ధ్రువపత్రాలు కలిగి ఉండాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-18T160647.475.wav?_=1

 

ధ్రువపత్రాలు కలిగి ఉండాలి

నిజాంపేట: నేటి ధాత్రి

ద్విచక్ర వాహనదారులు ధ్రువపత్రాలు, హెల్మెట్ కలిగి ఉండాలని పోలీసుల సూచించారు. నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక ఎస్సై రాజేష్ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లైసెన్స్, ఆర్ సి, ఇన్సూరెన్స్ పత్రాలు కలిగి ఉండాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పరుశురాం గౌడ్, మురళీధర్, కానిస్టేబుల్ అశోక్ ఉన్నారు.

వీవోఏల సమస్యల పరిష్కరించాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-28T124143.836.wav?_=2

 

 

వీవోఏల సమస్యల పరిష్కరించాలి

◆:- సైర్ఫ ఉద్యోగాలుగా గుర్తించి కనీస వేతనం రూ.18వేలకు పెంచాలి

◆:- వివో ఏల అధ్యక్షురాలు. తెలుగు హర్షిత. డిమాండ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల కేంద్రమైన ఐకేపీ వీవోఏలు గత 18 సంవత్సరాల నుండి పనిచేసుతున్నా ఝరాసంగం మండలంలో 38 మంది వీవోఏ లు ఉన్నారు. వెలగుగ్రామఖ్య సంగం లో పనిచేస్తున్న విఓఏలు అన్ని రకాల పైన పనులు 1 లైవ్ మీటింగ్ చేయడం. 2. ఉల్లాస్ యాప్.3 లోకాస్ యాప్. ఆన్లైన్ దావరా పనిఉత్తిడి. మహిళా సంఘాలకు బ్యాంక్ లీకేజ్ టార్గెట్ ఇప్పించడం గ్రామ సంఘం అప్పులు వసూలు చేయడం శ్రీనిధి లోన్ ఇప్పించ డం. శ్రీనిధి అప్పులు రికవరీ 100% చేయడం. పీఎంఫమ్.యూనిట్. లోన్ భీమ చేయడం మహిళ లకు సంఘాలను చేర్పించడం. వృద్ధదు సంఘాలు. కిశోర బాలికల సంఘాలు వికలాంగుల సంఘాలు చేయడం 18 నుఁడి 59 సంవత్సరం లోపు ఉన్న మహిళలను గుర్తించి సంఘాలలో చేర్పించడం .అన్ లై న్ పని ఒత్తిడి. లైవ్ మీటింగ్ ప్రభుత్వం చేపట్టి కార్యక్రమాలు. మహిళలను కోటీశ్వరులు. చేయడం. పని భారం తగ్గించడం. వివోఏ లకు కనీస

వేతనం చేయాలి.

డిమాండ్ :

1. కనీస వేతనం అమలు చేయాలి

2 వీవోఏ గ్రేడింగ్ విధానం రద్దు చేయాలి.

3 వీవోఏ ఖాతాకు వేతనం వేయాలి

4 ప్రమాద ఇన్సూరెన్స్ అమలుచేయాలి

5 గ్రామ సంఘానికి నెట్ సౌకర్యం కల్పించాలి

6 శ్రీనిధి ఇన్సెంటివ్ ఇవ్వాలి

7 బ్యాంకు లీకేజ్ టార్గెట్ తొలగించాలి

8 గ్రేడింగ్ విధానం తొలగించాలి

9 వివోఏ ఖాతాలో ప్రతినెల వేతనం చెల్లించాలి

10 సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించాలి.

వివో ఏ అధ్యక్షురాలు తెలుగు హర్షిత, ఉపాధ్యక్షురాలు సంధ్యారాణి, కార్యదర్శి అనిత, కోశాధికారి చిన్ని .సలహాదారులు రాజు పటేల్. ఉప సలహాదారులు సిరాజోద్దీన్, యూనియన్ సభ్యులు ఖాజా మియా, సిదప్ప, సూర్ రెడ్డి, రాములు, విజయ్ కుమార్, నర్సింలు ,పద్మారాణి, బేబీ, మరియమ్మ, ఫారిన బేగం, వివో వేలు తదితరులు పాల్గొనడం జరిగింది.

నిజాంపేట లో ఆటో ర్యాలీ..

నిజాంపేట లో ఆటో ర్యాలీ..
డ్రైవర్లకు అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

 

పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నిజాంపేటలో ఎస్సై రాజేష్ ఆధ్వర్యంలో ఆటో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సమావేశానికి రామాయంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరాజ గౌడ్ హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లు రోడ్డు భద్రత నియమాలను పాటించాలన్నారు. లైసెన్స్, ఇన్సూరెన్స్ వివిధ ధ్రువపత్రాలను వెంట ఉంచుకోవాలన్నారు. పోలీస్ విధుల గురించి డ్రైవర్లకు వివరించారు.

ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు…

ప్రభుత్వం నుండి కార్మికులకు సరైన ఆదరణ లేదు

కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలి

గుంపల్లి మునీశ్వర్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి

 

పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ రైతు భవన్ లో ఏఐటీయూసీ హమాలి యూనియన్ అవగాహన సదస్సు కార్మిక యూనియన్ అధ్యక్షులు లంకదాసర అశోక్ అధ్యక్షతనలో ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గుంపల్లి మునీశ్వర్ కార్మిక రాష్ట్ర అధ్యక్షులు హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన కార్మికుల పరిస్థితి మరింత అద్వానంగా ఉన్నదని ఏఐటియుసి పోరాటాలతో 50 కిలోల బస్తాలు వచ్చాయని హమాలి కార్మికులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కష్టించి పనిచేస్తున్న ప్రభుత్వం నుండి తగిన ఆదరణ లేకపోవడం దారుణమని అన్నారు.బరువులు మోసేటప్పుడు లారీల నుండి దించేటప్పుడు ఎత్తేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయని కాళ్లు చేతులు విరిగిన ప్రాణాలు పోయినా ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఠా జట్టు హమాలీల సంక్షేమ బోర్డును పునర్దించాలని మన మార్కెట్లో దడ్వాయిలు,కాంట్రవెస్తూ అటు రైతులకు హమాలి కార్మికులకు చేదోడు వాదోడుగా

ఉంటున్నారు.మార్కెట్లో ప్రధానంగా మార్కెట్ యార్డ్ లో పనిచేసే వారందరూ రెక్కలు ముక్కలు చేసుకొని డొక్కలు ఎండి చాలీచాలని ఆదాయంతో బతుకుతున్నారని అన్నారు. మార్కెట్లో పనిచేసే హమాలీ దడువాయి,గంపకూలి కార్మికులకు పని భద్రత కల్పించాలని,రైతు ప్రజా కార్మిక వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేసి నాలుగు కార్మికులకు ప్రమాద బీమా నష్టపరిహారం మూడు లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని మార్కెట్లో పనిచేస్తున్న వారందరికీ లైసెన్స్ గుర్తింపు కార్డులు ఇవ్వాలని మరియు కార్మికులందరికీ 3000 యూనిఫామ్ ను ప్రతి సంవత్సరం ఇవ్వాలని,మార్కెట్ యార్డ్ కార్మికుల లైసెన్స్ రెన్యువల్ చేసి 58 నుంచి 60 సంవత్సరాలకు ఇన్సూరెన్స్ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు.మార్కెట్ యార్డుల పాలకవర్గంలో కార్మికుల నుంచి ఇద్దరికీ డైరెక్ట్ గా అవకాశం కల్పించాలని యార్డులో క్యాంటీన్ మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ యొక్క సమావేశంలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి జక్కు రాజ్ గౌడ్,ఏ ఐ టి యు సి హనుమకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లంక దాసరి అశోక్,కార్మిక నాయకులు కోడే పాక ఐలయ్య,కోకిల శంకర్, కోట యాదగిరి,రేణిగుంట రాజయ్య,బొట్ల భద్రయ్య,మోరే రవి,ధార్వా యూనియన్ అధ్యక్షులు ప్రభాకర్,గంపకూలి లచ్చమ్మ తదితర కార్మికులు నాయకులు పాల్గొన్నారు.

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం…

ప్రతి డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం

మాట నిలబెట్టుకున్న సొంటి రెడ్డి

#నెక్కొండ, నేటి ధాత్రి:

క్కొండ మండల కేంద్రంలోని నవత ఆటో యూనియన్ సభ్యులందరికీ తన సొంత ఖర్చులతో ఉచితంగా ప్రమాద బీమా చేపిస్తానన్న మాట ప్రకారం. 160 మంది డ్రైవర్లకు సంవత్సరం పాటు ఉచితంగా ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల బీమా ఇన్సూరెన్స్ చేపించిన టిపిసిసి సభ్యులు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి. బుధవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ సెంటర్లో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఇన్సూరెన్స్ భీమ పత్రాలను నవత ఆటో యూనియన్ డ్రైవర్లకు అందించిన సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి, ఈ సందర్భంగా సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ఒక సంవత్సరమే కాకుండా ఐదు సంవత్సరాలు కంటిన్యూగా ప్రతి సంవత్సరం ఇన్సూరెన్స్ పాలసీ బీమా అందరికీ చెల్లిస్తానని ఇంకా ఎవరైనా డ్రైవర్లు ఉంటే వాళ్ల పేర్లు కూడా పంపించాలని ప్రతి ఒక్క డ్రైవర్ కు ఇన్సూరెన్స్ చాలా ముఖ్యమని యూనియన్ బాధ్యులకు తెలిపారు. డ్రైవర్ల అందరూ ప్రభుత్వానికి పరోక్షంగా సేవ చేస్తున్నారని, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుటలో డ్రైవర్ల పాత్ర కీలకమని, వీరి కుటుంబాలు వీరిపై ఆధారపడి ఉన్నాయని, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే ఎవరో ఏదో సహాయం చేస్తారని ఎదురు చూడకుండా చట్టప్రకారం ఇన్సూరెన్స్ చేసి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని పొందే అవకాశం ప్రభుత్వం కల్పించిందని, ఇలాంటి ఇన్సూరెన్స్ లను వినియోగించుకోవాలని డ్రైవర్లకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు సొంటి రెడ్డి రంజిత్ రెడ్డి కి చిరు సన్మానం చేశారు .కార్యక్రమంలో నవత ఆటో యూనియన్ అధ్యక్షుడు మోడెం సురేష్, శ్రీరంగం శ్రీనివాస్, ఉల్లేరావు ప్రభాకర్, పెండ్యాల రాజు, బద్రు నాయక్, మోడెం రాజు, మహమ్మద్ అమీర్, నవత ఆటో యూనియన్ డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ ధరలు..తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే..

