శ్రీ లక్ష్మీ పూజ కార్యక్రమలలో పాల్గొన్న ఎమ్మెల్యే చైర్మన్…

శ్రీ లక్ష్మీ పూజ కార్యక్రమలలో పాల్గొన్న ఎమ్మెల్యే చైర్మన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

దీపావళి పండగ సందర్భంగా పట్టణంలోని ప్రముఖల ఆహ్వానాలకు మేరకు శ్రీ లక్ష్మీ పూజ కార్యక్రమలలో పాల్గొన్న శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాజి మార్కెట్ చైర్మన్ రామకృష్ణ రెడ్డి
మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్ పెంటా రెడ్డి జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం మాజి మున్సిపల్ చైర్మన్ తంజిం
పాక్స్ చైర్మన్ మచ్చెందర్ మాజి కేతకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నరసింహ గౌడ్ నాయకులు ప్రభు పటేల్,నర్సింలు మిథున్ రాజ్ ఫయాజ్ తదితరులు.

సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతదే..

సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతదే

ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రమణారావు

భూపాలపల్లి నేటిధాత్రి

 

అత్యంత ప్రాచీనమైన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత నేటి యువతపై ఉంటుందని భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రమణారావు అన్నారు భారత అడవుల, పర్యావరణ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ గ్రీన్ కార్ప్స్ వారి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన క్యాంపస్ ఎకో బజార్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్
ఏ రమణారావు
హాజరైనారు అనంతరం మాట్లాడుతూ నేటి అనిశ్చిత వాతావరణం దృష్ట్యా పర్యావరణ రహిత, భారత సాంప్రదాయ ఉత్పత్తులతో దీపావళి పండుగను సమాజ హితం దృష్టిలో ఉంచుకొని నిర్వహించుకోవాలని సూచించారు. ప్రకృతి హితమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని సూచించారు. అంతకుముందు కళాశాల విద్యార్థులు ఏర్పాటుచేసిన స్టాల్స్ ను సందర్శించారు. హస్తకళలు, చేతివృత్తులు, పేపర్ బ్యాగ్స్,గాజులు,మట్టి దీప ప్రమిదలు, తృణధాన్యాలతో చేసిన పిండి వంటకాలు, జావా చెత్తను వేరు చేయు విధానం, వివరించే స్టాల్స్ సందేశకులందరినీ ఆకట్టుకున్నాయని విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రుక్షాన మహమ్మద్, చంద్రకళ, కవిత, కాత్య, కుమారస్వామి, ఆర్ శ్రీధర్, టీ శ్రీధర్, హైమావతి, రామచందర్, దేవేందర్, శ్రీనివాస్, వరలక్ష్మి, సమీరా, హనుము, శిరీష, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికెట్ ప్రధానం చేశారు.

ఇంట్లోని ఈ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే.. ప్రతికూల శక్తులు పరార్…

ఇంట్లోని ఈ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే.. ప్రతికూల శక్తులు పరార్.!

 

ఈ దీపావళికి మీ ఇంట్లో దీపాలు ఎక్కడ వెలిగించాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? దీపావళి నాడు లక్ష్మీ పూజతో పాటు దీపాలు వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోతుంది. సానుకూలత ఆకర్షిస్తుంది. కాబట్టి, ఇంట్లో ఏ ప్రదేశాల్లో దీపం వెలిగిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం..

 ఈ దీపావళికి ఇంట్లో దీపాలు ఎక్కడ వెలిగించడం మంచిదో మీకు తెలుసా? ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న జరుపుకుంటారు. దీపావళి రోజున లక్ష్మీ దేవిని పూజించడంతో పాటు, దీపాలు వెలిగించడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున దీపాలు వెలిగించడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి వస్తుందని నమ్ముతారు. కాబట్టి, దీపావళి రోజున ఇంట్లో ఏ ప్రదేశాలలో దీపాలు వెలిగించడం శుభప్రదమో తెలుసుకుందాం..

దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి

దీపావళి సీజన్‌లో ఆన్‌లైన్ మోసాల నుండి జాగ్రత్త…!

మోసపోకుండా జాగ్రత్త…!
అవగాహనే రక్షణ…!

జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఐపీఎస్

మహబూబాబాద్/ నేటి దాత్రి

దీపావళి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ లింకులు అంటూ సోషల్ మీడియా, మెసేజ్‌లు, ఈమెయిల్‌లు, వెబ్‌సైట్ల ద్వారా ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని. సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్‌సైట్లు సృష్టించి, బ్యాంక్ వివరాలు, ఓటిపి లు, యూపీఐ పిన్‌లు తీసుకొని ఖాతాల్లోని డబ్బులను దోచుకుంటున్నారని అన్నారు.

