కార్మిక సంఘానికి కొత్త కమిటీ ఏర్పాటైంది…

కార్మిక సంఘం బి సి డబ్లు జిల్లా మహాసభ లు సెప్టెంబర్ 14 న ఆదివారం ప్రజలు అందరూ రావాలి…

కాప్రా నేటిధాత్రి

 

 

మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం బి సి డబ్లు జిల్లా మహాసభ లు సెప్టెంబర్ 14 న ఆదివారం ఈసీఐఎల్ సిఐటియు కార్యాలయంలో జరిగినాయి
ఈమహాసభలో అధ్యక్షులు సిహెచ్ అశోక్ కార్యదర్శిగా జే వెంకన్నలు ఎన్నిక కావడం జరిగింది కార్యనిర్వహణ అధ్యక్షులు సి . కుమార్
ఉపాధ్యక్షులుగా డీకే దుర్గయ్య పి గంగారాం కే శ్రీనివాస్ కే యాదగిరి టి శ్రీనివాస్
సహాయక కార్యదర్శులుగా కార్యదర్శులుగా సిహెచ్ జంగయ్య ఎం కృష్ణమ్మ ఏ వేణు
కోశాధికారిగా పి ప్రభాకర్
మరియు 13 మంది కమిటీ సభ్యులు తో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని భవన నిర్మాణ కార్మిక సంఘం మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సిహెచ్ అశోక్ జె వెంకన్నలు ఒక ప్రకటనలో తెలిపినారు.

స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలకు సర్క్యులర్ జార్ చేయాలి..

స్ట్రక్చర్ మీటింగ్ ఒప్పందాలకు సర్క్యులర్ జార్ చేయాలి..

ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ
రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

సింగరేణి యాజమాన్యం మూడుసార్లు జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ లో ఒప్పందాలకు వెంటనే సర్క్యులర్ జారీ చేసి సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ మోటపలుకుల రమేష్ డిమాండ్ చేశారు. భూపాలపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్లో పిట్ సెక్రటరీ ఎన్. రమేష్ అధ్య క్షతన గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిగా ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ మోటాపలుకుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సింగరేణి యాజమాన్యం గతంలో జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ సమస్యలను పరిష్కరించకపోవడంతో సింగరేణి సి.ఎం.డితో జరిగే స్ట్రక్చర్ మీటింగ్ ను బహిష్కరించడం జరిగిందన్నారు. అట్లాగే యాజమాన్యం వాస్తవ లాభాలను ప్రకటించి కార్మికులకు 35శాతం లాభాలవాటా ఇవ్వాలని కోరారు. గతంలో సింగరేణిలో ఎన్నడు లేని విధంగా రాజకీయ జోక్యం ఎక్కువైందని దాంతో కార్మిక సమస్యలు పెండింగ్ పడుతున్నాయని ఆరోపించారు.ఇప్పటికైనా యాజమాన్యం కార్మిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఈ సందర్భంగా రమేష్ విజ్ఞప్తి చేశారు. ఈ గేట్ మీటింగ్ లో బ్రాంచ్ కమిటీ నాయకులు తాళ్ల పోషం, అసిస్టెంట్ ఫిట్ సెక్రటరీ జి. రవికుమార్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ ఎన్, సతీష్, టెంపుల్ కమిటీ చైర్మన్ ధనుంజయ్, సలహాదారులు రమేష్, పిట్ కమిటీ సభ్యులు. ఎన్ రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి…

జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయండి

సెప్టెంబర్ 15 న మహాసభ

యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎగమంటి ఎల్లారెడ్డి పిలుపు

సిరిసిల్ల టౌన్ *(నేటిధాత్రి)

 

 

 

సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్లలో జరగబోయే భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా 3 వ. మహాసభల కరపత్రాలను ఈరోజు బి.వై. నగర్ లోని కామ్రేడ్.. అమృత్ లాల్ శుక్లా కార్మిక భవనంలో నాయకులు ఆవిష్కరించడం జరిగినది.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించడం జరుగుతుందని భవన నిర్మాణ కార్మికుల ఉపాధి , సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు గత పోరాటాలను సమీక్షించుకొని ఉద్యమ కార్యచరణను రూపొందించుకోవడం కోసం యూనియన్ జిల్లా 3 వ. మహాసభలను సెప్టెంబర్ 15వ తేదీన సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఇట్టి మహాసభలలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా భవన మరియు ఇతర నిర్మాణ రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఇట్టి మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సి.ఐ.టి.యు జిల్లా అధ్యక్షులు మిట్టపల్లి రాజమల్లు , గురజాల శ్రీధర్ , కోల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన..

గద్దర్ చిత్రపటానికి నివాళులర్పించిన
కామ్రేడ్ చంద్రగిరి శంకర్.

భూపాలపల్లి నేటిధాత్రి

హైదరాబాదులో రవీంద్రభారతిలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ మూడో వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏఐ ఎఫ్ టియు కార్మిక నాయకుడు కామ్రేడ్ చంద్రగిరి శంకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా విప్లవ నాయకుడు గద్దర్ ఆశయాలను నేటి యువత కొనసాగించాలని కామ్రేడ్ చంద్రగిరి శంకర్ అన్నారు. గద్దర్ తన | ఆటపాటలతో సమాజాన్ని చైతన్యపరిచి చివరి శ్వాస వరకు ప్రజల పక్షాన నిలిచి తరతరాలకు ఉద్యమ స్ఫూర్తిని అందించిన పోరాట యోధుడు ప్రజాయుద్ధనౌక గద్దర్ అని అన్నారు ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version