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ ధరలు..తగ్గే వస్తువుల లిస్ట్ ఇదే

 

 

భారతీయులకు సెప్టెంబర్ 22 నుంచి వారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే గొప్ప మార్పు అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్రకారం ప్రధానంగా ఏ వస్తువులపై జీఎస్టీ తగ్గనుందనే విషయాలను ఇక్కడ చూద్దాం.

భారతీయులకు రేపటి (సెప్టెంబర్ 22, 2025) నుంచి ఊరట కలిగించే శుభవార్త అమల్లోకి రానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల ప్రకటించిన ప్రకారం, దైనందిన అవసరాల వస్తువులపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) శ్లాబ్స్ తగ్గిపోయాయి. దీంతో రోజువారీ ఆహార పదార్థాలు, షాంపూలు, గృహోపకరణాలు వంటి అనేక అవసరమైన వస్తువులు ఇకపై తక్కువ ధరలకు లభించనున్నాయి (New GST List September 2025).

ముఖ్యంగా జీవన, ఆరోగ్య బీమా సేవలపై కూడా GST రేటును సున్నాకి తగ్గించారు. ఈ మార్పులతో దాదాపు 400కిపైగా వస్తువులపై పన్ను భారం తగ్గిపోనుంది. ఇది ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు నిజంగా ఊరటనిచ్చే నిర్ణయం. కానీ లగ్జరీ, సిన్ గూడ్స్‌పై మాత్రం 40 శాతం వరకు పన్ను కొనసాగనుంది.

కొత్త GST రేట్ల జాబితా 2025: వస్తువుల వారీగా వివరాలు

5 శాతం రేటు (మార్పు లేదు)

  • రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న దుస్తులు, దుస్తుల ఉపకరణాలు
  • రూ.2500 కంటే తక్కువ విలువ ఉన్న కాటన్ క్విల్ట్స్
  • ఇతర టెక్స్‌టైల్ వస్తువులు (రూ.2500 కంటే తక్కువ)

18 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • సైనిక ఉపకరణాల భాగాలు (ఎగ్జెక్షన్ సీట్లు, డ్రోన్ బ్యాటరీలు, సముద్ర ఆయుధాలు మొదలైనవి)
  • డైమండ్ ఇంప్రెస్ట్ అథారిటీ కింద దిగుమతి చేసిన 25 సెంట్స్ వరకు ఉన్న కట్ అండ్ పాలిష్ డైమండ్స్
  • కళాకృతులు, పురాతన వస్తువులు

12 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • UHT మిల్క్, చీజ్ (ప్యాక్ చేసినవి), పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటి
  • కొన్ని ఔషధాలు (ఉదా: ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్, అసిమినిబ్)
  • నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, పెన్సిల్ షార్పెనర్స్, క్రయాన్స్

 

12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడిన వస్తువులు

  • కండెన్స్‌డ్ మిల్క్, బటర్, గీ, చీజ్
  • రూ. 2500 కంటే తక్కువ విలువ ఉన్న ఫుట్‌వేర్
  • కాటన్, జ్యూట్ హ్యాండ్‌ బ్యాగ్స్
  • వుడ్, రతన్, బాంబూ ఫర్నిచర్
  • కిరోసిన్ స్టవ్, లాంతర్లు, సీవింగ్ మెషీన్స్
  • డ్రై ఫ్రూట్స్ (బాదం, హాజెల్‌నట్స్, పిస్తా మొదలైనవి)
  • టెండర్ కొబ్బరి నీరు (ప్యాక్ చేసినవి)
  • నామ్‌కీన్, డయాబెటిక్ ఫుడ్స్
  • వ్యవసాయ యంత్రాలు, సౌర శక్తి పరికరాలు

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి…

మహిళా అభివృద్ధితోనే ఆర్థిక అభివృద్ధి

◆:- బీమా పథకాలపై అవగాహన

◆:- సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం

◆:- ఎస్బిఐ సీజీఎం సహదేవన్ రాధాకృష్ణన్

జహీరాబాద్ నేటి ధాత్రి:

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకుంటూ మహిళలు ఆర్థిక అభివృద్ధి చెందాలని ఎస్బిఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం (చీఫ్ జనరల్ మేనేజర్ ) సహదేవన్ రాధాకృష్ణన్, డీజీఎం జితేంద్ర కుమార్ శర్మ లు అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జన సురక్ష పై నిర్వహించిన అవగాహన సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ ధన్, సురక్ష, జీవన్ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ, దీన్ దయాళ్, అంత్యోదయ యోజన, కిసాన్ సమ్మన్ నిధి, పీఎంకిసాన్, సుకన్య సమృద్ధి పథకం, బేటీ బచావో బేటీ పడావో తదితర పథకాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ప్రతి ఖాతాదారుడు బీమా చేయించుకోవాలని వారు సూచించారు. ప్రతి ఖాతాదారు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలని తెలిపారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని మహిళా సంఘాలకు విజ్ఞప్తి చేశారు. డిజిటల్ అరెస్టు వంటి మోసాలను నమ్మకూడదని, అలాంటి సంఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంఢీ హైదరాబాద్ రాజీవ్ కుమార్, సంగారెడ్డి ఆర్‌ఎం ఆర్‌బిఓ పపాసాహెబ్ సిరాజ్ బాషా, ఝరాసంగం ఎంపీడీవో మంజుల, వివిధ బ్యాంకుల బ్రాంచ్ మేనేజర్లు, జహీరాబాద్, ఝరాసంగం, కోహిర్, మొగుడంపల్లి, న్యాల్‌కల్, రాయికోడ్ తదితర మండలాలకు చెందిన ఐకెపి సిబ్బంది, మహిళా సంఘాల నాయకులు, సభ్యులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కేతకి సంగమేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గొల్ల కురుమలను అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు…

గొల్ల కురుమలను అక్రమ అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపలేరు.