హెచ్చరిక: అక్టోబర్ 1 నుండి ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 390 మంది మోసపోయి రూ. 8.5 లక్షల వరకు నష్టం కలిగిందని తెలిపారు.

సైబర్ మోసగాళ్ల విధానం:

నకిలీ షాపింగ్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనల ద్వారా ప్రజలను ఆకర్షించడం.

వాట్సాప్, ఎస్ ఎం ఎస్, టెలిగ్రామ్ ద్వారా ఫిషింగ్ లింకులు పంపడం.

యాప్ డౌన్‌లోడ్ చేయమని చెప్పి బ్యాంక్ వివరాలు సేకరించడం.

గూగుల్‌లో నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు చూపించడం జరుగుతుందని గుర్తు చేశారు.

జిల్లా ప్రజలకు సూచనలు:

ధృవీకరించిన వెబ్‌సైట్లు మరియు అధికారిక యాప్స్ ద్వారానే కొనుగోలు చేసుకోవాలని సూచించారు.

టెలిగ్రామ్ లేదా ఇతర లింక్‌ల ద్వారా ఏపీకె ఫైల్స్ డౌన్‌లోడ్ చేయ వద్దని తెలిపారు.

ఎవరికీ బ్యాంక్ వివరాలు, ఓటిపి లు యూపీఐ పిన్‌లు పంచుకోవద్దని తెలిపారు.

ముందుగానే చెల్లింపులు చేయకుండా, “ క్యాష్ ఆన్ డెలివరీ” సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు..

ఎలాంటి మోసాలు జరిగిన వెంటనే 1930 నంబరుకు కాల్ చేయండి లేదా వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండని సూచించారు.
మోసపోకుండా జాగ్రత్త అవగాహనే రక్షణ.”

దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..

దీపావళి వేళ బ్లింకిట్‌లో బంగారం.. ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లోనే డెలివరీ..

 

దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది.

 భారత దేశంలోని అన్ని రాష్ట్రాల్లో దీపావళి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పండుగకు ముందు రోజున ఇంటికి శుభ్రం చేసి కొత్త రంగులతో ఇంటిని శోభాయమానంగా తీర్చిదిద్దుతారు. పండుగ రోజున మామిడితోరణాలు, ముద్దబంతి పూలతోఇంటి గుమ్మాలను చక్కగా అలంకరించి పండుగను జరుపుకుంటారు. ఆరోజున బంధువులు అందరూ ఒక్కచోటికి చేరుకుని.. మధుర పదార్థాలు వండి దేవతారాధన చేసి నివేదన చేస్తారు. ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలగాలని శ్రీ మహాలక్ష్మి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించి ఆ తర్వాత దానినే ప్రసాదంగా స్వీకరిస్తారు. సాయంత్రం పూట ఇంటికి అంతటా కూడా దీపాలు వెలిగింది లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తారు. శైవ, వైష్ణవ క్షేత్రాల్లో పూజలు నిర్వహిస్తారు.
ఇక దీపావళి పర్వదిన రోజున శుభ ముహూర్త సమయం కావున ప్రజలు ఎంతో నమ్మకంగా బంగారం కొనుగోలు చేస్తారు. కనీసం తమకు ఉన్నంతలో డబ్బులు సమకూర్చుకొని పుత్తడి కొనుగోలు చేస్తారు. దీంతో దేశ వ్యాప్తంగా బంగారం షాపులకు బలే గిరాకీ ఉంటుంది. ఫుడ్ డెలివరీ, గ్రోసరీస్ డెలివరీ చేస్తున్నట్టుగానే.. బంగారం కూడా ఈ పండుగ నుంచి డెలివరీ చేయాలని ఈ కామర్స్ బిజినెస్ సంస్థలు ఆలోచనలో పడ్డాయి. అనుకున్నదే తడవుగా బంగారం కొనుగోలు చేసే తమ యూజర్ల కోసం వినూత్న ఆలోచనతో ఓ ఈ కామర్స్ బిజిజెస్ సంస్థ ముందుకు వచ్చింది.

దీపావళి, ధంతేరస్ (ధన త్రయోదశి) సందర్భంగా బంగారం, సిల్వర్‌ను తమ యూజర్లకు అందించేందుకు బ్లింకిట్‌తో MMTC-PAMP, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో పుత్తడి, వెండి ఉత్పత్తులను 10 నిమిషాలలో తమ యూజర్లకు డెలివరీ చేయడాన్ని బ్లింకిట్ ప్రారంభించింది. శ్రీ మహాలక్ష్మీ అమ్మవారు ఉన్న సింబల్‌ను బంగారు నాణేలపై ముద్రించి అమ్మకానికి పెట్టింది. యూజర్లు బ్లింకిట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఆర్డర్ చేసుకుంటే మీ ఇంటికే లక్ష్మీ దేవి వస్తుంది. GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (0.5గ్రాములు) ధర రూ.6.999.. అలాగే GRT జువెల్లర్స్ లక్ష్మీ గోల్డ్ కాయిన్ (1 గ్రాములు) ధర రూ.13,949గా నిర్ణయించారు.

