద రెవెన్యూ రికార్డులలో జమాబంధి చేయడం జరిగిందని, అకస్మాత్తుగా రిజిస్ట్రేషన్లు ఆగిపోవడం వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నామని, భూములు అమ్ముకోలేక చాలా వివాహలు ఆగిపోయాయని, ఇంకా ఇలాగే కొనసాగేతే చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం పొంచి ఉందని కలెక్టర్కు అందజేసిన వినతి పత్రంలో పేర్కొన్నామని, ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకొని అట్టి సర్వే నంబర్లలో సంబంధిత అధికారులతో విచారణ జరిపి రిజిస్ట్రేషన్లు కొనసాగేలా చేయాలని రేకుర్తి గ్రామ ప్రజలు అధికారులను పత్రికా ముఖముగా కోరుతున్నారు.

మృతుడి కుటుంబానికి పరామర్శ…

మృతుడి కుటుంబానికి పరామర్శ

ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి

వీణవంక,(కరీంనగర్ జిల్లా):

నేటి ధాత్రి:

వీణవంక మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన శనిగరం మల్లయ్య 70 సం శుక్రవారం రోజున రాత్రి మృతి చెందగా, మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి మృతికి గల కారణాలు తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగడ సానుభూతి తెలియజేశారు. మృతుడి అంత్యక్రియల నిమిత్తం 5000/- ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పల్లెర్ల కిరణ్ గుప్తా,దూలం సమ్మయ్య గౌడ్, అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వ్యవస్థాపక అధ్యక్షులు గోనెల సమ్మన్న ముదిరాజ్ , కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల సమ్మయ్య, మోరెచంద్రయ్య తదితరులు ఉన్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి…

గుర్తు తెలియని వ్యక్తి మృతి

జమ్మికుంట, నేటి ధాత్రి:

ఉప్పల్ -జమ్మికుంట రైల్వే స్టేషన్ల మధ్య భీంపల్లి గ్రామ సమీపంలో రైలు పట్టాల ప్రక్కన సిమెంట్ కాలువలో గుర్తు తెలియని వ్యక్తి వయస్సు సుమారు 30-35 సంవత్సరాలు బహుశా ఎదో రైలు బండి నుండీ క్రింద పడగ చనిపోయి ఉంటాడు. మృతుడు నవీ బ్లూ ఫుల్ టీ షర్ట్, నవీ బ్లూ లోయర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు మృతుని వద్ద ఏపీఎస్ ఆర్టిసి బస్సు టికెట్ గుడివాడ నుండి విజయవాడ కలదు. అతని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు గాని వస్తువులు గాని లేవు. శవాన్ని ప్రభుత్వ హాస్పిటల్ జమ్మికుంట మార్చరీ లో భద్రపర్చానైనది. ఇట్టి కేసును జి. తిరుపతి ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ రామగుండం పరిశోదన చేయుచున్నాను ఏమైనా వివరాలు తెలిసినచో ఫోన్ నెంబర్ 9949304574, 8712658604 కి సమాచారం ఇవ్వగలరని కోరారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు…

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ నాయకులు

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల కేంద్రంకి చెందిన బూత్ అధ్యక్షులు ఉత్తేం కనకరాజ్ తాత మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ యాదవ్, మండల అధ్యక్షులు మోడీ రవీందర్. ఈకార్యక్రమంలో వీరితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు బండ తిరుపతిరెడ్డి, మండల జనరల్ సెక్రటరీలు పురేళ్ల శ్రీకాంత్ గౌడ్, పోచంపల్లి నరేశ్, మండల ఉపాధ్యక్షులు వేముండ్ల కుమార్, మండల కార్యదర్శి గుంట అశోక్, దళిత మోర్చా అధ్యక్షులు సంటి జితేందర్, ఐటీ సెల్ మండల్ కన్వీనర్ మాడిశెట్టి జయంత్, బీజేయం ప్రధాన కార్యదర్శి దయ్యాల రాజుకుమార్, సీనియర్ నాయకులు అక్షయ్, తదితరులు పాల్గొన్నారు.

రామడుగు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-25T135534.081.wav?_=3

 

రామడుగు పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్ కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రామడుగు ఏఎస్ఐ మనోజ్ కుమార్, మధుసూదన్ పాల్గొని మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని, ప్రతి విద్యార్థి మంచి నడవడికతో చదువుకుంటూ ఉన్నత లక్ష్యంతో పట్టుదలతో ముందుకు సాగుతూ అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల కలలు నెరవేరుస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ యొక్క ఫంక్షనింగ్, డయల్ 100, షీటీమ్స్, భరోసా, సైబర్ అవేర్నెస్, యాంటీ డ్రగ్ అవేర్నెస్, వంటి వివిధ నేర సంబంధిత అంశాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో రామడుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది, అక్షర హై స్కూల్ విద్యార్ధిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే…

విద్యార్థులు అభినందించిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం, నేటిదాత్రి

 

 

69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్-17 చెస్ టోర్నమెంట్ గురువారం జగిత్యాల లో జరిగిన ఇట్టి టోర్నమెంట్ లో జగిత్యాల జిల్లా నుండి పాల్గొన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెల్లుల్ల కు చెందిన పదవ తరగతి విద్యార్థి బబ్బిలి అక్షయ్’గెలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికయినట్లు ప్రధానోపాధ్యాయులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ సందర్బంగా గౌరవ కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల సంజయ్ విద్యార్థిని అభినందించి, శాలువతో సన్మానించారు.