చిట్యాల, నేటిధాత్రి ;

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం లో
గొల్ల కురుమలు అందరు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం గొల్ల కాపరులను పట్టింపు చేయకుండా ప్రభుత్వ వైఖరిని కండిస్తూ భూపాలపల్లి జిల్లా జేడీ కార్యాలయ ముట్టడికి భయలుదెరగ ముందస్తు గా తెల్ల వారు జామున అరెస్టు చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది,ఈ సంధర్బంగా జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్రె అనిల్ యాదవ్ మాట్లాడుతూ గొర్లు మేకలకు నట్టల మందులు పంపిణీ చేయాలి గొర్ల మేకల మేత కోసం559_1016 జీవోల ప్రకారం ప్రభుత్వ భూములు సొసైటీలకు ఇవ్వాలి ఆలాగే వివిధ ప్రమాదాలో చనిపోతున్న గొర్ల కాపరులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియో మరియు గొర్లు మేకలకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి ప్రభుత్వం రెండో విడుత గొర్లు లేదా నగదు బదలీ ఇవ్వాలని లేదంటే గొల్ల కురుమలును అందరినీ ఏకం చేసి ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో గొల్ల కురుమల సంఘం మండల అధ్యక్షులు మర్రి నరేష్ యాదవ్ సంఘం అద్యక్షులు కోడారి రవి యూత్ అద్యక్షులు వేముల హరీష్ యాదవ్ సంఘం జిల్లా నాయకులు కట్టే కొల్ల రాజు కోశాధికారి యదండ్ల మహేష్ యాదవ్ పాల్గొన్నారు.

భూపాలపల్లిలో జర్నలిస్టుల పక్షంలో TSJU…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-37-5.wav?_=3

జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది టి.ఎస్ జే.యూ యూనియన్

జిల్లా అధ్యక్షులు సంతోష్,ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవిందర్

భూపాలపల్లి నేటిధాత్రి

జర్నలిస్ట్ ల పక్షాన నిలిచేది తెలంగాణ స్టేట్ జర్నలిస్టు యూనియన్ ( ఎన్ యు జె ఐ) అని జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంతోష్,జిల్లా ప్రధాన కార్యదర్శి దొమ్మటి రవీందర్ లు అన్నారు.కాకతీయ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జర్నలిస్ట్ ల పక్షాన టి ఎస్ జే యూ పోరడుతుందని స్పష్టం చేశారు.ఇప్పటికే వర్కింగ్ జర్నలిస్ట్ ల పిల్లలకు ప్రయివేటు,కార్పొరేట్ పాఠశాలల్లో 50% ఫీజు రాయితీ కల్పించిన ఘనత మాదే అన్నారు.జర్నలిస్ట్ ల భద్రత దృష్ట్య ఏ యూనియన్ చేయని విధంగా టి ఎస్.జే.యూ రాష్ట్ర అధ్యక్షులు నారగౌని పురుషోత్తం,ప్రధానం కార్యదర్శి తోకల అనిల్,రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ ల సూచనతో యూనియన్ లో సభ్యత్వం తీసుకున్న ప్రతి జర్నలిస్ట్ కు రూ.5 లక్షల ప్రమా భీమా కల్పించిన ఏకైక యూనియన్ మాదే అన్నారు.అంతే కాకుండా టి ఎస్ జెయూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదార్థాల నియంత్రణపై విస్తృత కార్యక్రమం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు.వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నామన్నారు.రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కొన్ని యూనియన్లు మా యూనియన్ సభ్యులను మభ్యపెడుతూ తమ యూనియన్లో చేర్చుకుంటున్నట్లు తెలుస్తుంది.ఆ యూనియన్ నేతలు ఇప్పటివరకు జర్నలిస్టులకు ఏం చేశారో చెప్పాకే జర్నలిస్ట్ లు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాము.మా యూనియన్ ఎప్పుడు జర్నలిస్ట్ ల సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని జర్నలిస్టులు మిత్రులకు గమనించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నేతలు..జిల్లా ఉపాధ్యక్షులు గట్టు రవీందర్ గౌడ్,జిల్లా
ప్రచార కార్యదర్శి కారుకూరి సతీష్
సంయుక్త కార్యదర్శి కడపక రవి,బోళ్లపల్లి జగన్ గౌడ్, మారపేల్లి చంద్రమౌలి,దేవేందర్ తదితరులు పాల్గోన్నారు.