దాతల చేయూత అభినందనీయం…

దాతల చేయూత అభినందనీయం

•చేవెళ్ల మండల విద్యాధికారి పురందాస్

చేవెళ్ల, నేటిధాత్రి :

 

 

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు చేయూతనివ్వడం అభినందనీయమని చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్. పురందాస్ అన్నారు. ప్రాథమికోన్నత పాఠశాల ఎన్కెపల్లిలో దీపావళి పండుగను పురస్కరించుకుని ఇదే పాఠశాలలోఉపాధ్యాయులుగా పనిచేస్తున్న జి. కమల మనోహర్ బాబు దంపతులు శుక్రవారం మండల విద్యాధికారి ఎల్.పురన్ దాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి మునీర్ పాషా చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాధికారి పురందాస్ మాట్లాడుతూ దాతలు పేద విద్యార్థులకు ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్నత పదవులు సాధించినప్పుడు ఇదే తరహాలో పేదవారికి సహాయం చేయాలని అన్నారు. ధనం చాలామంది దగ్గర ఉన్నప్పటికీ దానగుణం కొందరిలోనే ఉంటుందని,అలాంటి వారిలో కమల టీచర్ దంపతులు ఒకరని అభినదించారు. వారు చేసిన మంచి ఎప్పటికీ వారి వెంట ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా దాత మనోహర్ బాబు మాట్లాడుతూ భగవంతుడు తనకిచ్చిన దానిలో కొంత విద్యార్థులతో పంచుకుంటున్నాను అని అన్నారు. పేద విద్యార్థులకు సహకారం అందించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. తదుపరి పాఠశాల పక్షాన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయ బృందం కలసి దాతను విద్యాధికారి సమక్షంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రెటరీ రేణు అంగన్వాడి కార్యకర్త స్వరూప ,ఆశ కార్యకర్త సుజాత విద్యార్థులు పాల్గొన్నారు.

కైలాస గుట్ట మీది సమస్యల గురించి మున్సిపల్ అధికారికి వినతి పత్రం….

కైలాస గుట్ట మీది సమస్యల గురించి మున్సిపల్ అధికారికి వినతి పత్రం.

కల్వకుర్తి/ నేటి దాత్రి:

 

 

 

కల్వకుర్తి పట్టణంలోని కైలాసం గుట్టపైన ఈ మధ్యకాలంలో భారీ వర్షాలు సంభవించడం వలన ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సమస్యలను మునిసిపల్ అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అందులో భాగంగా కరెంటు వైర్లు, కరెంట్ స్తంభాలు దెబ్బతినడం కరెంటు సప్లై రావడం లేదు.రానున్న పది రోజులలో బతుకమ్మ పండుగ, దసరా ఉత్సవాలు, దీపావళి కార్తీక మాసం పండుగలు ప్రారంభమవుతున్నాయి కావున భక్తుల ప్రయోజనాల సౌకర్యాల కొరకు కరెంటు వైర్లు, బల్బులను ఏర్పాటు చేయాలని కోరుచున్నాము.ప్రతి పండుగకు మున్సిపల్ వారికి చెప్పడం వారు వచ్చి తాత్కాలిక వైరింగ్ చేయడం మళ్లీ కొద్ది రోజుల తర్వాత యధావిధిగా పాడైపోతున్నాయి. అలా కాకుండా పర్మినెంట్ ఐమాక్స్ లైట్ ఏర్పాటు చేయగలరు స్తంభాలకు లైట్లు, వైరింగ్ చేయించగలరని కోరుతూ కల్వకుర్తి మున్సిపల్ గారికి వినతి పత్రం అందజేశారు . ఈ కార్యక్రమంలో దయాకర్,పురం మహేశ్వర్ రెడ్డి,
కుడుముల శేఖర్ రెడ్డి,గార్లపాటి, ప్రదీప్ కుమార్,బృంగి వివేకానంద,
ఉప్పరిపల్లి ప్రవీణ్ రెడ్డి,వాగులదాస్ నరేశ్ గౌడ్,కాగుల శ్రీశైలం యాదవ్,
దేవర్ల ఆంజనేయులు,చెందు ముదిరాజ్, రఘు యాదవ్,దేవర్ల వెంకటనారాయణ,రానదీర్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version