పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు…

పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు చర్యలు

సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి

జైపూర్,నేటి ధాత్రి:

 

జైపూర్ మండలం గంగిపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి నేతృత్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు ప్రారంభించినట్లు తెలిపారు.మంగళవారం గ్రామంలోని 270 పశువులకు పశు వైద్యులు టీకాలు వేశారు.ఈ సందర్భంగా పశు వైద్యులు వెంకటేష్ మాట్లాడుతూ.. పశువులలో నోటి,కాళ్లలో పుండ్లు,జ్వరం,మేత తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయని ఇది అంటూ వ్యాధి పాల ఉత్పత్తి కూడా 50% వరకు తగ్గుతుందని అన్నారు.పశువుల వ్యాధి నివారణ కొరకు ప్రభుత్వం సంవత్సరానికి రెండుసార్లు అంటే 6 నెలలకు ఒకసారి టీకాలు వేస్తుందని తెలిపారు.నాలుగు నెలల పైబడిన పశువులకు టీకాలు వేపించాలని,టీకాలు వేపించడం వల్ల పశువుల ఆరోగ్యం మెరుగుపడి పాల ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుందిళ్ల రాజేశ్వరి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ,పశు వైద్యులు వెంకటేష్,సిబ్బంది శృతి, మహబూబ్ అలీ,ప్రభాకర్, రైతులు సుందిళ్ల లచ్చయ్య, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

వ్యాధి నివారణ కార్యక్రమములో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్…

వ్యాధి నివారణ కార్యక్రమములో పాల్గొన్న అడిషనల్ కలెక్టర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కంబాలపల్లి లో పశువుల గాలి కుంటూ వ్యాధి నివారణ కార్యక్రమములో పాల్గొన్న ఝరాసంగం మండల పెద్దలు, నాయకులు ఇట్టి కార్యక్రమనికి సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్య అతిధి గా హాజరయ్యరు.ఇట్టి కార్యక్రమములో ఝరాసంగం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హనుమంతరావు పాటిల్, ఆలయ చైర్మన్ శేఖర్ పాటిల్,సీనియర్ నాయకులు సంగ్రామ్ పాటిల్, మారుతీరావు పాటిల్, వేణుగోపాల్ రెడ్డి,కొల్లూరు గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డప్పూరు సంగమేష్, వనంపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నవీన్ పాటిల్, యూత్ కాంగ్రెస్ ఝరాసంగం మండల ప్రధాన కార్యదర్శి చింతలగట్టు శివరాజ్, వినయ్ చిన్న,పాండు ముధిరాజ్,తెలంగాణ వాణి రిపోర్టర్ నాగన్న,బ్యాంక్ మిత్ర సంజీవ్,పశువులు వైద్యులు జెడి , మరియు మండల సిబ్బంది,డాక్టర్ జాన్ శ్రీకాంత్,మరియు గ్రామప్రజలు రైతులు పాలుగొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version