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్…

రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ తో సిరిసిల్ల ఆర్టిఏ వీడియో కాన్ఫరెన్స్

సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )

రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో భాగంగా జిల్లాలో జిల్లాకు సంబంధించి జరిపిన అన్ని రకాల వాహనాల కేసుల గురించి జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ మరియు మోటార్ వాహన తనిఖీ అధికారి వంశీధర్ కార్యాలయ నిర్వాహకురాలు కల్పన జరిపిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్షలో తెలిపిన వివరాలు జిల్లా నుంచి మొత్తం 293 కేసులు రాయడం జరిగిందన్నారు. అందుకుగాను రాష్ట్ర రవాణా శాఖ వారు నిర్ణయించిన 64 లక్షల రూపాయలు 100% గా నియమించారు. దీనికి గాను టాక్స్ మరియు పెనాల్టీ కాంపౌండింగ్ ఫీజు ద్వారా మొత్తంగా 96,96,465 టాక్స్ ఫెనాల్టీ రూపేణా 151 %గా వసూలు చేశామని మని తెలిపారు. అలాగే ఇంకా టాక్స్ కట్టని సరుకు రవాణా వాహనాలు ట్రాక్టర్ ట్రైలర్ ఇతర వాహనాలు 5088 వాహనాలు ఉన్నట్టు. ఈ వాహనాలు మీ స్వంతంగా టాక్స్ కట్టుకుంటే ఎలాంటి పెనాల్టీ లేకుండ కట్టాల్సి ఉంటుంది అదే రవాణా శాఖ అధికారులు పట్టుకుంటే 200 % ఫైన్ తో కట్టాల్సి ఉంటుందని. సరుకు రవాణా వాహనాలు తప్పని సరిగా భీమా, కాలుష్య నియంత్రణ పత్రాలు వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలతో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అలాగే పదిహేను సంవత్సరాలు పూర్తి ఐన స్వంత పనులకు వాడే ద్విచక్ర వాహనాలు, స్వంత కార్ లు విధిగా గ్రీన్ టాక్స్ వాహన భీమా వాహన కాలుష్య పత్రాలతో మీ స్వంత వాహనాలను పురుద్దరణ చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి తెలిపారు .పై విషయాన్ని రాష్ట్ర రవాణా కామిషనర్ సురేంద్ర మోహన్ కి తెలియజేశారు.

ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత..

ఎస్ బి ఐ నుండి రెండు లక్షల ప్రమాద బీమా చెక్కు అందజేత

#నెక్కొండ, నేటి ధాత్రి:

నెక్కొండ మండలంలోని వాగ్య నాయక్ తండ కు చెందిన స్వామి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతిచెందగా నెక్కొండ ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్ ఐలేష్ మృతుడి భార్య సునీతకు రెండు లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ ఐలేష్ మాట్లాడుతూ ఎస్బిఐ బ్యాంకులో స్వామి 436 రూపాయల ఇన్సూరెన్స్ ను చేయడంతో రెండు లక్షల బీమా చెక్కును మృతుడి భార్య సునీతకు అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు ఎస్బిఐ ఇన్సూరెన్స్ ను తప్పక కట్టుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నెక్కొండ ఎస్బిఐ బ్యాంకు సిబ్బంది, నెక్కొండ మాజీ జెడ్పిటిసి సరోజ హరి కిషన్ పాల్గొన్నారు.

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌..

 

అయినా.. పన్ను ప్రయోజనాలున్నాయ్‌

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా…

ఆరోగ్య బీమా లేదా..?

ఏ వ్యక్తికైనా ఆరోగ్య బీమా తప్పనిసరి. దేశంలో హెల్త్‌కేర్‌ వ్యయాలు ఏటా 14ు వంతున పెరుగుతున్నాయని అంచనా. అయితే వయోవృద్ధులు లేదా సీనియర్‌ సిటిజన్లు పెరుగుతున్న వయసు, ముందు నుంచి ఉన్న వ్యాధుల కారణంగా అందుబాటు ప్రీమియంలలో ఆరోగ్య బీమా పొందలేక పోతున్నారు. ఈ కారణంగా ఆస్పత్రి, వైద్య పరీక్షలు, డాక్టర్‌ కన్సల్టేషన్‌ వ్యయాలన్నీ తాము పొదుపు చేసుకున్న సొమ్ము నుంచే చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో ఉంచుకునే ఆదాయపు పన్ను చట్టం 80డి సెక్షన్‌.. 60 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ ఆరోగ్య సంబంధిత వ్యయాలపై కొన్ని రాయితీలు అందిస్తోంది. పాత ఆదాయపు పన్ను విధానాన్ని ఎంపిక చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం. దీని కింద ఆరోగ్య బీమా పాలసీ లేకపోయినా సీనియర్‌ సిటిజన్లు ఆరోగ్య సంబంధిత వ్యయాలపై పన్ను మినహాయింపులు కోరవచ్చు.
80డి సెక్షన్‌ ఏమిటి?

పన్ను చెల్లింపుదారుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ సెక్షన్‌ ఆరోగ్య బీమా లేదా ఆరోగ్య సంబంధిత వ్యయాలపై రాయితీలు, మినహాయింపులు అందిస్తుంది. తద్వారా పన్ను చెల్లింపు మొత్తం ఆదా చేస్తుంది.

  • ఈ సెక్షన్‌ కింద పన్ను చెల్లింపుదారు తనతో పాటుగా కుటుంబ సభ్యుల (భార్య లేదా భర్త, తనపై ఆధారపడిన సంతానం) ఆరోగ్య సంరక్షణకు చేసిన వ్యయాలపై లేదా ఆరోగ్య బీమా ప్రీమియంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • దీనికి తోడు వయోవృద్ధులైన తల్లిదండ్రుల కోసం చేసిన ఆరోగ్య సంబంధిత వ్యయాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై మరో రూ.25,000 పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేయవచ్చు.
  • అలాగే ప్రీమియం చెల్లిస్తున్న వ్యక్తి (స్వయంగా లేదా కుటుంబ సభ్యుల కోసం) సీనియర్‌ సిటిజన్‌ అయినట్టయితే ఈ మినహాయింపు పరిమితి గరిష్ఠంగా రూ.50,000 వరకు ఉంటుంది. అంటే మీరు సీనియర్‌ సిటిజన్‌ అయి ఉండి మీ కోసం, మీ తల్లిదండ్రుల కోసం కూడా ప్రీమియం చెల్లిస్తున్నట్టయితే రూ.1 లక్ష వరకు ఆదాయపు పన్ను మినహాయింపునకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.
  • ప్రివెంటివ్‌ హెల్త్‌ చెకప్‌ చెల్లింపుల (గరిష్ఠంగా రూ.5,000) కోసం చేసే వ్యయాలైతే నగదు రూపంలో చెల్లించవచ్చు. మిగతా వ్యయాలేవైనా నగదేతర రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది.