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం…

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలి

ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దు-ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలం హిమ్మత్ నగర్, గట్టుభూత్కుర్, చిన్న అచంపల్లి, పెద్ద అచంపల్లి, గర్షకుర్తి, తాడిజెర్రి, రంగారావుపల్లి, ఉప్పరమల్యాల, కురిక్యాల, మల్లాపూర్, వెంకంపల్లి, మధురానగర్ గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యం అమ్మి మద్దతు ధర పొందాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా చొప్పదండి ఎమ్మెల్యే సత్యం మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, రైతుల కోసం నీడ ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రాలకు రైతుల వివరాలను నమోదు చేసుకొని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని సూచించారు. ప్రతిపక్షాల మాటలు నమ్మి రైతులు ఆందోళనకు గురి కావద్దని, సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. ఈకార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, తహశీల్దార్ అంబటి రజిత, ఎంపిడిఓ రామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య, రామిడి రాజిరెడ్డి, సాగి అజయ్ రావు, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, రోమాల రమేష్, పడితపల్లి కిషన్, చక్రపాణి, శ్రీనివాస్, లక్ష్మణ్, హన్మంత రెడ్డి, మహేష్, ఆనంద్, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో చొప్పదండి నియోజకవర్గం డిగ్రీ కళాశాల మంజూరు

గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో చాలామంది పేద విద్యార్థులు చదువును ఇంటర్మీడియట్ తోనే ఆపేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్న సదుద్దేశంతో మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈసమస్య తీసుకువెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T130127.741.wav?_=4

 

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన సుంకె రవి శంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన పాకాల ప్రశాంత్ రెండు రోజుల క్రితం చనిపోయిన విషయం తెలుసుకున్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవిశంకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు తడగొండ సత్యరాజ్ వర్మ, బక్కశెట్టి నర్సయ్య, నాయకులు నర్సింబాబు, బక్కశెట్టి శ్రీనివాస్, అజయ్, రాజు, ఖాసీం షరీఫ్, త్రినాథ్ వర్మ, పాదం తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T125631.338.wav?_=5

 

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్

రామడుగు, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో దుబాయ్ లో మరణించిన ఎలగందుల ప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన చొప్పదండి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్. గత కొద్దిరోజుల క్రితం మరణించిన ప్రకాష్ మృతదేహాన్ని అక్కడి ఎన్నారై సభ్యుల సహకారంతో ఇండియాకు రప్పించి వారికి ఇద్దరు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారని తెలుసుకొని పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి పిల్లల చదువుల ఫీజులు మాఫీ చేయాలని కోరగా, యాజమాన్యం సానుకూలంగా స్పందించారు. ఈసందర్భంగా కుటుంబ సభ్యులు రవిశంకర్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో పూడూరు మల్లేశం, ఎడవల్లి పాపిరెడ్డి, వేల్పుల హరికృష్ణ, దాసరి అరుణ్ కుమార్, సుద్దాల మల్లేశం, రేణికుంట బసంతం రేణిగుంట అశోక్, దాసరి అనిల్, వేల్పుల రవి, రేణికుంట శ్రావణ్, రేణిగుంట రవి, రేణిగుంట ఆనంద్, దాసరి శంకర్, రేణిగుంట హరీష్, లింగంపల్లి రవి, దాసరి శ్రీనివాస్, దాసరి శేఖర్, దాసరి శ్రీనివాస్, దాసరి రవీందర్, పురాణం రమేష్, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వాలీబాల్‌కు గంగాధర విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు గంగాధర విద్యార్థి ఎంపిక

గంగాధర, నేటిధాత్రి:

Vaibhavalaxmi Shopping Mall

కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి మంచి కట్ల నందకిషోర్ ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ బాబు శ్రీనివాస్ తెలిపారు.
ఈరాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఈనెల16 నుండి 18 వరకు సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరులో జరుగుతాయని, సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో జరిగిన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్17 బాలుర జట్టులో నందకిషోర్ అత్యంత ప్రతిభ కనబరిచి బాలుర ఉమ్మడి కరీంనగర్ జిల్లా జట్టుకు ఎంపికైయ్యాడని తెలిపారు. ఈసందర్భంగా విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.అనిత కుమారి, ఎంపీడీవో డి.రాము, ఎంఈఓ ఏనుగు ప్రభాకర్ రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు అభినందించారు.

పాపయ్య గారికి నివాళులర్పించిన నల్లాల ఓదెలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-68.wav?_=6

పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి ప్రగాఢ సానుభూతి తెలిపిన నల్లాల ఓదెలు

మందమర్రి నేటి ధాత్రి

*మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ తండ్రి పాపయ్య కి నివాళులు అర్పించిన మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

మందమర్రి ఏరియా టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ మేడిపల్లి సంపత్ గారి తండ్రి మేడిపల్లి పాపయ్య స్వర్గస్తులవగా విషయం తెలుసుకొని కరీంనగర్ జిల్లా, జమ్మికుంట మండలం, రామన్నపల్లి గ్రామంలోని వారి స్వగృహం నందు పాపయ్య గారి పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన *మాజీ విప్, మాజీ చెన్నూరు శాసనసభ్యులు నల్లాల ఓదెలు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version