బీమా కవరేజీ లేని వారి మాటేమిటి?

ఆరోగ్య బీమా కవరేజీ లేని సీనియర్‌ సిటిజన్లకు కూడా ఈ సెక్షన్‌ రాయితీలు కల్పిస్తోంది. అలాంటి వారు వైద్య వ్యయాలపై ఏడాదికి గరిష్ఠంగా రూ.50,000 వరకు మినహాయింపులు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఈ వ్యయాలను మీ పిల్లలు భరించినట్టయితే వారు కూడా పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హులవుతారు. కేవలం 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మాత్రమే ఈ ప్రయోజనాలు పరిమితం అన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతే కాదు…నూతన, సరళీకృత ఆదాయపు పన్ను విధానం ఎంచుకున్న వారికి ఇది వర్తించదు.

ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా.

ఎస్ హెచ్ జీ సభ్యులకు బీమాతో ఆర్థిక భరోసా

కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

37 మందికి రూ.38 లక్షల లోన్ బీమా చెక్కులు,
ఇద్దరికి ప్రమాద బీమా రూ. 20 లక్షలు పంపిణీ

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్.హెచ్.జీ) సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం బీమా కల్పిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలకు బీమా, సభ్యులకు ప్రమాద బీమా చెక్కులను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అధికారులతో కలిసి సోమవారం పంపిణీ చేశారు. ముస్తాబాద్ మండలంలో 14 మందికి రూ. 14,96,457, తంగళ్ళపల్లి మండలంలో ఒకరికి రూ. 30 వేలు, గంభీరావుపేట మండలంలో 8 మందికి రూ.7,66,925, వీర్నపల్లి మండలంలో ఇద్దరికి రూ.2,67,434, ఎల్లారెడ్డిపేట మండలంలో 12 మందికి రూ.13,04,133 మొత్తం రూ. 38, 64,949 విలువైన చెక్కులు ఆయా స్వయం సహాయక సంఘాల బాద్యులకు అందజేశారు.
ఇద్దరికి ప్రమాద బీమా పంపిణీ అలాగే ముస్తాబాద్ మండలంలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన ఇద్దరు సభ్యులు ప్రమాదవశాత్తూ మరణించగా, వారికి నామిని లకు రూ. 10 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల విలువైన చెక్కులు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పంపిణీ చేశారు.కార్యక్రమంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, డీఆర్డీఓ శేషాద్రి, జడ్పీ సీఈవో వినోద్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా

ఆరోగ్య బీమా జాగ్రత్తలతో మరింత ధీమా…

 

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా…

వయసుతో పాటు ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయి. ఈ ఖర్చుల భారం తప్పించుకోవాలంటే ఆరోగ్య బీమానే గతి. లేకపోతే ఇల్లూ,ఒళ్లూ గుల్లే. అలా అని ఏజెంట్లు చెప్పే మాటలు నమ్మి ఎడాపెడా ఆరోగ్య బీమా పాలసీలు తీసుకోకూడదు. అలా చేస్తే కష్ట సమయాల్లో అక్కరకు రాకపోగా మన జేబుకే చిల్లు పడే ప్రమాదం ఉంది.

దీంతో చాలా మంది స్విగ్గీ, జొమాటాలో బిర్యానీ లేదా ఇతర తినుబండారాలు ఆర్డర్‌ చేసినంత ఈజీగా ఆరోగ్య బీమా పాలసీలు కొనేస్తున్నారు. ఆ పాలసీ షరతులు ఏంటి? కవరేజీ పరిమితులు, మినహాయింపుల గురించి ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదు. దీంతో ఆరోగ్యం దెబ్బతిని ఆస్పత్రిలో చేరేటప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిమితులు, మినహాయింపులను అడ్డుపెట్టుకుని బీమా కంపెనీలూ క్లెయిమ్స్‌కు సారీ చెబుతున్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. అవేమిటంటే..

అవగాహన

ఆరోగ్య బీమా అనేది ఒక భరోసా. అయితే వ్యాపారం పెంచుకునేందుకు కంపెనీల ఏజెంట్లు ఇప్పుడు దీన్ని కూడా వస్తువులను అమ్మినట్టు అమ్మేస్తున్నారు. పాలసీ తీసుకునే వ్యక్తికి పెద్దగా అవగాహన లేకపోతే లేని ప్రయోజనాలను ఉన్నట్టు చెప్పి మరీ అంటగడుతున్నారు. కాబట్టి కొత్తగా ఆరోగ్య బీమా తీసుకునే వ్యక్తి లేదా వ్యక్తులు పాలసీ గురించి పూర్తిగా అవగాహన చేసుకున్నాకే పాలసీ తీసుకోవడం మంచిది. ఇందుకోసం పాలసీ షరతులు, కవరేజీ పరిమితులు, మినహాయింపులను ఒకటికి రెండు సార్లు చదివి అర్థం చేసుకోవాలి. ఒకవేళ అర్థంగాకపోతే ఎవరైనా ఆర్థిక సలహాదారుని సంప్రదించడం మంచిది.

ఇప్పటికే ఉన్న వ్యాధులు

దాదాపు అన్ని బీమా కంపెనీలు ఇప్పటికే ఉన్న వ్యాధులకు వెంటనే కవరేజీ అనుమతించవు. కనీసం రెండు మూడేళ్ల తర్వాతే ఇందుకు అనుమతిస్తాయి. ఒకవేళ ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలకు కూడా వెంటనే కవరేజీ కావాలంటే ప్రీమియం కొద్దిగా ఎక్కువ చెల్లించాలి.

మెటర్నిటీ ట్రీట్‌మెంట్లు

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే మెటర్నిటీ ట్రీట్‌మెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. లేకపోతే బీమా కంపెనీలు ఇందుకు అనుమతించవు. ఒకవేళ అనుమతించినా అందుకు సవాలక్ష పరిమితులు, ఆంక్షలు పెడుతుంటాయి.

ఆధునిక ట్రీట్‌మెంట్లు

ఆరోగ్య సమస్యలతో పాటు ట్రీట్‌మెంట్లు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. టెక్నాలజీ అభివృద్ధితో ఇప్పుడు అధునాతన రోబోటిక్‌ సర్జరీలు, జన్యు (జెనెటిక్‌) పరీక్షలూ అందుబాటులోకి వచ్చాయి. పాలసీ తీసుకునేటప్పుడే ఇవి కూడా కవరయ్యేలా జాగ్రత్త పడాలి.

మానసిక రుగ్మతలు

మానసిక రుగ్మతలకు కూడా ఆరోగ్య బీమా వర్తింప చేయాలని బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) ఆదేశాలు జారీ చేసింది. అయినా ఈ ఆప్షన్‌ ఒకటి ఉందనే విషయాన్ని బీమా కంపెనీలు పెద్దగా పాలసీదారులకు చెప్పడం లేదు. మానసిక ఒత్లిళ్లు పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఆరోగ్య బీమా పాలసీ కింద ఈ రుగ్మతలకు కూడా కవరేజీ ఉండేలా చూసుకోవాలి.

గదుల అద్దె

కొన్ని ఆరోగ్య సమస్యలకు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్‌గా చేరక తప్పదు. అయితే ఇందుకు అయ్యే రూమ్‌ రెంట్‌పై బీమా కంపెనీలు అనేక పరిమితులు పెడుతుంటాయి. ఆ పరిమితికి మించి రూమ్‌ రెంట్‌ ఉంటే ఆ అదనపు మొత్తాన్ని పాలసీదారులే భరించాలి. కొన్ని బీమా కంపెనీలు రూమ్‌ రెంట్‌ ఎంత ఉన్నా, అది పాలసీ కవరేజీకి లోబడి ఉంటే చాలని చెబుతున్నాయి. పాలసీ తీసుకునేటప్పుడే పాలసీదారులు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. లేకపోతే జేబుకు చిల్లు పడుతుంది.

ఓపీడీ, వ్యాధి నిర్ధారణ

ఇవాళ ఔట్‌ పేషెంట్‌ సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా పెద్దభారంగా మారాయి. పెద్దపెద్ద ఆస్పత్రుల్లో డాక్టర్‌ కన్సల్టేషన్‌, వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడే ఈ ఖర్చులకూ కవరేజీ ఉండేలా జాగ్రత్త పడాలి. అయితే బీమా కంపెనీలు ఒక పరిమితి వరకే ఈ ఖర్చులను అనుమతిస్తాయి.

ఇతర జాగ్రత్తలు

  • పాలసీ తీసుకునే ముందే పాలసీ బ్రోచర్‌ను కాకుండా పాలసీ పూర్తి డాక్యుమెంట్‌ తీసుకుని చదివి పూర్తిగా అర్థం చేసుకోవాలి.
  • పాలసీ ద్వారా ఏయే సమస్యలకు కవరేజీ లభించదో ముందుగానే పూర్తిగా తెలుసుకోవాలి.
  • బీమా కంపెనీల పరిభాష అందరికీ అర్థం కాదు. పాలసీలో పేర్కొనే సబ్‌ లిమిట్స్‌, కో-పే, వెయిటింగ్‌ పీరియడ్‌ అంటే ఏమిటో క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
  • వివాహం, పిల్లలు పుట్టినప్పుడు, వృద్ధులైన తల్లిదండ్రులు ఉన్నప్పుడు మీరు తీసుకున్న ఆరోగ్య బీమా పాలసీ మీ అవసరాలకు సరిపోతుందా? లేదా? అనే విషయాన్ని సమీక్షించుకోవాలి.
  • మీ ఆరోగ్య బీమా పాలసీ కంపెనీ, పాలసీ వివరాలపై కుటుంబసభ్యులకు ముందుగానే పూర్తిగా తెలియజేయాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే అన్ని విషయాలు చక్కబెట్టాల్సిందే వారే.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునే ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే, అవసరమైనప్పుడు జేబులో పైసా ఖర్చు చేయకుండా ఆరోగ్య సమస్యల నుంచి తేలిగ్గా గట్టెక్కవచ్చు. లేకపోతే ఆరోగ్య పరంగానే కాకుండా ఆర్థికంగానూ దెబ్బతినే ప్రమాదం ఉంది

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం.

జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం

మెట్ పల్లి జూన్ 16 నేటి ధాత్రి

 

 

shine junior college

ప్రెస్ క్లబ్ సభ్యులకు ఇన్సూరెన్స్ పాలసీ బాండ్ లు అందజేత
బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు
మెట్ పల్లి: జర్నలిస్టుల భద్రత కొరకు ఇన్సూరెన్స్ చేయించడం అభినందనీయం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ చిట్నేని రఘు అన్నారు. టీయూడబ్ల్యూజే(ఐజేయు) ప్రింట్ మీడియా ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ పాలసీలు చేయించగా ఆ పాలసీ బాండ్లను సోమవారం రోజు డాక్టర్ రఘు చేతుల మీదుగా జర్నలిస్టులకు అందజేయడం జరిగింది. డాక్టర్ రఘు మాట్లాడుతూ జర్నలిస్టుల భద్రత కొరకే ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ పాలసీలు చేయించడం ఎంతో అభినందనీయం అని, ప్రజలకు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్న విలేకరులకు ప్రభుత్వం ద్వారా కూడా అందవలసిన సహాయ సహకారాల కోసం నేనెప్పుడూ పాటు పడుతా అని డాక్టర్ రఘు అన్నారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బూరం సంజీవ్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ అజీమ్ ఉపాధ్యక్షులు జంగం విజయ్ సాజిద్ పాషా, గౌరవ అధ్యక్షులు మాసుల ప్రవీణ్, గౌరవ సలహాదారులు దాసం కిషన్ ,క్యాషియర్ మక్సూద్, జాయింట్ సెక్రెటరీ పుండ్ర శశికాంత్ రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎండి సమీయుద్దీన్, కార్యవర్గ సభ్యులు పొనగాని మహేందర్, కుర్ర రాజేందర్ ,యానం రాకేష్ ,రఫీ ఉల్లా, సోహెల్ , హైమద్, అఫ్రోజ్,విజయసాగర్, సభ్యులు ఆదిల్ పాషా, ఆగ సురేష్,ఏసవేని గణేష్ ,ఎండి అభిద్ తదితరులు పాల్గొన్నారు.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం.

జీవిత భీమా వారి వరల్డ్ రికార్డ్ పురస్కారం అందుకున్న పరమేశ్వర్ పాటిల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ పరమేశ్వర్ పాటిల్ .జీవిత భీమా సంస్ధ నుండి అరుదైన గౌరవ పురస్కారం అందుకున్నారు ఆయన ఈసందర్భంగా మాట్లాడుతూ .జీవిత భీమా ద్వారా ప్రతి కుటుంబానికి పొదుపు చేయడం నేర్పడం.మరియు ప్రమాద బీమా ని అందించడం .ఆరోగ్యబీమాను అందించడం తనకు ఎంతగనో సంతృప్తి ఇస్తుంది అని అన్నారు .అనుకోకుండా జరిగే ప్రమాద ల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయి అందుకే ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు జీవిత భీమా ను తీసుకొని కుటుంబ భద్రతను కాపాడుకోవాలి అని అన్నారు.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత.

కోటి రూపాయల ఎస్బిఐ ప్రమాద భీమా అందజేత

రామకృష్ణాపూర్ నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన కొమిశెట్టి కిరణ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదం లో మృతి చెందగా, మృతుడు కాశీపేట 2 గని లో విధులు నిర్వర్తించేవాడు.సింగరేణి సంస్థకు ఎస్బిఐ బ్యాంక్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఎస్బిఐ సాలరీ అకౌంట్ ఎస్బిఐ లొ మెయింటైన్ చేసినందుకు గాను కోటి రూపాయల భీమా ఎస్బిఐ బ్యాంక్ మంజూరు చేసింది. ఇట్టి కోటి రూపాయల చెక్కును నామిని అయిన మృతుని భార్య కొమిశెట్టి కోమల కు శనివారం రామకృష్ణపూర్ ఎస్బిఐ బ్యాంక్ ఆవరణలో మంచిర్యాల ఎస్బిఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్త, ఆర్బీవో సివిఈ చీఫ్ మేనేజర్ శ్రీనివాస్ మూర్తి లు మృతుని కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమం లో బ్రాంచ్ మేనేజర్ గుగులోత్ గోపాల్, బ్యాంక్ స్టాఫ్ ప్రశాంత్,రామ కార్తిక్, వెంకటేశ్. రాజేంద్ర ప్రసాద్ , చందు, రమాదేవి లు పాల్గొన్నారు.

ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి.

గాయత్రి కో-ఆపరేటివ్ బ్యాంక్ ప్రమాద బీమా చెక్కు పంపిణి

జమ్మికుంట :నేటిధాత్రి

జమ్మికుంట మండలంలోని ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఖాతాదారుడు బిజిగిరి షరీఫ్ గ్రామ సుడైనటువంటి ముడతనపల్లి రాజు తండ్రి మల్లయ్య ప్రమాదవశాత్తు మరణించగా ఇతనికి గాయత్రి బ్యాంకులో నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది ప్రమాదంలో చనిపోవడం వల్ల అతని తల్లి అయిన ముడతనపల్లి సుశీలకు లక్ష రూపాయల చెక్కును జమ్మికుంట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ అయిన శ్రీమతి పుల్లూరి స్వప్న సదానందం చేతుల మీదుగా బ్యాంకు మేనేజర్ వోద్దుల మహేందర్ పొల్లు ప్రవీణ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో చెక్కు పంపిణీ చేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version